కొత్తగా పెళ్లి.. భార్యను గన్ తో కాల్చిన భర్త.. 

పెళ్లి ఒక పవిత్రమైన బంధం, అమ్మాయికి ఎన్ని ఆశలు ఉంటాయి, మానెన్నో కోరికలు ఉంటాయి. ఎన్నో ఊహలతో అత్తవారింటికి అడుగుపెడతారు అమ్మాయిలు. అలాంటి అమ్మాయిలను ఎలా చూసుకోవాలి దిగులుగా ఉన్నపుడు చెల్లిలా, కష్టాల్లో స్నేహితురాలిలా, ఆప్యాయతతో అమ్మగా, దైర్యంలో నాన్న తోడు ఉండాలి ప్రతి భర్త.  ఎందుకంటే.. పెళ్లి అంటే ఇంటి పేరుతో మార్చుకోవడం తో పాటు అమ్మానాన్నలకు దూరంగా ఉండాలి. అలవాట్లు మార్చుకోవాలి. ఎన్నో ఆశలతో అత్తవారింట్లో అడుగుపెడుతుంది. సర్వస్వం భర్త అని అనుకుంటుంది. తాజాగా ప్రతి అమ్మాయిలాగే కలలు కన్నది సారిక .. భర్త ప్రేమ, అత్తమామల ఆదరణ తో జీవితాంతం సంతోషంగా ఉండాలని కలలు కన్నది. కానీ ఆ కలలు కల్లలు గానే మిగిలిపోయాయి. పెళ్లై ముచ్చటగా మూడు నెలలు తిరగకముందే భర్త చేతిలో హతమైంది. వరకట్నం కోసం కట్టుకున్న భార్యను కాల్చి చంపాడో కసాయి భర్త.వివరాలలోకి వెళితే.. అది ముజఫర్ నగర్ జిల్లాలోని బుధానా తహసీల్‌ ఉపవాలి గ్రామానికి చెందిన సారికా (24)కు కుల్దీప్ తో గతేడాది ఫిబ్రవరిలో వివాహం జరిగింది. పెళ్లికి ముందే సారిక తల్లిదండ్రులు అనుకున్న కట్నం ముట్టచెప్పారు. అయితే వారిచ్చిన కట్నం కుల్దీప్ కి నచ్చలేదు. కుల్దీప్ పెళ్లి వద్దంటూ అయిష్టంగానే ఉన్నాడు. అయినా సరే తల్లిదండ్రుల బలవంతంపై సారిక మెడలో తాళికట్టాడు. వివాహం జరిగిన తర్వాత మూడు నెలల వరకు భార్యతో సక్యతగానే ఉన్నాడు  కుల్దీప్.  ఆ తర్వాత అతనిలో ఒక రాక్షసుడు నిద్రలేచాడు. ఆ తదుపరి సారికాను వరకట్నం కోసం వేధించడం మొదలు పెట్టాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకాంగాక పుట్టింటికి వెళ్లి రూ. 50 లక్షలు తీసుకురావాలని సారికను వేధిస్తుండేవాడు. ఈ విషయమై పలుమార్లు భార్యపై దాడి చేసేవాడు, విపరీతంగా కొట్టేవాడు, నిత్యం వేధించే వాడు. నిత్యం భార్య భర్తల మధ్య పొయ్యిలో మంట మండినట్లు ఎప్పుడు గొడవ జరిగేది.   ఇక ఈ నేపథ్యంలోనే మంగళవారం భార్యతో గొడవపడి తన లాకర్ లో ఉన్న తుపాకిని తీసుకొని భార్యపై కాల్పులు జరిపాడు. వరుసగా మూడు రౌండ్లు కాల్చడంతో ఆమె అక్కడిక్కడే మృతిచెందింది. అనంతరం  కుల్దీప్, అతని తండ్రి అక్కడినుండి పరారయ్యారు.   సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగుచూసింది.   

'నో వ్యాక్సినేష‌న్‌- నో శాల‌రీ'.. క‌లెక్ట‌ర్‌ కొత్త రూల్‌..

వ్యాక్సిన్‌పై ఇప్ప‌టికీ అనేక మందిలో అపోహ‌లు ఉన్నాయి. అందుకే, చాలామంది టీకా తీసుకోవ‌డానికి వెన‌క‌డుగు వేస్తున్నారు. అధికారులు ఎంత‌గా అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నా.. కొంద‌రు వ్యాక్సిన్ వేసుకోడానికి ముందుకు రావ‌డం లేదు. సెకండ్ వేవ్‌లో భారీగా కేసులు వ‌స్తుండ‌టం.. త్వ‌ర‌లో మూడో ముప్పు పొంచి ఉంద‌నే వార్త‌ల‌తో ప్ర‌భుత్వం మ‌రింత అప్ర‌మ‌త్త‌మైంది. త్వ‌ర‌గా దేశ ప్ర‌జలంద‌రికీ వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కంప్లీట్ చేసేందుకు స‌న్నాహాలు ముమ్మ‌రం చేసింది. టీకా కొర‌త‌ను తీర్చ‌డానికి ఇప్ప‌టికే విదేశీ వ్యాక్సిన్ల‌కు అనుమ‌తులు స‌ర‌ళం చేశారు. ఈ ఏడాది చివ‌రిక‌ల్లా అంద‌రికీ టీకా ల‌క్ష్యం నెర‌వేరేలా కార్య‌చ‌ర‌ణ రూపొందిస్తున్నారు. క‌రోనాపై పోరాటానికి టీకానే ప్ర‌ధాన ఆయుధం.  ప్ర‌ముఖులు వేసుకుంటేనే ప్ర‌జ‌ల‌కు స్పూర్తి. అధికారులు ముందుగా టీకా తీసుకుంటేనే సామాన్యులకు ధైర్యం. అందుకే, టీకా కార్యక్రమాన్ని ప్రోత్సహించేందుకు ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌ జిల్లా యంత్రాంగం వినూత్న నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులందరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని క‌లెక్ట‌ర్ ఆదేశాలు జారీ చేశారు. టీకాలు తీసుకోకపోతే జీతాలు పొందలేరని జిల్లా ఉన్నతాధికారి హెచ్చ‌రించారు. ‘నో వ్యాక్సినేషన్‌.. నో సాలరీ’ అంటూ ఫిరోజాబాద్‌ జిల్లా కలెక్టర్‌ చంద్ర విజయ్‌ సింగ్‌ మౌఖిక ఆదేశాలు జారీ చేశారని జిల్లా చీఫ్‌ డెవలప్‌మెంట్‌ అధికారి చర్చిత్‌ గౌర్‌ చెప్పారు. ‘ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా కొవిడ్‌ టీకా తీసుకోకపోతే.. సదరు ఉద్యోగిపై సంబంధిత శాఖ చర్యలు తీసుకుంటుంది. మే నెల జీతాన్ని నిలిపివేస్తుంది’ అని వెల్లడించారు. జిల్లా ట్రెజరీ అధికారులకు, ఆయా విభాగాధిపతులకు దీనికి సంబంధించి మార్గదర్శకాలు పంపినట్లు ఆయన తెలిపారు. టీకాలు తీసుకున్న ఉద్యోగుల జాబితా సిద్ధం చేయాలని.. అందరూ వ్యాక్సిన్‌ వేయించుకునేలా చూడాలని ఆదేశించారు.  నిబంధ‌న కాస్త క‌ఠినంగా అనిపించినా.. టీకాలు తీసుకుంటేనే జీతాలు.. అనే కాన్సెప్ట్ బాగుందంటున్నారు. ప్ర‌భుత్వ ఉద్యోగులే వ్యాక్సిన్ నుంచి త‌ప్పించుకోవాల‌ని చూస్తే ఎలా అని.. అందుకే క‌లెక్ట‌ర్ పెట్టిన అన‌ధికార రూల్ అదిరిపోయిందంటూ సోష‌ల్ మీడియాలో ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు నెటిజ‌న్లు. 

కేసీఆర్ జైలుకి.. ఈటల ఢిల్లీకి! బీజేపీ బాంబ్ పేల్చనుందా! 

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం జరగబోతోందా? ఎవరూ ఊహించని పరిణామాలు ఉంటాయా? అంటే అవుననే సమాధానమే వస్తోంది కొన్ని వర్గాల నుంచి. కేసీఆర్ కేబినెట్ నుంచి ఈటల రాజేందర్ బర్తరఫ్ తర్వాత జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు, సీనియర్ నేతలు కూడా తెలంగాణలో ఏదో జరగబోతుందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా రాజేందర్ ఢిల్లీలో బీజేపీ పెద్దలతో చర్చలు జరపడం.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో... సంచలనాలు జరగబోతున్నాయనే సంకేతం వస్తోంది.  బీజేపీ వర్గాలు, ఈటల రాజేందర్ అనుచరుల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం గులాబీ బాస్ టార్గెట్ గానే కీలక ఘటనలు జరగనున్నాయని తెలుస్తోంది. ఏడేండ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం భారీగా అవినీతి చేసిందని విపక్షాలు చాలా కాలంగా ఆరోపిస్తున్నాయి. ఇటీవల బీజేపీ నేతలు కూడా పదేపదే ఇవే ఆరోపణలు చేస్తున్నారు. దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమయంలో బండి సంజయ్.. త్వరలో కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పారు. తర్వాత కొంత వెనక్కి తగ్గారు. తాజాగా మరోసారి కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. సీఎం కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. అయితే ఎప్పుడు జైలుకు పంపించాలనే దానిపై తమ వ్యూహం తమకుందని తెలిపారు. కేసీఆర్ సహారా, ఈఎస్ఐ కేసుల వివరాలు పూర్తిగా తీస్తున్నాం. వారం రోజులుగా సీఎం కేసుల పైనే ఆరా తీస్తున్నాం. ఈ స్కాంలు చూశాకే  కేసీఆర్ ఎంత పెద్ద అవినీతిపరుడో తేలిపోయింది. త్వరలో ఆయనును జైలుకు పంపించడం ఖాయమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున బండి సంజయ్ చేసిన కామెంట్లు కాక రేపుతున్నాయి. పార్టీ పెద్దల నుంచి వచ్చిన సిగ్నల్స్ ఆధారంగానే సంజయ్ అలా మాట్లాడి ఉంటారని భావిస్తున్నారు. బీజేపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్న ఈటల రాజేందర్ .. ఢిల్లీలో బీజేపీ పెద్దలతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా బీజేపీ హైకమాండ్ ముందు ఈటల కొన్ని షరతులు పెట్టారని తెలుస్తోంది. అందులో ప్రధానమైనది కేసీఆర్ కుటుంబ అవినీతేనట. తనపై భూకబ్జా ఆరోపణలు చేసి కేబినెట్ నుంచి తప్పించడంపై రగిలిపోతున్న రాజేందర్.. కేసీఆర్ పైనా అదే స్థాయిలో రివేంజ్ తీసుకోవాలని భావిస్తున్నారట. అందుకే తాను బీజేపీలో చేరాలంటే కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపించాలని కేంద్రాన్ని కోరారట. రాష్ట్రంలో అనేక కుంభకోణాలు జరుగుతున్నాయని, అయినప్పటికీ కేంద్రం ఇప్పటి వరకు ఒక్క విచారణ కూడా చేపట్టకపోవడాన్ని ప్రజలు అనుమానిస్తున్నారని రాజేందర్ చెప్పారట. దానికి బదులిచ్చిన జేపీ నడ్డా.. సమయం వచ్చినప్పుడు కేసీఆర్ కుటుంబ కుంభకోణాలపై విచారణ చేపడతామని హామీ ఇచ్చారని అంటున్నారు. ఈటల రాజేందర్ తో జరిగిన చర్చల్లో జేపీ నడ్డా ఇచ్చిన హామీ మేరకే.. కేసీఆర్ టార్గెట్ గా తెలంగాణ బీజేపీ నేతలు దూకుడు పెంచారని చెబుతున్నారు. తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ ఒకటేనన్న భావన ప్రజల్లో ఉందన్న ప్రచారం సాగుతుండటంతో.. దానికి తెరదించాలని కూడా కాషాయ పెద్దలు సూచించారట. పశ్చిమ బెంగాల్‌ తరహాలో ఉద్యమించాలని బండి సంజయ్ కు జేపీ నడ్డా సూచించారని తెలుస్తోంది. హైకమాండ్ డైరెక్షన్ లో ఇకపై టీఆర్ఎస్ నే తెలంగాణ బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తారని అంటున్నారు.  మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో ఎప్పుడు చేరుతారన్నది తేలడం లేదు. వారం రోజుల్లో బీజేపీలో చేరతారని బండి సంజయ్ చెప్పారు. ఆయన ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేయడానికి న్యాయపరమైన సలహా తీసుకుంటున్నారని తెలిపారు. అయితే ఈటల చేరిక ఆలస్యం కావడానికి మరో కారణం ఉందంటున్నారు. ముందు కేసీఆర్ కుటుంబ అవినీతిని బయటపెట్టి.. అతన్ని జనంలో దోషిగా నిలబెట్టాలని రాజేందర్ ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. కేసీఆర్ అవినీతిపై కేంద్రంతో విచారణ జరిపించాకే.. ఈటల రాజేందర్ బీజేపీలో చేరుతారని అంటున్నారు. రాజేందర్ ముఖ్య అనుచరులు మాత్రం మరో వాదన చేస్తున్నారు. కేసీఆర్ ను జైలుకు పంపించి.. ఈటల రాజేందర్ కేంద్ర కేబినెట్ లో చేరుతారని చెబుతున్నారు.  

కరోనాకు బలైపోయిన వైద్య విద్యార్థిని..

సెకండ్‌ వేవ్‌ పంజా విసురుతోంది. రోజుకు లక్షలాది కేసులు నమోదుతున్నాయి.. మరణాలు వేలల్లో ఉంటున్నాయి. ఈ మహమ్మారిపై పోరాటంలో ఫ్రంట్ లైన్ వారియర్లుగా వైద్య సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారు.. కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్నారు. ఈ కరోనా మహమ్మారి వైద్య సిబ్బందిని సైతం కాటేస్తోంది. ప్రాణం ఇచ్చింది అమ్మనాన్న అయితే, కరోనా టైం లో ప్రాణం పోస్తుంది డాక్టర్స్ అని చెప్పాలి. డాక్టర్ వృత్తి ఏ భూమి మీద చాలా పవిత్రమైంది. అలాంటి పవిత్రమైన వృత్తికి  కొంత మంది అప కీర్తి తెస్తున్నారు.. కానీ కొంత మంది డాక్టర్స్ నీతిగా నిజాయిగా తమ సేవలు అందిస్తున్నారు.. అలా నీతిగా నిజాయితీగా పని చేసిన ఒక లేడీ యువ డాక్టర్ ప్రాణాలు కోల్పోయారు. ఆమె చిన్నపట్టి నుండి డాక్టర్ అవ్వాలని కలలు కన్నది. చివరికి అనుకున్నట్లు గానే డాక్టర్ అయింది. కరోనా టైం లో రోగులకు నిరంతరం ఆమె సేవలు అందించింది. చివరికి అదే వ్యాధికి గురై చనిపోయారు.  అది తూర్పు గోదావరి జిల్లా. సఖినేటిపల్లి మండలం. అంతర్వేదిపాలెం.  చెందిన కందికట్ల రోజి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఆశ్రమంలోనే ఎంబీబీఎస్ పూర్తిచేశారు. ఆ తర్వాత ఎప్పటి నుండి వేసుకున్న తెల్ల కొట్టుకు న్యాయం చేయాలని. అక్కడే కరోనా బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఎంతో మంది కరోనా టైములో ధైర్యాన్ని ఇచ్చారు. సేవలో నిమగ్నమయ్యారు నిస్వార్ధంగా పని చేసింది. మన దేశంలో నాయకులకు కనికరం లేనట్లు గానీ, కరోనా కు కనికరం లేదని మరోసారి నిరూపించింది. ఈ క్రమంలో యువ వైద్యురాలు కరోనా వల్ల అనారోగ్యం  బారినపడ్డారు. అయినా ఆమె జాగ్రత్తలు తీసుకుంటూ విశ్రాంతి తీసుకుంటోంది. ఈ క్రమంలో ఆమె దగ్గరలో ఉన్న సుబ్బమ్మ అనే కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో అడ్మిట్‌ అయ్యారు. ఇంతలో ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించి, కొన్నిరోజులుగా కరోనా తో పోరాడిన ఆమె తాజాగా కన్నుమూశారు. ఆమె కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఎన్నో ఆశలతో వైద్య వృత్తిలోకి అడుగుపెట్టిన యువ వైద్యురాలు మృతి చెందడంతో అంతర్వేది పాలెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తోటి వైద్యురాలు చనిపోవడంతో వైద్య సిబ్బంది కన్నీళ్లు పెట్టుకున్నారు. పెద్ద డాక్టర్ కావాలని కలలు కంది. పేదలకు సేవ చేయాలి అనుకుంది.  

ఎవరి తెలంగాణ ఇది?  తెరాస ఎవరిది?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడేళ్ళు పూర్తయ్యాయి. ఎన్నో ఆశలు, ఆశయాల వేదికగా ఆవిర్భవించిన రాష్ట్రం ఎనిమిదవ  ఆవిర్భావం దినోత్సవం జరుపుకుంటోంది.ఈ సందర్భంగా సంబురాలు జరుగుతున్నాయి. సమస్యలూ ఎదుర్కుంటోంది.  అన్నిటినీ మించి ఇప్పుడు ప్రధానంగా, తెలంగాణ సాధనలో కీలక పాత్రను పోషించిన తెలంగాణ రాష్ట్ర సమితి(తెరాస) ఓనరెవరు? ఈ పార్టీ ఎవరిదీ? ఈ తెలంగాణ రాష్ట్రం హక్కుదారులెవరు. ఇది బడుగుల రాజ్యం , బడుగుల రాష్ట్రం, బడుగుల పార్టీనా, లేక దొరల రాజ్యం, దొరల రాష్ట్రం, దొరల పార్టీనా? ఎవరి తెలంగాణ ఇది ? తెరాస ఎవరిదీ? అనే ప్రశ్న ప్రముఖంగా వినిపిస్తోంది. ఇదే అంశం రాజకీయ వర్గాల్లో,సామాన్యజనంలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా, బడుగు నేత ఈటల రాజేందర్’కు ముఖ్యమంత్రి కేసీఆర్ తమ మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలికిన నేపధ్యంలో, ఈప్రశ్న ప్రముఖంగా వినిపిస్తోంది. ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు, కేసీఆర్, పార్టీలో ఉన్న పాత కాపులు అందరినీ ఏరివేస్తూ వస్తున్న క్రమంలో బడుగు నేత ఈటల రాజేందర్’కు ఇటీవల ఉద్వాసన పలికారు. ఈ నేపధ్యంలో, తెరాస ఎవరిదీ? తెలంగాణ ఎవరిదీ? అన్న ప్రశ్న చర్చకు వస్తోంది. బడుగులం మేము తెరాస ఓనర్లమే ఆనందుకే ఆయనపై వేటుపడింది.   అయితే ఇది ఈరోజు మొదలైన చర్చకాదు, కేసీఆర్ కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత ఎప్పుడు అయితే  రాజకీయ అరంగేట్రం చేశారో, అప్పటినుంచే, బయట పడినా పడక పోయినా, పార్టీ భవిష్యత్ స్వరూప, స్వభావాలపై చర్చ మొదలైంది. 2001 జరిగిన పార్టీ ఆవిర్భావ సభ (సింహగర్జన సభ) వేదిక నుంచి కేసీఆర్ తమ కుటుంబ సభ్యులు ఎవరూ పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోరని, రాజకేయాలోకి రారని చాలా స్పష్టంగా ప్రకటించారు. చివరకు రాష్ట్రం ఏర్పడిన తర్వాత తాను సైతం పదవువులు ఆశించనని, దళితుని ముఖ్యమంత్రిని చేసి తాను కాపలా కుక్కలా ఉంటానని అన్నారు. అయితే ఆతర్వాత ఏమి జరిగిందో వేరే చెప్పనక్కరలేదు. కొడుకు , కూతురు మాత్రమే కాదు , ముందునుంచి ఉన్న మేనల్లుడు, మరో బంధువు, మరో బంధవు ఇటు పార్టీలో అటు ప్రభుత్వం లోనూ కీలకంగా మారారు.  అయితే ఇదేమీ అనూహ్యం కాదు. ఇలా కాకుండా ఇంకోలా జరిగుంటే, అది ఆశ్చర్యపోవలసిన విషయం అవుతుంది. కేసీఆర్ మాత్రమే కాదు,రేపు ఈటల సొంత పార్టీ పెట్టినా, అది కూడా చివరాఖరుకు, మరో కుటుంబ పార్టీగానే రూపాంతరం చెడుతుంది. దేశంలో ఉన్న ఏ ప్రాతీయ పార్టీ చరిత్ర తీసుకున్నా, అన్ని పార్టీలదీ ఒకటే చరిత్ర. తెరాస అందుకు భిన్నం కాదు. అందుకే, జలదృశ్యం మారి పోయింది. ఉద్యమ పార్టీగా అవిర్భవించిన తెరాస రూపాంతరం  చెందింది. రాష్ట్ర ఆవిర్భావంతోనే ఉద్యమ అవతారం చాలించింది. ఫక్తు పదహారణాల రాజకీయ పార్టీగా అవతరించింది. ఈ విషయాన్ని స్వయంగా కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రం ఏర్పడిన అనంతరం ఎన్నికలలో విజయం సాధించిన వెంటనే, కేసీఆర్ పలికిన తొలి పలుకులు, చేసిన తొలి ప్రకటన ఇదే.. “తెరాస ఇక ఎంతమాత్రం ఉద్యమ పార్టీ కాదు, ఫక్తు పదహారణాల రాజకీయ పార్టీ గా పనిచేస్తుంది” అని ప్రకటించారు. నిజంగా కూడా, ఉద్యమ లక్ష్యం  నెరవేరిన తర్వాత, ఉద్యమ పార్టీ అవసరం తీరిపోయిన తర్వాత,  పార్టీ కొత్త అవతారం తీసుకోవడం తప్పుకాదు. అయితే, ఉద్యమ లక్ష్యాలను వదిలేసి, చివరకు, ఫక్తు పదహారణాల , ‘కుటుంబ’ పార్టీగా మారిపోవడం, ఉద్యమానికి ద్రోహం చేయడంతో సమానం.  ఇప్పుడు, ఈటలకు ఉద్వాసన చెప్పడానికి  కూడా ప్రధాన కారణం అదే. కుటుంబ పాలనను కాదనడమే అయన చేసిన నేరం. కేటీఆర్’ను ముఖ్యమంత్రిని చేయాలన్న, కుటుంబ నిర్ణయాన్ని, పత్యక్షంగా పరోక్షంగా ప్రశ్నించడమే ఆయన చేసిన పెద్ద తప్పు. అందుకే ఆయన్ని ఆ విధంగా సాగనంపారు. నిజానికి, ఇలా సాగనంపిన వారిలో ఈటల మొదటి వ్యక్తి కాదు, బహుసా చివరి వ్యక్తికూడా కాకపోవచ్చును.  ఇలా కేసీఆర్ రాజకీయ ‘చతురత’ కు చిత్తయిన వారి జాబితా చాలా పెద్దది. నరేంద్రతో మొదలు పెడితే, కేసీఆర్  కంటే ముందునుంచి తెలంగాణ నిదాదాన్ని వినిపించిన  ఇన్నయ్య, విజయరామ రావు, రవీంద్ర నాయక్ (ఈయనకు కేసీఆర్ ఇచ్చిన బిరుదు, బంజార గాంధీ, అయితే, అదే గాంధీని తెలంగాణ భవన్ మెట్లు ఎక్కనీయ లేదు. చెప్పులతో కొట్టి , చొక్కా చింపి బయటకు గెంటేశారు),నారయణ రెడ్డి, చెరకు  సుధాకర్, సంతోష రెడ్డి, మందాడి సత్యనారాయణ, విజయశాంతి, కొదండ రామ్ ఇలా చెప్పుకుంటూ పోతే, ఇంతకు ముగియనంత జాబితా ఉటుంది.    కాబట్టి, ఇప్పడున్న పార్టీ ఎవరిదో వేరే చెప్పనక్కరలేదు. ఎవరో అన్నట్లుగా  ఇది, ఇతర కుటుంబ పార్టీలలానే, తెరాస కూడా ఫ్యామిలీ లిమిటెడ్ కంపెనీ ... కాదు, వద్దనుకుంటే ప్రజల ప్రత్యాన్మాయం పుట్టుకురావాలి ... ఇప్పటికైతే, తెరాస ఒక ఫ్యామిలీ లిమిటెడ్ కంపెనీ,, తెలంగాణ కంపెనీ ప్రాపర్టీ ..కాదంటే మరో ఉద్యమమే శరణ్యం.

ఆకాశంలో అద్భుతం.. ఇంద్ర‌ధ‌న‌స్సు సోయ‌గం..

ఆకాశంలో అద్భుతం ఆవిష్కృత‌మైంది. సూర్యుని చుట్టూ స‌ప్త‌వ‌ర్ణ శోభితం వెల్లివిరిసింది. నింగిలో ఇంద్ర‌ధ‌న‌స్సు క‌నువిందు చేసింది.  వారెవా.. రెయిన్‌బో.. క‌నులారా చూసి తీరాల్సిందే.. సూర్యుని చుట్టూ రంగుల‌తో స‌ర్కిల్స్ వేసిన‌ట్టు.. ఎంచ‌క్కా ఉంది.. ఈ ఉద‌యం వ‌ర్షం కుర‌వ‌డంతో.. హైదరాబాద్ తో పాటు.. కర్నూలు, కడప ప్రాంతాలలో దాదాపు రెండు గంటలపాటు ఈ ఇంద్ర‌ధ‌న‌స్సు కనిపించింది.. చూప‌రుల‌ను మంత్ర‌ముగ్థుల‌ను చేసింది.. సూర్యుడు ప్రకాశవంతంగా వెలిగిపోతుంటే.. దాని చుట్టూ సప్తవర్ణాలు వలయాకారంలో మెరిసిపోతూ కనిపించాయి..  గాలిలో చిన్నచిన్న నీటి స్ఫటికాలు ఉంటాయి. అవి కాంతిని వ‌క్రీక‌రిస్తాయి. తెల్ల‌ని కాంతిని ఏడు వ‌ర్ణాలుగా విభజించి ప్రతిబింబిస్తాయి. ఇదే.. ఈ వృత్తాకార ఇంద్రధనస్సు.  గత వారం బెంగళూరులోనూ ఇటువంటి దృశ్యం కనిపించింది. తాజాగా, హైద‌రాబాద్‌లో ఈ వృత్తాకార ఇంద్ర‌ధ‌న‌స్సు.. ఆకాశంలో రంగుల సంత‌కం చేసింది. 

మోదీకంటే జ‌గ‌న్ బిజీనా? ప‌రీక్ష‌ల‌పై పంత‌మేల? ప్రాణాల‌తో చెల‌గాట‌మేల‌?

ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై సీఎం జ‌గ‌న్ ఇంకా మొండి వైఖ‌రి వీడ‌టం లేదు. కేంద్రం సీబీఎస్ఈ 12వ త‌ర‌గ‌తి పరీక్ష‌లు ర‌ద్దు చేసింది. ఏపీ ప్ర‌భుత్వం మాత్రం ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కే మొగ్గు చూపుతోంది. పరీక్షల కంటే విద్యార్థుల ఆరోగ్యం, భద్రతే తమకు ముఖ్యమని ప్రధాని మోడీ అంటే.. విద్యార్థుల ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టైనా స‌రే.. ప‌రీక్ష‌లు నిర్వ‌హించి తీరుతామ‌నే మూర్ఖ‌త్వంతో జ‌గ‌న్‌ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అంటున్నారు. 'రాజీ ప‌డ‌లేం.. పరీక్షల కోసం విద్యార్థులను ప్రమాదంలోకి నెట్టలేం' అని మోదీ ప్ర‌క‌టిస్తే.. సీఎం జ‌గ‌న్‌రెడ్డి మాత్రం.. 'రాజీ ప‌డ‌తాం.. పరీక్షల కోసం విద్యార్థులను ప్రమాదంలోకి నెడ‌తాం'.. అన్న‌ట్టు ప‌ట్టుబ‌డుతున్నార‌ని మండిప‌డుతున్నారు.  ప్ర‌ధాని మోదీ. దేశంలోకే బిజీ ప‌ర్స‌న్‌. నిత్యం స‌మీక్ష‌లు, స‌మావేశాలు. క్ష‌ణం తీరిక ఉండ‌దు దేశ ప్ర‌ధానమంత్రికి. అంత బిజీ షెడ్యూల్‌లోనూ విద్యార్థుల భ‌విష్య‌త్తు కోసం ప్ర‌త్యేకంగా స‌మ‌యం కేటాయించారు. సీబీఎస్ఈ 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై అత్యున్న‌త స్థాయి స‌మావేశం నిర్వ‌హించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, ప్రకాశ్ జవదేకర్, పియూష్ గోయల్, స్మృతి ఇరానీ, ధర్మేంద్ర ప్రధాన్, నిర్మలా సీతారామన్‌లతో పాటు పాఠశాల, ఉన్నత విద్య సెక్రటరీ, పలువురు ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. అన్ని రాష్ట్రాలు, ఇతర పక్షాలతో చర్చించిన మీదట.. ప్రభుత్వం ముందున్న అన్ని అవకాశాలను ప‌రిశీలించి 12వ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని యావ‌త్ దేశం స్వాగ‌తించింది. ఒక్క ఏపీ స‌ర్కారు మిన‌హా. ఏపీ విద్యార్థులంతా ప‌రీక్ష‌లు వ‌ద్దంటున్నారు. స్టూడెంట్స్ త‌ల్లిదండ్రులు సైతం ఎగ్జామ్స్ వ‌ద్దంటూ వేడుకుంటున్నారు. ప‌రీక్ష‌లు కావాల్సిందేనంటూ ప‌ట్టుబ‌డుతుంది ఒకే ఒక్క‌రు. కేవ‌లం ఏపీ స‌ర్కారు మాత్ర‌మే ప‌రీక్ష‌ల కోసం ప‌ట్టుబ‌డుతోంది. ప్ర‌ధాని మోదీ అధ్య‌క్ష‌త‌న దేశంలోకే పేరెన్నిక గ‌ల హేమాహేమీల్లాంటి వ్య‌క్తులు అంత‌సేపు స‌మావేశ‌మై.. ప‌రీక్ష‌ల సాధ్యాసాధ్యాల‌పై క్షుణ్ణంగా చ‌ర్చించి మ‌రీ సీబీఎస్ఈ 12వ త‌ర‌గ‌తి ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేశారు. దేశంలోకే అత్యున్న‌త వ్య‌వ‌స్థ తీసుకున్న ఈ నిర్ణ‌యాన్ని అయినా క‌నీసం సీఎం జ‌గ‌న్‌రెడ్డి గౌర‌వించ‌లేరా? ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను ఇప్ప‌టికైనా ర‌ద్దు చేయ‌లేరా? ఎందుకంత మంకుప‌ట్టు? ఎందుక‌లా విద్యార్థుల ప్రాణాల‌తో చెల‌గాటం? ఎందుకంత పంతం? ఓహో.. లోకేశ్‌కు క్రెడిట్ వ‌స్తుంద‌నా..? అవును, ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల ర‌ద్దు కోసం టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ కొంత కాలంగా ప‌ట్టువిడ‌వ‌ని విక్ర‌మార్కుడిలా ప్ర‌భుత్వంపై పోరాడుతూనే ఉన్నారు. దాదాపు ప్ర‌తీరోజూ ప‌రీక్ష‌ల ర‌ద్దు చేయ‌మంటూ స‌ర్కారుకు విజ్ఞ‌ప్తి చేస్తూనే ఉన్నారు. నిత్యం వీడియో కాన్ఫ‌రెన్స్‌లో విద్యార్థులు, త‌ల్లిదండ్రుల‌తో మాట్లాడుతు.. వారి వేద‌న వింటున్నారు. ఆ వేద‌న‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌భుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు. ప‌రీక్ష‌ల ర‌ద్దుపై కేంద్ర హోంశాఖకు కూడా లేఖ రాశారు. అయినా.. లోకేశ్ డిమాండ్‌ను జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాలు ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేయ‌డ‌మో.. ర‌ద్దు చేయ‌డ‌మో చేశాయి. ఒక్క ఏపీ మాత్ర‌మే ఎప్పుడెప్పుడు ఎగ్జామ్స్ నిర్వ‌హిద్దామా అని ఆత్రుత ప‌డుతోంది.  ఏపీలో క‌రోనా క‌ల్లోలం ఇంకా వెంటాడుతూనే ఉంది. ఇప్ప‌టికీ ప్ర‌తీరోజూ వేలల్లో కేసులు. ప‌దుల సంఖ్య‌లో మ‌ర‌ణాలు. వీటికి తోడు బ్లాక్‌ఫంగ‌స్‌. ఇంత‌గా క‌రోనా ప్ర‌మాదం పొంచిఉంది కాబ‌ట్టే.. ప్ర‌భుత్వం సైతం క‌ర్ఫ్యూని పొడిగిస్తూ వ‌స్తోంది. మ‌రి, ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రావ‌డానికే ఆంక్ష‌లు విధించిన స‌ర్కారు.. ల‌క్ష‌లాది మంది విద్యార్థులు హాజ‌ర‌య్యే ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌లను మాత్రం య‌ధావిధిగా నిర్వ‌హించాల‌నుకోవ‌డం ఏవిధంగా క‌రెక్టో వారికే తెలియాలి. క‌నీసం కేంద్ర నిర్ణ‌యం త‌ర్వాత‌నైనా సీఎం జ‌గ‌న్‌రెడ్డిలో మార్పు వ‌స్తే బాగుండు అంటున్నారు విజ్ఞులు. సీబీఎస్ఈ 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ర‌ద్దు చేస్తూ ప్ర‌ధాని మోదీ నిర్ణ‌యం తీసుకున్నాక తాజాగా మ‌రోసారి నారా లోకేశ్ స్పందించారు. ఏపీలో ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌నే వైసీపీ ప్ర‌భుత్వ మొండివైఖ‌రి స‌రికాద‌న్నారు. విద్యార్థులు, త‌ల్లిదండ్రుల అభిప్రాయాలు సేక‌రించి ప్ర‌భుత్వానికి నివేదిక ఇస్తామ‌న్నారు. 'ప‌రీక్ష‌ల‌పై స‌మావేశం నిర్వ‌హ‌ణ‌కు సీఎం జ‌గ‌న్‌కు స‌మ‌యం స‌రిపోవ‌ట్లేదు. ప్ర‌ధాని మోదీకి స‌మ‌యం దొరికింది గానీ.. జ‌గ‌న్‌కు మాత్రం స‌మ‌యం దొర‌క‌ట్లేదు'. అని లోకేశ్ విమ‌ర్శించారు.    

వూహాన్ లో వైరస్.. అమెరికాలో ఫైజర్ ? కరోనా వ్యాప్తి వెనుక వ్యాపార కుట్ర? 

ఏడాదిన్నరగా ప్రపంచాన్ని వణికిస్తోంది కరోనా మహమ్మారి. లక్షలాది మందిని పొట్టన పెట్టుకుంది. కోట్లాది మంది వైరస్ భారీన పడ్డారు. చాలా దేశాలు ఆర్థికంగా చితికిపోయాయి. ధనిక రాష్ట్రాలే కరోనా దెబ్బకు అతలాకుతలం కాగా... పేద దేశాలు మరింత సంక్షోభంలో కూరుకుపోయాయి. చైనాలోని వూహాన్ లో తొలి కేసు నమోదు కాగా... ఆ వైరస్ పుట్టుకపై ఇంకా మిస్టరీ విడటం లేదు. చైనాలోని వూహాన్ ల్యాబ్ లోనే కరోనా వైరస్ ను కృత్రిమంగా తయారు చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. కొందరు సైంటిస్టులు ఇందుకు సంబంధించిన ఆధారాలు బయటపెడుతున్నారు. కరోనా వైరస్ పుట్టుక వెనుక అమెరికా హస్తం ఉందనే ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. గతంలో చైనా కూడా ఇలాంటి ఆరోపణలే చేసింది. యూఎస్ ఆర్మీనే వైరస్ ను చైనాకు తీసుకువచ్చిందని ఆరోపించింది. తాజాగా వ్యూహాన్ ల్యాబ్ తో అమెరికా ఫార్మా కంపెనీల లింకులు బయటకి వస్తున్నాయి. దీంతో కరోనా మహమ్మారి వెనుక అగ్రరాజ్యం హస్తం ఉందనే ఆరోపణలకు బలం చేకూరుతోంది.  కరోనా నియంత్రణకు మొదటగా వచ్చిన వ్యాక్సిన్ అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీ తయారు చేసింది. ఇదే ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. చైనా వూహాన్ లోని జీవ ప్రయోగశాలకు ఫైజర్ ఫార్మా సంస్థకు సంబంధాలున్నట్లు ఆధారాలు బయటకు వచ్చాయి. వుహాన్ లోని జీవ ప్రయోగశాల అమెరికన్ కంపెనీ GSK (గ్లాక్సోస్మిత్‌క్లైన్) చెందినది. ఈ GSK సంస్థే అమెరికాలోని ఫైజర్‌ను కొనుగోలు చేసింది. వుహాన్ లోకి లీక్ అయిన  వైరస్ కోసం వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది ఫైజర్ సంస్థ. ఇదే ఇప్పుడు చర్చగా మారింది.  అంతేకాదు  GSK కి బ్లాక్ రాక్ ఫైనాన్సెస్ నిధులు సమకూరుస్తుంది. ఈ  బ్లాక్ రాక్ ఫైనాన్స్.. ఓపెన్ ఫౌండేషన్ కంపెనీని నిర్వహిస్తుంది. బ్లాక్ రాక్ ఫైనాన్స్ కు చెందిన సోరోస్ ఫౌండేషన్ కు  జర్మన్ సంస్థ వింటర్‌థుర్ లో వాటా ఉంది. ఈ సంస్థ ఎండీ జిన్, వుహాన్‌లో ఒక ప్రయోగశాలను నిర్మించాడు. తర్వాత వూహాన్ లోని ఈ ప్రయోగశాలను జర్మన్ కంపెనీ అల్లియన్స్ కొనుగోలు చేసింది.ఇందులో వాన్గార్డ్ ప్రధాన వాటాదారుడు ఉన్నాడు. అతనే బ్లాక్ రాక్ సంస్థలోనూ కీలక వాటాదారు. ఈ బ్లాక్ రాక్ సంస్థే కేంద్ర బ్యాంకులను నియంత్రిస్తూ.. ప్రపంచ పెట్టుబడి మూలధనంలో మూడింట ఒక వంతును నిర్వహిస్తుంది. ఇక్కడ మరో కీలక అంశం ఉంది. బ్లాక్ రాక్..  బిల్ గేట్స్ యాజమాన్యంలోని మైక్రోసాఫ్ట్ లో  ప్రధాన వాటాదారుగా ఉంది. కరోనా వ్యాక్సిన్ ను తయారు చేసిన ఫైజర్ లోనూ మైక్రోసాఫ్ట్ సంస్థకు వాటా ఉంది.  వుహాన్ లో వెలుగుచూసిన  వైరస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందింది. దీని కట్టడి కోసం మొదటగా ఫైజర్ వ్యాక్సిన్ అందుబాటులో వచ్చింది. ఫైజర్ వ్యాక్సిన్ చాలా తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉంచాలి. టీకాను భద్రపరిచే ఏర్పాట్లను ఫైజర్  అనుబంధ సంస్థ చేస్తుంది. ఫైజర్ యొక్క అనుబంధ సంస్థే వ్యాక్సిన్ రవాణా కోసం ప్రత్యేక ఏర్పాట్లకు బాధ్యత వహిస్తుంది. ఫైజర్ కంపెనీ తన వ్యాక్సిన్‌ను అమెరికాలో 1,100 రూపాయలకు, యూరప్‌లో 1,800 రూపాయలకు విక్రయిస్తుంది. దీని ధర భారత్‌కు రూ .2,700. అంటే భారత్ లో 130 కోట్ల మంది, ఒక్కొక్కరికి రెండు డోసుల లెక్క మొత్తం  7 లక్షల కోట్ల రూపాయల మార్కెట్. ఇదంతా  గమనిస్తే.. కరోనా వైరస్ వెనుక పెద్ద తతంగమే ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  ఇక్కడే భారత రాజకీయ నేతల చర్యలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి.ముఖ్యంగా ఫైజర్ టీకాకు అనుమతి ఇవ్వాలంటూ కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేయడం విస్మయపరుస్తోంది. ఫైజర్ సంస్థ రూల్స్ ప్రకారం టీకా వల్ల ఏ భారతీయ పౌరుడైనా నష్టపోతుంటే.. అతను ఫైజర్‌పై కేసు పెట్టలేడు. అందుకే ఈ టీకా అనుమతికి భారత ప్రభుత్వం నిరాకరించింది. దీన్నే తప్పుపడుతూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఇక్కడే అమెరికా మరో కుట్రకు తెర తీసింది. ఫైజర్ ను గుర్తించలేదంటూ.. భారత వ్యాక్సిన్‌కు అవసరమైన ముడి పదార్థాలను అమెరికా ఆపివేసింది. అయితే భారత్ సర్కార్ ఒత్తిడి, అంతర్జాతీయంగా వచ్చిన విమర్శలతో అమెరికా ప్రెసిడెంట్ జోబిడెన్ దిగొచ్చారు. ముడి పదార్థాల ఎగుమతిపై విధించిన నిషేదంపై వెనక్కి తగ్గారు,  ఇక్కడ మరో కీలక అంశం ఉంది. కరోనా థర్డ్ వేవ్ .. చిన్న పిల్లలకు తీవ్ర ప్రభావం చూపుతుందనే ప్రచారం తెరపైకి వచ్చింది. ఈ ప్రచారం ప్రారంభమైన వారంలోనే చిన్న పిల్లల వ్యాక్సిన్ రెడీగా ఉందంటూ ఫైజర్ ప్రకటన చేసింది. చిన్న పిల్లలపై ఎప్పుడు ప్రయోగాలు చేశారు, పరిశోధనలు ఎప్పుడు ముగిశాయి.. థర్డ్ వేవ్ వస్తుందనే ప్రచారం జరిగిన కొన్ని రోజుల్లోనే ఇదంతా ఎలా ముగిసిందన్నది ప్రశ్నగా మారింది. కరోనాపై వరుసగా జరిగిన, జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే.. అమెరికా ఫార్మా కంపెనీల పెద్ద కుట్ర బయటికి వస్తోందని తెలుస్తోంది. ఒక అజ్ఞాన వైరస్ సృష్టించడం, ప్రజలలో వ్యాప్తి చేయడం, వారిని WHO లాగా మాట్లాడటం, మార్కెట్ టీకాలు వేయడం, భారీ మొత్తంలో డబ్బు సంపాదించడం లక్ష్యంగా అమెరికా కంపెనీలు కుట్రలు చేశాయనే అనుమానాలు బలపడుతున్నాయి.  ఇటీవలే అమెరికా అధ్యక్షుడు జోబిడెన్ మాస్క్ లేకుండా బయటికి వచ్చారు. రెండు టీకాలు వేసుకున్న వారు మాస్కు ధరించాల్సిన అవసరం లేదని ప్రకటించారు. ఇదంతా అమెరికా వ్యాపార కుట్రలో భాగంగానే జరిగిందని భావిస్తున్నారు. ఇంత జరగుతున్నా ఫైజర్ సంస్థ కోసం రాహుల్ భారత ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం.. మేధావిగా గుర్తింపు ఉన్న మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మాట్లాడకపోవడం అన్ని అమెరికా కుట్రలో భాగమేనా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రధాని మోడీ.. డొనాల్డ్ ట్రంప్ కు అనుకూలంగా వ్యవహించారనే ప్రచారం ఉంది. అందుకే మోడీ సర్కార్ పై కోపంతో జోబిడెన్... ఇదంతా చేస్తున్నారని అంటున్నారు. అయితే భారత్ టార్గెట్ గా అమెరికా చేస్తున్న కుట్రలకు.. మనదేశ ప్రతిపక్ష పార్టీనే మద్దతుగా నిలవడం నిజంగా దేశానికి దౌర్భాగ్యమే... 

ప్రైవేట్ హాస్పిటల్లో కరోనా కాసులు మోత..  

కరోనా కొంత మంది ఇంట్లో దుఃఖాన్ని నింపితే.. ఇంకొంత మంది గళ్ళ నిండుతుంది. చనిపోయిన శవాల దగ్గర కూడా చిల్లర ఏరుకుంటున్నారు. మరి తెలంగాణలో కరోనా విలయం తో పాటు పైవేట్ హాస్పిటల్ రోగులపై కొరడా విసుతున్నయి. అందినంత దొంచుకోవడమే పైవేట్ హాస్పిటల్ పనిగా మారింది. మొన్నటికి మొన్న విరించి హాస్పిటల్ లో 20 లక్షలు కడితేనే డెడ్ బాడీ ని ఇస్తామంటే, అతనికి చెల్లి తన అన్నాను చంపారని, ఒక లేడీ డాక్టర్ తన కుటుంబ సభ్యులతో, బంధువులతో హాస్పిటల్ ముంది బైఠాయించారు. ఆ సంఘటన మరిచిపోక ముందే హైదరాబాద్ లో మరో ప్రైవేట్ హాస్పిటల్ బాగోతం బయట పడింది. రోగి కుటుంబ ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోకుండా డబ్బుల కోసం వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే నగరంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల చీకటి కోణాలు వెలుగుచూడటంతో వైద్యారోగ్యశాఖ వాటిపై చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ కొన్ని ఆస్పత్రుల యాజమాన్యాలు ఇంకా బుద్ది మార్చుకోవడం లేదు. కాసుల వేటలో పడి కరోనా రోగుల కుటుంబాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉప్పల్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ బాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది. కరోనా మృతదేహాన్ని అప్పగించాలంటే రూ.5లక్షలు చెల్లించాలని బాధిత కుటుంబాన్ని డిమాండ్ చేశారు. ఈ ఘటన ఉప్పల్‌లోని ఆదిత్య ఆస్పత్రిలో బుధవారం వెలుగుచూసింది. భాస్కర్ అనే యువకుడు ఇటీవల కరోనా బారిన పడటంతో ఆదిత్య ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందడంతో ఆస్పత్రి యాజమాన్యం రూ.5లక్షలు చెల్లిస్తే గానీ డెడ్ బాడీ ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు. దీంతో కుటుంబసభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.  మరో వైపు  బ్లాక్‌ఫంగస్ ఇంజెక్షన్లను బ్లాక్ లో అమ్ముతున్న వ్యక్తులు అరెస్ట్..  మారదు లోకం మారాడు కాలం..దేవుడు  దిగి  రాని.. ఎవ్వరు  ఏమైపోనీ మారదు  లోకం .. మారదు  కాలం .. ఒక వైపు కరోనా తాజగా మరో వైపు బ్లాక్‌ఫంగస్ తో ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే వారి ప్రాణాలతో చెలగాటం ఆగుతున్నారు కొంత మంది దుండగులు  బ్లాక్‌ఫంగస్ ఇంజెక్షన్లను బ్లాక్ లో విక్రయిస్తున్న ముగ్గురిని ఏస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. ఈసీఎల్ చౌరస్తాలో బ్లాక్ ఫంగస్ ఒక్కో ఇంజెక్షను రూ.30 వేలకు అమ్ముతుండగా పోలీసులు పట్టుకున్నారు. పూజారి నవీన్ కుమార్ (25), గ్రందే కిషోర్ (42), దబ్బారెడ్డి వెంకటేష్ (25) బోరబండ, మోతినగర్ ప్రాంతానికి చెందిన వీరు బ్లాక్ లో అమ్ముతుండా ఏస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకుని కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. నిందితుల నుంచి మూడు ఇంజెక్షన్లు, మూడు సెల్ ఫోన్లు, హ్యూండాయ్ ఎక్స్ంట్ కారు, 1,460 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.  

కరోనా కాటుకు.. 594 మంది డాక్టర్స్ బలి..   

ఇందు గలడందులేడని సందేహం కలదు ఎందెందు చూసిన అందందే గలడు అన్నట్లు ప్రపంచం మొత్తం ఎక్కడ చూసిన కరోనా విస్తరించింది. పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు, యువకులు అని తేడాలేకుండా. భారత దేశంలో సమన హక్కు ఉందో లేదో తెలియదు గానీ, కరోనా మాత్రం అందరికి సమాన హక్కు కలిపించి వారి వారి ప్రాణాలను కరోనా కౌగిలో బంధించింది, విలయతాండవం చేసింది. ఒక్క సారిగా ప్రపంచాన్ని మొత్తం కుదిపేసింది. ఇక వివరాల్లోకి వెళితే..  కూడా  కరోనా టైం లో ఫ్రాంట్ లైన్ యుద్ధ వారధులుగా ఉండి, తమ ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా. అనునిత్యం అనితరమైన సేవలు అందించిన వారు డాక్టర్స్ అని చెప్పలి. అయితే కరోనా వైరస్ వైద్యం చేయడం తో పాటు, కరోనా కాటుకు వాలు కూడా బలయ్యారు. కరోనా మామూలు జనాల చెలగాటం ఆడడంతో పాటు, డాక్టర్స్ ని కూడా చెడుగుడు ఆడేసింది. కోవిడ్ సెకండ్ వేవ్ లో దేశంలో దాదాపు వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు డాక్టర్స్.  దేశవ్యాప్తంగా కరోనాతో 594 మంది డాక్టర్లు మృతి చెందినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకటించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మరణించిన వారి వివరాలను తన నివేదికలో ప్రచురించింది. ఢిల్లీలో అత్యధికంగా 108 డాక్టర్లు చనిపోగా... బీహార్‌లో 98 మంది, యూపీలో 67 మంది మరణించారని పేర్కొంది. రాజస్థాన్‌లో 43, ఝార్ఖండ్‌లో 39, ఏపీ 32, తెలంగాణలో 32, తమిళనాడులో 21, మహారాష్ట్రలో 17, మధ్యప్రదేశ్‌లో 16 మంది డాక్టర్లు కోవిడ్‌తో మరణించారు. 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించినట్లు ఐఎంఏ వెల్లడించింది. కోవిడ్‌తో ఎవరైనా చనిపోతే వారి కుటుంబసభ్యులు డాక్టర్లు, వైద్య సిబ్బందిపై దాడులు పాల్పడటంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి హింసాత్మక ఘటనల మధ్య విధులు నిర్వహించేందుకు డాక్టర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని అభిప్రాయపడింది. ఇలాంటి చర్యలను అరికట్టేందుకు పటిష్ట చట్టం రూపొందించాలని కేంద్రాన్ని కోరింది.

పీలేరు జైలుకు జ‌డ్జి రామ‌కృష్ణ.. హైకోర్టు స్పంద‌న‌..

జ‌డ్జి రామ‌కృష్ణ‌ను చిత్తూరు జిల్లా జైలు నుంచి పీలేరు స‌బ్‌ జైలుకు త‌ర‌లించారు. త‌న తండ్రికి ప్రాణ‌హాని ఉందంటూ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎ.కె. గోస్వామికి.. రామ‌కృష్ణ కుమారుడు వంశీకృష్ణ ఫిర్యాదు చేశారు. రామ‌కృష్ణ ఉన్న బ్యార‌క్‌కు వ‌చ్చిన మ‌రో ఖైదీ ఆయ‌న‌ను బెదిరించార‌ని లేఖ‌లో తెలిపారు. బెదిరించిన వ్య‌క్తి ద‌గ్గ‌ర‌ క‌త్తి కూడా ఉంద‌ని అందులో వివ‌రించారు. ఈ లేఖ‌పై స్పందించిన హైకోర్టు చీఫ్ జ‌స్టిస్‌.. రామ‌కృష్ణ‌కు ప్రాణ హాని విష‌య‌మై ప్ర‌భుత్వ న్యాయ‌వాదిని ప్రశ్నించారు. రామ‌కృష్ణ‌ను మ‌రో బ్యార‌క్‌లోకి మార్చామ‌ని చెప్ప‌గా.. పూర్తి వివ‌ర‌ణ స‌మ‌ర్పించాల‌ని హైకోర్టు ఆదేశించింది. విచార‌ణ‌ను గురువారానికి వాయిదా వేసింది. ఆ త‌ర్వాత జడ్జి రామ‌కృష్ణ‌ను పీలేరు స‌బ్‌జైలుకి త‌ర‌లించారు అధికారులు.    ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై ప్రజల్లో ద్వేషం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలపై.. జడ్జి రామకృష్ణను పోలీసులు ఏప్రిల్ నెల‌లో అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన జయరామచంద్రయ్య ఫిర్యాదు చేయగా.. సస్పెండయిన జడ్జి రామకృష్ణపై ఐపీసీ సెక్షన్‌ 124ఏ కింద పీలేరు పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. మెజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించగా.. జడ్జి రామకృష్ణను చిత్తూరు జిల్లా జైలుకు తరలించారు. అయితే, జ‌డ్జి రామ‌కృష్ణ ఉన్న బ్యారెక్‌లోని మ‌రో ఖైదీ బెడ్ కింద క‌త్తి ఉండ‌టం ప్ర‌స్తుత వివాదానికి కార‌ణం. సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడితే చంపుతానని రామకృష్ణను ఆ ఖైదీ బెదిరించాడని.. జడ్జి రామకృష్ణ కుమారుడు వంశీకృష్ణ ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదుతో ఖైదీని మరో బ్యారెక్‌కు తరలించారు. తన తండ్రి ప్రాణాలకు ముప్పు ఉందని జ‌డ్జి రామకృష్ణ కుమారుడు వంశీకృష్ణ ఆందోళన వ్యక్తం చేశాడు. వెంటనే ఆ జైలు నుంచి మార్చాలని ప‌ట్టుబ‌ట్టాడు. జైల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని.. భోజనం చేయడానికి కూడా భయపడుతున్నానని తన తండ్రి త‌న‌తో చెప్పారని అన్నారు.  జైల్లో ఉన్న‌ ఆ వ్యక్తి దగ్గర కత్తి ఎందుకు ఉందంటూ  టీడీపీ అధినేత చంద్ర‌బాబు సైతం ప్ర‌శ్నించారు. జడ్జి రామకృష్ణను హత్య చేసే ఉద్దేశంతోనే అతని బ్యారక్‌లోకి మరో వ్యక్తిని పంపించారని చంద్రబాబు ఆరోపించారు. ఆ అపరిచిత వ్యక్తి వద్ద కత్తి ఎందుకు ఉందో విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. మంత్రి పెద్దిరెడ్డి కక్షపూరితంగా కేసులు పెట్టి జడ్జి రామకృష్ణను జైలులో పెట్టించారని చంద్ర‌బాబు ఆరోపించారు. ‘న్యాయవ్యవస్థ ప్రతిష్ఠకు అండగా నిలిస్తే కేసులు పెడతారా?’ అని చంద్ర‌బాబు నిల‌దీశారు.  జ‌డ్జి రామ‌కృష్ణ కుమారుడు వంశీకృష్ణ హైకోర్టు ప్రధాన న్యాయ‌మూర్తికి లేఖ రాయ‌డంతో.. ఆయ‌న్నుచిత్తూరు జైలు నుంచి పీలేరు స‌బ్ జైలుకు త‌ర‌లించారు అధికారులు. 

భార్యను, ఇతరులతో చెరిపించిన భర్త.. 

యుగాలు ఏవైనా, వేదాలు ఏవైనా, చరిత్ర ఏదైనా, రాజ్యం ఏదైనా, రాజ్యం ఏదైనా, అప్పటి నుండి ఇప్పటి వరకు మహిళలపై దాడులు, అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు, మరిన్ని శిక్షలు విధించిన మహిళలు, మగాళ్ల వాంఛ కత్తులు బలి అవుతూనే ఉన్నారు. తాజాగా ఒక మహిళకు పెళ్లి అయింది. ఆ తర్వాత భర్త తో విడిపోవడం. ఆ తర్వాత మల్లి ఆమెకు బలవంతంగా పెళ్లి చేయడం. మళ్ళీ మొదటి భర్త సీన్ లోకి రావడం తీవ్రంగా కొట్టి పరాయి వ్యక్తులతో అత్యాచారం చేయించాడు. వివరాలు తెలుసుకుందాం.  ఓపెన్ చేస్తే.. అది పశ్చిమ గోదావరి జిల్లా. జంగారెడ్డిగూడెం పట్టణం. ఓ వివాహితపై అత్యాచారం జరిగింది. టి.నరసాపురం మండలం అప్పలరాజుగూడెం గ్రామానికి చెందిన మహిళ (25)కు కొంత కాలం క్రితం వివాహం జరిగింది. అయితే మనస్పర్థల కారణంగా భర్త నుంచి విడాకుల తీసుకుని ఒంటరిగా ఉంటోంది. అయితే ఈ నేపథ్యలోనే ఆ ఒంటరిగా  ఉన్న ఆ మహిళకు  ఏప్రిల్‌ 23న హైదరాబాద్‌ జీడిమెట్లకు చెందిన మల్లికార్జునరావుతో ఆమెకు బలవంతంగా మళ్లీ వివాహం జరిపించారు. ఆ పెళ్లి ఇష్టంలేని పెళ్లి చేశారని, ఆమెకు ఆ వ్యక్తితో ఉండడం ఇష్టం లేదని మే నెల 23న పుట్టింటికి తిరిగి వచ్చేసింది. అయితే 25వ మహిళకు భర్త, అత్త రమణ ఫోన్‌ చేసి తాము జంగారెడ్డిగూడెంలో ఉన్నామని, అక్కడకు రావాలని ఆమెకు సూచించారు. ఆ తర్వాత  ఆమెపై మిస్సింగ్ కేసు పెట్టామని, తమ వద్దకు రాకపోతే ఇంటికి పోలీసులు వస్తారని నమ్మబలికారు. ఆమె అత్తా తన భర్త. ఇక అంటే జంగారెడ్డిగూడెం వచ్చిన ఆ ఒంటరి మహిళను అత్త, భర్తతో పాటు అప్పలరాజుగూడేనికి చెందిన దాసరి రవిచంద్రకుమార్‌, చల్లా నాగసుబ్రహ్మణ్యం తీవ్రంగా కొట్టారు. తర్వాత ఇంటి వద్ద దింపుతామంటూ రవిచంద్రకుమార్‌, నాగసుబ్రహ్మణ్యం ఆమెను బైక్ ఎక్కించుకుని నమ్మపలికాయారు ఇక అంతే మార్గం మధ్యలో ఆమె పై సామూహిక అత్యాచారానికి పాల్పడారు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాుదు చేసింది. తన భర్త ప్రోద్బలంతోనే వారిద్దరు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు ఇద్దరు నిందితులతో పాటు ఆమె భర్త, అత్తపైనా కేసు నమోదు చేశారు.  

చరిత్రలో కలుస్తున్న 135 ఏండ్ల సెంట్రల్ జైలు

హుస్సేన్ సాగర్ పక్కనే ఉన్న సచివాలయం నేలమట్టం అయింది... ఇప్పుడు అదేబాటలో తెలంగాణ రాష్ట్రంలో మరో చరిత్రాత్మక కట్టడం కనుమరుగు కానుంది.135 ఏళ్ల కాలం నాటి వరంగల్ ప్రాంతీయ కారాగారం కథ ముగిసిపోతోంది. సెంట్రల్ జైలు ఉన్న ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని తలపెట్టిన కేసీఆర్ సర్కార్... చకాచకా అడుగులు వేస్తోంది. సర్కార్ ఆదేశాలతో జైలును ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. వరంగల్ సెంట్రల్ జైలు అధికారులు, సిబ్బంది ఖైదీలను తరలించే పని మొదలుపెట్టారు. మంగళవారం తొలి రోజు పటిష్ట భద్రత నడుమ 119 మంది ఖైదీలను హైదరాబాద్ చర్లపల్లికి తరలించారు. అందులో 80 మంది పురుషులు 39 మంది మహిళా ఖైదీలు ఉన్నారు. జైలు నుంచి తరలి వెళ్లే సమయంలో పలువురు మహిళా ఖైదీలు కంటతడి పెట్టారు. జైలులో వెయ్యి మంది ఉండేలా ఏర్పాట్లు ఉండగా, ప్రస్తుతం 27 బ్యార‌క్​లలో 956 మంది జైలులో ఉన్నారు. బ్యార‌క్‌లే కాకుండా అధికారుల‌కు, సిబ్బందికి వ‌స‌తి గృహాలు కూడా లోప‌లే నిర్మించారు. ఖైదీల ఆరోగ్య ప‌రిరక్షణకు 70 ప‌డ‌క‌ల ఆస్పత్రి కూడా ఉంది. వరంగల్ కేంద్ర కారాగారంలోని ఖైదీలను హైదరాబాద్​లోని చర్లపల్లి, చంచల్​గూడాతో పాటు ఖమ్మం, మహబూబాబాద్, నిజామాబాద్, అదిలాబాద్ జైళ్లకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 15 నుంచి 20 రోజుల్లోగా వరంగల్ కేంద్ర కారాగారాన్ని పూర్తిగా తరలిస్తామని జైళ్ల శాఖ డీజీ రాజీవ్​త్రివేది  చెప్పారు. 267 మంది జైలు సిబ్బంది ఉండగా, వారి ఇష్టానుసారంగా అనుకూలమైన చోటుకు ట్రాన్స్​ఫర్​ చేస్తామన్నారు. మామునూరు ప్రాంతంలో అత్యాధునిక హంగులతో అన్ని సౌకర్యాలతో కూడిన కొత్త జైలును రెండేళ్లలోగా నిర్మించనున్నామని తెలిపారు.  వరంగల్ సెంట్రల్ జైలుకు 135 ఏండ్ల చరిత్ర ఉంది మొత్తం 54.5 ఎక‌రాల్లో విస్తరించి ఉన్న సెంట్రల్​ జైలును 1886 లో నిర్మించారు. వ‌రంగ‌ల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ఎదురుగా ఆటోన‌గ‌ర్‌కు వెళ్లే ర‌హ‌దారిని ఆనుకుని, కేఎంసీ కాంపౌండ్ వాల్ వ‌ర‌కు రోడ్డుపొడ‌వునా కేంద్ర కారాగారం విస్తరించి ఉంది. దాదాపు అర కిలోమీట‌ర్ మేర ర‌హ‌దారి ప్రశాంతంగా క‌నిపిస్తూ ఉంటుంది.  సెంట్రల్​ జైలులో అప్పటి స్వాతంత్ర్య సమరయోధులు ఎంతో మంది కాలం గడిపారు. ప్రస్తుత సీనియర్​ రాజకీయ నాయకులు, ఎంతో మంది తెలంగాణ ఉద్యమ నాయకులు కూడా అందులో శిక్ష అనుభవించిన వారు ఉన్నారు. జైలు అధికారులు కేవ‌లం శిక్ష అనుభవించ‌డానికే కాకుండా ఖైదీల్లో ప‌రివ‌ర్తన తీసుకొచ్చే విధంగా స‌మూల మార్పులు తీసుకొచ్చారు. ఇందులో భాగంగా ఖైదీల‌తో వ్యవసాయం, ఇత‌ర ప‌నులు చేయించ‌డ‌మే కాకుండా వారికి ప్రతిఫలం కూడా అందిస్తూ వ‌స్తున్నారు. ఇటీవ‌ల పెట్రోల్‌ బంక్ కూడా ఏర్పాటు చేశారు. శిక్ష అనుభ‌విస్తున్న ఖైదీల‌తోపాటు, విడుద‌లైన వారికి ఈ బంక్‌లో ఉపాధి క‌ల్పిస్తున్నారు. క‌రోనా నేప‌థ్యంలో మాస్కులు, శానిటైజ‌ర్లు, ఫినాయిల్ లాంటివి త‌యారు చేయిస్తూ విక్రయిస్తున్నారు. అంతేకాదు దుప్పట్లు, కార్పెట్లు కూడా ప్రత్యే ఔట్‌లెట్ ఏర్పాటు చేసి ఖైదీల చేత విక్రయిస్తుంటారు.  వ‌రంగ‌ల్ ఉమ్మడి జిల్లాలో వివిధ నేరాల కింద శిక్ష అనుభ‌విస్తున్న ఖైదీల‌ను వారి కుటుంబ స‌భ్యుల‌ను క‌లుసుకోవ‌డానికి ఇక నుంచి ఇబ్బందులు త‌లెత్తే అవ‌కాశం ఉంది. జైలు త‌ర‌లింపు నేప‌థ్యంలో ఖైదీల‌కు ఇత‌ర జిల్లాల్లోని జైళ్లలో ఆవాసం కల్పిస్తారు. ఇక‌మీద‌ట వారిని కుటుంబ సభ్యులు క‌లుసుకోవాలంటే.. ఖమ్మం, మహబూబాబాద్, నిజామాబాద్, అదిలాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప‌రిస్థితి ఎదుర‌వ‌నుంది.

విజయవాడకు విదేశీ విమాన సర్వీసులు 

విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టుకు మళ్లీ కళకళలాడనుంది. విదేశీ విమాన సర్వీసులతో సందడిగా మారనుంది. విజయవాడకు విదేశీ విమాన సర్వీసులు పునఃప్రారంభం కానున్నాయి. మస్కట్, సింగపూర్, కువైట్ తదితర దేశాల నుంచి విమానాలు వచ్చేందుకు అనుమతించారు. సాయంత్రం 6.10 గంటలకు 65 మందితో దుబాయ్ విమానం ఇక్కడికి చేరుకోనుంది. విజయవాడకు ఒక్క ఆదివారం మినహాయించి వారానికి 10 విదేశీ విమాన సర్వీసులు రానున్నాయి. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఏప్రిల్ 3 నుంచి విదేశీ సర్వీసులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. వందే భారత్ మిషన్ లో భాగంగా రానున్న విదేశీ విమాన సర్వీసుల కోసం గన్నవరం ఎయిర్ పోర్టులో ఏర్పాట్లు పూర్తయ్యాయి. వందేభారత్ మిషన్ లో భాగంగా విదేశీ విమాన సర్వీసులు అక్టోబరు వరకు కొనసాగనున్నాయి. 18 దేశాల నుంచి ఇప్పటిదాకా 56,038 మంది ప్రవాసులు ఏపీకి చేరుకున్నారు. వీరిలో కువైట్ నుంచి రాష్ట్రానికి వచ్చినవారే 29,356 మంది ఉన్నారు.

అమరవీరులకు నివాళులు.. నిరాడంబ‌రంగా ఆవిర్భావ‌ వేడుక‌లు..

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నిరాడంబరంగా జ‌రుగుతున్నాయి. గన్‌పార్క్‌ అమరవీరుల స్తూపానికి సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. అనంత‌రం, ప్రగతిభవన్‌లో జాతీయ జెండా ఎగరవేశారు. జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.  తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా పోలీస్‌ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు.   తెలంగాణ ఆవిర్భావ దినోత్సవరం సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఘ‌న‌మైన చ‌రిత్ర‌, విశిష్ట సంస్కృతుల‌కు తెలంగాణ నిల‌య‌మని వెంకయ్యనాయుడు అన్నారు. రాష్ట్రం స‌హ‌జ వ‌న‌రులు, నైపుణ్యం క‌లిగిన మాన‌వ వ‌నరులను క‌లిగి ఉంద‌ని కొనియాడారు. తెలంగాణ అన్ని రంగాల్లో ప్ర‌గ‌తి, స్వ‌యం స‌మృద్ధి సాధించాల‌ని కోరుకుంటున్న‌ట్లు చెప్పారు. దేశంలో త‌న వంతు పాత్రను రాష్ట్రం కొన‌సాగించాల‌ని ఆకాంక్షించారు వెంకయ్యనాయుడు.  రాష్ట్ర ప్ర‌జ‌ల ఆరోగ్యం, శ్రేయ‌స్సు కోసం ప్రార్థిస్తున్న‌ట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. తెలంగాణ ప్ర‌జ‌లు విభిన్న సంస్కృతితో అన్ని రంగాల్లో రాణిస్తున్నార‌న్నారు.  తెలంగాణ ప్రజలకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం కొత్త చ‌రిత్ర‌ను సృష్టిస్తోంద‌న్నారు. ప్ర‌భుత్వం, ప్ర‌జ‌ల కృషితో క‌రోనా నుంచి త్వ‌ర‌లో బ‌య‌ట‌ప‌డ‌తామ‌ని ఆమె ఆశాభావం వ్య‌క్తం చేశారు.   

పెళ్ళికి వెళ్లారు.. రూ. వేయి ఫైన్ కట్టారు.. 

2020 సంవత్సరం కంటే ముందు. పెళ్లి అంటే తెలుగు సినిమా డైరెక్టర్ కృష్ణ వంశీ సినిమాల ఉండేది. పెళ్లి కూతురు వైపు బంధువులు, పెళ్లి కొడుకు వైపు బంధువులు, ఊర్లో వాళ్ళు, ఫ్రెండ్స్, ఒక వైపు బాజాభజంత్రీలు, మరోవైపు సన్నాయి సప్పుళ్ళు, ఇంకో వైపు బాహ్మణుడి వేద మంత్రాలు. అబ్బో ఆడో పెద్ద పండగల ఉండేది. ఎప్పుడైతే కరోనా ప్రపంచం నట్టింట విలయతాండవం చేయడం మొదలు పెట్టిందో. అప్పటి నుండి పెళ్లి కి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదంటే నమ్మాల్సిందే. కరోనా సమయంలో ప్రభుత్వాలు అన్నింటికీ నిబంధనలు విధించినట్లే పెళ్లి వేడుకల మీద కూడా విధించింది. కొంత మంది ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళు అమ్మానాన్నల పర్మిషన్ తీసుకోకుండా పెళ్లి చేసుకునే ఈ రోజుల్లో ఇంట్లో శుభకార్యం చేసుకోవాలంటే ప్రభుత్వం అనుమతి తీసుకుని నిబంధనలు కచ్చితంగా పాటించి తీరాల్సిందే. ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సిందే. ఇటీవల చాలామంది ఆ నిబంధనలు అతిక్రమించి చిక్కుల్లో పడిన ఘటనలు చూస్తేనే ఉన్నారు. కొద్దిరోజుల క్రితం శ్రీకాకుళంలో ఓ టీచర్‌ పెళ్లి వేడుకకు ఏకంగా 250 మంది హాజరు కావడంతో పోలీసులు పెళ్లి కొడుక్కి రూ.2లక్షల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే జిల్లాలో మరో వివాహ వేడుకకు హాజరైన వారికి దిమ్మతిరిగే షాకిచ్చారు పోలీసులు. వీడి పెళ్లి మా సావుకు వచ్చింది అనే సామెత వినేవుంటారు. కానీ తాజాగా ఒక వ్యక్తి వివాహ వేడుక 250 మంది  అతిధులకు ఫైన్ పడింది.   అది శ్రీకాకుళం జిల్లా. భామిని మండలం. తాలాడ గ్రామం. ఆ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తన వివాహ వేడుక రిసెప్షన్‌ జరిపించుకున్నాడు. తన బంధువులకి, మిత్రులకి, ఊర్లో వాళ్ళకి, తన శ్రేయోభిలాషులకు  అందరికి  శుభలేఖలు ఇచ్చారు. కరోనా సమయంలో ప్రభుత్వ నిభందనలు పెట్టిన విషయం తెలిసిందే.. ఆ నిబంధలను కాలరాస్తూ, పరిమితికి మించి అతిథులు హాజరయ్యారు. హాజరు అయ్యారు పోనీ.. ఆ హాజరు అయినా వాళ్ళు కనీసం మాస్కులు ధరించకుండా గుంపులు గుంపులుగా జాతరలో తిరిగినట్లు  తిరుగుతూ ఫంక్షన్లో సందడి చేశారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. పరిమితికి మించి ఎక్కువ మంది అతిథులు హాజరుకావడం, ఒక్కరు కూడా మాస్కలు ధరించకపోవడాన్ని నిర్ధారించుకున్న పోలీసులు అందరినీ మందలించారు. నిబంధనలు అతిక్రమించిన నేరానికి పెళ్లి కొడుకు, పెళ్లికూతురు సహా ఫంక్షన్ హాజరైన ప్రతి ఒక్కరికి రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించారు. నిబంధనలు అతిక్రమిస్తే పెళ్లి వారి కుటుంబానికి జరిమానా విధించాలి గానీ.. అతిథులకు కూడా ఫైన్ వేస్తారా? అంటూ కొందరు పోలీసులకు వాగ్వాదానికి దిగారు. నిబంధనలు అతిక్రమించిన ప్రతి ఒక్కరూ జరిమానా కట్టాల్సిందేనని తేల్చి చెప్పిన పోలీసులు 30 మంది దగ్గర రూ.వెయ్యి చొప్పున జరిమానా వసూలు చేసుకుని స్టేషన్‌కు వెళ్లిపోయారు.

ఏడేండ్ల తెలంగాణ ఎట్లుంది! చెదిరిన స్వప్నమేనా ?

ఎన్నో ఉద్యమాలు, ఎన్నో ఏళ్ల పోరాటం, ఇంకా ఎందరో అమాయకుల ప్రాణత్యాగం ... ఈ అన్నిటి ప్రతిఫలం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం. ఏడేళ్ళ క్రితం, 2014 జూన్  2 వ తేదీన 29 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం  ఏర్పడింది. ఎన్నో ఆశలు, ఆశయాలతో ఆవిర్భవించిన రాష్ట్రం ఈ ఏడేళ్ళలో, లక్ష్యసాధనలో ఎంత దూరం పయనించింది. ప్రజల ఆశలు,ఆకాంక్షలు ఏ మేరకు నెరవేరాయి?  ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడం అంత సులభం కాదు. అయితే ఒకటి మాత్రం నిజం, ఏ ‘ప్రత్యేక’ లక్ష్యాల కోసం అయితే, యువకులు బలిదానాలు చేశారో, ఆ లక్ష్యాలు నెరవేరలేదు. ముఖ్యంగా, నీళ్లు, నిధులు , నియామకాలు అనే మూడు లక్ష్యాల కోసం తెలంగాణ ఉద్యమం సాగింది. సాగునీటి రంగంలో కొంత ప్రగతి కనిపిస్తున్నా, ప్రాజెక్టుల నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి చోటు  చేసుకుందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇక నిధులు విషయంలో అయితే పంకాలు జరిగిపోయాయి కాబట్టి, ఆంధ్ర పాలకులు అన్యాయం చేసే అవకాశమే లేదు. అందుకే ఆ అన్యాయం ఏదో తెలంగాణ పాలకులే చేస్తున్నారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకు పోయింది.  అందరికంటే ఎక్కువగా అన్యాయమై పోయింది, విద్యార్ధులు నిరుద్యోగ యువత. తెలంగాణ కోసం నిజంగా పరితపించింది, ప్రాణత్యాగాలు చేసింది విద్యార్ధులు, నిరుద్యోగ యువత. సుమారు 1600 మందికి పైగా తెలంగాణ బిడ్డలు ప్రాణత్యాగం చేస్తే  అందులో అత్యధిక మంది విద్యార్ధులు , నిరుద్యోగ యువత. యువత ప్రనత్యగాల వల్లనే, తెలంగాణ సాధ్యమైంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అప్పటి ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ యువత బలిదానాలకు చలించే, తల్లులుగా స్పందించారు. తెలంగాణ సాకారం కావడానికే, ఆ ఇద్దరు ప్రధాన కారణం అయితే, ఆ ఇద్దరూ సానుకూలంగా స్పందించేలా చేసింది మాత్రం, తెలంగాణ యువకుల బలిదానాలు. అయితే దురదృష్టం ఏమంటే ఆ బలిదానాలకు తెలంగాణ రాష్ట్రంలో విలువ లేకుండా పోయింది. ఉద్యమ పార్టీగా అధికారంలోకి వచ్చిన తెరాస, నీళ్లు, నిదుల విషయంలో ఎలా ఉన్నా, నియామకాల విషయంలో మాత్రం ఉద్యమ స్పూర్తిని చంపేసింది. నియంకాలే కాదు, ఉన్న ఉద్యోగాలకు కూడా భరోసా లేకుండా పోయింది. ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయసు పెంచడంతో నిరుద్యోగుల ఆశలు ఆవిరై పోయాయి.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలే ఉండవని ఉద్యమ నేతగా ఇచ్చిన హామీని, ముఖ్యమంత్రి కేసీఆర్ మరిచి పోయారు. ఆయన మరిచి పోయింది ఆ ఒక్కటే కాదు, 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నిరుద్యోగులు అందరికీ నిరుద్యోగ భ్రుతి ఇస్తామని ఇచ్చిన హామీనీ ఆయన మరిచి పోయారు. రాష్ట్రంలో సుమారు 25నుంచి 30 లక్షల మంది వరకు నిరుద్యోగులు ఉంటారని అంచనా ... ఈ అందరికీ  నెలకు నెలకు రూ. 3016 వంతున నిరుద్యోగ భ్రుతి ఇస్తామని తెరాస ప్రకటించి, రెండేళ్ళు పూర్తయింది. అయినా ఇంతవరకు  విధి విధానాలు కూడా ఖరారు కాలేదు.  చివరకు కోర్టు మొట్టికాయలు వేస్తేనే కానీ ,తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకం జరగలేదంటే, నిరుద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ది వుందో అర్థం చేసుకోవచ్చని నిరుద్యోగ యువత ఆవేదన,  ఆగ్రహం వ్యకంచేస్తున్నారు. ఇక ప్రతి పక్షాలు  తెలంగాణలో కేసీఆర్ కుటుంబ సభ్యులకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని ఎద్దేవా చేస్తున్నాయి.  ఆర్థిక రంగం విషయానికి వస్తే, మిగులు ఆదాయంతో ప్రస్థానం ప్రారంభించిన తెలంగాణ రాష్ట్రం, ఇప్పడు అప్పుల ఉబిలో కూరుకు పోయింది. రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం అంతకంతకూ పెరిగిపోతోంది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పుల మొత్తం ఇంచుమించు రూ. 4 లక్షల కోట్లకు చేరుకుంది. వీటికి కట్టే కిస్తీలు, మిత్తీలకే  ప్రస్తుత 2021-22 బడ్జెట్లో రూ. 40 వేల కోట్లు కేటాయించారు. ఎఫ్ఆర్బీఎం చట్ట పరిధిలో ప్రభుత్వం చేసిన అప్పులు 2022 మార్చి నాటికి రూ. 2,86,804 కోట్లకు చేరనుంది. ఈ విషయాన్ని రాష్ట్ర బడ్జెట్లోనే ప్రభుత్వం అధికారికంగా ప్రస్తావించింది. దీనికి తోడు ఇరిగేషన్  ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, ఇతర కార్పొరేషన్ల పేరిట  రూ.1,05,006 కోట్ల రుణాలకు గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చింది. వీటిని బడ్జెట్లో చూపించకుండా దాటవేసింది. కార్పొరేషన్ల పేరిట చేసిన ఈ అప్పులన్నీ చివరకు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుంది. అందుకే వీటిని కూడా కలిపితే.. రాష్ట్రం చేసిన అప్పుల అసలు లెక్క  బయటపడుతోంది. తెలంగాణపై ఉన్న అప్పు మొత్తం రూ. 3,91,810 కోట్లు అని లెక్కతేలుతోంది.  నిజానికి  తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడేళ్ళు అయినా ... ఏరంగంలో చూసినా  తెలంగాణ ప్రజల ఉద్యమ ఆకాంక్షలు  నెరవేర లేదు. ఉచిత విద్యుత్, 24 గంటల విద్యుత్ సరఫరా, రైతు రుఅమాఫీ, రైతు భరోసా, కళ్యాణ లక్ష్మీ, వంటి సంక్షేమ పథకాలే కానీ, ప్రజల జీవితాలలో శాశ్వత వెలుగులు నింపే సంకల్పమే కనిపించడం లేదు. ఇక బంగారు తెలంగాణ అయితే ఎప్పటికీ అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది.

ఈటల చేరిక లాభమా? నష్టమా? బీజేపీకి బూమరాంగ్? 

కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన సీనియర్ నేత ఈటల రాజేందర్ కమలం గూటికి చేరుతున్నారు. కొత్త పార్టీ ఏర్పాటు ప్రతిపాదనను పక్కనపెట్టి.. కాంగ్రెస్ ఆహ్వనాన్ని కాదనుకుని, ఉద్యమకారుల వినతులను విడిచిపెట్టి .. కాషాయ కండువా కప్పుకుంటున్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. తెలంగాణలో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు కొలిక్కి వచ్చినా.. బీజేపీలో ఈటల చేరిక ఎవరికి లాభమనే చర్చలు ఇప్పుడు జోరుగా సాగుతున్నాయి. రాజేందర్ రాకతో తమకు మరింత బలం వచ్చిందని, టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని, వచ్చే ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరడం ఖాయమని తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు చెబుతున్నారు. అయితే ఈటల చేరికపై బీజేపీలోనే భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈటల చేరికతో తమకువచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువని కొందరు కమలనాధులు అంచనా వేస్తున్నారు. రాజకీయ వర్గాల్లోనూ ఇదేరకమైన చర్చ జరుగుతోంది.  గత ఏడాదిన్నర కాలంగా తెలంగాణ బీజేపీలోకి భారీగా వలసలు జరిగాయి. కాంగ్రెస్, టీడీపీలకు చెందిన చాలా మంది నేతలు కమలం గూటికి చేరారు. అందులో మాజీ మంత్రుులు, మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. టీడీపీలో కీలక పాత్ర పోషించిన మోత్కుపల్లి నర్సింహులు, గరికపాటి మోహన్ రావు, పెద్దిరెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి బీజేపీలో చేరారు. గరికపాటితో పాటు ఉమ్మడి పది జిల్లాలకు సంబంధించిన టీడీపీ ముఖ్య నేతలు, నియోజకవర్గ ఇంచార్జ్ లు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. వీళ్లలో చాలా మంది ఇప్పటికే బీజేపీలో తమకు సరైన ప్రాతినిద్యం లేదనే అసంతృప్తిలో ఉన్నారని తెలుస్తోంది. పార్టీలో చేరిన కొత్తలో గరికపాటి యాక్టివ్ గా ఉన్నారు. తర్వాత ఎందుకో ఆయన సైలెంట్ అయ్యారు. బీజేపీ నుంచి తనకు అనుకున్నంతగా సపోర్ట్ లేకపోవడం వల్లే ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదని అంటున్నారు. వరంగల్ కు చెందిన గరికపాటి.. ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఎక్కడా కనిపించలేదు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన జితేందర్ రెడ్డి... వరంగల్ బీజేపీ వ్యవహారాలు చూశారు.  మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన బీసీ నేత ఎర్రశేఖర్ ... బీజేపీలో ఇమడలేక ఇప్పటికే రాజీనామా కూడా చేశారు. నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక సమయంలో స్థానికంగా పట్టున్న అంజయ్య యాదవ్ కూడా గులాబీ గూటికి చేరారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన నేతలు ఎలా ఉన్నా.. పాత టీడీపీ నేతలు మాత్రం బీజేపీలో నిర్లక్ష్యానికి గురవుతున్నామనే భావనలో ఉన్నారంటున్నారు. ఇప్పుడు ఈటల రాజేందర్ ను తీసుకొచ్చి కీలక స్థానంలో నిలబెడితే వారంతా మరింత అసంతృప్తి లోనయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.  ఈటల రాజేందర్ బీజేపీలో చేరబోతున్నట్టు వస్తోన్న వార్తలపై మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్ బిజెపిలోకి వస్తే మరో ఉప్పెన తప్పదని ఆయన హెచ్చరించారు. తనను సంప్రదించకుండా ఈటెలను ఎట్లా బీజేపీ లోకి తీసుకుంటారు.. ఢిల్లీ నుండి స్పెషల్ ఫ్లయిట్ లో వచ్చిన నాయకులకు తనకు చెప్పడానికి ఏంటి బాధ.? అంటూ పెద్దిరెడ్డి బీజేపీ పెద్దల్ని ప్రశ్నించారు. ఈటలను బీజేపీలోకి తీసుకోవడం కరెక్ట్ కాదని పెద్దిరెడ్డి కుండబద్దలు కొట్టారు.ఈటల వ్యవహారం సామాజిక అంశం కాదు.. ఆర్థికపరమైన గొడవ అని   మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు కామెంట్ చేశారు. ఆయన మంత్రి పదవి ప్రజల కొసమా.. కంపెనీల కోసమా అని ప్రశ్నించారు. దళితుల గురించి ఈటల ఏనాడైనా మాట్లాడారా.. ఆయనది ఆత్మ గౌరవం కాదు, ఆత్మ ద్రోహం అన్నారు నర్సింహులు. అంతేకాదు తనకు వందల ఎకరాలు, రూ.వేల కోట్లు సంపాదించుకునే అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్‌ ఫొటో పెట్టుకుని ఈటల రాజేందర్‌ జీవితాంతం పూజ చేయాలన్నారు మోత్కుపల్లి నర్సింహులు. బీసీ నాయకుడికి మంత్రిపదవి ఇచ్చినందుకు కేసీఆర్‌కు ఈటల కృతజ్ఞతతో ఉండాలన్నారు.  పెద్దిరెడ్డి ,మోత్కుపల్లి నర్సింహులు బాటలోనే టీడీపీ నుంచి బీజేపీలో చేరిన నేతలంతా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. ఇదే సమయంలో రాజేందర్ తో పాటు బీజేపీ దూకుడుకు చెక్ పెట్టాలని చూస్తున్న గులాబీ బాస్.. తనదైన శైలిలో పావులు కదుపుతున్నారని చెబుతున్నారు. గతంలో తనకున్న పరిచయాలతో పాత టీడీపీ నేతలకు ఆయన గాలం వేస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే పెద్దిరెడ్డి.. ముఖ్యమంత్రికి టచ్ లోకి వచ్చారంటున్నారు. ఈటల సొంత నియోజకవర్గం హుజురాబాద్ మున్సిపాలిటీలోని ఇద్దరు బీజేపీ కౌన్సిలర్లు మంత్రి గంగుల సమక్షంలో గులాబీ జెండా పట్టుకున్నారు. పాలమూరుకు చెందిన ఎర్ర శేఖర్ కూడా త్వరలో గులాబీ గూటికి చేరుతారని అంటున్నారు. మోత్కుపల్లి కూడా కేసీఆర్ తో మాట్లాడుతున్నారని సమాచారం. వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నేత రేవూరి ప్రకాశ్ రెడ్డి కోసం గతంలో కేసీఆర్ ప్రయత్నించారట. అప్పుడు ఆయన బీజేపీలో చేరారు. తాజా పరిస్థితులతో రేవూరిని టీఆర్ఎస్ లో చేర్చుకునేందుకు కేసీఆరే రంగంలోకి దిగారంటున్నారు. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన నేతలందరిని కారు ఎక్కించేలా ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.  ఈటల రాజేందర్ పై దేవుడి భూములు, దళితుల భూములు తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. వీటిపైనే విచారణ జరుగుతోంది. ముఖ్యంగా దేవరయాంజల్ లోని సీతారామ ఆలయానికి సంబంధించిన భూముల అంశం బీజేపీకి ఇబ్బందిగా మారుతోంది. రాముడి పార్టీ అని చెప్పుకునే బీజేపీ.. రామాలయ భూముల ఆక్రమించారనే ఆరోపణలు వస్తే స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. రామాలయ భూముల పరిరక్షణ కోసం పోరాడకుండా.. కబ్జా చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతను పార్టీలో చేర్చుకోవడం సరికాదనే అభిప్రాయాన్ని కొందరు కమలం నేతలు వ్యక్తం చేస్తున్నారట. ఈటల విషయంలో సైలెంట్ గా ఉండే.. ముందు ముందు సమస్యలు వస్తాయని కొందరు ఆందోళన చెందుతున్నారట. రామాలయ భూముల గురించి మాట్లాడకుండా హిందుత్వ నినాదం చేసినా ఫలితం ఉండదనే అభిప్రాయం కొందరి నుంచి వస్తోంది. మొత్తంగా ఈటల రాజేందర్ చేరికతో తమకు లాభం కంటే నష్టమేననే చర్చ బీజేపీ నేతల్లో తీవ్ర స్థాయిలోనే జరుగుతుందంటున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలంతా వెళ్లిపోతే ఈటల వచ్చినా ప్రయోజనం ఏంటని ప్రశ్నిస్తున్నారు. రాజకీయ వర్గాల్లోనూ ఈటల రాజేందర్ చేరికతో బీజేపీకి బూమ్ రాంగ్ తప్పదనే అభిప్రాయమే ఎక్కువగా వ్యక్తమవుతోంది.