మీ అన్నకు నువ్వే కాపురం చేయి.. అంటూ వదిన..
posted on Jun 7, 2021 @ 3:21PM
ముపై గుండ్లు ఒక్క చోట ఉండొచ్చు కానీ.. మూడు శిగలు ఒక చోట ఉంలేవు అంటారు మన పెద్దలు.. అలాగే ఒక ఆడదానికి శత్రువు మరో ఆడదే అంటారు.. అది వంద శాతం నిజమనే అంటారు ఈ వార్త చదివితే.. అన్న సంపాదన అంత చెల్లెలికి సరిపోతుందనుకున్న వదిన, తన తల్లి గోరింటాకు సినిమాలో కంటే ఎక్కువే వేధించారు.. ఇంతకీ ఏం జరిగిందో మీరే చూడండి..
జగిత్యాల జిల్లా. గొర్రెపల్లి గ్రామం. ఆ యువతీ పేరు శ్రీదేవి. ఆమె వయసు 21 సంవత్సరాలు. పదేళ్ల కిందటే ఆ యువతి తల్లిదండ్రులు పదేళ్ల క్రితమే అనారోగ్యంతో మృతిచెందారు. అయితే అప్పటి నుంచి అన్న అరవింద్తో కలిసి శ్రీదేవి ఉండేది.. ఆ తర్వాత అన్న అరవింద్2కు అప్పటి నుంచి చెల్లి బాధ్యతలను అరవిందే చూసుకుంటున్నాడు. అయితే ఎనిమిదేళ్ల క్రితం జగిత్యాల జిల్లా గొర్రెపల్లి గ్రామానికి చెందిన తన మేనత్త జాదవ్ సెవంతబాయి కూతురు మంజులను అరవింద్ పెళ్లి చేసుకున్నాడు. వదిన రాగానే అన్న చెల్లెలా బంధానికి అడ్డుకట్ట వేసింది.. మెల్లిగా శ్రీదేవికి వదిన వేధింపులు మొదలయ్యాయి.
ఆర్థిక ఇబ్బందుల కారణంగా అరవింద్ ఉపాధి కోసం 2018లో దుబాయ్ వెళ్లాడు. శ్రీదేవి డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుంది. భార్యా పిల్లలకు తోడుకోసం అరవింద్ తన మేనత్తను కూడా హర్కపూర్లో తన ఇంట్లో ఉండమని చెప్పాడు. ఈ క్రమంలో అరవింద్ చెల్లెలు శ్రీదేవిని తమతోపాటు ఉంచుకుని పోషించడం అరవింద్ భార్య మంజుల, ఆమె తల్లి సెవంతబాయికి నచ్చేదికాదు. శ్రీదేవి పెళ్లి విషయంలో వారిద్దరూ దుబాయ్లో ఉన్న అరవింద్తో తరచూ ఫోన్లో మాట్లాడేవాళ్ళు, అప్పుడప్పుడు గొడవ పడుతుండేవారు. ఒక రకంగా టార్చెర్ చేసేవాళ్లు. ఆమె పెళ్లికి కట్నం ఇవ్వడంతో పాటు వివాహ ఖర్చులకు లక్షల రూపాయలు కావాల్సి వస్తుందని ఘర్షణ పడేవారు.
శ్రీదేవిని ఏమన్నా ఎవరు ఏమనేవాళ్లు లేరు.. ఈ క్రమంలో శ్రీదేవికి ఇటు వదిన నుండి అటు వదిన తల్లి నుండి వేధింపులు ఎక్కువయ్యాయి. అంతే కాదు తనకు పెళ్ళిచేయడం తమ వల్లకాదని.. అందుకే ఎవరితోనైనా లేచిపోవాలని శ్రీదేవిని మానసింకంగా హింసించేవారు. నిత్యం వేధించేవారు. ఏడాది నుండి ఈ వేధింపులు ఎక్కువ కావడంతో వాళ్ళ వేధింపులు భరించలేక శ్రీదేవి ఈ విషయాన్ని తన అన్నకు చెప్పింది. దుబాయ్లో కరోనా లాక్డౌన్తో ఇబ్బందులు పడిన అరవింద్ ఈ ఏడాది జనవరిలో స్వగ్రామానికి వచ్చాడు. తన చెల్లిని వేధించిన విషయమై భార్య, మేనత్తతో గొడవ పడ్డాడు. దీంతో భార్య మంజుల, మేనత్త సెవంతబాయి అదే నెలలో తమ ఊరికి వెళ్లిపోయారు. అయినా తరచుగా శ్రీదేవికి ఫోన్ చేస్తూ ఆమె కారణంగానే తాము విడిపోయామని వేధించేవారు. శనివారం రాత్రి కూడా శ్రీదేవికి మంజుల ఫోన్ చేసింది.
ఒక ఆడదానికి మరో ఆడదే శత్రువు అన్నట్లు.. శ్రీదేవి కారణంగా తాను పుట్టింటికి వచ్చాను. ఐదు నెలలైనా మీ అన్న కాపురానికి తీసుకెళ్లడం లేదని శ్రీదేవిని తిట్టిపోసింది. ఇక మీ అన్నతో నువ్వే సంసారం చేయ్ అంటూ వదిన సూటిపోటి మాటలు అన్నది. దీంతో మేనత్త కూడా తీవ్రంగా దూషించడంతో మనస్తాపం చెందిన శ్రీదేవి క్షణికావేశంలో ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. బంధువులు ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతిచెందింది. అరవింద్ ఫిర్యాదు మేరకు మంజుల, సెవంతబాయిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.