ఆల‌యంలో వైసీపీ క‌ల‌ర్స్‌.. అధికారుల ఓవ‌రాక్ష‌న్‌.. టెంపుల్ పాలిటిక్స్‌..

నీలం, తెలుపు, ఆకుప‌చ్చ‌.. ఈ మూడు వైసీపీ జెండా రంగులు. ఏపీని ఈ మూడు రంగుల్లో ముంచెత్తాల‌ని గ‌తంలో ప్ర‌య‌త్నించారు. గ్రామ స‌చివాల‌యాలు, ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు, రేష‌న్ షాపులు, ప్ర‌భుత్వం అనే పేరున్న దేనికైనా.. ఈ మూడు రంగుల‌నే పులిమేవారు. కోర్టు మొట్టికాయ‌ల‌తో ఈ మ‌ధ్య కాస్త కంట్రోల్ అయ్యారు.  తాజాగా, మ‌రోసారి ఓవ‌రాక్ష‌న్ చేశారు అధికారులు. ఈసారి ఏకంగా గుళ్లోనే ఆ మూడు రంగులతో అలంక‌ర‌ణ చేసేశారు. దేవుడంటే భ‌యంలేదో.. లేక‌, ముఖ్య‌మంత్రి అంటే భ‌య‌మో తెలీదు కానీ.. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల ఆలయ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. స్వామివారి బ్రహ్మోత్సవాలను రాజ‌కీయ కార్య‌క్ర‌మంగా మార్చేశారంటూ విమ‌ర్శ‌లు వెళ్లువెత్తుతున్నాయి.  ద్వార‌కా తిరుమ‌ల‌లో ఈ నెల 22 నుంచి 29 వరకు.. వైశాఖమాస తిరు కల్యాణోత్సవాలు జరిగాయి. శనివారం  బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు కావడంతో రాత్రి స్వామి వారి పవళింపు సేవ నిర్వహించారు. ఆ సంద‌ర్భంగా గర్భాలయంలో పూలు, పళ్లతో అలంకరణ చేశారు. ఈ అలంకరణలో భాగంగా.. వైసీపీ రంగులతో కూడిన ప్లాస్టిక్ పూల దండలను వినియోగించడం ప్ర‌స్తుత వివాదానికి కేంద్రం.  గర్భాలయంతో పాటు ఆలయ ముఖద్వారాలకు గజ మాలలుగా వైసీపీ జెండా రంగుల ప్లాస్టిక్ పూలను వేలాడ దీయ‌డంపై పెద్ద ఎత్తున‌ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆలయ ఈవో జీవీ సుబ్బారెడ్డితో పాటు అధికారుల తీరుపై భ‌క్తులు భక్తులు మండిపడుతున్నారు. దేవాల‌యంలో ఈ రాజ‌కీయ రంగులు ఏంటంటూ త‌ప్పుబ‌డుతున్నారు. స‌హ‌జ‌మైన పూల‌తో అలంక‌రించ‌కుండా.. కావాల‌ని ఇలా వైసీపీ రంగులు ఉన్న ప్లాస్టిక్ పూల‌దండ‌ను తెప్పించ‌డం ఏంట‌ని భ‌క్తులు మండిప‌డుతున్నారు. ప్లాస్టిక్ పూల‌ను పెట్ట‌డం.. వెంక‌న్న స్వామి వైభ‌వాన్ని కించ‌ప‌ర‌చ‌డ‌మేన‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.  అయినా.. మంచి పాల‌న అందిస్తే ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొందుతారు కానీ.. ఇలా రంగుల‌ను చూసి.. ఎవ‌ర‌బ్బా ఓట్లు వేసేది? ఇంత చిన్న లాజిక్ మ‌రిచి.. ముఖ్య‌మంత్రిని ప్ర‌స‌న్నం చేసుకునేందుకు.. దేవాదాయ శాఖ అధికారులు ఇలా ద్వార‌కా తిరుమ‌ల‌ను రాజ‌కీయ రంగుల‌ క్షేత్రంగా మార్చ‌డాన్ని భ‌క్తులు చీద‌రించుకుంటున్నారు. 

రాజ్‌నాథ్‌తో రఘురామ.. సీఎం కేసీఆర్‌కు లేఖ‌.. న్యాయం కోసం పోరాటం..

దెబ్బ‌తిన్న పులిలా ఎంపీ ర‌ఘురామ కృష్ణ‌రాజు న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు. త‌న‌కు జ‌రిగిన అన్యాయంపై రాజ్యాంగ వ్య‌వస్థ‌ల ముందు ఏక‌రువు పెడుతున్నారు. ఇప్ప‌టికే మెజిస్ట్రేట్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వ‌ర‌కు.. రాజ్యంపై ఒంట‌రి పోరాటం చేస్తున్నారు. మ‌రోవైపు, ఆయ‌న కుటుంబ స‌భ్యులు సైతం ర‌ఘురామ త‌ర‌ఫున త‌మ వంతు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఏపీ ప్ర‌భుత్వ కుట్ర‌ల‌పై లోక్‌స‌భ స్పీక‌ర్ నుంచి జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ వ‌ర‌కూ.. ర‌ఘురామ‌కు జ‌రిగిన దారుణంపై ఫిర్యాదులు చేశారు. అక్క‌డితో ఆగిపోలేదు ర‌ఘురామ‌. తాజాగా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో ఆయ‌న‌ భేటీ అయ్యారు. దాదాపు 10 నిమిషాల పాటు సమావేశమయ్యారు.  సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేశాక‌.. సికింద్రాబాద్‌ ఆర్మీ హాస్పిట‌ల్ నుంచి డిశ్చార్జ్ అయి.. నేరుగా ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స తీసుకున్నారు ర‌ఘురామ‌. ఆయ‌న కాలికి తీవ్ర గాయాలు ఉండ‌టంతో ప్లాస్ట‌ర్ ఆఫ్ పారిస్‌తో క‌ట్లు క‌ట్టిన వైద్యులు.. ఆయ‌న‌కు రెస్ట్ అవ‌స‌ర‌మ‌ని సూచించారు. ఢిల్లీ ఎయిమ్స్ నుంచి వ‌చ్చాక‌.. తాజాగా కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను క‌లిసి మొత్తం విష‌యాన్ని ఆయ‌న దృష్టికి తీసుకొచ్చారు. ఏపీ ప్రభుత్వం తనపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తోందని రాజ్‌నాథ్‌కు రఘురామ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కాలి గాయాల‌తో న‌డ‌వ‌లేని స్థితిలో ఉన్న ర‌ఘురామ‌.. వీల్‌ చెయిర్‌లోనే రాజ్‌నాథ్ ఇంటికి వెళ్లారు.   మ‌రోవైపు.. ఎంపీ ర‌ఘురామ కృష్ణ‌రాజు.. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖ రాయ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఒక ప్రజాప్రతినిధిని అరెస్టు చేసే సమయంలో పొరుగు రాష్ట్ర పోలీసులు అనుసరించాల్సిన విధివిధానాలు, మార్గదర్శకాలను గచ్చిబౌలి స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ (ఎస్‌హెచ్‌వో) పట్టించుకోలేదని ర‌ఘురామ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ అధికారిపై  క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈనెల 14న తన అరెస్టు సమయంలో చోటుచేసుకున్న నిబంధనల ఉల్లంఘనను వివరిస్తూ... కేసీఆర్‌కు 8 పేజీల లేఖ రాశారు ర‌ఘురామ‌. ‘‘నాపై ఏపీసీఐడీ సూమోటోగా కేసు నమోదు చేసింది. ఈ  కేసును గుంటూరు సీఐడీ అడిషనల్‌ ఎస్పీ విజయపాల్‌ నేతృత్వంలో పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 14వ తేదీన హైదరాబాద్‌ గచ్చిబౌలి బౌల్డర్‌హిల్స్‌లోని నా నివాసమైన 74వ నంబర్‌ విల్లాకు ఒక బృందం వచ్చింది. నన్ను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసేందుకు వచ్చినప్పుడు గచ్చిబౌలి స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ కనీస పోలీసు మాన్యువల్స్‌ను కూడా పట్టించుకోలేదు. ఎంపీగా ఉన్న నా అరెస్టుకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని కూడా పరిశీలించలేదు. ఏపీసీఐడీ  నుంచి ట్రాన్సిట్‌ రిమాండ్‌ ఆర్డరు తీసుకోలేదు. అసలు ఎఫ్‌ఐఆర్‌ ఉందో లేదో కూడా పరిశీలించలేదు. నన్ను అరెస్టు చేసే ముందు నా ఆరోగ్య పరిస్థితిపై  స్థానిక ఆసుపత్రిలో పరీక్షలు చేయించాలన్న నిబంధనను పట్టించుకోలేదు. నన్ను అదుపులోకి తీసుకుంటున్న సమయంలో ఏపీసీఐడీ న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా వ్యవహరించేలా చూడాల్సిన బాధ్యతనూ విస్మరించారు. నన్ను కారులోకి నెట్టేస్తున్నా గచ్చిబౌలి ఎస్‌హెచ్‌ఓ స్పందించలేదు. రాజ్యాంగ హక్కులను కాపాడడంలో భాగంగా నా అరెస్టుకు సంబంధించి ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి. అది కూడా తీసుకోలేదు’’ అని రఘురామ లేఖ‌లో వివరించారు.  తనను అరెస్టు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దును దాటేముందు ప్రస్తుతమున్న నిబంధనలు, మార్గదర్శకాల మేరకు తెలంగాణ ప్రభుత్వ అనుమతిని ఏపీసీఐడీ తీసుకోలేదని ఆరోపించారు. తెలంగాణ పోలీసులు ‘రూల్‌ ఆఫ్‌ లా’ను అమలుచేసేలా చర్యలు తీసుకోవాలని కేసీఆర్‌ను కోరారు. సీఐడీ అడిషనల్‌ ఎస్పీ విజయపాల్‌ బృందంతో పాటు తన నివాసానికి వచ్చిన గచ్చిబౌలి పోలీసు సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు.  ఇలా, ఎంపీ ర‌ఘురామ త‌న అరెస్ట్ విష‌యంలో అసంబ‌ద్ధంగా వ్య‌వ‌హ‌రించిన ప్ర‌తీ ఒక్క అంశంపై పోరాడుతున్నారు. ఇప్ప‌టికే కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండ‌గా.. ఎన్‌హెచ్ఆర్‌సీ, కేంద్ర ర‌క్ష‌ణ‌మంతి, తెలంగాణ ముఖ్య‌మంత్రి.. ఇలా న్యాయం కోసం ఆయ‌న తొక్క‌ని గ‌డ‌ప లేదు. అంతిమ విజ‌యం సాధించే వ‌ర‌కూ విశ్ర‌మించేది లేద‌న్న‌ట్టు ఉంది ర‌ఘురామ చిత్త‌శుద్ధి. మ‌రి, త‌ను చేస్తున్న ఒంట‌రి పోరాటంలో ఏ మేర‌కు స‌ఫ‌లం అవుతారో చూడాలి...

అప్పులు కాదు అభివృద్ధి కావాలి!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనకు రెండేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా వైసీపీ పాలనపై స్పందించారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. రెండేళ్లుగా ఏపీలో జరిగిన, జరుగుతున్న పరిణామాలను ఉదహరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యూజిలాండ్‌లో  టీడీపీ మ‌హానాడు నిర్వ‌హ‌ణ‌లో భాగంగా  వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో మాట్లాడారు చంద్రబాబు. రాజ‌కీయ క‌క్ష కోసం తాను ఎన్న‌డూ ప్ర‌య‌త్నాలు చేయ‌లేద‌ని చెప్పారు. అభివృద్ధి కోసమే నిరంతం తపించానని తెలిపారు.  ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అరాచక పాలన సాగుతుందన్నారు. అభివృద్దినా గాలికొదేలిసి ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ అప్పులమయం చేశారని ఆరోపించారు. ఆర్థిక అస‌మాన‌త‌ల‌ను తొల‌గించుకుంటూ పోవాలి.. అంతేగానీ, ఇష్ట ప్ర‌కారం చేసుకుంటూ పోతానంటే అభివృద్ధి జ‌ర‌గ‌దని చెప్పారు. ఆంధ్రప్ర‌దేశ్‌లో ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితులే కొన‌సాగుతున్నాయి.. అప్పులు చేసుకుంటూ పోతున్నారని అన్నారు. 'ఇలా చేసుకుంటూ పోతే భ‌విష్య‌త్తులో అప్పులు ఇచ్చే వారు కూడా క‌ర‌వైపోతారు రాష్ట్రం దివాళా తీస్తుంది. ఏ రాష్ట్ర ప్ర‌భుత్వ‌మైనా సంప‌ద సృష్టించాలి. ఆ సంప‌ద‌తో ప‌థ‌కాల‌ను కొన‌సాగించాలి. కానీ ప్ర‌స్తుత ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఇటువంటి ప‌ని చేయ‌ట్లేదు. అప్పులు చేసుకుంటూ వెళ్తోంది' అని చంద్ర‌బాబు విమ‌ర్శ‌ల జ‌ల్లు కురిపించారు. ఐటీని ప్ర‌మోట్ చేయాల‌ని ఆనాడు హైటెక్ సిటీకి రూప‌క‌ల్ప‌న చేశానని చెప్పారు చంద్రబాబు. అమెరికాలో తిరిగి భార‌త్‌కు రావాల‌ని ఐటీ కంపెనీల‌ను కోరాను.. మైక్రోసాఫ్ట్ ప్ర‌తినిధుల‌తో మాట్లాడానని చంద్ర‌బాబు తెలిపారు. భార‌త్ లో ఐటీ రంగ అభివృద్ధికి ఉన్న అవ‌కాశాల‌ను వివ‌రించి.. మైక్రోసాఫ్ట్ బ్రాంచ్‌ను హైద‌రాబాద్‌లో పెట్టాల‌ని కోరానన్నారు. మైక్రోసాఫ్ట్ హైద‌రాబాద్‌కు వ‌స్తే ప్ర‌పంచంలోని అనేక ఐటీ కంపెనీలు అక్క‌డ‌కు వ‌స్తాయ‌ని భావించాను... అనంత‌రం అదే జ‌రిగిందన్నారు చంద్రబాబు. అనేక ఐటీ కంపెనీలు హైద‌రాబాద్‌లో ఉన్నాయంటే గతంలో తాను చేసిన ప్రయత్నమే కారణమన్నారు.హైద‌రాబాద్‌లో అభివృద్ధిని ఎప్పుడు చూసినా తనకు చాలా సంతృప్తి క‌లుగుతుందన్నారు చంద్రబాబు. తన విజన్ వల్లే హైద‌రాబాద్‌లో ఇంజ‌నీరింగ్ కాలేజీలు పెరిగాయని చెప్పారు. 

రెండేళ్ల అరాచ‌కం.. మ‌రో మూడేళ్లు భ‌రించాల్సిందేనా?

జ‌గ‌న్‌రెడ్డి గ‌ద్దె నెక్కి స‌రిగ్గా రెండేళ్లు. మిగిలింది మ‌రో మూడేళ్లు. ఈ రెండేళ్ల‌లోనే ర‌చ్చ రంబోలా చేశాడు. వామ్మో.. ఇంకో మూడేళ్లు భ‌రించాలా? అని జ‌నం బెంబేలెత్తిపోతున్నారు. జ‌గ‌న్ అన్నా.. ఆయ‌న పాల‌న‌న్నా.. జ‌నాలు అంత‌గా భ‌య‌ప‌డుతున్నారు. ఈ రెండేళ్ల‌లో జ‌గ‌న్ ఏం సాధించారో చెప్ప‌డం క‌ష్ట‌మే కానీ.. జ‌గ‌న్ ఏం నాశ‌నం చేశారో చెప్ప‌డం మాత్రం చాలా సులువు. పాల‌న‌ను ఎలా భ్ర‌ష్టు ప‌ట్టించారో చెప్ప‌డానికి అనేక ఉదాహ‌ర‌ణ‌లు... ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని ఏది? ఈ ప్ర‌శ్న ఏ సివిల్ స‌ర్వీస్ ఇంట‌ర్వ్యూలో అడిగినా ట‌క్కుమ‌ని స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితి?  దేశంలోకే క‌ఠినమైన‌ ప్ర‌శ్న ఇది. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాజ‌ధాని అమ‌రావ‌తి అని.. ఆంధ్రులంతా స‌గ‌ర్వంగా.. చాతి విరుచుకు మ‌రీ చెప్పుకునే వారు. మా రాజ‌ధాని.. సింగ‌పూర్ త‌ర‌హాలో ఉంటుంద‌ని.. మాది అంత‌ర్జాతీయ స్థాయి రాజ‌ధాని అని.. మా రాజ‌ధానికి దేశంలో మ‌రే ప్రాంతం సాటికాద‌ని.. ఇలా ఆంధ్రులంతా గొప్ప‌లు పోయేవారు. సీమ ప్ర‌జ‌లు సైతం అమ‌రావ‌తిని అదృష్టంగా భావించారు. ఉత్త‌రాంధ్ర వాసులు సైతం మా అమ‌రావ‌తి అని మురిసిపోయారు. ఒక్క ఛాన్స్ అంటూ అంద‌ల‌మెక్కిన జ‌గ‌న‌న్న‌.. ఒక్క మాట‌తో అమ‌రావ‌తిని మూడు ముక్కలు చేశాడు. ఆ ముక్క‌ల‌నైనా చ‌క్క‌గా చేశాడా? అంటే అదీ లేదు. క‌ర్నూలు అలానే కునారిల్లుతోంది. త‌మ ప్రాంతానాకి న్యాయం జ‌ర‌గ‌డం కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉంది. జ‌గ‌న్‌రెడ్డి తీరును చూసి విశాఖ విస్తుబోతోంది. స‌ముద్ర‌తీరంలో జ‌రుగుతున్న‌ భూదందాల‌తో బెదిరిపోతోంది. జ‌గ‌న్‌రెడ్డి రెండేళ్ల పాల‌న ఎంత అరాచ‌కంగా సాగిందో చెప్ప‌డానికి.. అమ‌రావ‌తినే బెస్ట్ ఎగ్జాంపుల్ అంటున్నారు. 500 రోజుల‌కు పైబ‌డి అమ‌రావ‌తి రైతులు దీక్ష‌లు చేస్తున్నా.. ఈ స‌ర్కారులో ఉలుకూప‌లుకూ లేకుండా పోయింది. రైతుల చేతికి సంకెళ్లు వేసి అక్క‌సు తీర్చుకున్న ఘ‌న‌త జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌దే అనే విమ‌ర్శ‌. అసైన్డ్ భూములంటూ.. ఏకంగా ప్ర‌తిప‌క్ష నేత‌పైనే కేసుల కుట్ర చేస్తుండ‌టం ఈ రెండేళ్ల పాల‌న ఫ‌లితం.  న‌వ్యాంధ్ర మొద‌టి ముఖ్య‌మంత్రిగా.. ఏపీపై చంద్ర‌బాబు చేసిన అంద‌మైన‌ సంత‌కాన్ని.. విధ్వంసంతో చెరిపేసే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌నేది అంద‌రి అభిప్రాయం. చంద్ర‌బాబు ల‌క్ష్యంగానే జ‌గ‌న్ పాల‌న కొన‌సాగుతోంద‌ని అంటున్నారు. గ‌ద్దె నెక్కిన తొలినాళ్ల‌లోనే.. 'ప్ర‌జా వేదిక' కూల్చేసి.. ప్ర‌తీకారం తీర్చుకున్నార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ.. ఐఏఎస్‌, ఐపీఎస్‌ల స‌మావేశం పెట్టాలంటే.. ఏపీలో ఒక మంచి వేదికంటూ లేకుండా పోయింది. ప్రజా వేదిక కూల‌గొట్టి ఏం సాధించారో జ‌గ‌న్‌కే తెలియాలి అంటున్నారు. ఇక‌, అక్ర‌మ నిర్మాణ‌మంటూ చంద్ర‌బాబు నివాసానికి ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చారో.. వారికే తెలీదు. మ‌రి, ఈ రెండేళ్ల‌లో క‌ర‌క‌ట్ట‌పై అక్ర‌మ నిర్మాణాల తొల‌గింపు ఎంత వ‌ర‌కు వ‌చ్చింది ముఖ్య‌మంత్రి గారు?   మ‌రింత దారుణ‌మైన విష‌యం ఏంటంటే.. పేద‌ల నోటి కాడి.. కూడు చెద‌ర‌గొడుతూ.. అన్న క్యాంటీన్ల‌ను అర్థాంత‌రంగా మూసేయ‌డం. ప్ర‌భుత్వం మారింది.. పేద‌ల నిత్యాన్న‌ప‌థ‌కం మూత‌బ‌డింది. రాజ‌న్న క్యాంటీన్లు పెడ‌తామ‌న్నారు.. రెండేళ్లు అవుతోంది ఏవి?  పేద‌ల‌కు ప‌ట్టెడు అన్నం పెట్ట‌డానికి కూడా ఇంత రాజ‌కీయం చేయాలా జ‌గ‌న్‌? అని క‌డుపు కాలుతున్న వాళ్లంతా క‌డుపుమంట‌తో నిల‌దీస్తున్నారు.  న‌వ‌రత్నాల పాల‌నంటూ జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం మురిసిపోతోంది. ఆ న‌వ‌ర‌త్నాల వెనుక ఉన్న‌.. అప్పుల కుప్ప‌ల సంగ‌తి సామాన్యుల‌కు తెలీద‌ని అనుకుంటోంది. ఈ రెండేళ్ల‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను.. అప్పుల‌ప్ర‌దేశ్‌గా మార్చేశారు. ఇక అప్పు ముట్ట‌డం క‌ష్ట‌మ‌వుతుండ‌టంతో.. ఏకంగా ప్ర‌భుత్వ భూముల‌ను అడ్డంగా అమ్మేసుకునేందుకు తెగ‌బ‌డుతున్నారు. బంగారంలాంటి విశాఖ భూముల‌ను అంగ‌ట్లో వేలానికి పెట్టారు. అప్పులు, అమ్మేసుకోవ‌డాలే.. రెండేళ్ల విశిష్ట‌త‌.  ఇక‌, అభివృద్ధి అనే ప‌దం ఏపీలో అడ్ర‌స్ లేకుండా పోయింది. ఈ రెండేళ్ల‌లో ఒక్క‌టంటే ఒక్క కంపెనీ అయినా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వ‌చ్చిందా? ఒక్క‌టంటే ఒక్క భారీ పెట్టుబ‌డి అయినా ఏపీలో పెట్టారా?  చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్పుడు.. కియాలాంటి ఎన్నో కంపెనీలు ఏపీకి క్యూ క‌డితే.. జగ‌న్‌రెడ్డి సీఎం అయ్యాక‌.. ఉన్న కంపెనీలే త‌ట్టాబుట్టా స‌దురుకొని రాష్ట్రం నుంచి చెక్కేసే ప‌రిస్థితి దాపురించిందని వ్యాపార వ‌ర్గాలు గ‌గ్గోలు పెడుతున్నా.. ఈ ముఖ్య‌మంత్రి చెవికి సోకితేగా?  విశాఖ స్టీల్ ప్లాంట్ మ‌న‌ది కాకుండా పోతున్నా.. ప‌ట్టించుకుంటేగా?      ఇక‌, లిక్క‌ర్‌, ఇసుక పాల‌సీల గురించి ఎంత త‌క్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. దేశ ప్ర‌జ‌ల‌కు తెలిసిన‌.. ఏ బ్రాండ్ మ‌ద్యం కూడా ఏపీలో అమ్మ‌రు. మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్ర‌భుత్వప‌రం చేసి.. ఊరూ-పేరు లేని బ్రాండ్లు తీసుకొచ్చి.. భారీగా రేట్లు బాదేసి.. జ‌నాల‌తో బ‌ల‌వంతంగా మందు తాగిస్తున్నారు. మ‌ద్యం మాన‌లేక‌.. ఆ మందు గొంతు దిగ‌క‌.. బుక్క బుక్క‌కీ.. జ‌గ‌న్‌రెడ్డికి శాప‌నార్థాలు పెడుతున్నారు మందుబాబులు. వివిధ సంక్షేమ ప‌థకాల పేరుతో మ‌హిళ‌ల‌కు ఇస్తున్న డ‌బ్బంతా.. ఆ ఇంటాయ‌న తాగే మ‌ద్యం రూపంలో మ‌ళ్లీ ప్ర‌భుత్వ ఖ‌జానాకే చేరుతుంద‌నేది జ‌నం మాట‌. ఒక చేత్తో 10 రూపాయ‌లు ఇచ్చి.. మ‌రో చేత్తో వంద లాగేసుకుంటున్నార‌నే విమ‌ర్శ‌. ఆ మ‌ద్యం బ్రాండుల‌తో జ‌గ‌న్‌రెడ్డి జేబులోకి వేల కోట్ల రూపాయ‌లు క‌మిష‌న్‌గా వ‌చ్చి ప‌డుతోంద‌నేది ప్ర‌తిప‌క్షాల‌ ఆరోప‌ణ‌. ఇక‌, ఉచిత‌ ఇసుక హామీ ఎప్పుడు గంగ‌లో క‌లిసిపోయింది. ఏపీలోని ఇసుక రీచుల‌ను వేలం పాట‌లో అయిన వారికి అమ్మేసుకున్నారు. ఇసుక నుంచి కాసుల తైలంబు పిండుకుంటున్నారు.  అభివృద్ధితో పాటు పాల‌న ఇలా ప‌డ‌కేస్తే.. క‌క్ష్య సాధింపు చ‌ర్య‌లు, కుట్ర రాజ‌కీయాల్లో మాత్రం ఈ రెండేళ్ల‌లో జ‌గ‌న్‌రెడ్డి భారీ విజ‌య‌మే సాధించార‌ని చెప్పొచ్చు. ప్ర‌తిప‌క్ష నేత‌ చంద్ర‌బాబు మొద‌లు.. అచ్చెన్నాయుడు, జేసీ ఫ్యామిలీ, దేవినేని ఉమా, ధూళిపాళ్ల న‌రేంద్ర‌, కొల్లు ర‌వీంద్ర‌, కూన ర‌వికుమార్‌.. ఇలా ఏ జిల్లాలో ఎవ‌రినీ వ‌ద‌ల‌కుండా.. కుట్ర‌లు, కేసుల‌తో ఏపీలో ప్ర‌తిప‌క్ష‌మే లేకుండా చేయాల‌నే ప్ర‌య‌త్నాల్లో ఈ రెండేళ్లూ బిజీగా ఉన్నారు సీఎం జ‌గ‌న్‌రెడ్డి. ఇందులో ఏ కేసులో బ‌లం లేకుండా.. టీడీపీని భ‌య పెట్ట‌డానికే ఇలా కేసుల‌తో బెదిరిస్తున్నార‌నే విమ‌ర్శ వినిపిస్తోంది. ప్ర‌తిప‌క్షమ‌నే కాదు.. స్వ‌ప‌క్షంలో విప‌క్షంగా మారిన న‌ర్సాపురం ఎంపీ ర‌ఘురామ‌ను ఎంత‌గా ఇబ్బంది పెట్టాలో అంత‌కంటే ఎక్కువే ఇబ్బంది పెట్టింది ఏపీ స‌ర్కారు. ఇలాంటి క‌క్ష్య సాధింపు చ‌ర్య‌లో గ‌తంలో ఏ ప్ర‌భుత్వ‌మూ చేప‌ట్ట‌లేద‌ని.. ఇది జ‌గ‌న్ పైశాచిక ఆనందానికి నిద‌ర్శ‌న‌మ‌ని.. ప్ర‌తిప‌క్ష టీడీపీ ప్ర‌తినిత్యం విమ‌ర్శిస్తూనే ఉంది.  కేవ‌లం పార్టీలు, నేత‌ల‌నే కాదు.. రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల‌నూ జ‌గ‌న్‌రెడ్డి వ‌ద‌ల‌డం లేదంటూ జ‌నాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మాజీ ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్‌కు.. జ‌గ‌న్‌రెడ్డికి జ‌రిగిన.. టామ్ అండ్ జెర్రీ వార్‌ను చూసి జ‌నాలే చీద‌రించుకున్నారు. ఎన్నిక‌లు వ‌ద్దంటూ.. జ‌గ‌న్ స‌ర్కారు చేసిన కుట్ర‌లు.. మ‌ధ్య‌లో ఆర్డినెన్స్ తీసుకొచ్చి.. ర‌మేశ్‌కుమార్‌ను తొల‌గించి.. జ‌స్టిస్ క‌న‌క‌రాజ్‌ను ఎస్ఈసీగా చేసి.. కోర్టు మెట్టికాయ‌ల‌తో త‌ల‌బొప్పిక‌ట్టి.. అబ్బో.. స్టేట్ వ‌ర్సెస్ ఎస్ఈసీ ఎపిసోడ్‌.. ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్‌రెడ్డి అనుభ‌వ‌రాహిత్యానికి నిద‌ర్శ‌నం అంటున్నారు. ఇక‌, వ‌రుస‌గా జ‌రిగిన స్థానిక సంస్థ‌లు, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో అధికార ప‌క్షం చేసిన ఆగ‌డాల‌కు అడ్డూఅదుపు లేకుండా పోయింది. తిరుప‌తి ఉప ఎన్నిక‌లో దొంగ ఓట్లు పోటెత్తిన వైనం చూసి అంతా నివ్వెర్ర‌పోయారు.  ఇలా చెప్పుకుంటూ పోతే.. ఇంకా చాల‌నే ఉన్నాయి జ‌గ‌న్‌రెడ్డి య‌వ్వారాలు. ఈ రెండేళ్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఓ పీడ‌క‌లగా మారిందంటున్నారు. జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌లో అభివృద్ధిలో ఏపీ రెండు ద‌శాబ్దాలు వెన‌కబ‌డింద‌ని వాపోతున్నారు. అరాచ‌కాల్లో మాత్రం అంద‌నంత ఎత్తులో.. అంద‌రిక‌న్నా ముందున్నార‌ని అంటున్నారు. ఇలాంటి అధ్వాహ్న‌, అడ్డ‌గోలు పాల‌న‌ను ఏపీ ప్ర‌జ‌లు మ‌రో మూడేళ్లు భ‌రించాలా? అని భ‌య‌ప‌డిపోతున్నారు. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాలంటూ ఎంపీ ర‌ఘురామ సీబీఐ కోర్టులో వేసిన పిటిష‌న్‌పై వేగంగా విచార‌ణ జ‌రుగుతుండ‌టం ఒక్క‌టే కాస్త ఊర‌ట‌నిచ్చే అంశం.. అప్ప‌టి దాకా త‌ప్ప‌దు ఈ దారుణం అంటున్నారు. జ‌గ‌న్‌రెడ్డి రెండేళ్ల అరాచ‌క పాల‌న‌పై ఓ పుస్త‌కం రిలీజ్ చేయాల్సిన అవ‌స‌రం ఉందంటున్నారు ప్ర‌జాస్వామ్య‌వాదులు.

కొవిడ్ బాధితులకు  కేంద్రం  భరోసా 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండవసారి బాధ్యతలు స్వీకరించి రెండేళ్ళు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కొవిడ్’తో కన్నుమూసిన వారి కుటుంబాలను, కొవిడ్ కాటుకు తల్లి తడ్రులను కోల్పోయి అనాధలుగా మిగిలిన పిల్లలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సంక్షేమ చర్యలకు శ్రీకారం చుట్టింది. కొవిడ్  మహమ్మారి సృష్టించిన సంక్లిష్టతలను దృష్టిలో ఉంచుకుని, అనాధ పిల్లల సంరక్షణ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది.అనాధ పిల్లలకు కేవలం తాత్కాలిక ఆర్థిక సహాయం చేయడం కాకుండా, వారి జీవితాలను తీర్చిదిద్దే విధంగా, ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. అనాధ పిల్లలకు విద్యా బుద్ధులు అందించడంతో పాటుగా, వారికి  18 ఏళ్ల వయసు వచ్చే నాటికి, వారి పేరున రూ.పది లక్షల మూలనిధిని ‘పీఎం కేర్స్ ఫర్ చిల్ద్రన్’  ద్వారా ప్రభుత్వం సమకూరుస్తుంది. అదే విధంగా చిన్నారులకు ఉన్నత విద్య కోసం రుణ సదుపాయం కల్పించడంతో పాటు ఆ మొత్తానికి సంబంధించిన వడ్డీని పీఎం కేర్స్‌ చెల్లిస్తుంది. కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐ), ఉద్యోగుల భవిష్య నిధి సంస్థల సభ్యుల కుటుంబాలకు చేయూతగా పెన్షన్ అందజేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. కొవిడ్‌ కారణంగా తల్లిదండ్రులను లేదా వారిలో ఏ ఒక్కరినైనా కోల్పోయిన చిన్నారులకు సైతం పీఎం కేర్స్‌ నిధి ద్వారా పెన్షన్ సదుపాయం కలిపిస్తుంది.  ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వ్యవస్థీకృత కార్మికులు, ఉద్యోగులకే కాకుండా అవ్యవస్తీకృత రంగంలో పనిచేసే కార్మికులు కొవిడ్’తో మరణిస్తే వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ప్రస్తుత నిబంధనల ప్రకారం సగటు రోజు కూలీలో 90 శాతం సొమ్మును పెన్షన్‌గా అందజేస్తారు. గతేడాది మార్చి 24 నుంచి 2022 మార్చి 24 వరకు ఈ పథకం వర్తిస్తుంది. ఉద్యోగుల బీమా పథకం అనుసరించి ఇచ్చే గరిష్ఠ బీమా మొత్తాన్ని రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెరిగింది. కనిష్ఠ బీమా కింద రూ.2.5 లక్షలను ఇచ్చే పథకాన్ని కూడా పునరుద్ధరించారు.. ఈ పథకం గతేడాది ఫిబ్రవరి 15 నుంచి వచ్చే మూడేళ్లపాటు వర్తిస్తుంది. ఈ పథకాలకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడిస్తుంది’’ అని ప్రభుత్వం వివరించింది.  ఇదిలా ఉంటే, మరోవంక కరోనా మహమ్మారి రెండోదశలో తల్లిదండ్రులిద్దరినీ లేదా వారిలో ఏ ఒకరినైనా కోల్పోయిన చిన్నారుల వివరాలను సమర్పించాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌(ఎన్‌సీపీసీఆర్‌) రాష్ట్రాలను శనివారం కోరింది. ఆ సమాచారాన్ని ‘బాల్‌ స్వరాజ్‌ పోర్టల్‌’లో పొందుపరచాలని సూచిస్తూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కార్యదర్శులకు లేఖలు రాసింది. జువెనైల్‌ జస్టిస్‌ ప్రకారం తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను, వారి హక్కులను సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని కమిషన్‌ అభిప్రాయపడింది. అలాంటి చిన్నారులను బాలల సంక్షేమ కమిటీ ముందుకు తీసుకురావాలని తెలిపింది. కొవిడ్‌ కారణంగా తల్లిదండ్రులు చనిపోవడంతో దేశవ్యాప్తంగా సుమారు  577 మంది బాలలు అనాథలైనట్లు ఈ వారం ప్రారంభంలో ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో అలాంటి చిన్నారుల సంరక్షణకు చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల లేఖలు రాసింది. దిల్లీ, ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, పంజాబ్‌ సహా పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే చిన్నారుల కోసం ఉచిత విద్య, నెలవారీ భృతిని అందజేస్తూ అండగా నిలుస్తున్నాయి. పోషణ, సంరక్షణ అవసరమైన చిన్నారులను పర్యవేక్షించేందుకు బాల్‌ స్వరాజ్‌ పోర్టల్‌ను రూపొందించారు.

ముక్కు నేల‌కు రాస్తారా? కుట్ర‌ల‌కు భ‌య‌ప‌డేదే లే..

సీఎం కేసీఆర్‌తో తాడోపేడో తేల్చుకునేందుకే సిద్ధ‌మ‌వుతోంది మాజీ మంత్రి ఈట‌ల కుటుంబం. అక్ర‌మ కేసులు, అస‌త్య ఆరోప‌ణ‌ల‌పై తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్నారు. ఈట‌ల స‌తీమ‌ణి జ‌మున పేరుతో కొనుగోలు చేసిన భూముల‌ను.. క‌బ్జా భూములంటూ ప్ర‌చారం చేయ‌డంపై మండిప‌డుతున్నారు. ఇప్ప‌టికే రాజ్యం బ‌నాయించిన కేసుల‌పై ఈట‌ల రాజేంద‌ర్ ఇటు ప్ర‌జాక్షేత్రంలో.. అటు హైకోర్టులో.. పోరాడుతున్నారు. బ‌ల‌మైన ప్ర‌భుత్వాన్ని ఎదుర్కోవాలి కాబ‌ట్టి.. బ‌ల‌మైన జాతీయ పార్టీలో చేరేందుకూ సిద్ధ‌మ‌వుతున్నారు. అటు టీఆర్ఎస్ నేత‌లు.. ఇటు పింక్ మీడియా క‌లిసి.. ఈట‌ల అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డారంటూ దుమ్మెత్తిపోస్తుండ‌టంపై.. ఈట‌ల ఫ్యామిలీ భ‌గ్గుమంది. తాజాగా, ఈట‌ల స‌తీమ‌ణి జ‌మున  కేసీఆర్‌పై, అధికారుల‌పై డైరెక్ట్‌గా మాట‌ల యుద్ధానికి దిగారు. బ‌స్తీమే స‌వాల్ అన్న‌ట్టు మాట్లాడారు.  ‘‘మెదక్‌ జిల్లా మాసాయిపేటలో 46 ఎకరాలు కొనుగోలు చేశాం. ఒక్క ఎకరం ఎక్కువగా ఉన్నా ముక్కు నేలకు రాస్తా.. సర్వే చేసిన అధికారులు ముక్కు నేలకు రాస్తారా?’’ అంటూ స‌వాల్ విసిరారు ఈట‌ల జ‌మున‌.  తమ హేచరీస్‌, గోదాములపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని జమున ఆరోపించారు. అసత్య ప్రచారాలు తిప్పికొట్టడం తమకు తెలుసన్నారు. తాము కష్టపడి పైకొచ్చామని.. ఎవరినీ మోసం చేయలేదన్నారు. మాసాయిపేటలో మోడ్రన్‌ హ్యాచరిస్ పెట్టాలని 46 ఎకరాలు కొన్నామని, బడుగు బలహీనవర్గాల భూమి కాజేశామని దుష్ప్రచారం చేస్తున్నారని మండిప‌డ్డారు. 1992లో దేవరయాంజల్‌ వచ్చి 1994లో అక్కడి భూములు కొన్నాం. మా గోదాములు ఖాళీ చేయించి ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తున్నారు. అసత్య ప్రచారాలు ఎక్కువ రోజులు నిలవలేవు. ఎన్ని కుట్రలు చేసినా భయపడేది లేదంటూ భ‌గ్గుమ‌న్నారు ఈట‌ల రాజేంద‌ర్ స‌తీమ‌ణి జ‌మున‌. ప‌నిలో ప‌నిగా.. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ప‌త్రిక‌పైనా ఫైర్ అయ్యారు. పత్రిక ఉందని ఎలా పడితే అలా రాస్తారా? మా స్థలంలో ఏర్పాటు చేసిన పత్రికలోనే మాపై దుష్ప్రచారం చేస్తారా? అంటూ నిల‌దీశారు. నిజాలు ఎప్పటికైనా బయటపడతాయని, పత్రిక కోసం భూమి ఇచ్చిన కుటుంబం తమదని ఈటల భార్య జమున ఆవేశంగా మాట్లాడారు.  ముక్కు నేల‌కు రాస్తారా? అంటూ నేరుగా అధికారుల‌ను.. మా భూమిలో పెట్టిన ప‌త్రిక అంటూ ప‌రోక్షంగా కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ.. ఇక త‌గ్గేదే లే.. తాడోపేడో తేల్చుకునుడే.. అన్న‌ట్టుగా ఈట‌ల జ‌మున సంకేతాలు ఇచ్చారు. 

అవమాన భారంతో ఏడ్చిన ఈటల రాజేందర్! 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో తాడోపేడో తేల్చుకునేందుకు మజీ మంత్రి ఈటల రాజేందర్ సిద్ధమయ్యారు. సీఎం కేసీఆర్ కు, టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈటల రాజేందర్ కుటుంబ సభ్యులు ఓపెన్ చాలెంజ్ విసిరారు. తమపై చేస్తున్న ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు. ఒక మహిళగా ఛాలెంజ్ చేస్తున్నా అక్రమాలు జరిగినట్లు నిరూపించాలంటూ ఈటల జమున సవాల్ చేశారు. ఉద్యమంలోకి రాక ముందు కేసీఆర్ కుటుంబ ఆస్తులు ఎంత..? ఇప్పుడు ఎంత..? చర్చకు సిద్ధమేనా అంటూ జమున ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు ఈటల జమున.  సమైక్యాంధ్రలో ఆత్మ గౌరవంతో బ్రతికామన్నారు జమున. 2014 నుంచి ఆ పరిస్థితులు లేవన్నారు. ప్రగతి భవన్ గేట్ వద్దే మూడు సార్లు అపాయింట్మెంట్ లేదని ఆపితే ఈటెల ఇంటికి వచ్చి ఏడ్చినా సందర్భాలు ఉన్నాయన్నారు జమున. ఉమ్మడి రాష్ట్రంలో ఈటెల కు జ్వరం వస్తే అప్పటి పాలకులు వచ్చి పరామర్శించారని.. తెలంగాణ వచ్చాక ఆ పరిస్థితి లేదన్నారు. ఉద్యమంలో ఈటెల రెండు మూడు రోజులు ఇంటికి రాకపోయినా కూడా దైర్యంగా ఉన్నామని.. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ పరిస్థితులు లేవన్నారు. వైఎస్సార్ పార్టీలోకి  ఆహ్వానిస్తే  వెళ్లని వ్యక్తి రాజేందర్ అని చెప్పారు. అధికారం ఉందని ఎం చేసినా చెల్లుతుందని అనుకుంటే పోరపాటన్నారు జమున.  ఉద్యమంలో ఈటెల పెట్టిన డబ్బుల గురించి ఎవరైనా ఆడిగారా..? అని జమున ప్రశ్నించారు. తాను వ్యాపారం చేస్తూ ఈటెలను ఉద్యమంలోకి పంపానని చెప్పారు.  తన వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బుల ద్వారా ఉద్యమంలో ఈటెల అందరిని కాపాడుకున్నారని జమున తెలిపారు.  ఈటెల ఉద్యమంలో ఎలా ఉన్నాడో ఓయూ విద్యార్థులను అడగాలన్నారు. తన  ఆస్తులు మొత్తం అమ్మి ఐనా సరే మా ఆయనకు అండగా ఉంటానని జమున స్పష్టం చేశారు. తెలంగాణ ఆత్మ గౌరవ పోరాటంలో ఎంతకైనా సిద్ధమేనన్నారు. నయీమ్ చంపుతాను అంటే భయపడలేదన్నారు.  వకులాభారణం మొహం చూసి ఒక్క వోట్ పడతాదా అని జమున ఎద్దేవా చేశారు. అన్నా అని బతిలాడితే బీసీ కమిషన్ లో సభ్యుడిగా నియామకం జరిగేలా చేశారన్నారు. తన  ఇంట్లో అన్నం తిన్న వాళ్ళతోనే తిట్టిస్తున్నారని విమర్శించారు. పోలీసులు తన కుటుంబం కోసమే పని చేస్తున్నట్లు ఉందన్నారు. సమైక్య పాలనలో కూడా ఇన్ని ఇబ్బందులు లేవన్నారు జమున. ఇప్పుడు రెడ్డి-ముదిరాజ్ లమని ఇప్పుడు గుర్తుకు వచ్చిందా..? అని ప్రశ్నించారు. కులాల పేరుతో పాలన చేస్తున్నారని జమున మండిపడ్డారు. 

తెలంగాణలో లాక్ డౌన్ పొడిగింపే?

తెలంగాణలో లాక్ డౌన్ ను సడలిస్తారా.. పొడిగిస్తారా? సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. రాష్ట్రంలో మే 12 నుంచి లాక్ డౌన్ అమలవుతోంది. మొదట మే 20 వరకు ప్రకటించారు. తర్వాత 30వ తేదీ వరకు పొడిగించారు. ఆదివారంతో అ గడువు ముగియనుండటంతో లాక్ డౌన్ పై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది.  ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు సడలింపు ఇస్తూ... తర్వాత లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. ఇదే విధంగా మరో  10 రోజులు లాక్ డౌన్ పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది.  కరోనా కట్టడి, లాక్‌డౌన్‌ అమలుపై రాష్ట్రమంత్రివర్గం భేటీలో చర్చించనున్నారు.  జూన్‌ నెలాఖరు వరకు కరోనా మార్గదర్శకాలను పొడిగిస్తూ కేంద్రం నిర్ణం తీసుకుంది. దీంతో తెలంగాణలోనూ లాక్‌డౌన్‌ పొడిగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. లాక్ డౌన్ తోనే  కరోనా నియంత్రణ పటిష్టంగా జరుగుతుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది. కేబినెట్ సమావేశానికి హోంశాఖ, వైద్యారోగ్య, ఆర్థిక శాఖ అధికారులను పిలిచి మాట్లాడే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది. కరోనా కట్టడికి ఇప్పటిదాకా ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు, ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో అందుతున్న వైద్యసేవలు, అందుబాటులో ఉన్న బెడ్లు, ఆక్సిజన్‌ సరఫరా, బ్లాక్‌ఫంగస్‌ చికిత్సపై సమావేశంలో చర్చించనున్నారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్రస్తుతం లాక్ డౌన్ అమలవుతోంది. చాలా రాష్ట్రాలు జూన్ 15 వరకు పొడిగించాయి. తెలంగాణ పక్క రాష్ట్రాలైనా కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లోనూ లాక్ డౌన్, కర్ఫ్యూ అమలవుతోంది. పక్క రాష్ట్రాల్నని లాక్ డౌన్ లో ఉన్నందున... ఇక్కడ కూడా లాక్ డౌన్ పెట్టడం తప్పనిసరని అధికారులు అభిప్రాయపడుతున్నారు.  రాష్ట్రంలో 600 టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి చేయాలని సర్కారు నిర్ణయించిన నేపథ్యంలో ఈ అంశంపై సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నది. సంగారెడ్డి, జగిత్యాల, కొత్తగూడెం, వనపర్తి, మంచిర్యాల, మహబూబాబాద్‌లో కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటుకు సంబంధించిన ఫైలును మంత్రివర్గం ఆమోదించనున్నది. వైద్యసిబ్బంది నియామకం, జ్వరసర్వే, వ్యాక్సిన్‌ గ్లోబల్‌ టెండర్లపై చర్చించనున్నారు. వ్యాక్సిన్‌ గ్లోబల్‌ టెండర్ల ప్రక్రియలో ప్రీబిడ్డింగ్‌ సమావేశం కూడా పూర్తయ్యింది. కొవిషీల్డ్‌, స్పుత్నిక్‌-వీ వ్యాక్సిన్‌ తయారుచేసిన అంతర్జాతీయ కంపెనీలు బిడ్లను దాఖలు చేశాయి. ఈ అంశంపైనా చర్చించే అవకాశం ఉన్నది. వర్షాకాల వ్యవసాయ సీజన్‌ వస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ వ్యవసాయరంగంపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచటం, రైతుబంధు అందజేత తదితర అంశాలపై క్యాబినెట్‌ సమావేశంలో చర్చించి పలు నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉన్నది. ధాన్యం సేకరణ ఎంతవరకు వచ్చిందనే అంశంపైనా చర్చించే అవకాశం ఉన్నది. జూన్ 15 నుంచి రైతు బంధు నిధులు అందిస్తామని చెప్పడంతో.. దానిపైనా కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. 

ఎంసెట్ పరీక్షలు వాయిదా

తెలంగాణలో  ఎంసెట్‌ పరీక్షలు వాయిదా  పడ్డాయి. కరోనా ఉధృతి తగ్గనందున పరీక్షలను వాయిదా వేయాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం జూలై 5, 6 తేదీల్లో ఎంసెట్‌ మెడికల్‌.. 7, 8, 9 తేదీల్లో ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే మే2 నుంచి జరగాల్సిన ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు వాయిదాపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సెకండియర్‌ పరీక్షలను జూలై 15 తర్వాత నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించిన తేదీలను ప్రకటించాల్సి ఉంది. ఇంటర్‌ ద్వితీయ సంవత్సర పరీక్ష తేదీలు ఖరారైన తర్వాత ఎంసెట్‌ తాజా షెడ్యూల్‌ను ప్రకటిస్తామని తెలంగాణ ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ఆచార్య తుమ్మల పాపిరెడ్డి వెల్లడించారు.. ఇక వెనుకబడిన, సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాలకు  జరగనున్న టీజీసెట్‌ ప్రవేశపరీక్ష వాయిదా పడింది. ఈ పరీక్ష ఆదివారం జరగాల్సి ఉంది. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో పరీక్షను వాయిదా వేశామని, తదుపరి తేదీని తర్వాత ప్రకటిస్తామని టీజీ సెట్‌ కన్వీనర్‌, సాంఘిక, గిరిజన గురుకులాల విద్యాసంస్థల కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

రాజ‌రాజ న‌రేంద్రుడు.. సంగం స‌పోర్ట్‌ ఆయ‌న‌కే..

ధూళిపాళ్ల న‌రేంద్ర‌. సంగం డెయిరీ ఛైర్మ‌న్ ఆయ‌న‌. ఏళ్లుగా ఆయ‌నే అధిప‌తి. పాల ఉత్ప‌త్తిదారుల‌కు పెన్నిధి. డెయిరీలో ఎలాంటి స‌మ‌స్య లేదు. అంతా సంతోషంతో ఉన్నారు. అందుకే, స‌ర్కారుకు క‌ళ్లు మండిన‌ట్టున్నాయి. ధూళిపాళ్ల టీడీపీ నాయ‌కుడు కాబ‌ట్టి.. ఆయ‌న సార‌ధ్యంలోని సంగం డెయిరీని టార్గెట్ చేసిన‌ట్టున్నారు. క‌ట్ చేస్తే.. ధూళిపాళ్ల న‌రేంద్ర అరెస్ట్‌. జైలుకు త‌ర‌లింపు. సంగం డెయిరీ ఆస్తులు స్వాధీనం. హైకోర్టు తీర్పుతో ఆస్తులు మ‌ళ్లీ సంగం డెయిరీకే సొంతం. ఇదీ జ‌రిగింది.    బెయిల్‌పై తిరిగొచ్చిన ధూళిపాళ్ల‌.. ఛైర్మ‌న్ హోదాలో విజయవాడలో జ‌రిగిన‌ సంగం డెయిరీ పాలకవర్గం సమావేశానికి హాజ‌ర‌య్యారు. సుదీర్ఘ విరామం త‌ర్వాత‌.. అతిపెద్ద రాజ‌కీయ హైడ్రామా త‌ర్వాత‌.. న‌రేంద్ర నేతృత్వంలో మీటింగ్ జ‌ర‌గ‌డం విశేషం. ఏ కుర్చీన‌యితే.. అత‌ని నుంచి లాక్కోవాల‌ని చూశారో.. ఇప్పుడు అదే సీటులో మ‌రోసారి ఆసీనులై.. అదే సంగం పాల‌క వ‌ర్గానికి ఛైర్మన్‌గా.. ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డం రాజ‌కీయంగా ఆస‌క్తిక‌రంగా మారింది. తాత్కాలికంగా త‌న‌ను ఇబ్బందిపెట్టినా.. తుది విజ‌యం త‌న‌దేనంటూ ధూళిపాళ్ల‌.. రాజ‌రాజ న‌రేంద్రుడిలా.. సంగం డెయిరీ ఛైర్మ‌న్‌గా.. సింహాస‌నం అధిష్టించ‌డం ఆయ‌న స‌త్తాకు నిద‌ర్శ‌నం.  సంగం డెయిరీ పూర్తిగా పాల ఉత్పత్తిదారుల ఆస్తి.. దీనికి పాలకవర్గం కేవలం విధాన నిర్ణేత మాత్రమేనని ధూళిపాళ్ల తెలిపారు. నరేంద్ర అధ్యక్షతన జరిగిన పాలకవర్గం సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జూన్ 1 నుంచి గేదె పాల సేకరణ.. కిలో వెన్నకు 715 రూపాయలు చెల్లించనుంది. 10 శాతం వెన్న శాతం ఉన్న గేదె పాలు లీటరుకు రూ.71.50 చెల్లించేందుకు పాలకవర్గంలో నిర్ణయం తీసుకున్నారు. పశు దాణా కోసం మొక్కజొన్నల ధర క్వింటాల్‌కు 1700 చెల్లించాలని తీర్మానం చేశారు. ఈ ఏడాదిలో 2 వేల టన్నుల మొక్కజొన్న కొనుగోలుకు సంగం డెయిరీ నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జిల్లాలో ఆవులలో పొదుగువాపు పథకం ప్రారంభించాలని, చిత్తూరు జిల్లా కుప్పం, నెల్లూరు జిల్లా వెంకటగిరిలో 5 వేల లీటర్ల బల్క్ కూలర్‌ను ప్రారంభించేందుకు డెయిరీ నిర్ణయం తీసుకుంది. ఛైర్మన్ ధూళిపాళ్ల న‌రేంద్ర‌కు సంఘీభావాన్ని తెలియజేస్తూ సంగం డెయిరీ ఏకగ్రీవ తీర్మానం చేయ‌డం విశేషం. సంగం డెయిరీపై ఆయ‌న‌కున్న అనుబంధానికి ఇది నిద‌ర్శ‌నం. 

మా నాన్నకు ప్రాణహాని! హైకోర్టుకు జడ్జీ రామకృష్ణ కొడుకు లేఖ 

దళిత జడ్జి రామకృష్ణ తనయుడు వంశీకృష్ణ ఆంధ్రప్రదేశ్  హైకోర్టుకు లేఖ రాశారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న తన తండ్రికి ప్రాణహాని ఉందని వంశీకృష్ణ లేఖలో తెలిపారు. తన తండ్రి ఉన్న బ్యారెక్‌లోకి అపరిచితుడిని పంపారని, ఆ అపరిచితుడు తన తండ్రిని బెదిరిస్తున్నాడని పేర్కొన్నారు. ఆ వ్యక్తిని, తన తండ్రిని వేర్వేరు బ్యారెక్‌లో ఉంచాలని వంశీకృష్ణ హైకోర్టును విజ్ఞప్తి చేశారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిపై  తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ జడ్జి రామకృష్ణను ఏప్రిల్ 15న మదనపల్లెలో పోలీసులు అరెస్ట్ చేశారు.  బీ కొత్తకోట నుంచి మదనపల్లెలో కరోనా టెస్ట్ కోసం వెళుతుండగా దారి మధ్యలో జడ్జి రామకృష్ణ పోలీసులు అదుపులోకి తీసుకొని పీలేరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఆయనను కోర్టులో హాజరు పర్చారు. కోర్టు రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు.  తన అరెస్ట్ పై రామకృష్ణ స్పందిస్తూ...గతంలో  నంద్యాల ఉపఎన్నికల్లో ప్రతిపక్ష నాయకుడి హోదాలో జగన్ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును నడిరోడ్డుపై కాల్చి చంపాలని అన్నారని గుర్తుచేశారు. ఇప్పుడు తాను అదే విధంగా అన్నానని చెప్పారు. జగన్ అప్పటి ముఖ్యమంత్రిపై చేసిప వ్యాఖ్యలు తప్పుకానప్పుడు ఇప్పుడు తాను సీఎం జగన్‌ను అంటే దేశ ద్రోహం ఎలా అవుతుందని రామకృష్ణ  ప్రశ్నించారు. జడ్జి రామకృష్ణ వ్యవహారాన్ని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. మెజిస్ట్రేట్ రామకృష్ణ జీవితం ప్రమాదంలో ఉందని వర్ల రామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పెద్దిరెడ్డి మెజిస్ట్రేట్ రామకృష్ణపై దాడి చేయించారని ప్రతి ఒక్కరికీ తెలుసని అన్నారు. జైలులో ఉన్న రామకృష్ణకు ప్రాణహాని ఉందని తన కుమారుడు వంశీ ఆవేదన చెందుతున్నారని వర్ల రామయ్య అన్నారు. 

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. జూన్ 15 నుంచి డబ్బులు...

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు ముఖ్యమంత్రి కేసీఆర్. జూన్ 15 నుంచి రైతు బంధు నిధులు అందిస్తామన్నారు. జూన్ 15 నుంచి 25 వ తేదీ లోపల రైతుబంధు పంటసాయం కింద ప్రభుత్వం అందించే ఆర్ధిక సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయాలని సిఎం కెసిఆర్ ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. గత యాసంగిలో అవలంబించిన విధానాన్నే ఇప్పుడు కూడా అవలంబిస్తూ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని సిఎం ఆదేశించారు. ఇప్పటిదాకా ఇచ్చిన  కాటగిరీ ల వారిగానే  రైతు బంధు ఆర్ధిక సాయాన్ని ఖాతాలో వేయాలన్నారు.  జూన్ 10 వ తేదీని కటాఫ్ డేట్ గా పెట్టుకోని ఆ తేదీవరకు పార్ట్ బీ నుంచి పార్ట్ ఏ లోకి చేరిన భూములకు రైతు బంధు వర్తింప చేయాలని సిఎం కేసీఆర్ ఆదేశించారు.  దేశంలో తెలంగాణ రాష్ట్రం తప్ప ఎక్కడా రైతువద్దనుంచి వొక్కగింజకూడా కొంటలేరని చెప్పారు కేసీఆర్. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా కొన్ని ప్రతిపక్షాలు రైతుల వద్దకు పోయి ధర్నాలు చేయాలని కుయుక్తులకు పాల్పడుతున్నాయని విమర్శించారు. కానీ వాస్తవం తెలిసిన, విజ్జత కలిగిన రైతులు ప్రతిపక్షాల ఆటలు సాగనిస్తలేరన్నారు. గత సంవత్సరంలో కరోనా సమయంలో ఆర్ధిక వ్యవస్థ కుప్పుకూలితే తెలంగాణ జీఎస్డీపీకి వ్యవసాయ రంగం 17 శాతం ఆదాయన్ని అందచేసిందని చెప్పారు కేసీఆర్. ధాన్యం దిగుబడిలో  తెలంగాణ ది దేశంలోనే నెంబర్ వన్ స్థానం అన్నారు. వొక్క కారు మాత్రమే వరి పంట పండించే పంజాబ్ కన్నా తెలంగాణలో రెండు పంటల ద్వారా అధిక దిగుబడి వచ్చిందన్నారు. రాబోయే కాలంలో మెదక్, మహబూబ్ నగర్ తదితర జిల్లాల్లో  ఇంకా మరికొన్ని ప్రాజెక్టులను లిఫ్టులను పూర్తి చేసుకోబోతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ రంగం నూటికి నూరు శాతం స్థిరీకరించబడుతుందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి.  తెలంగాణలో పండుతున్న వరి ధాన్యం మొత్తాన్ని కొనాల్సిందిగా కేంద్రాన్ని కోరనున్నామని సిఎం కేసీఆర్ తెలిపారు. పంజాబ్ వంటి రాష్ట్రాల్లో నూటికి నూరు శాతం ధాన్యం సేకరిస్తున్న ఎఫ్ సీ ఐ.. తెలంగాణలో సేకరిచంక పోవడం పై సిఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం ఇట్లా వివక్ష చూపడం సరికాదన్నారు. ఈ మేరకు ప్రధానికి లేఖ రాయనున్నామన్నారు. ధాన్యాన్ని కొనడం ఎంత శ్రమో.. ధాన్యాన్ని సేకరించి స్టాకు చేయడం కూడా అంతే శ్రమతో కూడుకున్నదని సిఎం తెలిపారు. తెలంగాణ వచ్చిన కొత్తలో కేవలం 4 లక్షల టన్నుల ధాన్యాన్ని స్టాకు చేయడానికి మాత్రమే గోడౌన్ల లభ్యత వుండేదని, కానీ నేడు 25 లక్షల టన్నుల ధాన్యాన్ని నిల్వచేసుకునేందుకు గోడౌన్ల నిర్మాణం జరిగిందన్నారు. భవిష్యత్తులో మొత్తం 40 లక్షల టన్నుల సామర్థ్యనికి గోడౌన్ల నిర్మాణాలకు  ప్రతిపాదనలు మార్కెటింగ్ శాఖ  సిద్ధం చేసిందన్నారు.  వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో... విత్తనాల లభ్యత, ఎరువులు ఫెస్టిసైడ్ల లభ్యత, కల్తీ విత్తనాల నిర్మూలన అనే అంశం మీద సిఎం కెసిఆర్ చర్చించారు. నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులోకి తేవాలని సిఎం వ్యవసాయ శాఖ అదికారులను ఆదేశించారు. కల్తీ విత్తనాలమీద ఉక్కుపాదం మోపాలన్నారు. జిల్లాల వ్యాప్తంగా కల్తీ విత్తన తయారీదారులమీద దాడులు జరపాలని . కల్తీ విత్తనదారులను వలవేసి పట్టుకోవాలని, ఎంతటి వారినైనా పీడీ యాక్టుకింద అరెస్టు చేసి చట్టబపరమైన చర్యలు తీసుకోవాలని సిఎం  స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. చిత్తశుద్దితో పనిచేసి కల్తీ విత్తన విక్రయ ముఠాలను పట్టుకున్న వ్యవసాయ శాఖ, పోలీసు శాఖ, అధికారులను గుర్తించి వారికి ఆక్సిలరీ ప్రమోషన్, రాయితీల తో పాటు ప్రభుత్వం సేవా పతకం అందచేస్తుందని సిఎం స్పష్టం చేశారు. ఈ మేరకు తక్షణమే జిల్లాల వారిగా పోలీసులను రంగంలోకి దించాలని  డిజిపీ కి ఫోన్లో సిఎం ఆదేశించారు. నిఘావర్గాలు కల్తీ విత్తన తయారీదారుల మూఠాలను కనిపెట్టాలని ఇంటిలిజెన్స్ ఐజీని సిఎం ఆదేశించారు.

అనాథశ‌వాల‌కు అంతిమ గౌర‌వం.. ఎన్టీఆర్ ట్ర‌స్ట్‌ సాయం..

నారా భువ‌నేశ్వ‌రి. టీడీపీ అధినేత చంద్ర‌బాబు సతీమ‌ణి. భ‌ర్తే ఆమెకు స‌ర్వ‌స్వం. రాజ‌కీయం తెలీదు. త‌న వ్యాపార‌మేదో తాను చేసుకుంటూ ఉంటారు. చాలా అరుదుగా మాత్ర‌మే ప్ర‌జ‌ల ముందుకు వ‌స్తారు. ఏదైన విష‌యం త‌న‌ను తీవ్రంగా క‌లిచివేస్తే మాత్రం.. త‌ప్ప‌కుండా స్పందిస్తారు. గ‌తంలో అమ‌రావ‌తి రైతుల ఆక్రంద‌న ఆమెను క‌లిచివేసింది. రైతు దీక్షా శిబిరాన్ని సంద‌ర్శించి.. అమ‌రావ‌తి ఉద్య‌మానికి త‌న వంతు సాయంగా, అప్ప‌టిక‌ప్పుడు త‌న‌ చేతికి ఉన్న‌ బంగారు గాజులు తీసి విరాళంగా ఇచ్చారు. అమ‌రావ‌తి కోసం నేను సైత‌మంటూ ముందుకొచ్చారు.  తాజాగా, ఏపీలో క‌రోనా క‌ల్లోలంతో ప‌రిస్థితులు దారుణంగా త‌యార‌య్యాయి. టెస్టుల నుంచి ట్రీట్‌మెంట్ వ‌ర‌కూ.. ప్ర‌భుత్వం అన్ని విష‌యాల్లోనూ అట్ట‌ర్‌ఫ్లాప్ అయింది. క‌రోనాతో చ‌నిపోతే క‌నీసం అంత్య‌క్రియ‌లూ జ‌రిపించ‌లేని దుస్థితిలో ఉంది ప్ర‌భుత్వ యంత్రాంగం. అలాంటి ఉదంతాలు చూసి చంద్ర‌బాబు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి క‌ల‌త చెందారు. అనాథ శ‌వాల‌కు ఎన్టీఆర్ ట్ర‌స్ట్ ఆద్వ‌ర్యంలో అంత్య‌క్రియ‌లు చేస్తామ‌ని ఆమె ప్ర‌క‌టించారు.  క‌రోనా బారిన ప‌డి మృతిచెందిన వారిని కొన్ని చోట్ల‌ రోడ్ల ప‌క్క‌న వదిలేయ‌డంపై క‌ల‌త చెందామ‌ని నారా భువ‌నేశ్వ‌రి అన్నారు. కరోనా మృతుల కుటుంబీకులు ముందుకు రాక‌పోతే అంత్య‌క్రియ‌ల‌కు ఏర్పాట్లు చేస్తామ‌ని చెప్పారు. ఇందుకోసం ప్ర‌త్యేక వాహ‌నాల‌ను సిద్ధం చేసిన‌ట్లు వివ‌రించారు.   మ‌రోవైపు, ఎన్టీఆర్ ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో నాలుగు ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ల నిర్మాణానికి చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. రేపల్లె, పాలకొల్లు, టెక్కలి, కుప్పంలో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ తెలిపింది. ఇప్పటికే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందుబాటులో ఉన్నాయి. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా టెలీమెడిసిన్, మందుల పంపిణీ, అన్నదానం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 

ఆమెకు సెల్యూట్‌.. పేట్రియాటిక్‌ ల‌వ్‌స్టోరీ.. పుల్వామా అమ‌రుడి అడుగుజాడ‌..

‘‘ఐ లవ్‌ యూ విభూ.. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది. విభూ వదిలి వెళ్లిన మార్గాన్ని నేను కొనసాగిస్తున్నా. నా మీద నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.’’ అంటూ ఉద్వేగభరితంగా చెప్పుకొచ్చారు నిఖితాకౌల్‌.  పై వ్యాఖ్య‌లు చ‌దివి.. ఇదేదో ప్రేమ వ్య‌వ‌హారం అనుకునేరు. ప్రేమే.. కానీ వ‌ట్టి ప్రేమ మాత్ర‌మే కాదు. అంత‌కుమించి. భర్తతోపాటు ఆయన బాధ్యతనీ ప్రేమించి, దేశానికి సేవ చేయాలన్న తన కలను కొనసాగించడానికి కొత్త ప్రమాణం మొదలుపెట్టారు నిఖితాకౌల్‌. ఏడాది పోరాటం.. ఆమె సాధించిన విజ‌యం ఎంతోమందికి స్ఫూర్తి దాయ‌కం.   పుల్వామా దుర్ఘ‌ట‌న గుర్తుండే ఉంటుందిగా. 2019లో క‌శ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్ర‌వాదులు జ‌వాన్లు వెళుతున్న వాహ‌నాన్ని పేల్చేశారు. ఆ ఉగ్ర‌దాడిలో మేజ‌ర్ విభూతి శంక‌ర్ సైతం అమ‌రుల‌య్యారు. అప్పటికి ఆయనకు వివాహమై తొమ్మిది నెలలే అయింది. 27 ఏళ్ల వయసులోనే భర్తను కోల్పోయిన ఆమెను చూసి అందరూ బాధపడ్డారు. ఆ పుల్వామా అమ‌రుడు విభూతి శంక‌ర్‌ భార్యే నిఖితాకౌల్‌. అంద‌రిలా ఆమె భ‌ర్త చ‌నిపోయాడ‌ని ఏడుస్తూ కూర్చోలేదు. త‌న త‌ల‌రాత‌ ఇంతేనంటూ త‌ల్ల‌డిల్లిపోలేదు. విధికి ఎదురునిలిచి.. త‌న త‌ల‌రాత‌ను తిరిగి రాసుకుంటున్నారు. మేజ‌ర్ విభూ మీద ప్రేమతో.. తాను సైతం ఆర్మీలే చేరాల‌ని.. దేశ ర‌క్ష‌ణ బాధ్య‌త‌లు చేప‌ట్టాల‌ని త‌లిచారు. అప్ప‌టికే ఢిల్లీలో చేస్తున్న‌ మంచి ఉద్యోగాన్ని వ‌దిలేశారు. ఆర్మీలో చేరేందుకు శిక్షణ తీసుకున్నారు. షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) రాతపరీక్షనూ, సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డ్‌ (ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూనూ స‌క్సెస్‌ఫుల్‌గా పూర్తిచేశారు.    భర్త శిక్షణ పూర్తి చేసిన చెన్నైలోని ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలోనే సీటు సాధించారు నిఖిత‌. ‘అర్హత సాధించడానికి చాలా కష్టపడ్డాను. ఏడాది శిక్షణనూ పట్టుదలగా పూర్తిచేశాను. విభూ గర్వించే ఆఫీసర్‌ అవ్వాలన్నది నా కల’ అంటారామె.  ఆర్మీ శిక్షణ పూర్తి చేసుకుని తాజాగా లెఫ్టినెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. శనివారం చెన్నైలో జరిగిన పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో పుల్వామా అమరుడు మేజర్‌ విభూతి శంకర్‌ దౌండియాల్‌ సతీమణి నిఖిత.. ఆర్మీలో లెఫ్టినెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. ఉత్తర కమాండ్‌ చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ వైకే జోషీ స్వయంగా ఆమె భుజాలపై నక్షత్రాలు పెట్టి సైన్యంలోకి తీసుకున్నారు. 

ఒకే రోజు రెండు కొవిడ్ డోసులు! ఆ మహిళకు ఏమైందంటే... 

ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినే ఆయుధమని వైద్య సంస్థలు చెబుతున్నారు. దేశంలోనూ వ్యాక్సినేషన్ ను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. మన దేశంలో రెండు టీకాలు అందుబాటులో ఉండటంతో... వాటిని పంపిణి చేస్తున్నారు. అయితే వ్యాక్సిన్ల రెండు డోసుల మధ్య కొంత దూరం అవసరమని ప్రభుత్వం చెబుతోంది. కోవిషీల్డ్ టీకా రెండో డోసుకు 12 నుంచి 14 వారాల గడువు ఉండగా.. కొవాగ్జిన్ అయితే 4 నుంచి 6 వారాల వ్యవధిలోనూ సెకండ్ డోసు తీసుకోవాల్సి ఉంటుంది.  వ్యాక్సిన్ పంపిణిపై పక్కగా ప్రోటోకాల్ ఉన్నా కొందరు ఆరోగ్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.  రాజస్థాన్‌లోని దౌసాలో ఓ మహిళ (44)కు ఒకేసారి రెండు డోసులూ ఇచ్చేశారు అక్కడి వైద్య సిబ్బంది. ఉదయం 9 గంటలకు ప్రజారోగ్య కేంద్రానికి వెళ్తే 11 గంటలకు వ్యాక్సిన్ వేశారని, సాయంత్రం తన భార్యకు జ్వరంగా ఉంటే ఏమైందని అడిగితే తనకు రెండు డోసులు వెంటవెంటనే ఇచ్చారని చెప్పడంతో షాకయ్యారని ఆమె భర్త చరణ్ శర్మ తెలిపారు.  ఒక రోజు రెండు డోసులు ఇచ్చారన్న వార్త స్థానికంగా కలకలం రేపింది. ఆ మహిళకు ఏమవుతుందోమోనన్న ఆందోళన కనిపించింది.  చరణ్ శర్మ ఆరోపణలను ఆసుపత్రి సిబ్బంది కొట్టిపడేశారు. ఒకేసారి రెండో డోసులు ఇవ్వడం సాధ్యం కాదని, అది నిబంధనలకు విరుద్ధమని దౌసా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్  మనీష్ చౌదరీ చెప్పారు. తొలుత వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తే రక్తం రావడంతో సిబ్బంది విరమించుకున్నారని, ఆ తర్వాత మరో ప్రాంతంలో టీకా వేశారని ఆయన  చెప్పారు.  సూదిని రెండుసార్లు పొడవడంతో తనకు రెండు డోసులు ఇచ్చేసినట్టు ఆమె భయపడుతోందని అన్నారు. మహిళ ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు వైద్య బృందాన్ని ఆమె గ్రామానికి పంపినట్టు చెప్పారు. ఆమె ఆరోగ్య పరిస్థితి సాధారణంగానే ఉన్నట్టు వైద్యులు గుర్తించారని తెలిపారు. ఆమెలో ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదన్నారు.  మరోవైపు ఏకకాలంలో రెండు మోతాదులు తీసుకున్నా దుష్ప్రభావాలేమీ ఉండమని ఎస్ఎంఎస్ మెడికల్ కాలేజీ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ రమణ్ శర్మ తెలిపారు. ఫేజ్ 2 ట్రయల్స్‌లో దీనిని కూడా పరీక్షించామని, ఎలాంటి సైడ్ ఎఫెక్టులు రాలేదని చెప్పారు.   

ప్రధాని మోడీ కాళ్లు మొక్కుతా! మమత బెనర్జీ సంచలనం..

కొత్త ప్రభుత్వం ఏర్పడినా పశ్చిమ బెంగాల్ లో రాజకీయ మంటలు చల్లారడం  లేదు. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా.. దానికి రాజకీయం పులుముకుంటోంది. యాస్ తుపానుపైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య యుద్ధం సాగుతోంది. యాస్ తుపాను సమీక్ష సమావేశం సందర్భంగా చోటు చేసుకున్న వివాదంలో కేంద్రం తనపై నిందలు మోపడం పట్ల  బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో స్పందించారు. ప్రధాని మోడీని 30 నిమిషాల పాటు వేచి చూసేలా చేశారని కేంద్రం.. మమతపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై ఘాటుగా స్పందించిన మమత... ఇటీవల బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకే కేంద్రం ఈ విధంగా ప్రవర్తిస్తోందని విమర్శించారు. తమను ఓడించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించిన కేంద్రం పెద్దలు, దారుణంగా భంగపడ్డారని, అప్పట్నించి ప్రతి రోజు ఏదో ఒక వివాదం రేకెత్తిస్తున్నారని, తనను ప్రతిసారీ అవమానిస్తున్నారని మమత మండిపడ్డారు.  మే 28న జరిగిన సంఘటనలను వివరించారు దీదీ. యాస్ తుపానువల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు తాను సాగర్, డిఘా వెళ్ళాలని నిర్ణయించుకున్నానని, దీనికి సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేసుకున్నానని చెప్పారు. ఆ తర్వాత అకస్మాత్తుగా ఓ ఫోన్ కాల్ వచ్చిందన్నారు. తుపాను తర్వాతి పరిస్థితిని పరిశీలించేందుకు ప్రధాన మంత్రి బెంగాల్ వస్తున్నట్లు చెప్పారన్నారు. అందుకు అనుగుణంగా తాము ప్రణాళికను రచించామని చెప్పారు. తాము ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలవడానికి ముందు ఒక గంటపాటు తమను వేచి ఉండేలా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అధికారులు చేశారన్నారు. పీఎం హెలికాప్టర్ వస్తుందని చెప్పారని, తాము సహనంతో వేచి చూశామని చెప్పారు. ప్రధాన మంత్రి-ముఖ్యమంత్రి సమావేశం జరిగే ప్రదేశానికి తాము చేరుకునేసరికి, అక్కడ మోదీ సమావేశం అంతకుముందే ప్రారంభమైపోయిందని చెప్పారు. సమావేశం జరుగుతోంది కాబట్టి మీరు వెళ్ళకూడదని చెప్పారని, తనను బయటే నిలిపేశారని తెలిపారు. అప్పుడు కూడా తాము సహనంతో వేచి చూశామన్నారు. ఆ తర్వాత మళ్ళీ తాను అడిగినపుడు మరో గంట వరకు ఎవరూ లోపలికి వెళ్ళకూడదని చెప్పారన్నారు. ప్రధాని సమావేశం రాజకీయ సమీకరణాలు సరిచేసేందుకే అన్నట్టుగా సాగిందని, విపక్ష బీజేపీని సమావేశానికి పిలవడం ఏంటని ఆమె ప్రశ్నించారు. బెంగాల్‌కు సాయం చేయాలంటే తన కాళ్ళు పట్టుకోవాలని మోదీ చెబితే, తాను బెంగాలీల కోసం తప్పకుండా ఆయన కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నానని మమత బెనర్జీ చెప్పారు. రాష్ట్రంలో ఓటమిని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు.  ప్రధాన మంత్రి-ముఖ్యమంత్రి సమావేశం జరుగుతుందని అంతకుముందు చెప్పారన్నారు. ఈ సమావేశంలో ఇతరులు కూడా పాల్గొనడంతో నివేదికను సమర్పించాలని తాను నిర్ణయించుకున్నానని చెప్పారు. ఆ తర్వాత ప్రధాన మంత్రి వద్ద అనుమతి తీసుకుని తాను డిఘాలో తుపాను వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు వెళ్ళానని వివరించారు. తాను ప్రధాన మంత్రి అనుమతిని మూడుసార్లు కోరానని చెప్పారు. ‘‘సార్, మీ అనుమతితో నేను వెళ్ళవచ్చునా? మేం డిఘా వెళ్ళి, తుపాను నష్టాన్ని అంచనా వేయవలసి ఉంది, వాతావరణం కూడా అంత బాగా లేదు’’ అని తాను మోడీతో చెప్పానని తెలిపారు. ఆ తర్వాత మాత్రమే తాము అక్కడి నుంచి డిఘా వెళ్ళామని తెలిపారు. ఆ సమావేశ మందిరంలో కొన్ని ఖాళీ కుర్చీలు ఉన్నాయని, అయితే తాము డిఘా వెళ్ళవలసి ఉన్నందువల్ల అక్కడ కూర్చోవలసిన అవసరం తమకు రాలేదని చెప్పారు. అక్కడ ఖాళీ కుర్చీలు ఉన్నట్లు ఓ ఫొటోను మీడియాకు విడుదల చేశారని, ఇది సరైనది కాదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిసారీ తనను ఇలాగా టార్గెట్ చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి గుజరాత్, ఒడిశా, ఇతర రాష్ట్రాల్లో సమీక్షా సమావేశాలు నిర్వహించినపుడు ప్రతిపక్షాల సభ్యులు హాజరు కాలేదని గుర్తు చేశారు. కానీ బెంగాల్‌లో మాత్రం ప్రతిపక్ష నేతలు పాల్గొన్నారన్నారు.  కేంద్ర ప్రభుత్వం సెలక్టివ్ న్యూస్‌తో తనను లక్ష్యంగా చేసుకుందని మమత ఆరోపించారు. ఆ వార్తలు ఏకపక్షంగా ఉన్నాయని, అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి వీల్లేకుండా రాశారని ఆరోపించారు. తనకు జాతీయ స్థాయి మీడియాలో కొందరు మిత్రులు ఉన్నారని, కొన్నిసార్లు తమకు పీఎంఓ నుంచి సూచనలు వస్తూ ఉంటాయని వారు చెప్పారని అన్నారు. తనపై పక్షపాతంతో కూడిన వార్తలను రాయాలని పీఎంఓ నుంచి ఆదేశాలు వస్తూ ఉంటాయని వారు చెప్పారన్నారు. ఆ వార్తల ఆధారంగా తనను అవమానించేందుకు ఇటువంటి సూచనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. శుక్రవారం కూడా ఇదేవిధంగా సెలక్టివ్ న్యూస్ ఇచ్చి, కేంద్ర ప్రభుత్వం తనను టార్గెట్ చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కేంద్ర సర్వీసుల్లోకి పిలిపించారని, ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరుతున్నానని చెప్పారు బెంగాల్ ముఖ్యమంత్రి.  

అంబులెన్సు లో వేయిల ఖర్చు.. అందుకే బైక్ మీద పేషేంట్.. 

కరోనా లాక్ డౌన్ అందరికి ఒకేలా ఉండదు. ఉన్నోడు తిన్నది అరగక ఏడుస్తుంటే. లేనోడు కడుపు మాది చస్తున్నారు. ఇది ఓన్లీ ఫుడ్ విషయం లోనే కాదు. కోవిద్ ట్రీట్మెంట్ విషయంలో కూడా.. డబ్బులు ఉన్నవాడికి సరైన వైద్యం అందుతుంది. డబ్బులు లేని మిడ్డిల్ క్లాస్, మరియు పూర్ పీపుల్ సరైన వైద్యం సరైన టైం కి అందక ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక అసలు విషయానికి వస్తే.. కరోనా మెడిసిన్ దగ్గరి నుండి, శాస్తే శవాన్ని మోసుకపోవడానికి వెళ్లే అంబులెన్స్ కూడా ఇప్పుడు రేట్లు పెంచాయి. అడ్డగోలుగా   మెడికల్ సర్వీసుల ధరలన్నీ మారిపోయాయి. అంబులెన్సుల ధరలైతే ఇక చెప్పే పని లేదు. ఇష్టమొచ్చినట్లుగా డ్రైవర్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అంబులెన్స్ ఖర్చులు భరించలేక ఓ పెద్దాయన చనిపోతే అతడి శవాన్ని కుటుంబీకులు బైక్‌‌పై తీసుకెళ్లారు. ఈ ఘటన చూసిన వారంతా.. లోకం ఎలా తయారైందో అంటూ పలు రకాలుగా చర్చించుకున్నారు. అది ఖమ్మం జిల్లా.  ఆత్కూరు. మల్లారం గ్రామం. అతని పేరు ఎర్రనాగుల నారాయణ అతని వయసు 70 సంవత్సరాలు. అతను సుమారు వారం రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ మధిరలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఈ క్రమంలో శుక్రవారం గుండెల్లో నొప్పిగా ఉందని అతడు కుటుంబసభ్యులతో కలిసి మోటారు సైకిల్‌పై మధిరకు వస్తున్నాడు. సిరిపురం గ్రామంలోని ఓ ఆర్‌ఎంపీ వద్ద చూపించుకోగా ఆయన మధిరలోని ఆసుపత్రిలో వైద్యం చేయించుకోమని సూచించాడు. మోటారు సైకిల్‌పై మధిరకు తీసుకెళ్తుండగా.. ఆత్కూరు సమీపంలోకి రాగానే ఒక్కసారిగా గుండెపోటు రావడంతో మోటారు సైకిల్‌పైనే మృతి చెందాడు. ఏమిటి మనం ఎలాంటి సమాజం లో బతుకుతున్నాం..ఈ ప్రపంచంలో అతి పవిత్రమైనవి పుట్టుక చావు.. ఆ పవిత్రమైన వారికి కూడా ఇలాంటి వాటితో అపవిత్రం చేస్తున్నారు. ఈ కాలంలో ప్రజల మీద జాలిచూపాల్సింది పోయి.. ఇటు ప్రభుత్వం ఒకవైపు,  హాస్పిటల్స్ మరోవైపు,  మెడికల్ ఇంకోవైపు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ప్రజల శవాల గుట్టలను సినిమా చూసినట్లు చూస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే మనిషి రక్తంలో ఉండే మంచి అనే కణాలు చనిపోయాయనే చెప్పాలి. ఇప్పుడు కొందరికి కరోనా తీసుకపొవఛు.. ఈ కరోనా పేరుతో సొమ్ముచేసుకున్న వాళ్ళను మరోకి తీసుకుపోవచ్చు. రాజుల పాలు రాళ్ళ పాలు అయినట్లు.. ఎంత సంపాదించినా చివరికి మన వెంట ఏది రాదు.. ఆరు అడుగుల నెల తప్పా..   

రాందేవ్ వర్సెస్ ఐఎంఏ.. ఎవరూ తగ్గట్లే!

ఆధునిక వైద్యంగా పిలవబడే అలోపతి వైధ్యం గురించి యోగా గురు  రాందేవ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రేపిన   దుమారం ఇంకా సర్దు మణగలేదు. రాందేవ్ వ్యాఖ్యలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం , ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అలాగే, ఐఎంఏ ఫిర్యాదు మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్ష వర్ధన్, రాందేవ్ బాబాకు ఘాటైన లేఖ రాసిన విషయం  కూడా, అంతే, అందరికీ తెలిసిందే. అదే విధంగా  ఆ లేఖలో కేంద్ర మంత్రి సూచించిన విధంగా రాందేవ్ బాబా తమ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. ఐఎంఏతో పాటుగా అలోపతి వైద్యులకు క్షమాపణలు కూడా చెప్పారు. అక్కడితో ఆ వివాదానికి చుక్క పెట్టారు.  అయితే రాందేవ్ బాబా, తగ్గినట్టే తగ్గి మళ్ళీ అలోపతికి కొత్త సవాళ్ళు విసిరారు.  వివాదాన్ని మరో మలుపు తిప్పారు. అలోపతి వైద్యంలో ఉన్న లొసుగులను ఎత్తి చూపుతూ, బీపీ, మధుమేహం సహా కొన్ని రోగాలకు  అలోపతిలో శాశ్వత చికిత్స ఎందుకు లేదంటూ ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ)కు 25 ప్రశ్నలు సంధించారు. ఈ మేరకు ట్విటర్‌లో బహిరంగ లేఖ రాశారు.బాబా ప్రశ్నలకు ఐఎంఎ ఎదుకనో సమాధానం అయితే ఇవ్వలేదుగానీ, రాందేవ్’ బాబా క్షమాపణలతో ముగిసింది అనుకున్న పాత సంగతులను పైకితీసి అయన మీద కేసులు పెట్టింది. అంతే కాదు ఓ వెయ్యి కోట్ల రూపాయలకు పరవు నష్టం దావా కూడా వేసింది. సోషల్ మీడియాలో రాందేవ్ బాబాకు వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. నెటిజన్లు ఆయపై  దుమ్మెత్తి పోశారు. ఆయన పై దేశద్రోహం కేసు పెట్టాలని , ఆయన్ని తక్షణమే అరెస్ట్ చేయాలని సోషల్ మీడియా హోరెత్తి పోయింది. అయితే రాందేవ్ బాబా, ఆ విషయాన్ని లైట్’ గా తీసుకున్నారు. ఎవరూ తనను అరెస్ట్ చేయలేరని, పరోక్షంగా, ఆయన్ని అరెస్ట్ హేయాలని కోరుతూ కొందరు ప్రధాని మోదీకో లేఖరాయడాన్ని ఎద్దేవా చేశారు. అదలా ఉంటే’ ఇప్పుడు తాజాగా, ఐఎంఏ కేసులు , పరవు నష్టం దావా విషయంలో ఒకడుగు వెనకు వేసింది. రాందేవ్ బాబా కొవిడ్ 19 వాక్సిన్, ఆధునిక వైద్యం పై తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే కేసులు, పరవు నష్టం దావా వెనక్కి తీసుకుంటామని ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు, డాక్టర్ జే ఏ జయలాల్. పేర్కొన్నారు. అయితే, కొవిడ్ వాక్సిన్, ఆధునిక వైద్యంపై చేసిన వ్యాఖ్యలను, రాందేవ్ బాబా ఇప్పటికే వెనక్కి తీసుకున్నారు. క్షమాపణలు కూడాచెప్పారు.  అయినా ఇప్పుడు మళ్ళీ మరోమారు అవే డిమాండ్స్ చేయడం ఏమిటన్న ప్రశ్నకు, ఐఎంఏ అధ్యక్షుడు, ‘అలాకాదు, ఆయన తమ వ్యాఖ్యలను సంపూర్ణంగా ఉపసంహరించుకోవాలని, క్షమ్పణలు చెప్పాల’ని అంటున్నారు. అయితే, రాందేవ్ బాబా,  ఫ్రెష్’గా సంధించిన 25 ప్రశ్నలకు సమాధానాలు లేకనో లేక చేపప్డం ఇష్టం లేక పోవడం వల్లనో,  ఐఎంఏ, అసలు విషయాన్ని డైవర్ట్ చేస్తోందని రాందేవ్ బాబా ఫాలోయర్స్ అంటున్నారు. అయితే, ఏది ఏమైనా అలోపతి, ఆయుర్వేదం, అలోపతి మరో వైద్య విధానం మధ్య వివాదాలు, వాదోపవాదాలు, విమర్శలు, ప్రతి విమర్శలకు ఇది సమయం కాదు. కానీ, ఎప్పుడో ఒకప్పుడు జాతీయ వైద్య విధానంపై లోతైన చర్చ జరగవలసిన అవసరం అయితే వుంది. అప్పుడు, భారతీయ వైద్య విధానంపై లోతైన చర్చ అవసరం అవుతుందని, అంటున్నారు  భారతీయ వైద్య విధానం పట్ల విశ్వాసం ఉన్న వైద్యులు.

టీఆర్ఎస్ సభలో ఈటల నినాదం.. గులాబీకి ఊహించని షాక్..

కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్.. ప్రతీకారం దిశగా అడుగులు వేస్తున్నారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ గా ముందుకు కదులుతున్నారు. రాజేందర్ కు కౌంటర్ గా అధికార పార్టీ ఎత్తులు వేస్తోంది. హుజురాబాద్ నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ చేశారు కేసీఆర్. మండలానికో ఇంచార్జ్ ను నియమించారు. టీఆర్ఎస్ కేడరంతా పార్టీలోనే ఉండేలా , ఈటల రాజేందర్ కు మద్దతు లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే గులాబీ బాస్ వ్యూహానికి ఈటల నియోజకవర్గంలో చెక్ పడుతున్నట్లు కనిపిస్తోంది. కేసీఆర్ డైరెక్షన్ లోనే సమావేశాలు నిర్వహిస్తున్న టీఆర్ఎస్ ముఖ్య నేతలకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి.  హుజూరాబాద్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ పార్టీ కేడరంతా ఈటల అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విడిపోయిన పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వర్గాలు ఢీ అంటే ఢీ అనే విధంగా వ్యవహరిస్తున్నాయి. ఈ క్రమంలో పోటాపోటీగా సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక వర్గం నుంచి మరో వర్గంలోకి వలసలు కూడా ఎక్కువయ్యాయి. అధికార టీఆర్ఎస్ తన అంగ, అర్థ బలాలను వినియోగించి.. వలసలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. అటు ఈటల వర్గాన్ని, ఇటు బీజేపీ నేతలను టీఆర్‌ఎస్‌లోకి చేర్చుకోవాలని ఆ పార్టీ నేతలు తహతహలాడుతున్నారు.ఈ నేపథ్యంలో వీణవంకలో టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ హాజరయ్యారు. ఈటల  వైపు ఎవరూ వెళ్లొద్దని కార్యకర్తలకు లక్ష్మణ్ పిలుపు నిచ్చారు.  అయితే టీఆర్‌ఎస్ పార్టీ ఒకటి తలిస్తే అక్కడ మరొకటి జరిగింది. ఈ మీటింగ్‌లో ఈటల రాజేందర్‌కు అనుకూలంగా కొందరు కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ‘జై’ ఈటల నినాదాలతో సభ దద్దరిల్లింది. దీంతో ఒక్కసారిగా టీఆర్‌ఎస్ నేతలు ఖంగుతిన్నారు. వెంటనే పోలీసులు కల్పించుకుని ఈటల మద్దతుదారులను సమావేశం నుంచి బయటకు పంపారు. ఈ ఘటనతో నియోజకవర్గంలో ఈటల రాజేందర్ కు బలం ఏమాత్రం తగ్గలేదని తెలుస్తోంది.