ఈ కిషోర్.... మరో సత్యంరామలింగరాజు
పట్టణాలలో ప్రజలనెత్తిని శఠగోపం పెట్టటం మామూలు అయ్యింది. విజయవాడలో సూటింగ్స్, షర్టింగ్స్ కు పేరెన్నికగన్న యాక్స్ ఎన్ యాక్స్ టైలర్స్ కు అధినేత అయిన యర్రంశెట్టి వాలేశ్వరరావు పెద్దకుమారుడు కిషోర్, కోడలు నాగమణి 6.60 కోట్లకు దివాలా తీసినట్లు గురువారం నగరంలోని రెండో అదనపు సీనియర్ జడ్జి కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని జడ్జి విక్టర్ ఇమ్మాన్యుయేల్ విచారణకు స్వీకరించారు. ఈ వార్త ఛానల్స్ లో ప్రసారం కాగానే భాధితులు షోరూం కు పరుగులు తీసారు. యాక్స్ ఎన్ యాక్స్ టైలర్స్ గా ప్రసిద్ది చెందిన వాలేశ్వరరావుకి గతంలో నటదిగ్గజాలయిన ఎన్టీరామారావుకి, నాగేశ్వరరావుకి కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహిరించారు. యాభై పదులు దాటిన వారు హీరోగా వేయటానికి గానూ సరికొత్త డిజైన్లతో వారిని మెప్పించారు. బెల్ బాటమ్ ఫ్యాంటు తో పాటు పెద్ద కాలర్లు ఉన్న షర్టులతో వారిని యంగ్ హీరోలుగా గుర్తింపు తెచ్చిన పేరు వుంది. డ్రైవర్ రాముడు, అడవిరాముడు, వేటగాడు తదితర సినిమాల కాస్ట్యూమ్స్ వాలేశ్వరరావు చేతిలో రూపుదిద్దుకొని ప్రేకకులను మెప్పించినవే. గతంలో తన తండ్రికి ఉన్న ఈ పేరును అడ్డం పెట్టుకొని వాలేశ్వరరావు కుమారుడు,కోడలు అప్పు తెచ్చినట్లు తెలుస్తుంది. కరక్టుగా సత్యం రామలింగరాజు అస్తుల జప్తు చేయటానికి కోర్టునండి అనుమతిలభించిన రోజునే ఈ సంఘటన జరగటం మూలంగా ప్రజలు వ్యాపార వర్గాలు కోర్టులో ఐపి పెట్టటం అంత తేలికయిన వ్యవహారం కాదని, దర్యాప్తు సంస్థలు, కోర్టులు చట్టాలను కఠినతరంగా అమలు చేసి అక్రమార్కులకు బుద్ది చెబుతున్నారని అంటున్నారు. ఆరన్నర కోట్లకు దివాళా తీసినట్టు చూపి కేవలం బ్యాంకులో 15 వేలవరకు ఉందంటే ఎలా నమ్ముతారని దేని మీద పెట్టుబడి పెట్టి నష్టపోయారూ ...ఎందుకు నష్టపోయారో కూడా రుజువు చేసుకోవలసి వుంటుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయ పడుతున్నారు.