ప్రేమ‌ కోసమై పాక్ చెర‌లో చిక్కి.. తెలుగు టెక్కీ ల‌వ్‌స్టోరీ..

అత‌ను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌. పేరు ప్ర‌శాంత్‌. ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆమె కూడా అత‌న్ని ఇష్ట‌ప‌డింది. మ‌నుసులైతే క‌లిశాయి కానీ.. త‌నువులు మాత్రం చాలా దూరంగా ఉన్నాయి. ఆమె ఉండేది స్విట్జ‌ర్లాండ్‌లో. ప్ర‌శాంత్‌ హైద‌రాబాద్‌వాసి. మ‌రి, ఎలా? ఆమె రావ‌డం కుద‌ర‌దు. ఇత‌ను అక్క‌డి వెళ్ల‌డానికి వీసా లేదు. ఎలాగైనా ప్రేయ‌సిని క‌లుసుకుందామ‌నుకున్నాడు. వీసా లేకున్నా.. అన‌ధికారికంగా దొంగ‌చాటుగా స్విట్జ‌ర్లాండ్ చెక్కేసే ప్ర‌య‌త్నం చేశాడు. క‌ట్ చేస్తే.. మార్గ‌మ‌ధ్య‌లో పాకిస్తాన్‌లో చిక్కుకుపోయాడు. అప్ప‌టి నుంచీ పాక్ జైల్లోనే మ‌గ్గిపోయాడు ప్ర‌శాంత్‌. 2017లో జ‌రిగిందీ ఘ‌ట‌న‌.  విషయం తెలిసిన అతడి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ప్రశాంత్ కుటుంబ సభ్యులు సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి పరిస్థితి వివరించారు. ఆయన సానుకూలంగా స్పందించారు. భారత విదేశాంగ శాఖ అధికారులకు విషయం తెలియజేశారు. వారి ప్ర‌య‌త్నాలు ఫ‌లించి.. ఎట్ట‌కేల‌కు ప్రశాంత్ విడుదలయ్యాడు. వాఘా బోర్డర్ ద‌గ్గ‌ర ప్ర‌శాంత్‌ని భారత అధికారులకు అప్పగించారు.  ప్రశాంత్ మంగళవారం హైదరాబాద్‌ చేరుకున్నాడు. సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్.. ప్రశాంత్‌ను కుటుంబసభ్యులకు అప్పగించారు. అమ్మ మాట వినకుండా.. ప్రేమ విషయంలో ఎక్కువ ఆలోచించకుండా.. తాను స్విట్జర్లాండ్ వెళ్తూ పాకిస్తాన్లో చిక్కుకున్నానని ప్రశాంత్ ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.  తాను ఇంత త్వరగా విడుదల అవుతానని అనుకోలేదని ప్ర‌శాంత్ అన్నాడు. తన విడుదల కోసం కృషిచేసిన తెలంగాణ ప్రభుత్వంతో పాటు భారత ప్రభుత్వానికి తాను జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పాడు. తనతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా చాలా మంది పాకిస్తాన్ జైల్లో మగ్గుతున్నారని వెల్లడించాడు.  ప్రేయ‌సి కోసం దేశ స‌రిహ‌ద్దులు దాటడానికి ఆయ‌న చేసిన సాహ‌సం గొప్ప‌దే. ప్రేమ మైకం ముందు తాను చేస్తున్న‌ ప్ర‌యాణం అక్ర‌మనే విష‌యం మ‌రిచాడు. అదృష్టం కలిసిరాక‌పోవ‌డంతో పాక్ అధికారుల‌కు చిక్కి.. ఏళ్ల త‌ర‌బ‌డి జైల్లో మ‌గ్గిపోయాడు. ఇక త‌న జీవితం అక్క‌డే అంతం అవుతుంద‌ని అనుకున్నాడు. కానీ,  అత‌ని త‌ల్లిదండ్రుల విజ్ఞ‌ప్తితో, తెలంగాణ పోలీసుల కృష్టితో.. భార‌త్ ప్ర‌భుత్వ ప్ర‌య‌త్నంతో.. ప్ర‌శాంత్ పాక్ నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడు. మ‌రో, భ‌జ‌రంగీ భాయీజాన్‌గా నిలిచాడు.    

సీబీఎస్ఈ పరీక్షలు రద్దు.. విద్యార్థుల భద్రతే ముఖ్యమన్న మోడీ 

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు జరపకపోవడమే మేలని ప్రధాని అభిప్రాయపడ్డారు. పరీక్షల కంటే విద్యార్థుల ఆరోగ్యం, భద్రతే తమకు ముఖ్యమని ప్రధాని మోడీ అన్నారు. పరీక్షల రద్దుపై ఆయన ట్వీట్ చేశారు.‘‘విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పరీక్షల కోసం విద్యార్థులను ప్రమాదంలోకి నెట్టలేం..’’ అని ప్రధాని స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా పరీక్షలు రాయాలనుకుంటే, వారికి కరోనా తీవ్రత తగ్గాక పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. పరీక్షలకు హాజరు కావాలని విద్యార్థులను బలవంతపెట్టొద్దని ప్రధాని పేర్కొన్నారు.   ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై మంగళవారం సాయంత్ర ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. కేంద్ర మంత్రులు అమిత్ షా, ప్రకాశ్ జవదేకర్, పియూష్ గోయల్, స్మృతి ఇరానీ, ధర్మేంద్ర ప్రధాన్, నిర్మలా సీతారామన్‌లతో పాటు పాఠశాల, ఉన్నత విద్య సెక్రటరీ, పలువురు ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. 12వ తరగతి బోర్డు పరీక్షల నిర్వహణపై అన్ని రాష్ట్రాలు, ఇతర పక్షాలతో చర్చించిన మీదట.. ప్రభుత్వం ముందున్న అన్ని అవకాశాలపైనా ప్రధాని చర్చించారు. పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

జ‌గ‌న్ కౌంట‌ర్‌కు ర‌ఘురామ కౌంట‌ర్‌.. అంతా వెంక‌న్న స్వామి చూసుకుంటారు..

జ‌గ‌న్ కౌంట‌ర్‌కు కౌంట‌ర్ వేశారు. ర‌ఘురామ మ‌ళ్లీ త‌న వాయిస్ వినిపించారు. అరెస్ట్‌, బెయిల్‌, చికిత్స‌తో ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న ఆయ‌న తాజాగా జ‌గ‌న్ కేసుపై స్పందించారు. సీఎం జగన్ బెయిల్‌ను రద్దు చేయాలంటూ తాను వేసిన పిటిషన్ వెనుక ఎలాంటి వ్యక్తిగత స్వార్థం లేదని చెప్పారు. కోర్టులో జగన్ కౌంట‌ర్ పేల‌వంగా ఉంద‌ని.. ఆయ‌న తరపు న్యాయవాది చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవాలు లేవని అన్నారు. జగన్ వేసిన కౌంటర్ లో ఎలాంటి విషయం లేదని తెలిపారు. ఈ కేసులో కచ్చితంగా న్యాయం జరుగుతుందనే ఆశాభావం వ్య‌క్తం చేశారు. తన ఆరోగ్యం కోసం, తన బెయిల్ కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ పాదాభివందనాలు చేస్తున్నానని అన్నారు. పైనున్న వేంకటేశ్వరస్వామి అన్నీ చూసుకుంటారంటూ వేదాంత ధోర‌ణిలో మాట్లాడారు.  అక్రమాస్తుల కేసులో అరెస్టై.. బెయిల్‌పై బ‌య‌ట ఉన్న సీఎం జ‌గ‌న్‌.. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని.. వెంటనే ఆయన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు గతంలో జగన్, సీబీఐ మూడు సార్లు గడువు కోరారు. అయితే, కౌంటర్ దాఖలు చేసేందుకు జగన్, సీబీఐకి చివరి అవకాశం ఇస్తున్నామంటూ గత నెల 26న సీబీఐ కోర్ట్ హెచ్చరించ‌గా.. తాజాగా కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు.  రఘురామరాజు తన పిటిషన్‌లో అనేక కీలక అంశాలను ప్రస్తావించారు. సాక్షులను ప్రత్యక్షంగా, పరోక్షంగా బెదిరిస్తున్నారని.. బెయిల్‌ షరతులను ఉల్లంఘిస్తున్నారని తెలిపారు. న్యాయస్థానం ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు. పలువురు సాక్షులు జగన్‌ ప్రభుత్వంలో అధికారులుగా ఉండటం, కొందరు సహ నిందితులు కీలక స్థానాల్లో ఉండటం, ఒకరికి సలహాదారు పదవి ఇవ్వడం, విజయసాయి రెడ్డి, అయోధ్య రామిరెడ్డిని రాజ్యసభకు పంపడం లాంటివన్నీ పిటిషన్‌లో వివరించారు. ప్రజాప్రతినిధుల కేసుల్లో విచారణ వేగవంతం చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలను జీర్ణించుకోలేని వైసీపీ నేతలు న్యాయవ్యవస్థపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. ఇంత నిర్దిష్టమైన అంశాలు ఉండటంతో జగన్ బెయిల్ పై ఎటువంటి నిర్ణయం ఉంటుందన్నది ఆసక్తిగా మారింది.  ర‌ఘ‌రామ పిటిష‌న్‌పై జగన్ తరపు లాయర్లు 98 పేజీల కౌంటర్ దాఖలు చేశారు. జగన్ బెయిల్ షరతులను ఎక్కడా ఉల్లంఘించలేదని అందులో తెలిపారు. సీబీఐని ప్రభావితం చేస్తున్నారన్న పిటిషనర్ వాదనలో నిజం లేదని అన్నారు. సీబీఐ కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తుందని.. పిటిషనర్ రఘురామరాజుకు ఈ కేసులో సంబంధం లేదని వివ‌రించారు. ఇలాంటి కేసుల్లో థర్డ్ పార్టీ జోక్యం చేసుకోవద్దని సుప్రీం కోర్టు తీర్పులున్నాయని స్ప‌ష్టం చేశారు. రఘురామరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, ఆయ‌న‌ను అనర్హుడిగా ప్రకటించాలని స్పీకర్‍కు లేఖ కూడా రాసిన‌ట్లు వెల్ల‌డించారు. రఘురామ పిటిషన్‌కు విచారణార్హత లేదని.. వ్యక్తిగత, రాజకీయాల కోసం న్యాయవ్యవస్థను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రఘురామరాజుపై ఏపీలో అనేక కేసులున్నాయని.. కౌంట‌ర్‌లో తెలిపారు.  అయితే, జగన్ బెయిల్ రద్దు చేయవద్దని సీబీఐ ఎక్క‌డా కోరక‌పోవ‌డం ఆస‌క్తిక‌రం. రఘురామ పిటిషన్‌పై చట్టప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని మాత్ర‌మే కోర్టును కోరింది సీబీఐ. కోర్టు విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవాలని విన్న‌వించింది. త‌దుప‌రి విచారణ ఈనెల 14కి వాయిదా ప‌డింది.    జగన్ బెయిల్ కేసులో సీబీఐ వేసిన కౌంటర్ పై ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జగన్‌ బెయిలు రద్దుకు ఎస్‌ లేదా నో అని చెప్పకుండా బంతిని కోర్టు పరిధిలోకి నెట్టింది సీబీఐ. ఈ విషయంలో మేం జోక్యం చేసుకోం.. మీరే నిర్ణయం తీసుకోండి అని చెప్పింది. దీంతో జగన్ బెయిల్ కేసులో ఏదైనా జరగవచ్చని చెబుతున్నారు. ఎంపీ ర‌ఘురామ సైతం జ‌గ‌న్ త‌ర‌ఫున వేసిన కౌంట‌ర్ పేల‌వంగా ఉందంటూ వ్యాఖ్యానించ‌డం.. ఆయ‌న‌లోని ధీమాకు నిద‌ర్శ‌నం. 

ఎంపీ రేవంత్ రెడ్డికి బిగ్ షాక్! టీపీసీసీ పదవికి గండమేనా..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ,మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. ఓటుకు నోటు కేసు ఏసీబీ పరిధిలోకి రాదని.. రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. కేసు ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుందని రేవంత్‌ తన పిటిషన్‌‌లో పేర్కొన్నారు. గతంలో ఏసీబీ కోర్టు కొట్టివేయడంతో హైకోర్టును ఆశ్రయించారు రేవంత్‌. అయితే ఇక్కడ కూడా అదే రిపీట్ అయ్యింది.   ఇటీవలే ఈ కేసులో ఏసీబీ కోర్టులో ఈడీ చార్జీషీట్ దాఖలు చేసింది. ఎంపీ రేవంత్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా పేర్కొంది. ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రేవంత్‌రెడ్డి 50 లక్షలు ఇచ్చినట్టు చార్జ్‌షీట్‌లో రాశారు. తెలంగాణ శాసన మండలి ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ చేసే విధంగా.. ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రాయబారం నడిపినట్టుగా రేవంత్‌రెడ్డిపై చార్జ్‌షీట్‌లో అభియోగాలు మోపారు. ఛార్జీషీట్‌లో రేవంత్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి, అతని కుమారుడు వేం కృష్ణ, కీర్తన రెడ్డి, సెబాస్టియన్‌ల పేర్లను పొందుపరిచారు. ఈడీ  చార్జ్ షీట్ లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేరు లేకపోవడంతో ఆయనకు రిలీఫ్ దక్కింది.  ఈడీ చార్జీషీట్ వేసిన మరుసటి రోజే ఎంపీ రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట కలిగింది. ఓటుకు నోటులో మిగిలిన సాక్షలందరి చీఫ్ ఎగ్జామినేషన్ పూర్తయిన తరువాతనే క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని సుప్రీం కోర్టులో రేవంత్ రెడ్డి పిటిషన్ వేశారు. ఈ కేసులో తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు సాక్షులను క్రాస్ ఎగ్జామినేషన్ చేయవద్దని ఏసీబీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏసీబీకి నోటీసులు జారీ చేసింది. దీనిపై నాలుగు వారాలలో సమాధానం చెప్పాలని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.  2015 మే 21న స్టీఫెన్ సన్‌కు 50 లక్షల రూపాయలు లంచం ఇస్తూ రెడ్ హ్యాండెడ్‌గా రేవంత్ రెడ్డి పట్టుపడ్డారు. అప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగ్గా… టీడీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్న వేం నరేందర్ రెడ్డికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేసేందుకు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ప్రలోభాలకు గురిచేశారన్నది రేవంత్ రెడ్డి తదితరులపై ఉన్న ప్రధాన అభియోగం. అప్ప‌ట్లో వీడియో ఆధారాలు బట్టబయలు కాగా, రేవంత్ రెడ్డి కొంతకాలం జైలులో కూడా ఉన్నారు. బెయిల్ పై బయటికి వచ్చిన ఆయన టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరారు.  ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు రేవంత్ రెడ్డి. త్వరలోనే ఆయనకు పీసీసీ పగ్గాలు వస్తాయనే ప్రచారం జరుగుతోంది. రేవంత్ రెడ్డి పేరును కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసిందని.. రెండు,మూడు రోజుల్లోనే అధికారిక ప్రకటన వస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓటుకు నోటు కేసులో ఈడీ చార్జీషీట్ దాఖలు చేయడం కాక రేపుతోంది. రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు రాకుండా కుట్రలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

పిల్ల‌ల‌కు ఆ టీకా బెస్ట్‌! ఐఏపీ సూచన ఏంటంటే..

క‌రోనా సెకండ్ వేవ్ హ‌డ‌లెత్తిస్తోంది. థర్డ్ వేవ్ వార్త‌లు వ‌ణికిస్తున్నాయి. సెకండ్ వేవ్‌లోనే ఇన్ని ల‌క్ష‌ల మంది క‌రోనా బారిన ప‌డితే.. ఇక మూడో ముప్పు ఏ రేంజ్‌లో ఉంటుందోన‌నే భ‌యం వేధిస్తోంది. థ‌ర్డ్ వేవ్‌లో వైర‌స్ ప్ర‌భావం పిల్ల‌ల‌పై ఎక్కువ‌గా ఉండ‌నుంద‌ని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు. ఇప్ప‌టికే మ‌హారాష్ట్రంలో థ‌ర్డ్ వేవ్ క‌ల్లోలం మొద‌లైపోయింద‌ని.. ఒకే జిల్లాలో 8వేల మందికిపైగా పిల్ల‌ల‌కు క‌రోనా సోకింద‌ని తెల‌డంతో అంతా అల‌ర్ట్ అవుతున్నారు. మూడో ముప్పు నుంచి పిల్ల‌ల‌ను ర‌క్షించుకునేది ఎలాన‌ని తెగ హైరానా ప‌డుతున్నారు త‌ల్లిదండ్రులు.  థర్డ్ వేవ్ నుంచి పిల్లలను రక్షించడానికి ఐదేళ్ల లోపు పిల్లలకు ప్రతి ఏడాది 'ఫ్లూ' సంబంధిత టీకాలను ఇవ్వడం మంచిదని ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ పిడియాట్రిషన్‌ (ఐఏపీ) సూచించింది. ఇటీవల అమెరికా మిచిగాన్‌ మిస్సోరీ నిర్వహించిన అధ్యయనంలోనూ ఈ విష‌యం నిర్ధార‌ణ అయింది. ఇనాక్టివేటెడ్‌ ఇన్‌ఫ్లూయెంజా టీకాను తీసుకున్న త‌ర్వాత‌.. కొవిడ్‌ బారిన ప‌డిన పిల్లలు.. త్వరగా కోలుకున్నారని తెలిసింది. మహారాష్ట్ర పిడియాట్రిక్‌ టాస్క్‌ఫోర్స్‌ చిన్నారులు కరోనా నుంచి త్వరగా కోలుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించింది. కొవిడ్‌ టీకా, ఇన్‌ఫ్లూయెంజా టీకాలు.. ఎపిటామిమోలాజిక్‌ క్లినికల్‌ ఫీచర్లు ఇంచుమించు దగ్గరగా ఉంటాయి. క‌రోనా వైర‌స్‌ పిల్లలపై ప్రాణాంతకంగా మారకుండా ఉండడానికి ఫ్లూ కి సంబంధించిన టీకాలు ఇప్పించడం మంచిదని తెలిపింది. ఫ్లూ టీకా వ‌ల్ల.. కొవిడ్‌ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్‌ను తగ్గించవచ్చని, పిల్ల‌ల‌ ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించ‌కుండా ఉంటుందని సూచించింది. పిల్లలకు ఇన్‌ఫ్లూయెంజా టీకా ఇవ్వ‌డం వ‌ల్ల‌ ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఆ రోగ నిరోధ‌క శ‌క్తి కరోనా వైరస్‌తో పోరాడటానికి బాగా ప‌నికొస్తుంద‌నేది వైద్యులు చెబుతున్న మాట‌.  అయితే, ఫ్లూ టీకా, కరోనా టీకా.. ఆ రెండూ వేరు వేరు. అందుకే, ఒక‌వేళ పిల్ల‌ల‌కూ టీకాలు ఇవ్వ‌డానికి కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తే.. ఆ రెండు టీకాలకు మధ్య దాదాపు నాలుగు వారాల సమయం ఉండాలి. అప్పుడు పిల్లల్లో యాంటీబాడీస్ డెవ‌ల‌ప్‌మెంట్‌కి కావ‌ల‌సిన సమయం ఉంటుంది. వైరస్‌లతో పోరాడటానికి కావ‌ల‌సిన‌ ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఎంత‌గా టీకాలు వేసుకున్నా.. మాస్క్ ధ‌రించ‌డం, సామాజిక దూరం పాటించ‌డం మాత్రం మ‌రిచిపోవ‌ద్ద‌ని వైద్యులు సూచిస్తున్నారు. 

ఒక్క అమ్మాయిని ఇద్దరు ఇష్టపడ్డారు.. చివరికి కత్తి తో పొడుచుకున్నారు..

చిన్నదో వైపు పెద్దదో వైపు.. సాంగ్ వినే ఉంటారు, నారి నారి నడుమ మురారి సినిమా కూడా చూసే ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ ఆ రెండింటికి బిన్నంగా ఉంటుంది. ఈ కథలో హీరోలు ఇద్దరు, హీరోయిన్ ఒక్కరు. చివరికి ఏం జరిగిందో మీరో తెలుసుకోండి..  ఓపెన్ చేస్తే.. అది హైదరాబాద్ మైలార్‌దేవ్‌పల్లి పరిధి  వట్టేపల్లి గ్రామం.. వారిద్దరి పేర్లు  ఉమార్, మెయిన్, ఆ ఇద్దరు దోస్తు మేర దోస్త్ తుహే మేరె జాన్.. ముస్తఫా ముస్తఫా ఫ్రెండ్స్ పొద్దున్న లేస్తే ఇద్దరు కలిసే ఉంటారు. చివరికి అక్కడే చిక్కు వచ్చింది. ఆ చిక్కు ఏంటని అనుకుంటున్నారా.. ఇద్దరు కలిసి ఒకే అమ్మాయిని ఇద్దరు ఇష్టపడ్డారు. ప్రేమ ఎలాంటి పని అయినా చేయిస్తోంది అన్నట్లు.. హీరోని విలన్ ని చేస్తుంది.. విలన్ ని హీరో గా చేస్తుంది. ఫ్రెండ్స్ ని బద్ద శత్రువుల్ని చేస్తుంది. అవసరం అంటే చపడానికైనా.. చనిపోవడానికైనా తెగిపజేస్తుంది. ఇంకేముంది తాను ప్రేమిస్తున్న అమ్మాయి జోలికి రావద్దంటూ ఉమర్ పై కత్తితో మొయిన్ బెదిరించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో ఆవేశానికి గురైన మొయిన్ పథకం ప్రకారం ఇంట్లో నుండి తీసుకొచ్చిన కత్తితో ఉమర్ పై దాడి చేశాడు. ఉమర్ కుడి భుజం పై కత్తిపోట్లు పడడంతో తృటిలో ప్రమాదం తప్పింది.దాడి అనంతరం మొయిన్ అక్కడి నుండి పారిపోయాడు. హుటాహుటిన స్థానికులు ఉమర్ ను ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు మొయిన్ పై 307 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించారు.

ఈటల రాజేందర్ కు మరో షాక్! గులాబీ బాస్ స్కెచ్ మాములుగా లేదుగా..

సీనియర్ నేత ఈటల రాజేందర్ వ్యవహారంలో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. కేసీఆర్ మంత్రివర్గం నుంచి రాజేందర్ ను బర్తరఫ్ చేసిన తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తన అనుచరులు, నియోజకవర్గ నేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు ఈటల. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ టార్గెట్ గా ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో గులాబీ పార్టీతో తాడోపేడో తేల్చుకుంటారనే ప్రచారం జరిగింది. కాని రాజీనామాపై వెనక్కి తగ్గారు ఈటల. బీసీ సంఘాలు, ఉద్యమ నేతలను కలవడంతో కొత్త పార్టీ పెడతారని భావించారు. టీజేఎస్ అధినేత కోదండరామ్ తో కలిసి కేసీఆర్ కు వ్యతిరేకంగా ఐక్య వేదికగా ఏర్పాటు చేస్తారని భావించారు. కాని అది కూడా జరగలేదు. చివరికి అనూహ్యంగా కమలం గూటికి చేరారు ఈటల రాజేందర్. ఢిల్లీకి వెళ్లి కమలం బీజేపీ పెద్దలను కలిశారు. ఈటల రాజేందర్ కదలికలపై నిఘా పెట్టిన టీఆర్ఎస్ అధిష్టానం ఎప్పటికప్పుడు కౌంటర్ వ్యూహాలు అమలు చేసింది. హుజురాబాద్ నియోజకవర్గంలోని గులాబీ లీడర్లంతా పార్టీలోనే కొనసాగేలా ప్రయత్నాలు చేసింది. మంత్రి గంగుల కమలాకర్ ను రంగంలోకి దింపింది. మంత్రి హరీష్ రావును కూడా పురమాయించింది. బోయినపల్లి వినోద్ కుమార్ కుడా సీన్ లోకి వచ్చారు. కేసీఆర్ ఎత్తులతో తన సొంత నియోజకవర్గంలోనే ఈటలకు ఇబ్బందికర పరిస్థితులు కల్పించారు. మొదట ఈటలకు మద్దతుగా నిలిచిన నేతలు కూడా ఒక్కొక్కరు తిరిగి టీఆర్ఎస్ సైడ్ కు వచ్చేశారు. దీంతో తన అనుచరులను బెదిరిస్తున్నారంటూ రాజేందర్ ఆరోపణలు చేశారు. తాజాగా ఢిల్లీలో రాజేందర్ కదలికలపైనా గులాబీ ఫోకస్ చేశారని తెలుస్తోంది. రాజేందర్ ఢిల్లీ నుంచి వచ్చి ప్రకటన చేసేలోగా ఆయనకు మరో షాకిచ్చేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారని సమాచారం.  ఢిల్లీలో బీజేపీ నేతలను కలిసిన రాజేందర్ ను టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయనున్నారని తెలుస్తోంది. అంతేకాదు రాజేందర్ ఎమ్మెల్యే పదవికి ఎర్త్ పట్టారని సమాచారం. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్ కు టీఆర్ఎస్ ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ పూర్తైందంటున్నారు. టీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన వెంటనే ఈటలపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది. తనంతట తానుగా ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేసేలోగానే అనర్హత వేటు పడేలా అధికార పార్టీ పావులు కదుపుతుందని తెలుస్తోంది. ఈటలకు మద్దతుగా ఉన్న నేతలను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని సమాచారం.  ఈటల రాజేందర్ ఎపిసోడ్ పై మాట్లాడిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా అదే సంకేతమిచ్చారు. బీజేపీ నాయకులను ఈటల రాజేందర్ కలవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 ఏళ్లుగా కేసీఆర్ ఎందరో నాయకులను తయారు చేశారని చెప్పారు. ఇప్పుడు ఈటల రాజేందర్ కమ్యూనిజం ఎక్కడ పోయిందని ప్రశ్నించారు. బీజేపీ నాయకుల దగ్గర తాకట్టు పెట్టారా? అని పల్లా వ్యాఖ్యానించారు. అందరూ ఈటలను ఛీ కొడుతున్నారని వ్యాఖ్యానించారు. మంత్రిగా చట్ట విరుద్ధ పనులు ఎలా చేశారని రాజేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. ‘‘అసైన్డ్ భూములు ఎలా తీసుకున్నావు. నీ ఆత్మగౌరవం ఎక్కడ ఉంది. నిన్ను గౌరవించినట్లు సీఎం కేసీఆర్ ఇంకెవరినీ గౌరవించలేదు. ఎక్కువ పదవులు మీరే అనుభవించారు. పదవి లేకుండా ఎప్పుడు ఉన్నావు. సొంత ప్రభుత్వ పథకాలను అవహేళన చేశావు. పార్టీ మీద, నాయకుడి మీద నమ్మకం లేదని క్షమించరాని నేరం చేశావు. మీరు చేసిన దానికి పార్టీపరంగా తప్పక చర్యలు తీసుకుంటాం. సమయం చూసి అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారు. నీ సమాధి నువ్వే కట్టుకున్నావు ఈటల రాజేందర్.’’ అని పల్లా రాజేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. 

ఆనందయ్య మందు పంపిణికి డేట్ ఫిక్స్!

కృష్ణపట్నం ఆనందయ్య యాదవ్ ఆయుర్వేద మందుకు అనుమతి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు హైకోర్టు మందు పంపిణికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఆనందయ్య మందుకు అడ్డంకులు తొలగిపోవడంతో జనాలంతా సంతోషపడ్డారు. మందు ఎప్పుడిస్తారా అంటూ ఎదురుచూస్తున్నారు. మందు పంపిణికి అనుమతి వచ్చిందని తెలియగానే వందలాది మంది కృష్ణపట్నం బాట పట్టారు. అయితే మందు పంపిణిపై మాత్రం క్లారిటీ రావడం లేదు. ప్రస్తుతానికి మందు అందుబాటులో లేదని తెలుస్తోంది. వన మూలికలు సేకరించి మందును తయారు చేశాకే పంపిణి చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆనందయ్య మందు పంపిణిపై ప్రభుత్వం దృష్టి సారించింది. సోమవారం కృష్ణపట్నం వెళ్లి ఆనందయ్య ఇంటిని, మందు తయారయ్యే ప్రాంతాన్ని పరిశీలించారు నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్. మంగళవారం కలెక్టరేట్ లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఆనందయ్య కూడా ఈ సమావేశానికి వచ్చారు. ఈ సందర్బంగా మందు తయారీ, పంపిణి, కొవిడ్ మార్గదర్శకాలు ప్రకారం పంపిణీకి ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు. మందు తయారు కాగానే.. కొవిడ్ రూల్స్ పాటిస్తూ పంపిణి చేయాలని నిర్ణయించారట. ఇందుకోసం ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేస్తుందని కలెక్టర్ క్లారిటీ ఇచ్చారు. రెండు, మూడు రోజుల్లోనే మందు పంపిణి ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.  ఆనందయ్య మందుకు ప్రజల్లో విపరీతమైన డిమాండ్‌ ఉన్న కారణంగా అందరికి మందు అందుబాటులోకి తేవాలంటే పెద్ద ఎత్తున తయారు చేయాల్సి ఉంటుంది. మూలికలు, ఆకులు అడవుల్లో లభించినా.. తేనె, మిరియాలు తదితరాలను పెద్ద ఎత్తున కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆనందయ్య ఒక్కరే వీటిని సమీకరించుకోవడం, ఆర్థికంగా సాధ్యం కాకపోవచ్చు. ప్రభుత్వమే వనరులను సమీకరించి ఆనందయ్యకు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. మందు పంపిణీకి అధికార యంత్రాంగం విశాలంగా ఉన్న ప్రదేశాన్ని ఎంపిక చేయడం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆనందయ్య మందుకు ప్రజల్లో ఆదరణ, డిమాండ్‌ ఉండటంతో భారీ సంఖ్యలో వచ్చే అవకాశముంది. తొక్కిసలాట జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది మందు తయారీ కోసం వనమూలికల సేకరణలో ఆనందయ్య టీమ్ పని చేస్తోంది. వీలైనంత త్వరలో కొవిడ్‌ మందుల పంపిణీ ప్రారంభిస్తానని, ఇప్పుడే కృష్ణపట్నం రావద్దని ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య చెప్పారు. మందుల తయారీకి కావాల్సిన మూలికలు సిద్ధం చేసుకోవాల్సి ఉందని తెలిపారు. సాధ్యమైనంత వరకు దేశవ్యాప్తంగా ప్రజలకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కృష్ణపట్నంలోనే కాకుండా వివిధ ప్రాంతాల్లో మందుల పంపిణీకి సన్నాహాలు చేస్తున్నట్లు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ప్రత్యేకంగా ఒక యాప్‌ తయారు చేసే విషయాన్ని ఆలోచిస్తున్నామన్నారు. దూర ప్రాంతాల వారు కృష్ణపట్నం రావాల్సిన అవసరం లేకుండా యాప్‌లో బుక్‌ చేసుకుంటే కొరియర్‌ సర్వీస్‌ ద్వారా మందు పంపాలని యోచిస్తున్నామని తెలిపారు.  రాష్ట్ర ప్రభుత్వ అనుమతి పొందిన ఆనందయ్య మందు పంపిణీ తేదీని త్వరలో ప్రకటిస్తామని ఆయుష్‌ కమిషనర్‌ రాములు చెప్పారు. ఆ మందును ఆయుర్వేదంగా గుర్తించడం లేదని, సంప్రదాయ మందుగా పంపిణీ చేసుకోవచ్చని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. కరోనా సోకిన వారు డాక్టర్లు ఇచ్చే మందులు వాడుతూనే ఆనందయ్య మందులు తీసుకోవాలని రాములు సూచించారు. పంపిణీ సందర్భంగా పాజిటివ్‌ బాధితులు క్యూలో నిలబడకూడని తెలిపారు. వారు తమకు తెలిసిన వారితో మందు తెప్పించుకోవాలని సూచించారు. మరోవైపు ఆనందయ్య మందు వ్యవహారంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కృషి అభినందనీయమని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆనందయ్య మందు ఆగిపోడానికి వైసీపీ ఎమ్మెల్యేనే కారణమని ఆరోపించారు. ఎంతమంది పేదలు ఉచితంగా ఇచ్చే మందును కోల్పోయారని అన్నారు. హైకోర్టు ఆదేశాలతో ఆనందయ్య మందుకు విముక్తి కలిగిందన్నారు. చేసేందంతా చేసి ఇప్పుడు సన్మానాలు చేసుకోవడం సిగ్గుచేటని సోమిరెడ్డి విమర్శించారు

హైకోర్టుకు కోపం వ‌స్తే ఎట్టా ఉంటాదో తెలుసా?

అన్నీ భవిష్యత్‌లోనే చేస్తారా? ఇప్పుడేమీ చేయడం లేదా? ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్సల ధరలు ఒకే విధంగా ఉండాలన్న ఆదేశాలు అమలు చేశారా? ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ట్రీట్‌మెంట్‌కు గరిష్ఠ ధరలను సవరిస్తూ కొత్త‌ జీవో ఇచ్చారా? కొత్త ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌లు ఇంకెప్పుడు అందుబాటులోకి వస్తాయి? కరోనాపై సలహా కమిటీ ఎందుకు ఏర్పాటు చేయలేదు? అంటూ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ.. తెలంగాణ ప్ర‌భుత్వంపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించింది హైకోర్టు.  బంగారం తాకట్టు పెట్టి ఆస్పత్రులకు ఫీజులు చెల్లిస్తున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, సిబ్బంది పెంపునకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని నిల‌దీసింది. మూడో దశ సన్నద్ధతపై వివరాలు సమగ్రంగా లేవని.. మహారాష్ట్రలో ఒకే జిల్లాలో 8వేల మంది చిన్నారులు కరోనా బారిన పడ్డారని గుర్తు చేసింది. కేటాయించిన బ్లాక్ ఫంగస్ ఔషధాలు ఎందుకు సరఫరా చేయలేదో తెలపాలని కేంద్రాన్ని ఆదేశించింది హైకోర్టు.  గతంలో తాము ఇచ్చిన ఆదేశాల్లో కొన్ని ఎందుకు అమలు చేయలేదని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లీ, న్యాయమూర్తి జస్టిస్‌ విజయసేన్‌ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్‌) హైకోర్టుకు నివేదిక సమర్పించారు.  కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ప్రజారోగ్య సంచాలకులు(డీహెచ్‌), డీజీపీ, కార్మిక, జైళ్ల శాఖలు, జీహెచ్ఎంసీ వేర్వేరుగా నివేదికలు అందించాయి. ప్రైవేట్​ఆస్పత్రులపై వచ్చిన ఫిర్యాదులు పరిశీలిస్తున్నామని.. దీనికి సంబంధించి ముగ్గురు ఐఏఎస్‌లతో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పటికే 79 ఆస్పత్రులకు 115 షోకాజ్ నోటీసులు జారీ చేశామని.. 10 ఆసుపత్రుల కరోనా చికిత్స లైసెన్సులు రద్దుచేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ పడకలు పెంచుతున్నామన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 744 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైనట్లు డీహెచ్ హైకోర్టుకు తెలిపారు. బ్లాక్ ఫంగస్ చికిత్సకు 1,500 పడకలు అందుబాటులో ఉన్నాయని నివేదికలో తెలిపారు.  తెలంగాణలో లాక్‌డౌన్‌, కర్ఫ్యూ నిబంధనల ఉల్లంఘనలపై 2.61లక్షల కేసులు నమోదు చేసినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి హైకోర్టుకు తెలిపారు. ఔషధాల బ్లాక్‌ మార్కెట్‌పై 150కేసులు నమోదు చేశామన్నారు. ఏప్రిల్‌ 1నుంచి మే30వ తేదీ వరకు 7.49లక్షల కేసులు నమోదు చేశామని.. మాస్కులు ధరించని వారిపై 4.18లక్షల కేసులు నమోదు చేసి రూ.35.81కోట్ల జరిమానా విధించినట్టు.. జనం గూమిగూడినందుకు 13,867కేసులు పెట్టిన‌ట్టు నివేదికలో తెలిపారు. ప్ర‌భుత్వ వ‌ర్గాలు స‌మ‌ర్పించిన నివేదిక‌ల‌పై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తూ.. స‌ర్కారుపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం గుప్పించింది హైకోర్టు. 

బీజేపీ డైరెక్షన్’లో  శశికళ యాక్షన్ 

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రానున్నట్లు పంపిన సంకేతాలు తమిళనాడు రాజకీయాలలో సంచలనంగా మారాయి. అయితే,  ఆమె వస్తానన్నా, తాము  ఆమెను పార్టీలోకి తీసుకోమని, ఆమె అవసరం పార్టీకి లేదని,  అన్నా డిఎంకే నాయకులు తెగేసి చెపుతున్నారు. అంతే కాదు, ఎప్పుడోనే పార్టీతో తెగతెంపులు చేసుకున్న ఆమెకు, పార్టీలో జరుగుతున్న పరిణామాలతో ఏ విధమైన సంబంధం లేదని, ఏఐఏడీఎంకే డిప్యూటి కోఆర్డినేటర్‌ కేపీ మునుసామి స్పష్టం చేశారు. ఆమె చాలా రోజుల నుంచి పార్టీలో లేరని మునుసామి తెలిపారు. పార్టీపై తిరిగి పట్టు సాధించాలనే యోచనతో కార్యకర్తల్లో గందరగోళం సృష్టించేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అయితే, జయలలిత మరణంతోనే అన్నా డిఎంకేలో నాయకత్వ సమస్య తలెత్తింది.నిజానికి జయలలిత మరణించిన వెంటనే, ఏఐఏడిఎంకే శాసన సభా పక్షం, జయ స్థానంలో శశికళను నాయకురాలుగా ఎన్నుకుంది. అయినా, అప్పటి రాష్ట్ర ఇన్ - చార్జి గవర్నర్ సీహెచ్. విద్యాసాగర రావు, ఢిల్లీ పెద్దల జోక్యంతో,ఆమెతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించలేదు.ఇంతలో  జయలలిత, శశికళ సహా ముద్దాయిలుగా ఉన్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తీర్పు వచ్చి ఆమె జైలుకు వెళ్ళడంతో కథ మలుపు తిరిగింది.  ఇక అక్కడి నుంచి అన్నాడిఎంకే’  రిమోట్ బీజేపీ పెద్దల చేతికి వెళ్ళింది. ఒకవిధంగా బీజేపీ నాయకత్వం, అన్నా డిఎంకే  అధిష్టానం అన్నట్లుగా వ్యవహారం నడుస్తోంది. అలాగే, శశికళ కూడా బీజేపీ చెప్పు చేతల్లో, పార్టీ నాయకుల డైరెక్షన్’లోనే నడుస్తున్నారని, సన్నిహిత వర్గాల సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించినా, ఇప్పుడు క్రియాశీల రాజకీయాలలోకి వస్తున్నానని ఫీలర్స్ పంపినా, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ ఢిల్లీ పెద్దలవే అని కొందరు విశ్లేషకులు పేర్కొంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమె మేనల్లుడు పెట్టిన  ‘అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే) పార్టీ అభ్యర్ధులను నిలిపితే తమ మిత్ర పక్షం అన్నా డిఎంకేకి నష్టం. సో, ఢిల్లీ  పెద్దలు ఆమె చేత సన్యాసం ప్రకటన చేయించారు. ఇక ఇప్పుడు పళనిస్వామి, పనీర్ సెల్వం వర్గాల మధ్య అంతర్గత విబేధాలు ముదిరి పాకాన పడిన నేపధ్యంలో ఆమె అవసరం ఏర్పడింది. అందుకే ఢిల్లీ డైరెక్షన్’లోనే ఆమె కథకు కొత్త ట్విస్ట్ ఇచ్చారని అంటున్నారు.  అదే నిజం అయితే, పళని, పన్నీర్ ఎమన్నా,అన్నా డిఎంకే నో’ అన్నాశశికళ క్రియాశీల రాజకీయాలలోకి రావడం ఖాయంగానే కనిపిస్తోంది. ముఖ్యంగా, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా, లోక్ సభ ఎన్నికల నాటికీ అయినా పార్టీని ఒక ఫోర్సుగా తయారు చేయాలంటే, జయలలిత స్టైల్లో పనిచేసే శశికళ లాంటి  స్ట్రాంగ్ లీడర్  కావాలని బీజేపీ బావిస్తోంది కాబట్టి  ఆమె క్రియాశీల రాజకీయల్లోకి రావడమే కాదు, పార్టీ పగ్గాలు చేపట్టడం కూడా జస్ట్ మ్యాటరాఫ్ టైం అంటున్నారు.  అంతే కాదు, పిట్ట పోరు పిట్టపోరు  పిల్లి తీర్చింది అన్నట్లు పళని, పన్నీర్ తగువును శశికళ తీర్చడం ఖాయమని తమిళ రాజకీయ పండితులు అంటున్నారు.

కేటీఆర్ వ‌ర్సెస్ సోనూసూద్‌.. ఎవ‌రు సుప‌ర్‌హీరో?

క‌రోనా కాలంలో ఎవ‌రు, ఏ చిన్న సాయం చేసినా అత‌న్ని సూప‌ర్‌హీరోగానే చూస్తున్నారు. అలాంటిది లెక్క‌లేన‌న్ని.. చెప్పుకోలేన‌న్ని.. సాయాలు చేస్తూ.. ప్ర‌జ‌ల పాలిటి రియ‌ల్ సూప‌ర్‌హీరోగా నిలుస్తున్నారు సోనూసూద్‌. వ‌ల‌స కూలీల నుంచి క్రికెట్ స్టార్స్ వ‌ర‌కూ.. అనేక మందికి సోనూసూదే సూప‌ర్‌హీరో. లాక్‌డౌన్‌లో కూలీలను బ‌స్సులు, ప్ర‌త్యేక‌ విమానాల్లో గ‌మ్య స్థానాల‌కు చేర్చిన ఘ‌న‌త ఆయ‌న‌ది. అందుకే, హాస్పిట‌ల్‌లో బెడ్ కావాల‌న్నా.. రెమ్‌డెసివిర్ ఇంజెక్ష‌న్లు కావాల‌న్నా.. ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు కావాల‌న్నా.. సోనూసూద్‌నే ఆశ్ర‌యిస్తున్నారు జ‌నాలు. అందుకే, కేవ‌లం ప్ర‌జ‌లే కాదు పాల‌కులు సైతం సోనూసూద్‌ను సూప‌ర్‌హీరోగా కీర్తిస్తున్నారు. తాజాగా, మంత్రి కేటీఆర్ సోనూసూద్‌ను సూప‌ర్‌హీరో అంటూ ట్వీట్‌ చేయ‌డం.. సోనూ సైతం కేటీఆర్‌ను పొగ‌డ‌టం సోష‌ల్ మీడియాలో ఆస‌క్తిక‌రంగా మారింది.  ఇటీవ‌ల‌ తెలంగాణకు చెందిన ఒక కరోనా బాధితుడు త‌నకు ఆక్సిజ‌న్ లెవెల్స్ ప‌డిపోయాయ‌ని.. అర్జెంటుగా ఆక్సిజ‌న్ కాన్సెంట్రేట‌ర్ అందించ‌గ‌ల‌రా? అంటూ మంత్రి కేటీఆర్‌కు ట్విట‌ర్‌లో రిక్వెస్ట్ పెట్టాడు. ఆ బాధితుడి ట్వీట్‌కు స్పందించిన కేటీఆర్ ఆయ‌న‌కు ఆక్సిజ‌న్ కాన్సెంట్రేట‌ర్ అందేలా చేశారు. దీంతో.. ఆ క‌రోనా బాధితుడు తిరిగి ట్విట్ట‌ర్‌లోనే కేటీఆర్‌కు కృత‌జ్ఞ‌త చెప్పాడు. "కేవలం పది గంటల్లోనే తాము కోరిన ఆక్సిజన్ కాన్సెంట్రేటర్‌ను అందించినందుకు ధన్యవాదాలు కేటీఆర్ సార్. కరోనా కష్టకాలంలో ఇప్పటి వరకూ మీరెంతోమంది తెలంగాణ ప్రజలకి సాయం చేశారు. మీరందించిన సహాయాన్ని మేము ఎప్పటికీ మరచిపోలేము. మీరు రియ‌ల్ సూప‌ర్హీరో" అంటూ అతను కేటీఆర్ కు మెసేజ్ పెట్టాడు.  అత‌ని ట్వీట్‌కు కేటీఆర్ స్పందించారు. "బ్రదర్.. నేను మీచే ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధిని. నావంతు బాధ్యత మాత్రమే చేస్తున్నా.. మీరు చెప్పిన సూపర్ హీరో కచ్చితంగా సోనుసూద్."  అంటూ అత‌ని ట్వీట్‌కు బ‌దులిచ్చారు కేటీఆర్. ఆ ట్వీట్‌కు సోనూసూద్‌ని కూడా ట్యాగ్ చేశారు. ఆ త‌ర్వాత‌.. కేటీఆర్ ట్వీట్‌పై సోనూసూద్ కూడా స్పందించారు. "మీ ప్రేమ పూరిత మాటలకు చాలా ధన్యవాదాలు సార్! కానీ మీరు నిజంగా తెలంగాణ కోసం ఎంతో చేసిన హీరో. మీ నాయకత్వంలో రాష్ట్రం చాలా అభివృద్ధి చెందింది. నేను తెలంగాణను నా రెండో ఇంటిగా.. నా వర్క్ స్టేషన్ గా భావిస్తున్నాను. ఎన్నో ఏళ్లుగా తెలంగాణ ప్రజలు నాపై చాలా ప్రేమను చూపించారు." అంటూ సోనూసూద్ కేటీఆర్‌కు రిప్లై ఇచ్చారు. సోనూసూద్ రిప్లైకి కూడా కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ‘చాలా ధన్యవాదాలు బ్రదర్.. లక్షలాది మందికి స్పూర్తినిస్తూ మీరు ప్రారంభించిన గొప్ప పనిని కొనసాగించండి’.. అంటూ కేటీఆర్ అన్నారు. ఇలా కేటీఆర్‌, సోనూసూద్‌ల మ‌ధ్య జ‌రిగిన ట్వీట్స్ సంభాష‌ణ‌పై అనేక కామెంట్లు, రీట్వీట్‌లు వ‌స్తున్నాయి. సోష‌ల్ మీడియాలో వీరి సంభాష‌ణ వైర‌ల్‌గా మారింది. 

KIMS ఆసుపత్రిలో ‘నగ్నంగా’ కొవిడ్ పేషెంట్స్..

కరోనా వల్ల మృతి మానవత్వం కరువైతుంది. డబ్బుల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ఈ కరోనా టైం లో మనుషులు ఏంటో తెలిచొచ్చింది. కొంత మంది సేవ చేస్తూ మానవత్వం చాటుకుంటుంటే ఇంకొంత మంది కాసులు కూడగట్టేపనిలో ఉన్నారు. కొన్ని హాస్పిటల్లో అయితే మరి దారుణం. కరోనా పేషేంట్స్ ను పట్టించుకోవడం.. బిల్లు కడితే గాని డెడ్ బాడీస్ ని బాధిత కుటుంబాలకు ఇవ్వడం లేదు. ఇలా రోజు వార్తలు వింటూనే ఉన్నాం.. అలాంటి వార్తలు మన కళ్లారా చూస్తున్నాం .. ఈ వార్త చవివాక మీరే తెలుసుకుంటారు..తాజాగా కిమ్స్ కొవిడ్ ఆసుపత్రిలో కరోనా బాధితులు ఒంటిపై బట్టలు లేకుండా నేల మీద పడుకున్నారు. మరి కొందరు ఏకంగా టాయిలెట్ల పక్కనే బట్టలు లేకుండా నిద్రపోతున్న ఫోటోలు, వీడియోలు సంచలనంగా మారాయి. ఈ ఫోటోలు పలు విమర్శలకు దారి తీస్తున్నాయి. సోషల్ మీడియలో ఈ ఫోటోలు, వీడియో వైరల్ అవడంతో ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ వినీత్ భరద్వాజ్ స్పందించారు. అత్యవసర విచారణకు ఆదేశించినట్టు ఓ ప్రకటనలో తెలిపారు. వివరాల ప్రకారం.. బరిపాడా పట్టణం బంకిశోలా ప్రాంతంలో ఉన్న కిమ్స్ కొవిడ్ ఆస్పత్రిలో.. టాయిలెట్ పక్కన, అన్నం ప్లేట్లు పడేసే చోట రోగులకు ఆసుపత్రి సిబ్బంది బెడ్స్ కేటాయించారు. ఈ సందర్భంగా ఓ కరోనా బాధితుడిని కలిసేందుకు ఆయను బంధువు ఆసుపత్రికి వెళ్లగా.. ఈ దారుణ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోను రికార్డు చేశారు. అయితే ఈ ఘటనపై మయూర్ భంజ్ అదనపు డివిజనల్ వైద్యాధికారి ఎన్ఆర్ దాస్ స్పందిస్తూ తనకేమీ తెలియదని చెప్పుకురావడం విమర్శలకు దారి తీస్తున్నది. కాగా.. ఆసుపత్రి తీరుపై, అధికారులపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కారణంగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఫైర్ అవుతున్నారు. ఆసుపత్రి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన ఒడిషాలో చోటుచేసుకుంది.   

కరోనా సోకిన పిల్లలకు మరో వింతవ్యాధి ? 

కరోనా ఒక వైపు దేశం విలయ తాండవం చేస్తుంది. మరణాలు ఒక ఒక రేంజు లో చనిపోతున్నారు. రోజు ఒకటి కాదు, రెండు కాదు రోజు వేల సంఖ్యలో మరణాలు సంవిస్తున్నాయి. సెకండ్ ఒకవైపు అయితే కొత్తగా దేశ ప్రజలను బ్లాక్ ఫంగస్ భయబ్రాంతులకు గురిచేస్తోంది.. ఈ బ్లాక్ ఫంగస్  వల్ల చాలా మంది బాధపడుతున్నారు. కొంత మంది చనిపోతున్నారు. అయితే ఈ రెండు వ్యాధులు ఇప్పటివరకు యువకుల పై, పెద్ద వారిపై ప్రభావం చూపించింది. చాలా మంది ఆ మహమ్మారి కాటుకు బలైయింది.. అయితే ఈ రెండు మహామారిలు అంతం కాకముందే ఇప్పుడు మరో వ్యాధి వస్తోంది. కొత్త వ్యాధి విరుచుకుపడుతుంది.ఈ వ్యాధి అలాంటి ఇల్లాంటి వ్యాధి కాదు అది డైరెక్టుగా చిన్న పిల్లపైనే దాని ప్రభావం చూపుతుంది.  దీని పేరు MIS-C. అనగా మల్టీసిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్. ఈ వ్యాధి పిల్లలలో కనిపిస్తోందని స్పష్టమైంది. బ్లాక్ ఫంగస్ కోవిడ్ -19 తో సంబంధం కలిగి ఉన్నట్లే MIS-C కూడా కరోనా వైరస్‌తో సంబంధం ఉన్న వ్యాధి. ఈ వ్యాధి ఉత్తర భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలో కనిపిస్తుంది. చాలామంది పిల్లలు దీని బారిన పడ్డారు. కుటుంబంలో ఎవరైనా కోవిడ్ -19 రోగి లేదా కోలుకున్నట్లయితే పిల్లల గురించి చాలా జాగ్రత్తగా ఉండండి అని వైద్యులు సూచిస్తున్నారు. పిల్లలలో ఏదైనా అసాధారణ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. MIS-C వ్యాధి అంటే ఏమిటి ఈ వ్యాధి కోవిడ్ -19 తో సంబంధం కలిగి ఉంటుంది. కుటుంబంలో ఎవరైనా కొవిడ్ బారిన పడితే వారిద్వారా పిల్లలకు సంభవిస్తుంది. కోవిడ్ రోగి కోలుకున్నా, పిల్లలు అతనితో సంబంధం కలిగి ఉంటే అప్పుడు ఈ వ్యాధి సోకుతుంది. అయినప్పటికీ కరోనా బారిన పడిన పిల్లలలో 0.14 శాతం మంది మాత్రమే MIS-C కి గురవుతున్నారు. జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ సంఖ్య పెరుగుతుంది. పిల్లలలో మీరు నిరంతర జ్వరం, చర్మ మచ్చలు లేదా దద్దుర్లు, అలసట, ఎర్రటి కళ్ళు, విరేచనాలు వంటి సమస్యలను చూసినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఈ వ్యాధిని డెంగ్యూ లేదా టైఫాయిడ్ లాగా చికిత్స చేయలేమని వైద్యులు చెబుతున్నారు. దీనికి చికిత్స పూర్తి భిన్నంగా ఉంటుందని పిల్లలను వెంటనే ఆసుపత్రిలో చేర్పించడం అవసరమని సూచిస్తున్నారు. వ్యాధి లక్షణాలు ఏమిటి ఈ వ్యాధిలో పిల్లల అనేక అవయవాలలో వాపు ఉంటుంది. మెదడు, గుండె, రక్త నాళాలు, కడుపు, మూత్రపిండాలు లేదా చర్మం వాపు ఉంటుంది. ప్రారంభంలో జ్వరం ఉంటుంది. తరువాత వాపు మొదలవుతుంది. ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. పిల్లలకి 100 డిగ్రీల కంటే ఎక్కువ జ్వరం కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. జ్వరం, చర్మం దద్దుర్లు, ముందరి ఉద్గారాలు, గొంతు లేదా వాపు, ఎర్రటి కళ్ళు, నాలుకపై ఎర్రటి మచ్చలు, కడుపు నొప్పి, విరేచనాలు, అలసట దాని ప్రధాన లక్షణాలు. కష్ట సమయాల్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది. ఛాతీ నొప్పి, పసుపు లేదా నీలం కళ్ళు, ఇవి తీవ్రమైన లక్షణాలు. వీలైనంత త్వరగా పిల్లవాడిని అత్యవసర సంరక్షణలో చేర్పించాలి.  

ఒక కేసీఆర్‌.. ఒక జ‌గ‌న్‌.. ఒక ఈట‌ల‌.. ఒక మంచి ఛాన్స్ మిస్‌?

అష్ట‌ల‌క్ష్మిల్లోకి ధైర్యల‌క్ష్మినే ముఖ్య‌మంటారు. ధైర్య‌మున్న‌వాడే విజేత‌. తాత్కాలిక ప్ర‌యోజ‌నాల కోసం రాజీ ప‌డితే... శాశ్వ‌త అధికారానికి దూర‌మ‌వుతారు. ఆనాడు.. కేసీఆర్, జ‌గ‌న్‌రెడ్డిలు ధైర్యాన్నే న‌మ్ముకున్నారు. నేడు ముఖ్య‌మంత్రులుగా అధికారం చెలాయిస్తున్నారు. ఈట‌ల రాజేంద‌ర్ మాత్రం అలా చేయ‌లేక‌పోయారు. సొంత‌పార్టీ పెట్టి, కేసీఆర్ వ్య‌తిరేక శ‌క్తుల‌ను క్రూడీక‌రించి.. ముఖ్య‌మంత్రి పీఠం దిశ‌గా అడుగులు వేయ‌గ‌ల అన్నిర‌కాల సామ‌ర్థ్యాలు ఉన్నా కూడా.. ధైర్యం మాత్రం చేయ‌లేక‌పోయారు. కేసుల భ‌యం వెంటాడిన‌ట్టుంది. తాత్కాలిక ప్ర‌యోజ‌నాల కోసం.. శాశ్వ‌త అవ‌కాశాన్ని చేజేతులారా కాల‌ద‌న్నుకున్నారు. చ‌రిత్రలో నిల‌వ‌గ‌ల స‌త్తా ఉన్న నేత అయి ఉండి కూడా.. చ‌రిత్ర‌ నుంచి ఆయ‌న స‌రైన పాఠాలు నేర్వ‌న‌ట్టున్నారు.  అది 2001, ఏప్రిల్ 27.. హైద‌రాబాద్ జ‌ల‌దృశ్యంలో తెలంగాణ రాష్ట్ర స‌మితి ఆవిర్భావం. ఆ స‌మ‌యంలో ప్ర‌త్యేక తెలంగాణ కోసం పార్టీ పెట్ట‌డమంటే సాహ‌స‌మే. అది కేసీఆర్‌కు మాత్ర‌మే సాధ్య‌మైంది. అంత‌కుముందు, చంద్ర‌బాబు కేబినెట్‌లో చోటు కోసం కేసీఆర్ గట్టిగానే ప్ర‌య‌త్నించారు. ఈక్వేష‌న్స్ కుద‌ర‌క‌.. మంత్రి ప‌ద‌వి ద‌క్క‌లేదు. డిప్యూటీ స్పీక‌ర్‌తో సంతృప్తి చెంద‌ని కేసీఆర్‌.. ప్రత్యేక తెలంగాణ ఉద్య‌మం లేవ‌నెత్తారు. స్వ‌ప‌రిపాల‌న‌ ప్ర‌స్తావ‌నే వినిపించ‌ని రోజుల్లోనే.. తెలంగాణ కోసం సొంత‌పార్టీతో ఉద్య‌మాన్ని ఉర‌క‌లెత్తించారు. చంద్ర‌బాబు, వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి, కిర‌ణ్‌కుమార్‌రెడ్డి లాంటి బ‌ల‌మైన పాల‌కుల‌తో బ‌లంగా పోరాడారు. ఒక‌టి, రెండు కాదు..  ఏకంగా 15 ఏళ్ల పాటు ఓపిగ్గా ఎదురుచూశారు. ఆ ధైర్య‌మే ఆయ‌న్ను విజ‌య‌తీరాల‌కు చేర్చింది. ఏడేళ్లుగా ముఖ్య‌మంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. ఈట‌ల రాజేందర్ మాత్రం బ‌ల‌మైన కేసీఆర్‌తో పోరాడే ధైర్యం చేయ‌లేక‌.. సొంత‌పార్టీ పెట్టేందుకు వెన‌క‌డుగు వేశార‌ని అంటున్నారు. ప‌ట్టుమ‌ని ప‌ది రోజులు కూడా నిల‌బ‌డ‌లేక‌పోయారు. కేసుల‌తో ఉక్కిరిబిక్కిరి అయి.. బెదిరి.. బేజారై.. బీజేపీ అనే ర‌క్ష‌ణ చ‌ట్రం కింద చేరిపోయారు.  ఒక్క కేసీఆర్ అనే కాదు.. ధైర్యాన్ని న‌మ్ముకొని.. తెగువ ప్ర‌ద‌ర్శించి.. ఓపిగ్గా రాజ‌కీయం నెరిపిన‌.. ఏ ఒక్క నాయ‌కుడూ.. ఓడిపోయిన‌ట్టు చ‌రిత్ర‌లోనే లేదు. వైఎస్ జ‌గ‌న్‌రెడ్డి ఉదంతం అందుకు మ‌రో బెస్ట్ ఎగ్జాంపుల్‌. వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి మ‌ర‌ణం త‌ర్వాత‌.. తానే సీఎం కావాల‌ని ప‌ట్టుబ‌ట్టారు జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి. తండ్రి శ‌వం సాక్షిగా సంత‌కాల సేక‌ర‌ణ చేశార‌ని అంటారు. జ‌గ‌న్ సీఎం కావాల‌నే కాంక్ష‌ను.. కాంగ్రెస్ హైక‌మాండ్ మొగ్గ‌లోనే తుంచేసింది. పార్టీలో అలా ప‌డుండు.. స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు చూద్దాంలే అన్న‌ట్టు మాట్లాడింది. కాంగ్రెస్‌ అధిష్టానంతో విభేదించారు జ‌గ‌న్‌రెడ్డి. అప్పుడు ఆయ‌న ముందు రెండు దారులు క‌నిపించాయి. అందులో..  ఆప్ష‌న్ 1-- అధిష్టానం మాట విని.. రాజకీయంగా రాజీపడితే.. ఏ ఎంపీ ప‌ద‌వో, మంత్రి ప‌ద‌వో వ‌స్తుంది. ఎంచ‌క్కా ఎప్ప‌టిలానే వ్యాపారాలు చేసుకోవ‌చ్చు. వేల కోట్లు కూడ‌బెట్టుకోవ‌చ్చు. బెంగ‌ళూరు ప్యాలెస్‌లో ద‌ర్జాగా జీవితం గ‌డిపేయ‌వ‌చ్చు.  ఆప్ష‌న్ 2-- త‌న ల‌క్ష్య‌మైన ముఖ్య‌మంత్రి పీఠాన్ని సాధించుకోవ‌డం కోసం రాజకీయ, ఆర్థిక‌ భవిష్యత్తును ప‌ణంగా పెట్టి.. కేసులు, ఇబ్బందులు ఎదుర్కోవడానికి సిద్ధం కావటం. స్వ‌త‌హాగా మొండిఘ‌ట‌మైన జ‌గ‌న్‌.. రెండో ఆప్ష‌న్‌నే ఎంచుకున్నారు. అక్ర‌మాస్తుల కేసుల్లో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అయినా.. రెండేళ్లు జైల్లో మ‌గ్గినా.. దాదాపు తొమ్మిది ఏళ్లు అన్నిర‌కాల క‌ష్ట‌న‌ష్టాల‌ను భ‌రిస్తూ.. ఓపిగ్గా పోరాడుతూ వ‌చ్చారు. అంతిమంగా త‌న స్వ‌ప్నం సాకారం చేసుకున్నారు. ముఖ్య‌మంత్రి సింహాస‌నంపై రెండేళ్లుగా పెత్త‌నం చెలాయిస్తున్నారు.  తెలుగు రాష్ట్రాల్లో కంటి ముందు క‌నిపిస్తున్న ఈ ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల ఉదంతాన్ని ఈట‌ల రాజేంద‌ర్ అవ‌గాహ‌న చేసుకోలేక‌పోయార‌ని అంటున్నారు. పోరాడితే పోయేదేమీ లేదు- బానిస సంకెళ్లు తెగి ముఖ్య‌మంత్రి కావ‌డం మిన‌హా.. అని గుర్తించ‌లేక‌పోయారు. చాలామంది రాజ‌కీయ నాయ‌కులు ఇలానే చేస్తుంటారు. బ‌డా వ్యాపారాలు ఉన్న వారైతే మ‌రీ భ‌య‌ప‌డిపోతుంటారు. ఎన్నిక‌ల్లో ఓడిన వెంట‌నే అధికార పార్టీలోకి చేరిపోతుంటారు. త‌మ ఆర్థిక ప్ర‌యోజ‌నాల కోసం కాంప్ర‌మైజ్ అవుతుంటారు. ఆ క్ర‌మంలో రాజ‌కీయ భ‌విష్య‌త్తును నాశ‌నం చేసుకుంటుంటారు. ఈట‌ల రాజేంద‌ర్ సైతం అలానే రాజీ ప‌డ్డార‌నేది విశ్లేష‌కుల మాట‌.   ఈటల‌ది సుదీర్ఘ ఉద్య‌మ‌, రాజ‌కీయ చ‌రిత్ర‌. బెదిరింపుల‌కు భ‌య‌ప‌డే మ‌నిషి కాదు. ఆనాడు వైఎస్ విసిరిన వ‌ల‌కు చిక్క‌కుండా.. ఉద్య‌మాన్నే న‌మ్ముకొని ఉన్న‌ నిఖార్సైన నాయ‌కుడు. ఆర్థిక బ‌ల‌మూ మెండు. సామాజిక అండా దండా పుష్క‌లం. కానీ, ఆయ‌న‌లో కొర‌వ‌డింది విసుమెత్తు ధైర్యం. కేసీఆర్‌ను సొంతంగా ఢీకొట్టే ధైర్యం లేక‌నే ఆయ‌న జాతీయ పార్టీలో చేరి గుంపులో గోవింద‌లా మిగిలేందుకు సిద్ధ‌మ‌య్యారు. గ‌డీల పాల‌న‌కు గండికొట్టేలా.. దొర‌కు వ్య‌తిరేకంగా.. తెలంగాణ ఉద్య‌మం మాదిరి.. రాజ‌కీయ శ‌క్తుల పున‌రేకీక‌ర‌ణ‌కు ప్ర‌య‌త్నం చేసే సాహ‌సం చేయ‌లేక‌పోయారు. కోదండ‌రాం సారు, కొండా విశ్వేశ్వ‌రరెడ్డిలాంటి వాళ్లు ఎంత‌గా ధైర్యం నింపినా.. సొంత‌పార్టీతో కేసీఆర్‌కు స‌వాల్ విస‌ర‌లేక‌పోయారు.  ఈట‌ల గ‌ట్టిగా పోరాడి ఉంటే.. ఓపిగ్గా రాజ‌కీయం చేయ‌గ‌లిగి ఉంటే.. ఆయ‌న సైతం కేసీఆర్‌లా, జ‌గ‌న్‌రెడ్డిలా.. ఏనాటికైనా ముఖ్య‌మంత్రి కాగ‌ల అర్హ‌త, సామ‌ర్థ్యం ఉన్న‌వాడే. కానీ, కేసీఆర్ దాడి నుంచి త‌న ఆర్థిక సామ్రాజ్యాన్ని తాత్కాలికంగా కాపాడుకోవ‌టానికి.. సొంత‌పార్టీ విష‌యంలో కాంప్ర‌మైజ్ అయ్యార‌ని అంటున్నారు. ముఖ్య‌మంత్రి అయ్యే శాశ్వత రాజకీయ అవకాశాన్ని పోగొట్టుకున్నార‌ని చెబుతున్నారు. కేసీఆర్‌, జ‌గ‌న్‌రెడ్డిలా చిత్త‌శుద్ధి, ప‌ట్టుద‌ల‌, ధైర్యం లేక‌నో.. లేక‌, దేవేంద‌ర్‌గౌడ్‌, ఆలె న‌రేంద్ర‌, విజ‌య‌శాంతి, చిరంజీవి లాంటి వాళ్లను చూసి.. సొంత‌పార్టీ పెడితే చ‌రిత్ర‌లో క‌లిసిపోతాన‌నే భ‌య‌మో.. కార‌ణం ఏదైనా కానీ.. కేసీఆర్‌పై సింగిల్‌గా పోరాడ‌కుండా.. చేతులెత్తేసి.. మ‌రోపార్టీలో చేరిపోయి.. చ‌రిత్ర సృష్టించే అవ‌కాశాన్ని కోల్పోయార‌ని విశ్లేషిస్తున్నారు. ఒక కేసీఆర్‌.. ఒక జ‌గ‌న్‌.. ఒక ఈట‌ల రాజేంద‌ర్.. అనేలా ఆ ఇద్ద‌రి స‌ర‌స‌న నిల‌బ‌డ‌లేక‌పోయారు. ఈట‌ల ముఖ్య‌మంత్రి అయితే.. అది కేవ‌లం ఆయ‌న‌కే కాదు.. బీసీల‌కు రాజ్యాధికారం సాధించిన వాడిగా చ‌రిత్ర‌లో నిలిచిపోతాడు. అందుకే అంటారు.. ధైర్యే సాహ‌సే ల‌క్ష్మి.

బెయిల్ రద్దుకు నో చెప్పని సీబీఐ.. జగన్ కు జైలు తప్పదా? 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌పై నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు గతంలో జగన్, సీబీఐ మూడు సార్లు గడువు కోరారు. దీంతో కౌంటర్ దాఖలు చేసేందుకు జగన్, సీబీఐకి చివరి అవకాశం ఇస్తున్నామంటూ గత నెల 26న సీబీఐ కోర్ట్ హెచ్చరించింది. ఈ క్రమంలో సీబీఐ, జగన్ తరఫు న్యాయవాదులు కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు.  జగన్‌ బెయిలును రద్దు చేయాలన్న పిటిషన్‌పై సీబీఐ ఎలాంటి వైఖరి తీసుకుంటుంది అన్నది కొన్ని రోజులుగా ఆసక్తి రేపింది. వైసీపీలో టెన్షన్ పుట్టించింది.  జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతుందా లేక రద్దు చేయవద్దు..  బెయిలు నిబంధనలను ఆయన ఎంతమాత్రమూ ఉల్లంఘించడంలేదు అని చెబుతుందా? అన్నది రాజకీయ వర్గాల్లో  తీవ్ర ఉత్కంఠ రేపింది. కేంద్ర సర్కార్ తో జగన్ కొనసాగిస్తున్న సత్ససంబంధాలతో జగన్ కు అనుకూలంగానే సీబీఐ నిర్ణయం ఉంటుందనే చర్చ కూడా జరిగింది. అయితే వైసీపీ ఆశలను వమ్ము చేస్తూ  న్యాయస్థానంలో మెమో దాఖలు చేసింది సీబీఐ. జగన్ బెయిల్ రద్దు చేయవద్దని కోరలేదు. రఘురామ పిటిషన్‌పై చట్టప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. కోర్టు విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవాలని కోరింది.ఇరు పక్షాల వాద‌న‌లు విన్న ధ‌ర్మాస‌నం విచారణను ఈనెల 14కి వాయిదా వేసింది.  జగన్ బెయిల్ కేసులో సీబీఐ వేసిన కౌంటర్ పై ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జగన్‌ బెయిలు రద్దుకు ఎస్‌ లేదా నో అని చెప్పకుండా బంతిని కోర్టు పరిధిలోకి నెట్టింది సీబీఐ. ఈ విషయంలో మేం జోక్యం చేసుకోం.. మీరే నిర్ణయం తీసుకోండి అని చెప్పింది. దీంతో జగన్ బెయిల్ కేసులో ఏదైనా జరగవచ్చని చెబుతున్నారు. రఘురామరాజు తన పిటిషన్‌లో అనేక కీలక అంశాలను ప్రస్తావించారు. సాక్షులను ప్రత్యక్షంగా, పరోక్షంగా బెదిరిస్తున్నారని.. బెయిల్‌ షరతులను ఉల్లంఘిస్తున్నారని తెలిపారు. న్యాయస్థానం ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు. పలువురు సాక్షులు జగన్‌ ప్రభుత్వంలో అధికారులుగా ఉండటం, కొందరు సహ నిందితులు కీలక స్థానాల్లో ఉండటం, ఒకరికి సలహాదారు పదవి ఇవ్వడం, విజయసాయి రెడ్డి, అయోధ్య రామిరెడ్డిని రాజ్యసభకు పంపడం లాంటివన్నీ పిటిషన్‌లో వివరించారు. ప్రజాప్రతినిధుల కేసుల్లో విచారణ వేగవంతం చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలను జీర్ణించుకోలేని వైసీపీ నేతలు న్యాయవ్యవస్థపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. ఇంత నిర్దిష్టమైన అంశాలు ఉండటంతో జగన్ బెయిల్ పై ఎటువంటి నిర్ణయం ఉంటుందన్నది ఆసక్తిగా మారింది. జగన్ బెయిల్ కేసులో  జరగబోయే పరిణామాలపై ఏపీ జనాల్లోనూ ఉత్కంఠ నెలకొంది. జగన్ తరపు లాయర్లు 98 పేజీల కౌంటర్ దాఖలు చేశారు. జగన్ బెయిల్ షరతులను ఎక్కడా ఉల్లంఘించలేదని అందులో పేర్కోన్నారు. సీబీఐని ప్రభావితం చేస్తున్నారన్న పిటిషనర్ వాదనలో నిజం లేదని పేర్కొన్నారు. సీబీఐ కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తుందని.. పిటిషనర్ రఘురామరాజుకు ఈ కేసులో సంబంధం లేదని వివ‌రించారు. ఇలాంటి కేసుల్లో థర్డ్ పార్టీ జోక్యం చేసుకోవద్దని సుప్రీం కోర్టు తీర్పులున్నాయని స్ప‌ష్టం చేశారు. రఘురామరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, ఆయ‌న‌ను అనర్హుడిగా ప్రకటించాలని స్పీకర్‍కు లేఖ కూడా రాసిన‌ట్లు వెల్ల‌డించారు. రఘురామ పిటిషన్‌కు విచారణార్హత లేదని.. వ్యక్తిగత, రాజకీయాల కోసం న్యాయవ్యవస్థను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రఘురామరాజుపై ఏపీలో అనేక కేసులున్నాయని.. విన్న‌వించారు.  

 థర్డ్ పార్టీ జోక్యం చేసుకోవద్దు! బెయిల్ కేసులో జగన్ కౌంటర్ 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌పై నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. జగన్ తరపు లాయర్లు 98 పేజీల కౌంటర్ దాఖలు చేశారు. జగన్ బెయిల్ షరతులను ఎక్కడా ఉల్లంఘించలేదని అందులో పేర్కోన్నారు. సీబీఐని ప్రభావితం చేస్తున్నారన్న పిటిషనర్ వాదనలో నిజం లేదని పేర్కొన్నారు. సీబీఐ కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తుందని.. పిటిషనర్ రఘురామరాజుకు ఈ కేసులో సంబంధం లేదని వివ‌రించారు. ఇలాంటి కేసుల్లో థర్డ్ పార్టీ జోక్యం చేసుకోవద్దని సుప్రీం కోర్టు తీర్పులున్నాయని స్ప‌ష్టం చేశారు.  రఘురామరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, ఆయ‌న‌ను అనర్హుడిగా ప్రకటించాలని స్పీకర్‍కు లేఖ కూడా రాసిన‌ట్లు వెల్ల‌డించారు. రఘురామ పిటిషన్‌కు విచారణార్హత లేదని.. వ్యక్తిగత, రాజకీయాల కోసం న్యాయవ్యవస్థను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రఘురామరాజుపై ఏపీలో అనేక కేసులున్నాయని.. విన్న‌వించారు.ఆచంట, నర్సాపురం, పెనుగొండ, పెనుమంట్ర, భీమవరం పోలీస్ స్టేషన్‌లలో కేసులున్నాయని తెలిపారు. ఆయన బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టడంతో సీబీఐ కూడా కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ విషయాలను పిటిషనర్‌ కోర్టు ముందు దాచారన్నారు. వ్యక్తిగత, స్వార్థ ప్రయోజనాల కోసం కోర్టును ఉపయోగించుకోవాలని చూస్తున్నారని అన్నారు.  ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటీషన్‌‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు ఇప్పటికే జగన్, సీబీఐ మూడు సార్లు గడువు కోరారు. దీంతో కౌంటర్ దాఖలు చేసేందుకు జగన్, సీబీఐకి చివరి అవకాశం ఇస్తున్నామంటూ  గత నెల 26న సీబీఐ కోర్ట్ హెచ్చరించింది. ఈ క్రమంలో జగన్ తరఫు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు. వాద‌న‌లు విన్న ధ‌ర్మాస‌నం విచారణను ఈనెల 14కి వాయిదా వేసింది.  

ఒక్క చేప అతని జీవితాన్ని మార్చేసింది..

తంతే గారెల బుట్టలో పడ్డాడు. నక్క తోకను తొక్కాడు. ఈ మాటలు అప్పుడప్పుడు విన్న ఈ మాట చెప్పారంటే. ఏదైనా అద్భుతం జరిగితే మాట్లాడుకుంటాం.. సరిగ్గా  ఓ మత్స్యకారుడికి కూడా అదృష్టం వరించింది. తంతే అతను ఒకే సారి లక్షాధికారు అయ్యాడు. అదెలా అనుకుంటున్నారా.. మీరే చూడండి.. ఎలాగో..  అతని పేరు సాజిద్‌ హాజీ అబూబాకర్‌. అతని వృత్తి చేపలు పట్టడం.  అతని వాళ్లకి  అరుదైన చేప చిక్కింది. ఇంకేముంది అతని కష్టాలు తీరాయి. అతను రాత్రికి  రాత్రే లక్షాధికారి అయ్యాడు. ఒక చేప పడడం ఏమిటి .. ఆ చేపతో లక్షాధికారి అవ్వడం ఏంటని అనుకుంటున్నారా.. మరి అదే మ్యాజిక్. కొంత మంది ఓవర్ నైట్ స్టార్ అయినట్లు. ఆ చేపలు పట్టే సాజిద్‌ హాజీ అబూబాకర్‌ ఒకే నైట్ లక్షాది కారి అయ్యాడు. అంత ఆ చేప మహిమ. మరి అతని వలకు చిక్కిన చెప్పా అలాంటిలాంటి చేప కాదు అరుదైన క్రోకర్ జాతి చేప. దాని ధర ఎంత పలికిందో తెలిస్తే ఆశ్చర్యమే కాదు హార్ట్ ఎటాక్ కూడా వస్తుంది. అది ఏకంగా 72 లక్షలు ధర పలికింది. అదృష్టం ఎవర్ని, ఎప్పుడు, ఎలా, ఎక్కడి నుండి  వరిస్తుందో చెప్పలేం. ఆ చేపలు పట్టే అతనికి ఈ చేప ద్వారా అదృష్టం వరించింది. ఈ చేప అరుదైన అట్లాంటిక్‌ క్రోకర్‌ జాతికి చెందిన 48 కిలోల చేప అబాబాకర్ వలకు చిక్కింది. ఐరోపా, చైనాలో ఈ క్రోకర్‌ జాతి చేపలకు అత్యధిక డిమాండ్‌ ఉంది. వాస్తవానికి చేపల విలువ వాటి మాంసం ఆధారంగా నిర్ణయిస్తారు. కానీ, క్రోకర్‌ జాతి భిన్నమైంది. వైద్యపరంగా ఈ చేపలకు అంతర్జాతీయ మార్కెట్‌లో భారీ డిమాండ్‌ ఉంది. దీని చర్మాన్ని, ఎముకలను ఔషధాల్లో, ఇతర వైద్యపరమైన చికిత్సల్లోనూ ఉపయోగిస్తారు. అందుకే దీనికి అంతటి డిమాండ్. నిజానికి వేలంలో ఇంకా ఎక్కువ ధరకు ఈ చేప అమ్ముడుపోయింది. రూ 86.4 లక్షల వరకు వెళ్లినా.. పెద్ద మొత్తంలో వేలంలో దక్కించుకున్నవారికి రాయితీ ఇవ్వడం స్థానికంగా సంప్రదాయం. దీంతో అధికారులు చివరికి రూ.72 లక్షలుగా ధరను ఖరారు చేశారు. గతవారం కూడా గ్వాదర్‌ తీరంలోనే ఒక మత్స్యకారుడి వలకు క్రోకర్‌ జాతి చేప చిక్కగా.. వేలంలో అది రూ.7.8 లక్షలకు అమ్ముడైంది. ఈ చేపలు జెవానీ సహా చుట్టుపక్కల తీరానికి వేసవికాలంలో సంతానోత్పత్తి కోసం చేరుకుంటాయని జలచర నిపుణులు పేర్కొంటున్నారు. ఇంత పెద్ద మొత్తంలో అమ్ముడయిన చేపను తాను ఎప్పుడూ చూడలేదని గ్వాదర్ మత్స్యకారుల సంక్షేమ విభాగం డిప్యూటీ డైరెక్టర్ అహ్మద్ నదీమ్ అన్నారు. ఈ చేప 8.6 మిలియన్లకు అమ్ముడయినా.. కొంత రాయితీ ఇవ్వడంతో 7.2 మిలియన్లు దక్కిందన్నారు. ఈ ఘటన పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌ లో చోటుచేసుకుంది.  చేపలు పట్టడం అంత ఈజీ ఏం కాదు.. పడవలు వేసుకుని వేటకు వెళ్ళినపుడు.. కొంత మంది ప్రాణాలు కూడా పోతాయి. ఫుడ్ ఉండదు. నీళ్లు ఉండవు.. ఒక్కోసారి వారం రోజుల పాటు చేపలకు తిరుగుతారు. ఫలితం ఉండదు. ఈ ప్రపంచంలో ప్రతి కష్టం వెనక సుఖం ఉంటుంది.. ఆ సుఖం రావాలంటే ముందు పని చెయ్యాలి.. ఆ తర్వాత ఆ సమయం కోసం ఎదురు చూడాలి..ఫలితం అదే వస్తుంది. 

కంటే కూతుర్నే క‌నాలి.. ‘సైకిల్‌ గర్ల్‌’ జీవితంలో విషాదం..

కంటే కూతుర్నే క‌నాలి అనిపించింది ఆమె క‌ష్టం. తండ్రి కోసం ఆ కూతురు.. చేయ‌లేని సాహ‌సం చేసింది.   అనిత‌ర సాధ్య‌మైన ప‌నిని.. చేసి చూపించింది. గ‌తేడాది లాక్‌డౌన్ సిత్రాల‌లో ఆమె ఘ‌ట‌నే హైలైట్‌. ఆమె.. సైకిల్ జ్యోతిగా అప్ప‌ట్లో ఫుల్ పాపుల‌ర్‌. గాయ‌ప‌డిన తండ్రిని సైకిల్‌పై కూర్చోబెట్టుకొని.. అనేక రాష్ట్రాలు దాటి.. ఏకంగా 1200 కిలోమీట‌ర్లు సైకిల్ తొక్కి.. తండ్రిని సొంతూరికి తీసుకొచ్చిన బాలిక‌. అప్ప‌టి అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ కూతురు ఇవాంక సైతం ఆమె సైకిల్ యాత్ర‌ను మెచ్చుకున్నారు. ఇండియ‌న్ సైక్లింగ్ ఫెడ‌రేష‌న్ సైతం శ‌భాష్ అంటూ ప్ర‌శంసించింది. ఆ సైకిల్ జ్యోతి కుటుంబంలో ఇప్పుడు తీవ్ర విషాధం. ఏ తండ్రి కోస‌మైతే తాను అంత‌గా క‌ష్ట‌ప‌డి.. అంతదూరం సైకిల్ తొక్కి.. సుర‌క్షితంగా ఇంటికి తీసుకొచ్చిందో.. ఇప్పుడా తండ్రి గుండెపోటుతో మ‌ర‌ణించాడు. ఆమె తండ్రి చ‌నిపోవ‌డం.. జ్యోతితో పాటు యావ‌త్ దేశాన్ని కంట‌త‌డి పెట్టిస్తోంది. అంతా అయ్యో పాపం అంటూ సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు. దేశాన్నే క‌దిలించిన ఆమె క‌థ అలాంటిది మ‌రి... ఆ జ్ఞాప‌కాల్లోకి మ‌రోసారి..... బిహార్‌లోని దర్భంగ జిల్లా సిర్హులి గ్రామానికి చెందిన మోహన్‌ పాస్వాన్‌ బ‌తుకుతెరువు కోసం ఢిల్లీ స‌మీపంలోని గురుగ్రామ్ వ‌ల‌స వెళ్లాడు. మోహ‌న్‌కు ముగ్గురు పిల్ల‌లు. గతేడాది లాక్‌డౌన్‌కు ముందు మోహన్‌ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. తండ్రిని చూసుకునేందుకు పెద్ద కుమార్తె జ్యోతి కుమారి గురుగ్రామ్‌కు వచ్చింది. ఆమె వ‌చ్చిన కొంత‌కాలానికే మోదీ స‌ర్కారు దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది. ఎక్క‌డి వాహ‌నాలు అక్క‌డే నిలిచిపోయాయి. ఈ తండ్రీకూతుళ్లు అక్కడే చిక్కుకుపోయారు.  గురుగ్రామ్‌లో ఉండ‌లేక‌.. ఎలాగైన‌ సొంతూరుకు వెళ్లాల‌నుకున్నారు. ఓ పాత సైకిల్‌ కొని.. దానిపై తండ్రిని కూర్చోబెట్టుకొని.. సుమారు 1200 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ.. ఎన్నో కష్టాలను ఓర్చుకుంటూ.. ఏడు రోజుల తర్వాత స్వగ్రామానికి చేరింది. ‘సైకిల్‌ గర్ల్’ పేరుతో జ్యోతి ఉదంతం అప్ప‌ట్లో మారుమోగిపోయింది.  జ్యోతి సాహసాన్నిభారత సైక్లింగ్‌ ఫెడరేషన్‌ గుర్తించింది. ఆమెకు సైక్లింగ్‌లో శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఈ ఏడాది జనవరిలో ప్రధానమంత్రి బాలల పురస్కారాన్ని అందుకుంది జ్యోతి కుమారి. ఆత్మనిర్భర్‌ పేరుతో నిర్మిస్తున్న ఓ సినిమాలో జ్యోతి కథను తెరకెక్కిస్తుండగా.. అందులో తన పాత్రను తానే పోషిస్తోంది. అలాంటి జ్యోతికుమారి.. ఏ తండ్రి కోస‌మైతే అంత‌దూరం సైకిల్ తొక్కిందో.. ఇప్పుడు అదే తండ్రి అర్థాంత‌రంగా చ‌నిపోవ‌డంతో సైకిల్ జ్యోతి ఇంట్లో విషాదం నెల‌కొంది. ఆమె కుటుంబాన్ని ఆదుకుంటామ‌ని జిల్లా యంత్రాంగం తెలిపింది. సైకిల్ జ్యోతి ఉదంతం మ‌రోసారి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.  

కేసీఆర్ గడ్డ నుంచే పోరాటం.. జూన్ 2 నుంచే శ్రీకారం..

తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరుగుతున్నాయి. రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత పెరిగిందని గ్రహించిన సీఎం కేసీఆర్ రూట్ మార్చారు. కొన్ని రోజులుగా పాలనలో దూకుడు పెంచారు. అదే సమయంలో విపక్షాలు యాక్టివ్ అయ్యాయి. ఈటల రాజేందర్ ఎపిసోడ్ తో తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్నాయి. ఈటల కోసం కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నాలు చేసినా... రాజేందర్ కమలం గూటికి చేరడం ఖాయమైంది. అటు తెలంగాణ పీసీసీ చీఫ్ ను ఫైనల్ చేయబోతోంది కాంగ్రెస్ హైకమాండ్. కొత్త పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల కూడా తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఇతర విపక్షాలకు ధీటుగా ఆమె కార్యక్రమాలు చేస్తున్నారు.  తాజాగా మరో సంచలనానికి శ్రీకారం చుట్టారు షర్మిల. కొన్ని రోజులుగా ట్విట్టర్ వేదికగా కేసీఆర్ పై విరుచుకుపడుతున్నారు షర్మిల. కరోనా, లాక్‌డౌన్ పరిస్థితులపై సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇకపై ఆమె ప్రత్యక పోరాటంలోకి దిగబోతున్నారు. కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ నుంచే ఆమె యాక్షన్ మొదలు పెడుతున్నారు. అది కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునే. జూన్ 2న గజ్వేల్ వెళుతున్నారు షర్మిల. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను పరామర్శించి వారికి భరోసానివ్వనున్నారు.  గన్‌పార్క్ వద్ద నివాళులర్పించి  షర్మిల గజ్వేల్‌కు బయలుదేరనున్నారు. షర్మిల పర్యటన కోసం అనుచరులు ఏర్పాట్లు చేస్తున్నారు.  తెలంగాణలో పార్టీ పెడతానని ప్రకటించిన షర్మిల జిల్లాల వారీగా వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.  ఏప్రిల్ లో ఖమ్మంలో సంకల్ప సభ నిర్వహించారు. జూలై8న కొత్త పార్టీ పేరు , ఎజెండా ప్రకటిస్తానని చెప్పారు. అప్పటి నుంచి పార్టీ కార్యాచరణలోనే ఉన్నారు షర్మిల. జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తన యాక్షన్ ప్లాన్‌ను సీఎం కేసీఆర్ ఇలాకా నుంచి షురూ చేయబోతున్నారు. వైఎస్ షర్మిల గజ్వేల్ పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున గజ్వేల్ వెళుతున్న షర్మిల.. అక్కడ ఏం చేయబోతున్నారు, ఏం చెప్పబోతున్నారన్నది చర్చగా మారింది.