అభివృద్ధి అంటే ఇది.. జగనన్నను చూసి తెలుసుకోండి! 

అభివృద్ధి అంటే ఏంటో తెలుసుకోండి. అభివృద్ధి అంటే మౌలిక సదుపాయాలు కల్పించడం అని అనుకోకండి. అభివృద్ధి అంటే ఏవేవో కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెట్టడం కాదు ..సరిగా తెలుసుకోండి. అభివృద్ధి అంటే రాష్ట్రానికి ఆదాయం పెంచేలా చర్యలు తీసుకోవడం కాదు.. అర్ధం చేసుకోండి. ఇప్పటివరకు పాపం చాలామంది నేతలు, ప్రముఖులు, ఆర్ధిక నిపుణులు రకరకాలుగా అనుకుంటున్నారు. వారందరూ ఒకసారి ఏపీ వస్తే అసలు అభివృద్ధి అంటే ఏంటో తెలిసిపోతుంది. వారు రాసిన పుస్తకాలను తగలబెట్టేసి కొత్త పుస్తకాలు రాయొచ్చు. పాపం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది విని అసలు అభివృద్ధి అంటే ఏంటో తెలుసుకోండి.  బాస్..రైతు దినోత్సవంలో మాట్లాడుతూ గిట్టనివాళ్లు ఏదో చెబుతూ ఉంటారు.. ఒక్కసారి గ్రామాలకు వెళ్లి చూడండి (పట్టణాల సంగతి అడక్కండే) అభివృద్ధి ఏంటో కనపడుతుంది. నాలుగడుగులు వేస్తే ప్రభుత్వ పాఠశాల కనపడుతుంది.. అక్కడ ప్రైవేటు పాఠశాల కన్నాబెటర్ గా ఇంగ్లీషు మీడియంలో పాఠాలు చెబుతుంటారు.. ఇంకో నాలుగడుగులు వేస్తే విలేజ్ క్లినిక్ ఉంటుంది..అక్కడ వైద్య సిబ్బంది అన్ని రకాల మందులతో ఉంటారు. అన్నిటికి రిపేర్లుచేసి కొత్త రంగులు కూడా వేశాం. ఇలా చెప్పుకుంటూ పోయారు జగన్మోహన్ రెడ్డి. అదీ అభివృద్ధి అంటూ ముగించారు. అంటే మనం అర్ధం చేసుకోవలసింది ఏంటంటే పాత భవనాలకు రిపేర్లు చేసి రంగులు వేస్తే చాలు.. అభివృద్ధి జరిగినట్లే. అంగన్ వాడీ సెంటర్లను చంద్రబాబునాయుడు టైములోనే డెవలప్ చేశారు. వాటికి ప్రీ ప్రైమరీ స్కూల్స్ అని పేరు మారిస్తే చాలు అభివృద్ధి జరిగినట్లే.. అలాగే టించర్, టీటీ వేయడానికి నర్సు ఉంటే చాలు అభివృద్ధి జరిగినట్లే.. అదీ సంగతి. స్కూళ్లు, ఆస్పత్రులు రిపేర్లు చేయడంలో తప్పు లేదు.. వాటిని మెరుగుపర్చడంలో తప్పే లేదు.. కాని అదే అభివృద్ధి అని చెప్పుకోవడమే మరీ ఎబ్బెట్టుగా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి అంత గర్వంగా వాటి గురించి చెప్పుకుని అదే అభివృద్ధి అని చెప్పుకోవడమే ఇప్పుడు హాస్యాస్పదంగా మారింది. ఇప్పటివరకు అందరూ పాపం ఇన్ ఫ్రా అభివృద్ధి చేస్తే పెట్టుబడులు వస్తాయని..తద్వారా ఉద్యోగాలు వస్తాయని..దాని వల్ల ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుందని.. దాని వల్ల మార్కెట్ పెరుగుతుందని.. దాని వల్ల ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని.. దాని వల్ల ప్రజలకు మెరుగైనసేవలు అందించొచ్చని .. అదే అభివృద్ధి అనుకునేవారు.ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ చక్రాన్ని విరగ్గొట్టేశారు. ప్రజలకు బ్యాంకుల్లో డబ్బులు వేస్తే చాలు.. రిపేర్లు చేసి రంగులు వేస్తే చాలు.. అప్పులు చేసి డబ్బులు తెస్తే చాలు... ఇవే అభివృద్ధి అనుకోవాలని చెబుతున్నారు.. కాదని చెప్పేవాళ్లు గిట్టనివాళ్లు అంటున్నారు.  ఇంకా నయం... తెలుగుదేశం మీద, చంద్రబాబునాయుడిపైన పగతో అమరావతిని నాశనం చేయడం.. మూడు రాజధానుల పేరుతో కుంపటి పెట్టి అన్ని చోట్ల అనిశ్చితి వచ్చేలా చేయటం..రియల్ఎస్టేట్ వ్యాపారాన్ని పడేయటం.. ఇసుక పాలసీ పేరుతో భవన నిర్మాణ రంగాన్ని కూల్చేయటం.. రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టుల పనులు లేటు చేయడం ..ఇవన్నీ కూడా అభివృద్ధిలో భాగమే అని చెప్పలేదు. పాపం మర్చిపోయారేమో ఈ విషయాలు చెప్పడం.. మనం మాత్రం బాస్ దగ్గర కొత్త ఆర్ధిక పాఠాలు నేర్చేసుకోవడం బెటర్..లేదంటే మనకు ఏదో ఒక పేరు పెట్టేస్తారు సార్.

రోడ్డు కావాలన్న ప్రజలు.. రైతుబంధు, పెన్షన్ డబ్బులు ఇవ్వాలన్న ఎమ్మెల్యే.. 

అది తెలంగాణ రాష్ట్రము. వికారాబాద్ నియోజకవర్గం. అతను ఒక  టీఆరెఎస్ పార్టీ ఎంఎల్ఏ. అభివృద్ధి చేయమంటే.. అది చేయడానికి ప్రజలను చందాలు అడిగాడు. ప్రజలు ఆయన అన్న మాటలు విని ఖంగుతిన్నారు. రోడ్డు వేయడం కోసం ప్రజలు డబ్బులు ఇవ్వడం బాగానే ఉంది.. మరి అంతదానికి ప్రభుత్వం ఎందుకు..? ఆ మాట పక్కన పెడితే నియోజకవర్గ అభివృద్ధి కోసం వచ్చే నిధులు ఏమైతున్నాయి.. ఆ నిధులు కదా ఖర్చు చేయాల్సింది.. అంటే ఆ నిధులు నాయకులూ మింగి రోడ్డు వేయమని ప్రజలు ప్రశ్నిస్తే మీరే డబ్బులు ఇవ్వండి అడగడం ఒక టీఆర్ఎస్ పార్టీ నాయకులకే చెల్లింది.. నియోజకవర్గం అభివృద్ధి చేస్తారని ఎంఎల్ఏ ని గెలిపించుకుంటే.. ఈయన గవర్నమెంట్ నుండి ప్రజలకు కాస్తో కూస్తో పధకాల నుండి వచ్చిన డబ్బులను  లూటీ చేయాలనీ చూశాడు.. అంటే కాదు సిగ్గులేకుండా కొంతమంది జనం మీద పది గణేష్ చందా అడిగినట్లు.. ఈ సార్ కూడా  నేరుగా ప్రజలను ఈ విషయంగా అడిగాడు ఇక అంతే ఈ విషయం విన్న ప్రజలు టైడ్ యార్డ్ లా ఒక్కసారిగా హవాకు అయ్యారు. ఇంతకీ టీఆర్ఎస్ ఎంఎల్ఏ చేసిన ఆ ఘనకార్యం ఏంటో తెలుసుకుందాం..?  వికారాబాద్ జిల్లా పూడురు మండలంలోని పలు గ్రామాల్లో పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పర్యటించారు. ప్రజా సమస్యలపై ఆరా తీశారు. రాజకీయ నాయకులు అంటే తెగిపడిన చుక్కలాగా ఎప్పుడో ఎన్నికలప్పుడు వస్తే.. మళ్ళీ వాళ్ళ మొహం చూడాలి అంటే రాసి పెట్టి ఉండాలి.. అయితే మొత్తానికి ఈ పర్యటన అతని మనసులు దాగిన మాటను తెలిపింది.. పర్యటనలో భాగంగా పూడురు అనుబంధ గ్రామమైన మైసమ్మ గడ్డ తాండా కు వెళ్ళాడు. తండా ప్రజలు ఎన్నికలప్పుడు రోడ్డు వేయిస్తామని హామీ ఇచ్చారని.. వర్షం పడితే గ్రామానికి రాకపోకలు ఇబ్బంది అవుతోందని, తమ గ్రామానికి రోడ్డు వేయించాలని ఎమ్మెల్యేను నిలదీశారు . అయితే, అంత పెద్ద మొత్తం నిధులు వచ్చే పరిస్థితి లేదని ఎమ్మెల్యే చెప్పారు. అయినా శాంతించని కొందరు రోడ్డు కావాలంటూ గట్టిగా అడిగారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఎమ్మెల్యే మహేష్ రెడ్డి.. మీ ఊరికి రోడ్డు కావాలంటే రైతు బంధు, పెన్షన్లు, కళ్యాణ లక్ష్మీ వదులుకోండి.. వెంటనే ఊరికి రోడ్డు వేయిస్తానని బదులిచ్చారు. మొత్తానికి ఆయన కన్ను ప్రజలు వచ్చే పెన్షన్ మీద.. రైతు బందు.. కల్యాణ లక్మి మీద పడింది.. అంతే అది కూడా ప్రజలకు అందడం ఆమనకు ఇష్టంలేదని తేలింది..  అంతే! ఈ సమాధానంతో గ్రామస్తులకు పట్టపగలే చుక్కలు కనబడ్డాయి. పాపం ఏమీ అర్థం కాని కొద్దిమంది ఆశ్చర్యంతో కూడిన కంగారు వల్ల వచ్చిన అయోమయం లుక్స్‌ ఇస్తే, ఎమ్మెల్యే మహేష్ రెడ్డి.. ప్రభుత్వం వద్ద పైసలు లేవు.. మరి ఏం చేయాలే. తర్వాత వేయిస్తాలే.. అంటూ తన సమాధానాన్ని సరిచేసే యత్నం చేసారు.  

రూ.41 వేల కోట్ల తప్పుడు లెక్కలు.. అంతా జగన్మాయ! 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడానికి కూడా అప్పు తేవాల్సిన పరిస్థితి. ప్రతి నెలా పెన్షనర్లకు ఎప్పుడు తమ డబ్బులు వస్తాయో తెలియని గందరగోళ పరిస్థితి. అప్పుల్లో దేశంలోనే మూడో స్థానంలో ఉంది ఏపీ. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసి కేంద్ర ఆర్థికశాఖ వర్గాలే అవాక్కవుతున్నాయంటే ఎంతగా దివాళ తీసిందో అర్థం చేసుకోవచ్చు. ఏపీ ఇంతగా అప్పుల్లో కూరుకుపోవడానికి జగన్ రెడ్డి సర్కార్ అస్తవ్యస్థ, అనాలోచిత విధానాలే కారణమనే ఆరోపణలు వస్తుండగా.. తాజాగా మరో సంచలన విషయం వెలుగు చూసింది.  ఏకంగా 41 వేల కోట్ల రూపాయలకు లెక్కలే లేవని తెలుస్తోంది.  రాష్ట్రప్రభుత్వం జమ ఖర్చుల నిర్వహణపై సంచలన ఆరోపణలు చేశారు పిఏసి చైర్మన్ పయ్యావుల కేశవ్. జమఖర్చుల నిర్వహణపై గవర్నర్ కలిసి పిర్యాదు చేశారు.  నలభైవేల కోట్లకు సరియైన లెక్కలు లేవని పయ్యావుల ఆరోపించారు. ట్రెజరీ కోడ్ ప్రకారం ప్రభుత్వం లోని ఏ శాఖ అయినా ట్రెజరీ నుండి డబ్బు తీసుకునేటప్పుడు అది ఎందుకు తీసుకుంటున్నామో, దేనికి ఖర్చు పెడుతున్నామో బిల్లులో పేర్కొనాలి. కానీ అలాంటిదేమీ చూపించకుండా జగన్ రెడ్డి ప్రభుత్వంలోని వివిధ శాఖలు ప్రత్యేక బిల్లు అంటూ 10,806 బిల్లుల కింద  రూ.41,043 కోట్లను విత్ డ్రా చేశాయి. ఈ బాగోతాన్ని పక్కా ఆధారాలతో పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ బయటపెట్టారు.  ఏడాది క్రితమే ఇది తప్పని ప్రభుత్వాన్ని హెచ్చరించారు పయ్యావుల కేశవ్. అయినా ప్రభుత్వ తీరు మారకపోవడంతో... రాష్ట్రప్రభుత్వ ఆర్ధిక నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని, ఆర్ధిక అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసి ఫిర్యాదు చేసారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 161, 151/2 లను ప్రస్తావిస్తూ... రాష్ట్రప్రభుత్వ కార్యనిర్వాహక అధిపతిగా రాష్ట్ర ఆర్థిక, జమ ఖర్చుల నిర్వహణపై దృష్టి పెట్టాలని... గత రెండు ఆర్ధిక సంవత్సరాలకు సంబందించిన లెక్కలపై కాగ్ తో స్పెషల్ ఆడిట్ జరిపించాలని గవర్నర్ ను కోరారు పయ్యావుల కేశవ్. ఇదే విషయమై రాష్ట్ర ప్రభుత్వానికి కాగ్ రాసిన లేఖలను వినతి పత్రానికి జత చేసారు.   ఇప్పటికే జగన్ రెడ్డిపై అక్రమాస్తుల కేసులున్నాయి. గతంలో షెల్ కంపెనీలు, సూట్ కేసు కంపెనీలు పెట్టి, దొంగలెక్కలు చూపించి ఆస్తులను పెంచుకున్నారనే అభియోగాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దివాళా దిశగా ఉన్నా .. జగన్ & కో లకు చెందిన కంపెనీలు ఆర్ధిక లాభాలతో దూసుకుపోతున్నాయి.  సెబీ ఇచ్చిన సమాచారం మేరకు వైసీపీ ఎంపీ  అయోధ్యరామిరెడ్డికి చెందిన రాంకీ సంస్థల పై ఐటీ దర్యాప్తు జరుగుతోంది. ఇదే సమయంలో ప్రభుత్వ పద్దుల్లో రూ.41 వేల కోట్ల తప్పుడు లెక్కలు ఉండటం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. ఆ రూ.41 వేల కోట్లు ఏమైనట్టు అనే చర్చ జనాల్లో సాగుతోంది. తప్పుడు లెక్కలతో పక్కాగా దర్యాప్తు చేస్తే అసలు దొంగలెవరో తేలుతుందని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.   

రెడ్డి ఎంటర్‌ప్రైజెస్ వసూళ్ల కథ ఏంటీ? రఘురామ మరో సంచలనం..

ఆంధ్రప్రదేశ్ వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్మోరెడ్డిపై పోరాటం చేస్తున్న నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు మరో సంచలనానికి తెర తీశారు. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి అక్రమాలు, వైసీపీ నేతలు దురాగాతాలపై లేఖలు రాస్తూ జగన్ రెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న రఘురామ.. తాజాగా మరో బాంబా పేల్చారు. రెడ్డి ఎంటర్‌ప్రైజెస్ వసూళ్లను ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. వసూళ్ల పర్వానికి సంబంధించి అంశాలను ప్రస్తావిస్తూ.. ఆ కథేంటో తేల్చాలని డిమాండ్ చేశారు.  ఏపీబెవరేజెస్ సంస్థ  సిబ్బంది, రెడ్డి ఎంటర్‌ప్రైజెస్ వసూళ్లను ప్రస్తావిస్తూ ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డికి ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. రాష్ట్రానికి 25 వేల కోట్ల ఆదాయాన్నిచ్చే ఏపీబెవరేజెస్ సంస్థ ఉద్యోగులు..వారి సమస్యలను తమ దృష్టికి తేవాలని ప్రయత్నించారన్నారు. తమరు అవకాశం ఇవ్వకపోవడంతో సమస్యలను తన దృష్టికి తెచ్చినట్లు చెప్పారు. 6 నెలల క్రితం రెడ్డి ఎంటర్‌ప్రైజెస్ ఏజెన్సీ రాష్ట్రంలోని మద్యం షాపుల నుంచి..5 కోట్ల రూపాయలు వసూలు చేసేందుకు పకడ్బందీ ప్లాన్ వేసిందన్నారు. 10,258 మంది ఉద్యోగులకు నెల జీతం చెల్లించాలంటూ మద్యం షాపుల నుంచి ఈ మొత్తం డిమాండ్ చేశారని తెలిపారు ఎంపీ రఘురామ రాజు.  రెడ్డి ఎంటర్ ప్రైజెస్ మరో 10.25 కోట్ల వసూలుకు మరో ప్లాన్ వేసిందని...ఈ సంస్థ వివరాలన్నీ తమరు పరిశీలించాలని ముఖ్యమంత్రి కోరారు నర్సాపురం ఎంపీ. ఈ సంఘటనలపై డిప్యూటీ సీఎంకు ఫిర్యాదు చేసినా విచారణ జరగలేదన్నారు. ఈ ఘటనలపై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రఘురామ లేఖలో పేర్కొన్నారు. ఇటీవలే ఎక్సైజ్ శాఖకు సంబంధించి పలు ప్రాంతాల్లో అవినీతి జరిగినట్లు బయటకి వచ్చింది. ప్రభుత్వ ఖజానాకు జమ చేయాల్సిన డబ్బులను కొందరు సిబ్బందే అక్రమంగా కాజేశారనే తేలింది. ఈ ఘటనలపై దర్యాప్తు కూడా జరుగుతోంది. ఆ నేపథ్యంలో తాజాగా ఎంపీ రఘురామ రాజు చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. అసలు ఏపీబెవరేజెస్ సంస్థలో ఏం జరుగుతోంది, రెడ్డి ఎంటర్‌ప్రైజెస్ వసూళ్లపై సమగ్ర విచారణ జరపాలనే డిమాండ్ జనాల నుంచి వస్తోంది.  రెడ్డి ఎంటర్‌ప్రైజెస్ వసూళ్లపై ముఖ్యమంత్రికి ఎంపీ రఘురామ రాజు రాసిన లేఖ ఇది.. ముఖ్యమంత్రి గారూ, తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు? ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోయీలెవ్వరు? – శ్రీ శ్రీ రాష్ట్రానికి 25 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఇచ్చే అతి ముఖ్యమైన సంస్థ ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇంత ముఖ్యమైన కార్పొరేషన్ కు చెందిన సేల్స్ పర్సన్లు, సూపర్ వైజర్లు తాము ఎదుర్కొంటున్న సమస్యలను మీ దృష్టికి తీసుకురావాలని శతవిధాలా ప్రయత్నించారు. అయితే మీరు వారికి అవకాశం ఇవ్వలేదు. దాంతో ఏఐటియుసి అనుబంధ సంస్థ అయిన ఏపి బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ వారు తమ సమస్యలను నా దృష్టికి తీసుకువచ్చారు. ఈ లేఖ ద్వారా వారి సమస్యలను మీ దృష్టికి తీసుకురావాలని భావిస్తున్నాను. ఆరు నెలల కిందట రెడ్డి ఎంటర్ ప్రైజెస్ అనే అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ రాష్ట్రంలోని మద్యం షాపుల నుంచి 5 కోట్ల రూపాయలు వసూలు చేసేందుకు పకడ్బంది ప్లాన్ వేసింది. తమకు ఉన్న 10,258 మంది ఉద్యోగులకు నెల రోజుల జీతం చెల్లించాలని చెబుతూ రాష్ట్రంలోని మద్యం షాపుల వారి నుంచి ఈ మొత్తం డిమాండ్ చేశారు. మద్యం షాపులకు తదుపరి లైసెన్సులు రెన్యూవల్ కావాలీ అంటే ఈ మొత్తం తమకు చెల్లించాల్సిందేనని వారు వత్తిడి తెచ్చారు. దాంతో కొందరు  ఫిర్యాదు చేయగా సంబంధిత మంత్రి, ఉపముఖ్యమంత్రి ఈ సంఘటనపై విచారణకు ఆదేశించారు. తమ ప్రభుత్వం అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో సహించదని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. రెండు రోజుల్లో దర్యాప్తు నివేదిక తనకు అందాలని ఆదేశాలిచ్చారు.  అదే సమయంలో రెడ్డి ఎంటర్ ప్రైజెస్ మరో 10.25 కోట్ల రూపాయలు వసూలు చేసేందుకు మరో పకడ్బంది ప్లాన్ వేసింది. తన వద్ద పని చేస్తున్న సిబ్బందికి గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు, వారిని ఈఎస్ఐ జాబితాలో చేర్చేందుకు ఒక్కొక్కరూ 10 వేల రూపాయలు తమకు చెల్లించాలని రెడ్డి ఎంటర్ ప్రైజెస్ కోరింది. ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ మద్యం షాపుల్లో పని చేస్తున్న 10,258 మంది సూపర్ వైజర్ల నుంచి, సేల్స్ మెన్ ల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు రెడ్డి ఎంటర్ ప్రైజెస్ స్కెచ్ వేసింది. ఇలా చేయని ఉద్యోగులకు ఈ నెల జీతాలు రావని బెదిరించింది. చట్టపరంగా చెల్లించాల్సిన ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ లను సకాలంలో చెల్లించకుండా ఈ సంస్థ, న్యాయపరమైన చిక్కుల్లో పడుతున్న విషయాన్ని గుర్తించడం లేదు. ఆరు నెలల కిందట ఫిర్యాదు ఇచ్చినప్పుడు వసూళ్ల కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేసిన ఈ సంస్థ, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మళ్లీ కలెక్షన్లు ప్రారంభిస్తున్నది. సికింద్రాబాద్ లోని దక్షిణ మధ్య రైల్వేలో సీనియర్ డిసిఎం గా పని చేస్తున్న ఐఆర్ టి ఎస్ అధికారి అయిన డి.వాసుదేవరెడ్డిని డెప్యుటేషన్ పై తీసుకువచ్చి మీరు ఏపి బెవరేజెస్ కార్పొరేషన్ కు మేనేజింగ్ డైరెక్టర్ గా నియమించారు. ఇలా చట్ట విరుద్ధ కలెక్షన్లు జరుగుతున్నా కూడా ఆయన నోరు మెదపడం లేదు… ఎవరిపైనా చర్యలు తీసుకోవడం లేదు.సూటిగా చెప్పాలంటే ఈ రెడ్డి ఎంటర్ ప్రైజెస్ కు ఔట్ సోర్సింగ్ కార్యకలాపాలలో ఎలాంటి గత అనుభవం లేదు. ఈ మద్యం షాపు ఉద్యోగులతో కూడా ఆ సంస్థకు ఎలాంటి సంబంధం కూడా లేదు. ఈ మద్యం షాపు ఉద్యోగులను జిల్లా కలెక్టర్లు నేరుగా బెవరేజెస్ కార్పొరేషన్ కోసం నియమించారు. ఇలా జిల్లా కలెక్టర్లు బెవరేజెస్ కార్పొరేషన్ కోసం నియమించిన ఉద్యోగులను తమ ఉద్యోగులుగా ఈ సంస్థ తన వెబ్ సైట్ లో చూపిస్తున్నది. అంతే కాదు ఈ సంస్థ ఈ ఒక్క కాంట్రాక్టునే చూపిస్తున్నది తప్ప గతంలో తాను నిర్వహించిన కాంట్రాక్టులను చెప్పడం లేదు. అంటే ఈ సంస్థకు ఎలాంటి పూర్వ అనుభవం కూడా లేదన్నమాట. బెవరేజెస్ కార్పొరేషన్ కోసం నియమితులైన సిబ్బందికి జీతభత్యాలు చెల్లించాలన్న విషయం ముందుకు రాగానే ఈ రెడ్డి ఎంటర్ ప్రైజెస్ తెరపైకి వచ్చింది. దాదాపు 10 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పుకుంటున్న ఇంత ‘‘పెద్ద’’ సంస్థ గురించి ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు కూడా ఒక్క సారి ఈ వివరాలన్నీ పరిశీలించండి. దాదాపుగా రెండు సంవత్సరాలు కావస్తున్నా ఈ ఉద్యోగులకు గుర్తింపు కార్డులు ఇవ్వలేదు. అంతే కాదు వీరికి ఈఎస్ఐ కూడా అమలు చేయడం లేదు. ఈ ఆందోళనలతో బాటు వారిని మరో భయం కూడా వెంటాడుతున్నది. ఒక్కో ఉద్యోగి మూడు లక్షల రూపాయల సెక్యూరిటీ ఇవ్వాలని, అందుకోసం ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను పూచీకత్తుగా తీసుకురావాలని కోరుతున్నారు. వారు ఇప్పటికే APBCL కు రెండు లక్షల రూపాయల పూచీకత్తులను సమర్పించి ఉన్నారు.సాక్షాత్తూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినా ఈ సంఘటనలపై ఎలాంటి విచారణ జరగలేదు. APBCL అధికారుల నుంచి సైతం ఎలాంటి స్పందన లేదు. దాంతో సుమారు 10 వేల మందికి పైగా ఉన్న సిబ్బంది, వారిపై ఆధారపడి ఉన్న మరో 50 వేల మంది కుటుంబ సభ్యులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నందున, వారిని దృష్టిలో ఉంచుకుని తక్షణమే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను ఈ లేఖ ద్వారా మిమ్మల్ని కోరుతున్నాను. చట్టబద్ధంగా ఇవ్వాల్సిన ఈఎస్ఐ సౌకర్యాన్ని, ప్రావిడెంట్ ఫండ్ ను కూడా ఈ సంస్థ అమలు చేసే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలని నేను మిమ్మల్ని వినమ్రంగా కోరుతున్నాను. కార్మిక చట్టాల ప్రకారం వారికి పని గంటలను కూడా నిర్దేశిస్తే మరింత మంచిది. ఇప్పుడు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ. ఈ సమయంలో ఈ సిబ్బందిని ఈఎస్ఐ ఆసుపత్రుల నెట్ వర్క్ పరిధిలోకి తీసుకువచ్చి వారికి వైద్య సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. దురదృష్టవశాత్తూ కరోనాకు గురి అయి ఏ ఉద్యోగి అయినా మరణిస్తే కారుణ్య నియామకాల కింద మరణించిన ఉద్యోగి కుటుంబంలో ఒకరికి ఆ ఉద్యోగం ఇప్పించాలని కూడా నేను కోరుతున్నాను. భవదీయుడు కె.రఘురామకృష్ణంరాజు

త‌ల్లి, చెల్లినే బెట‌ర్‌!.. వాళ్ల‌ను చూసి నేర్చుకో జ‌గ‌న్...

వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి. ఏపీ ముఖ్య‌మంత్రి. అంత‌టివాడిని ప‌ట్టుకొని గ‌జ‌దొంగ అని తిడుతున్నారు. జ‌గ‌న్‌నే కాదు ఆయ‌న తండ్రి దివంగ‌త మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డిని సైతం నీళ్ల‌దొంగ అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌ను రాక్ష‌సులు అంటున్నారు. తెలంగాణ మంత్రులు అంతేసి మాట‌లంటున్నా.. నోరు మూసుకొని ప‌డుతున్నారు జ‌గ‌న్‌. ఎందుకు? స‌హ‌న‌మా? సామ‌ర‌స్య‌మా? చేత‌గానిత‌న‌మా?  వైఎస్ ష‌ర్మిల‌. జ‌గ‌న్ సోద‌రి. అన్న‌లానే తానూ సీఎం అవుదామ‌ని.. తాను తెలంగాణ కోడ‌లినంటూ అక్క‌డ జెండా ఎత్తారు. అజెండా కూడా ప్ర‌క‌టించారు. జ‌గ‌న్‌లా భ‌య‌ప‌డ‌కుండా కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్ర‌జాస‌మ‌స్య‌ల‌తో పాటు త‌న తండ్రి వైఎస్సార్‌పై చేసిన వ్యాఖ్య‌ల‌పైనా ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. జ‌గ‌న్‌లా ఊ-ఆ అన‌కుండా.. ఆడ సివంగిలా చెల‌రేగిపోయారు. వైఎస్సార్‌ను ఎవ‌రైనా కించ‌ప‌రిస్తే ఉరికించి ఉరికించి కొడ‌తామంటూ ఖ‌త‌ర్నాక్ వార్నింగ్ ఇచ్చారు ష‌ర్మిల‌. కాంగ్రెస్‌ను సైతం ఏకిపారేశారు. వైఎస్సార్‌ను టీఆర్ఎస్ పార్టీ నాయ‌కులు తిడుతుంటే కాంగ్రెస్ వాళ్లు చేతికి గాజులు వేసుకుని కూర్చున్నారా? అంటూ ఇజ్జ‌త్ తీసేశారు. జ‌గ‌న్‌కంటే చిన్న‌దైనా.. మ‌హిళైనా.. సీమ బిడ్డ అనిపించుకున్నారు. క‌డ‌ప పౌరుషం చూపించారు. క‌నీసం, ష‌ర్మిలకు వ‌చ్చిన కోపం, ఆవేశంలో స‌గం వంతైనా జ‌గ‌న్‌కు వ‌చ్చుంటే.. ఆయ‌న‌లా నీళ్లు న‌మిలేవారు కాదు. నీతి సూత్రాలు చెప్పేవారు కాదంటున్నారు.  అంతెందుకు.. ష‌ర్మిల వ‌ర‌కు ఎందుకు. వైఎస్ విజ‌య‌మ్మ‌నే తీసుకుందాం. త‌న భ‌ర్త‌ను తిడితే.. ఆ వ‌య‌సులోనూ ఆమెకు ఒళ్లు మండింది. త‌న పెనిమిటి గానీ, త‌న బిడ్డ‌లు కానీ.. దొంగ‌లు, గ‌జ‌దొంగ‌లు కాదంటూ.. దోచుకోవ‌డం, దాచుకోవ‌డం తెలీదంటూ.. త‌న స్థాయిలో గ‌ట్టిగానే కౌంట‌ర్ ఇచ్చారు విజ‌య‌మ్మ‌. క‌నీసం.. ఆ అమ్మ‌కు వ‌చ్చినంత కోప‌మ‌న్నా జ‌గ‌న్‌కు రావ‌డం లేదా? త‌ల్లి, చెల్లిలు అంత స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయితే.. వైఎస్సార్‌ను దొంగ అన్నందుకు తెలంగాణ మంత్రుల‌ను ఏకిపారేస్తే.. ఇక సీమ బిడ్డ‌గా చెప్పుకునే జ‌గ‌న్‌రెడ్డి మాత్రం చాలా సాదాసీదా స్టేట్‌మెంట్స్ ఇస్తూ క‌వ‌ర్ చేసుకుంటున్నారని త‌ప్పుబ‌డుతున్నారు.   తాజాగా, సీఎం జ‌గ‌న్ జ‌ల వివాదంపై స్పందించారు. కొంద‌రు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని అన్నారు. కృష్ణాలో తమకు కేటాయించిన నీళ్లను వాడుకుంటే తప్పేంటన్నారు. నీటి కేటాయింపులపై సంతకాలు చేశారని గుర్తు చేశారు. నీటి విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని, రాష్ట్రాల మధ్య సఖ్యత ఉండాలన్నదే తన అభిమతమన్నారు. పాలకుల మధ్య కూడా సఖ్యత ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. అంతే. ఇంత‌కు మించి గ‌ట్టిగా మాట్లాడింది లేదు. త‌న‌ను గ‌జ‌దొంగ అని, త‌న తండ్రిని నీళ్ల‌దొంగ అని అన్నందుకు తెలంగాణ మంత్రుల‌కు ఎలాంటి వార్నింగ్ ఇవ్వ‌లేదు. క‌నీసం వారి మాట‌ల‌ను ఖండించ‌నూ లేదు. త‌ప్పుబ‌ట్ట‌నూ లేదు. ఇదేం తీరు? బ‌హుషా ఆ విమ‌ర్శ‌ల‌ను ఆయ‌న అంగీక‌రిస్తున్నారేమో అంటున్నారు.  ష‌ర్మిల హెచ్చ‌రించిన‌ట్టు వైఎస్సార్‌ను కించ‌ప‌రిస్తే ఉరికించి కొడ‌తామని గానీ.. త‌న భ‌ర్త మంచోడ‌ని విజ‌య‌మ్మ అన్న‌ట్టు గానీ.. కనీసం వాళ్ల స్థాయిలో కూడా రియాక్ట్ అవ‌లేదు జ‌గ‌న్‌. జ‌స్ట్‌.. కొంద‌రు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టానుసారం మాట్లాడుతున్నార‌ని మాత్ర‌మే అన్నారు. ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్న‌ట్టు.. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోస‌మో.. లేక‌, హైద‌రాబాద్‌లో ఆస్తుల ర‌క్ష‌ణ కోస‌మో.. కార‌ణమేంటో తెలీదు కానీ మ‌రీ ఈస్థాయిలో జ‌గ‌న్‌ దిగ‌జారడాన్ని ఆయ‌న అభిమానులే జీర్ణించుకోలేక‌పోతున్నారు. త‌న‌ను, త‌న తండ్రిని తిట్టినందుకు ప‌డితే ప‌డ్డారు గానీ, క‌నీసం ఏపీ ప్ర‌జ‌ల‌ను  రాక్ష‌సుల‌తో పోల్చినందుకైనా తెలంగాణ మంత్రుల‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చుంటే.. ఆంధ్రుల ఆత్మాభిమానం నిల‌బ‌డేదంటూ సీఎం జ‌గ‌న్ తీరుపై మండిప‌డుతున్నారు ఏపీ ప్ర‌జ‌లు. త‌ల్లి, చెల్లిని చూసైనా రోషం తెచ్చుకొని.. పౌరుషం చూపించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. 

అమిత్ షాకు కేసీఆర్ ఆఫర్! ఏంటది? ఏం జరగబోతోంది? 

బీజేపీతో దోస్తీకి కేసీఆర్ ప్రయత్నించారా? గులాబీ బాస్ కు కమలం పెద్దలు హ్యాండిచ్చారా?.. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన కొన్ని కామెంట్లు ఇప్పుడు  హాట్ టాపిక్ గా మారాయి. హైదరాబాద్ జిల్లా బీజేపీ సమావేశంలో బండి సంజయ్ కొన్ని హాట్ కామెంట్స్  చేశారు. అమిత్ షా, కేసీఆర్ డీల్స్ కు సంబంధించి కీలక విషయాలు చెప్పారు సంజయ్. ఇవే ఇప్పుడు రాష్ట్రంలో సంచలనం రేపుతున్నాయి.  తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. ఇప్పటికే బీజేపీ దూకుడు మీదుండగా.. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఎంపికతో కాంగ్రెస్ కూడా రేసులోకి వచ్చింది. నిజానికి గత ఏడేండ్లుగా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ఎదురులేకుండా పోయింది. 2014లో బోటాపోటీ మెజార్టీలోనే పవర్ లోకి వచ్చిన కేసీఆర్.. తర్వాత కాలంతో తనదైన ఎత్తులతో పార్టీని మరింత బలోపేతం చేసుకున్నారు. అదే సమయంలో విపక్షాలను బలహీనం చేసేలా పావులు కదిపారు. కేసీఆర్ ఎత్తులతో కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయింది. బీజేపీ పరిస్థితి అంతంత మాత్రంగానే తయారైంది.  అయితే బీజేపీ చీఫ్ గా బండి సంజయ్ నియామకంతో బీజేపీ స్పీడ్ పెరిగింది. దుబ్బాక ఉప ఎన్నికతో తెలంగాణ పొలిటికల్ సీన్ మారిపోయింది. సొంత జిల్లాలో బీజేపీ సంచలన విజయం సాధించడంతో కేసీఆర్ కు మైండ్ బ్లాక్ అయింది. వెంటనే జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లోను కారు పార్టీకి చెమటలు పట్టించింది కమలం పార్టీ. ఏకంగా 48 డివిజన్లు గెలుచుకుని వణుకు పట్టించింది. గ్రేటర్ ఫలితాలతో ఉలిక్కిపడిన  కేసీఆర్.. మేయర్ ఎన్నికను వెంటనే జరపకుండా వాయిదా వేశారు. జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికలను వాయిదా వేసినప్పుడే రకరకాల చర్చలు తెరపైకి వచ్చాయి. మేయర్ సీటును బీజేపీకి ఇచ్చేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారని ప్రచారం జరిగింది. ఎంఐఎంతో మిత్రపక్షంగా వ్యవహరించే టీఆర్ఎస్.. బీజేపీకి మేయర్ సీటు ఎలా ఇస్తుందన్న వాదన కూడా జరిగింది. అయితే రెండు నెలల తర్వాత నిర్వహించిన మేయర్ ఎన్నికలో మాత్రం అధికార పార్టీనే పోటీ చేసి గెలిచింది.  జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికకు సంబంధించి సంచలన విషయం ఇప్పుడు వెలుగులోనికి వచ్చింది. గ్రేటర్ మేయర్ పీఠాన్ని బీజేపీకి కేసీఆర్ ఆఫర్ చేశారట. ఈ విషయాన్ని చెప్పిందో ఎవరో కాదు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయే. జీహెచ్ఎంసీ మేయర్ సీటును తీసుకోవాలని కేసీఆర్ తమకు ఆఫర్ చేశారని... ఈ విషయాన్ని అమిత్ షాతో కూడా చర్చించామని తెలిపారు. అయితే కేసీఆర్ ఆఫర్ ను అమిత్ షా తిరస్కరించారని చెప్పారు. అప్పటి నుంచే కేసీఆర్ కు భయం పట్టుకుందని బండి సంజయ్ అన్నారు. తన ఆఫర్ ను అమిత్ షా కాదనడంతో.. తనపై కేంద్రం పెద్దలు ఫోకస్ చేశారనే టెన్షన్ కేసీఆర్ కు పట్టుకుందని సంజయ్ అన్నారు. అమిత్ షాకు కేసీఆర్ ఆఫర్ ఇచ్చారంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇప్పటికే బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది. పైపైకి తిట్టుకుంటూ లోపల సహకరించుకుంటారని రేవంత్ రెడ్డి కూడా పలుసార్లు విమర్శలు చేశారు. కేసీఆర్ జైలుకు పోవడం ఖాయమని చెబుతున్న బండి సంజయ్.. అవినీతి విషయాలు ఎందుకు బయటపెట్టడం లేదని కూడా ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో తమకు కేసీఆర్ ఆఫర్ ఇచ్చారని బండి సంజయే చెప్పడంతో.. కాంగ్రెస్ ఆరోపణలు నిజమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సంజయ్ వ్యాఖ్యలే అస్త్రంగా కాంగ్రెస్ నేతలు రెండు పార్టీలను టార్గెట్ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.   

జగనన్న అంటే అంత అలర్జీనా! జల జగడంపై క్లారిటీ ఇచ్చిన షర్మిలక్క..

ష‌ర్మిల పార్టీ ఆవిర్భావం అన‌గానే.. రెండు రాష్ట్రాల జ‌ల వివాదంపై ఆ పార్టీ వైఖ‌రి ఏంటనే ఆస‌క్తి నెల‌కొంది. ఏపీ, తెలంగాణ‌ల మ‌ధ్య ప్ర‌స్తుతం నెల‌కొన్న జ‌ల‌జ‌గ‌డంపై ష‌ర్మిల ఏమంటారనే ఇంట్రెస్ట్ పెరిగింది. వైఎస్సార్‌టీపీని ప్రారంభిస్తూ.. ష‌ర్మిల మాట్లాడటం స్టార్ట్ చేశాక‌.. మిగ‌తా విష‌యాల‌కంటే కూడా వాట‌ర్ ఎపిసోడ్‌లో ఆమె స్పంద‌నపైనే అంతా ఫోక‌స్ పెట్టారు. కొన్ని రోజులుగా ఇరు రాష్ట్రాల వాట‌ర్‌ వార్‌లో ఆమె వ్యూహాత్మ‌క మౌనం పాటిస్తూ వ‌చ్చినా.. ఎట్ట‌కేళ‌కు ఆమె మౌనం వీడక త‌ప్ప‌లేదు. కృష్ణా, గోదావ‌రి జ‌లాలు, ప్రాజెక్టుల‌పై వైఎస్సార్‌టీపీ అనుస‌రించ‌బోయే వైఖ‌రిని ష‌ర్మిల తేట‌తెల్లం చేశారు.  ఏపీ సీఎం జ‌గ‌న్ స్వ‌యానా ష‌ర్మిల‌కు అన్న కావ‌డంతో.. ఆమె రియాక్ష‌న్ ఎలా ఉంటుందోన‌ని అంతా అటెన్ష‌న్‌గా ఆమె స్పీచ్ విన్నారు. ఆ టాపిక్ రాగానే అల‌ర్ట్ అయ్యారు. ఏపీని విమ‌ర్శిస్తుందా? జ‌గ‌న‌న్న‌ను త‌ప్పుబ‌డుతుందా? కేసీఆర్‌పైన ఎలాగూ అటాక్ చేస్తార‌ని తెలిసిందే కానీ, ఏపీ, జ‌గ‌న్‌ల వైఖ‌రిపై ష‌ర్మిల కౌంట‌ర్ ఎలా ఉండ‌నుందోన‌నే ఆస‌క్తి పెరిగింది. అంత‌లా ఉత్కంఠ నెల‌కొన్న నీటి విష‌యంలో ఏం మాట్లాడాలి అనే దానిపై ష‌ర్మిల బాగానే క‌స‌ర‌త్తు చేసి వ‌చ్చిన‌ట్టుంది. తానెక్క‌డా బుక్ కాకుండా.. త‌నపై ఎలాంటి విమ‌ర్శ‌లు రాకుండా.. చాలా వ్యూహాత్మ‌కంగా.. ఎలాంటి స్టాండ్ తీసుకోకుండా.. త‌న స్టాండ్ ఇదంటూ మాట‌ల గారడీ చేశార‌ని అంటున్నారు. స్ప‌ష్టంగా ఇదీఅదీ అని చెప్ప‌కుండా.. అస‌లే మాత్రం స్ప‌ష్ట‌త లేకుండా.. స‌మ‌న్యాయం జ‌ర‌గాలంటూ సూక్తులు మాత్రం చెప్పారు.    ఎక్క‌డా జ‌గ‌న‌న్న పేరు కూడా ప్ర‌స్తావించ‌లేదు. బ‌హుషా ఆయ‌న పేరు పల‌క‌డ‌మూ ఆమెకు ఇష్టం లేదేమో. అందుకే, ప‌క్క రాష్ట్రం ముఖ్య‌మంత్రి అంటూ సంబోధించడం ఆస‌క్తిక‌ర ప‌రిణామం. ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు కౌగిలించుకుంటారు.. క‌లిసి భోజ‌నం చేస్తారు.. క‌లిసి ఉమ్మ‌డి శ‌త్రువును ఓడిస్తారు.. అలాంటిది.. నీటి స‌మ‌స్య‌పై క‌నీసం రెండు నిమిషాలు క‌లిసి మాట్లాడుకోలేరా? అంటూ ప్ర‌శ్నించారు ష‌ర్మిల‌. ప్ర‌స్తుత జ‌ల‌వివాదంలో కేంద్ర ప్ర‌భుత్వానిదీ త‌ప్పు ఉంద‌ని.. ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని మండిప‌డ్డారు. రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాలు జ‌ల వివాదాల‌ను ప‌రిష్క‌రించుకోడానికి ఎలాంటి ప్ర‌య‌త్న‌మూ చేయ‌క‌పోతే వారి చిత్త‌శుద్ధిని ఎలా న‌మ్మాలంటూ నిల‌దీశారు. అది వారి చేత‌గాని త‌న‌మని అనుకోవాలా? అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.  జ‌ల వివాదాల‌పై వైఎస్సార్‌టీపీ వైఖ‌రి ఏంటో ప్ర‌క‌టించారు ష‌ర్మిల‌. తెలంగాణ‌కు న్యాయంగా ద‌క్కాల్సిన ఒక్క చుక్క నీటిబొట్టూ వ‌దులుకోం.. ప‌క్క రాష్ట్రాల‌కు చెందాల్సిన ఒక్క చుక్క నీటిబొట్టూ అడ్డుకోబోం.. నీటి విష‌యంలో రెండు రాష్ట్రాల‌కు స‌మ‌న్యాయం జ‌ర‌గాల‌ని కోరుకుంటున్నాం.. అంటూ క‌ర్ర విర‌గ‌కుండా.. పాము చావ‌కుండా.. చాక‌చ‌క్యంగా త‌ప్పించుకున్నారు ష‌ర్మిల‌.  జ‌ల వివాదంపై ష‌ర్మిల ఇచ్చిన క్లారిటీ కంటే కూడా.. ఆ సంద‌ర్భంగా ఆమె నోటి నుంచి జ‌గ‌న్ పేరు రాకుండా చాలా జాగ్ర‌త్త‌గా మాట్లాడ‌టం చూస్తుంటే.. రెండు ర‌కాల అనుమానాలు క‌లుగుతున్నాయి. ష‌ర్మిల కూడా జ‌గ‌న్ మ‌నిషేన‌ని.. అందుకే అన్న‌ను ఇరికించ‌డం, అన్న‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం ఇష్టం లేకే ఆయ‌న పేరు ప్ర‌స్తావించ‌లేద‌ని అంటున్నారు. ఇక మ‌రో యాంగిల్‌.. జ‌గ‌న్‌తో ష‌ర్మిల‌కు పూర్తి స్థాయిలో తేడాలొచ్చాయ‌ని.. అందుకే త‌న నోటి నుంచి జ‌గ‌న్ పేరు ప‌ల‌క‌డానికి సైతం ఆమె ఇష్ట‌ప‌డ‌లేద‌ని అంటున్నారు. ఈ రెండు వ‌ర్ష‌న్‌ల‌లో ఏది క‌రెక్టో వారిద్ద‌రికే తెలియాలి. అయితే, నీళ్ల లొల్లిపై వైఎస్సార్‌టీపీ వైఖ‌రిలో ఎలాంటి స్ప‌ష్ట‌త లేద‌ని.. వ‌దులుకోం.. అడ్డుకోం.. అంటూ క్లారిటీ లేని క‌న్ఫ్యూజ‌న్ క్రియేట్ చేశార‌ని అంటున్నారు తెలంగాణ‌వాదులు.   

జగన్, షర్మిల గజ దొంగలా? విజయమ్మ భావోద్వేగం.. 

తెలంగాణలో కొత్త పార్టీ ప్రారంభించింది వైఎస్ షర్మిల. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతి సందర్భంగా పార్టీ పేరును అధికారికంగా ప్రకటించింది.  వైఎస్సార్ టీపీ  లోగోతో పాటు జెండాను ఆవిష్కరించింది. షర్మిల పార్టీ ఆవిర్భావ వేడుకను జూబ్లీహిల్స్ లోని కన్వెషన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్ విజయమ్మ భావోద్వేగ ప్రసంగం చేశారు. తన  బిడ్డను ఖమ్మంలోనే తెలంగాణ ప్రజలకు అప్పగించానని చెప్పారు.  అప్పటి నుంచి ఇప్పటి వరకు షర్మిలపై ఎన్నో విమర్శలు చేశారన్నారు. షర్మిల పార్టీ పెడితే అధికార పార్టీ నేతలు, ఇతర పార్టీల నాయకులు ఎందుకు తమ వైఖరిని, తమ వ్యూహాలను మార్చుకున్నారో సమాధానం చెప్పాలని విజయమ్మ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ ను తమ సొత్తు అని భావిస్తున్నారని, ఇన్ని రోజులు ఎందుకు పట్టించుకోలేదో సమాధానం చెప్పాలన్నారు. వైఎస్సార్ పై ఎఫ్ఐఆర్ పెట్టిన కాంగ్రెస్.. ఇప్పుడు ఆయన జపం విజయమ్మ చేస్తోందని విమర్శలు చేశారు.  ప్రజల సమస్యలు పరిష్కరించే వాడే అసలైన నాయకుడని, అన్ని వర్గాలకు దగ్గరైన నేత  వైఎస్సార్ అని విజయమ్మ గుర్తు చేశారు. వైఎస్ సీఎం అయ్యాక తెలంగాణ  ప్రాంతానికి సంక్షేమంలో, అభివృద్ధిలో, జలయజ్ఞం వంటి పథకాలతో పెద్ద పీట వేశారన్నారు. ఆయన హఠాన్మరణంతో ఎంతో మంది తెలంగాణ ప్రజలు చనిపోయారని, తెలంగాణ సశ్యశ్యామలం కావాలనేది ఆయన సంకల్పమని, వైఎస్సార్ మరణంతో ఆయన కల అసంపూర్ణంగా మిగిలిపోయిందన్నారు. ఆయన రక్తాన్ని పుణికి పుచ్చుకున్నది జగన్, షర్మిల లని, వారు నేడు వేర్వేరు రాష్ట్రాలకు ప్రతినిధులుగా పనిచేస్తున్నారన్నారు. జగనన్న బాణంగా 3 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి రికార్డు సృష్టించిందన్నారు. ఎండ, వాన, చలి ఆమె పాదయాత్ర ఆపలేకపోయాయని చెప్పారు. ఆమెలో ఉన్న సంకల్పం, చిత్తశుద్ధి.. ఆమెను నడిపించిందనన్నారు విజయమ్మ.  తెలంగాణ షర్మిల మెట్టినిల్లు అన్న విజయమ్మ.. ప్రజల మంచి కోసమే పార్టీ పెట్టిందన్నారు. తన తండ్రి కలలను నెరవేర్చడం కోసమే రాజకీయాల్లోకి వచ్చిందని తెలిపారు. తెలంగాణ బిడ్డలకు బంగారు భవిష్యత్తు కోసం షర్మిల ముందుకు వస్తోందన్నారు.  రెండు తెలుగు రాష్ట్రాలు మనవే.. రాష్ట్రాల మధ్య వనరుల విషయంలో వివాదాలు రావొచ్చు కానీ పరిష్కార మార్గాలున్నాయన్నారు. వైఎస్సార్ కానీ, ఆయన బిడ్డలు కానీ, దొంగలు, గజదొంగలు కాదన్నారు విజయమ్మ. తమ కుటుంబానికి దాచుకోవడం, దోచుకోవడం తెలియదు.. అభివృద్ధి పంచడం మాత్రమే తెలుసునన్నారు. 

బీజేపీకి రేవంత్ తొలి పంజా! కాంగ్రెస్ గూటికి ఖమ్మం నేతలు..

పీసీసీ చీఫ్ గా ఎంపీ రేవంత్ రెడ్డి నియామకంతో కాంగ్రెస్ లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కేడర్ లో కదలిక వచ్చింది. ఇంతకాలం స్తబ్ధుగా ఉన్న నేతలు కూడా యాక్టివ్ అయ్యారు. రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న వెంటనే కార్యాచరణ మొదలు పెట్టారు. గాంధీభవన్ లో వరుస సమావేశాలు నిర్వహించారు. భవిష్యత్ గమనంపై చర్చించారు. దశల వారీగా ప్రజా సమస్యలపై చర్చించాలని నిర్ణయించారు. రేవంత్ రెడ్డి రాకతో గాంధీభవన్ కూడా చాలా కాలం తర్వాత కళకళలాడుతోందని చెబుతున్నారు.  పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకంతో పార్టీకి బూస్ట్ రావడమే కాదు వలసలు కూడా మొదలయ్యాయి. రేవంత్ రెడ్డి తొలి పంజా బీజేపీపై పడింది. ఖమ్మం జిల్లాకు చెందిన కమలం నేతలు రేవంత్ రెడ్డి సమక్షంలో గాంధీభవన్ లో కాంగ్రెస్ గూటికి చేరారు. సత్తుపల్లికి చెందిన బిజెపి నేతలు  కిష్టారం మాజీ సొసైటీ ఛైర్మన్ రావి నాగేశ్వరరావు, కిష్టారం మాజీ సర్పంచ్ ప్రత్తిపాటి భిక్షపతి, యువజన నేత పుచ్చకాయల లక్ష్మారెడ్డి లు బిజెపి పార్టీ నుండి కాంగ్రెస్ లో చేరారు. టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి కండవాలు కప్పి వారిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు.రేవంత్ రెడ్డిపై నమ్మకంతో పార్టీలో చేరుతున్నట్లు సత్తుపల్లి నేతలు చెప్పారు. రేవంత్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్న మానవతరాయ్ నేతృత్వంలోనే ఈ చేరికలు జరిగాయి.  ఇతర పార్టీల్లో చేరిన కాంగ్రెస్ నేతలంతా సొంత గూటికి చేరాలని ఈ సందర్భంగా  రేవంత్ రెడ్డి  పిలుపిచ్చారు. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతున్నామని చెప్పారు. త్వరలోనే నిరుద్యోగుల సమస్యలపై పాదయాత్ర చేయాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. త్వరలోనే మరికొందరు నేతలు కాంగ్రెస్ లో చేరనున్నారని తెలుస్తోంది. అన్ని జిల్లాల నుంచి వలసలు ఉంటాయని అంటున్నారు. కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీల్లో చేరిన చాలా మంది నేతలు రేవంత్ రెడ్డితో టచ్ లోకి వచ్చారని చెబుతున్నారు. టీడీపీలో రేవంత్ తో కలిసి పని చేసిన ప్రస్తుతం వివిధ పార్టీల్లో ఉన్న నేతలు కూడా హస్తం గూటికి వస్తారని అంటున్నారు. 

వైఎస్సార్‌టీపీ వ‌ర్సెస్ వైఎస్సార్‌పార్టీ.. రంజుగా వైఎస్‌ రాజ‌కీయం!

వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి. దివంగ‌త ముఖ్య‌మంత్రి. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌పై చెర‌గ‌ని ముద్ర. ఎప్పుడో 11ఏళ్ల క్రితం చ‌నిపోయిన నాయ‌కుడు.. ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల్లో మ‌ళ్లీ యాక్టివ్ రోల్ ప్లే చేస్తుండ‌టం ఆశ్చ‌ర్య‌క‌ర‌మే. వైఎస్సార్ బొమ్మ చూపించి.. ఆయ‌న కొడుకు జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఏపీలో అధికారంలోకి వ‌చ్చారు.  అన్న‌ను చూసి.. సేమ్ టూ సేమ్‌ అలానే తానూ ముఖ్య‌మంత్రి కావాలంటూ తెలంగాణ‌లో కొత్త‌ జెండా ఎత్తారు ష‌ర్మిల‌. అన్న వాడిన క‌ల‌ర్లే వాడి.. జెండాలో వైఎస్సార్ బొమ్మ పెట్టి.. పార్టీకీ వైఎస్సార్ పేరుపెట్టి.. రాజ‌న్న రాజ్యం తీసుకొస్తానంటూ.. అట్ట‌హాసంగా..హంగామాగా.. సినిమా ఫంక్ష‌న్ మాదిరి.. అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు వైఎస్ ష‌ర్మిల‌. ఓ మీడియా స‌హ‌కారంతో ఆ ఈవెంట్‌ను గ్రాండ్ స‌క్సెస్ చేశారు.  ష‌ర్మిల ఆశ‌, ఆశ‌యం ఒక్క‌టే. తండ్రి పేరు చెప్పి.. రాజ‌కీయ ఫ‌లాలు పొందాల‌నేదే ఆమె వ్యూహం. అందుకే, వైఎస్సార్ పేరును ప‌దే ప‌దే ఉచ్చ‌రిస్తూ.. తెలంగాణ‌వాదులు ఎప్పుడో మ‌ర్చిపోయిన వైఎస్సార్‌ను ప‌దే ప‌దే గుర్తు చేస్తూ.. త‌న వ్యూహం, త‌న బ‌లం, త‌న బ‌ల‌గం ఏమిటో సూటిగానే స్ప‌ష్టం చేశారు వైఎస్ ష‌ర్మిల‌. త్రి పాయింట్ ఎజెండా అంటూ.. సంక్షేమం, స్వ‌యంస‌మృద్ధి, స‌మాన‌త్వం.. అంటూ ఏవేవో ఆశ‌యాలు చెప్పినా.. వైఎస్సార్‌ను చూసి, ఆయ‌న ప‌నితీరును చూసి.. ఆయ‌న బిడ్డ‌నైన త‌న‌కు ఓటేయ‌మంటూ నేరుగానే అడిగారు ష‌ర్మిల‌. అక్క‌డ ఏపీలో జ‌గ‌న్‌రెడ్డి సైతం అంతే.. వైఎస్సార్ పాల‌న తీసుకొస్తా.. త‌న‌కు ఒక్క ఛాన్స్ ఇవ్వండంటూ అంద‌ల‌మెక్కారు. అన్న లానే త‌న‌నూ న‌మ్మేస్తార‌ని.. అన్న‌లానే త‌న‌నూ సీఎం చేసేస్తార‌నేది ఆమె ఆశ‌. అది అడియాశా కాదా అనేది ముందుముందు తేలుతుంది.  అయితే.. ఏపీలో వైఎస్సార్ బొమ్మ చూపించి ఓట్లు దండుకున్నంత ఈజీగా తెలంగాణ‌లో ఓట్లు రాల‌వ‌నేది ఇక్క‌డి వారి మాట‌. తెలంగాణ‌లో రాజ‌కీయ చైత‌న్యం ఎక్కువ‌. సెంటిమెంట్ మ‌రింత ఎక్కువ‌. వైఎస్సార్‌ను కాంగ్రెస్ నేత‌గానే చూస్తారు తెలంగాణ‌వాదులు. ఆయ‌న అమ‌లు చేసిన ఆరోగ్య‌శ్రీ, ఇందిర‌మ్మ ఇళ్లు, ఫీ రీయింబర్స్‌మెంట్‌లాంటి ప‌థ‌కాల ల‌బ్దిదారులు ఇప్ప‌టికీ ఆయ‌న్ను త‌లుచుకుంటారు. తెలంగాణ‌లో వైఎస్సార్ అభిమానులు ఎక్కువే అయినా.. వారంతా కాంగ్రెస్‌వాదులుగానే ఉన్నారు. అయితే, వైఎస్సార్ మీద తెలంగాణ వ్య‌తిరేకి అనే ముద్ర కూడా బ‌లంగా ఉంది. తాను తెలంగాణ‌కు అడ్డు కాదు, పొడ‌వు కాదు అంటూనే.. ఆయ‌న బ‌తికున్నంత కాలం తెలంగాణ‌ను అడ్డుకున్న వైనం అంద‌రికీ తెలిసిందే. అలాంటి.. తెలంగాణ వ్య‌తిరేకి పేరు మీదుగానే పార్టీ పెట్ట‌డం.. ఆయ‌న బొమ్మ పెట్టుకొని మ‌రీ ప్ర‌జ‌ల ముందుకు వ‌స్తుండ‌టం.. ష‌ర్మిల‌కు స‌వాలే. అయితే, తెలంగాణ‌వాదులు వైఎస్సార్‌ను సంక్షేమక‌ర్త‌గా గుర్తుపెట్టుకున్నారా? లేక‌, తెలంగాణ ద్రోహిగా గుర్తుపెట్టుకున్నారా? అనే దానిపైనే ఆమె రాజ‌కీయ భ‌విష్య‌త్తు డిపెండ్ అయి ఉంటుంది.  ఏపీలో వైఎస్సార్‌ను చూసి జ‌గ‌న్ వెంట న‌డిచిన‌ట్టు.. ఇక్క‌డ వైఎస్సార్ కూతురు అయినంత మాత్రాన ష‌ర్మిలకు ఆయ‌న అభిమానులంతా స‌పోర్ట్ చేస్తార‌ని చెప్ప‌లేం. ఎందుకంటే, వైఎస్సార్.. కాంగ్రెస్ లీడ‌ర్‌గానే ఇక్క‌డ పాపులర్‌. వైఎస్సార్ అభిమానులు కాంగ్రెస్ వెంటే ఉన్నారు. ఒక‌వేళ ష‌ర్మిల వైపు వెళ్దామ‌నుకున్నా.. ఇప్పుడు రేవంత్‌రెడ్డి ఎంట్రీతో ఆ ఛాన్స్ కూడా లేకుండా పోయిన‌ట్టైంది. రేవంత్ సైతం వ్యూహాత్మ‌కంగా ప‌దే ప‌దే వైఎస్సార్ నామ‌స్మ‌ర‌ణ చేస్తున్నారు. వైఎస్సార్‌ను తిడితే కుష్టురోగం వ‌స్తుంద‌ని కూడా శాప‌నార్థాలు పెట్టారు. మునుపెన్న‌డూ లేనివిధంగా వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి జ‌యంతిని కాంగ్రెస్ పార్టీ ఘ‌నంగా జ‌రిపింది. ఇదంతా ష‌ర్మిల పార్టీ ఎఫెక్ట్ అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇలా.. వైఎస్సార్ కాంగ్రెస్ నాయ‌కుడేన‌నే విష‌యం మ‌రోసారి బ‌ల‌వంతంగా ప్ర‌జ‌ల‌కు గుర్తు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ‌లో వైఎస్సార్‌ రాజ‌కీయ వార‌సత్వం కాంగ్రెస్‌కే సొంత‌మ‌న్న‌ట్టు రేవంత్‌రెడ్డి వైఎస్సార్ విష‌యంలో సెంటిమెంట్ రాజేస్తున్నారు.  ఇలా.. ఇటు ష‌ర్మిల‌, అటు రేవంత్‌రెడ్డిలు.. తెలంగాణ రాక‌ముందే చ‌నిపోయిన వైఎస్సార్‌ను.. తెలంగాణలోనే ఆద‌ర్శ నేత‌గా కీర్తిస్తూ.. ఎవ‌రికి వారే ప్ర‌యోజ‌నం పొందాల‌ని ప్ర‌య‌త్నిస్తుండ‌టంతో తెలంగాణ రాజ‌కీయాలు ఇప్పుడు వైఎస్సార్ నామ‌జ‌పంతో ఆస‌క్తిక‌రంగా మారాయి.   

అక్కకు గర్భం చేసిన తమ్ముడు.. 

ఆడమగ రెండు వేరు వేరు శరీరాలు.. కానీ ఆ రెండు కలిస్తేనే ఈ సృష్టి కి కారణం అయింది. అది సృష్టి ధర్మం అని చెప్పవచ్చు.. ఎంత సృష్టి ధర్మం అయినా వరసైన వాళ్ళతో మనసులు కలుపుకోవడం.. ఆ తర్వాత శరీరాలు కలుపుకోవడం ఆనవాయితీ.. కానీ ఇప్పుడు ఉన్న రోజుల్లో వరసలు వావిలు ఏం లేకుండా మడతెట్టేస్తున్నారు నేటి యువత .. కొంతమంది తెలియక చేస్తే మరికొంత మంది తెలిసి ఈ తప్పులు చేస్తున్నారు.. తాజాగా ఇలాంటి సాతంగమే జరిగింది చదవండి మీకే తెలుస్తుంది..  వాళ్ళు ఇద్దరు అక్క తమ్ముడు. అక్క  వయసు 16 సంవత్సరాలు..  తమ్ముడు వయసు 12 సంవత్సరాలు.  సరిగా లోకజ్ఞానం కూడా తెలియని వయసు. ఏది ఆటనో, ఏది శృంగారమో కూడా అవగాహన లేని చిన్నారులు. కానీ లాక్‌డౌన్ సమయంలో ఇంట్లో ఖాళీగా కూర్చోలేక అక్కాతమ్ముడు ఆడిన ఓ ఆట అక్కను గర్భవతిని చేసింది. టీనేజ్ ఏజ్ రాకముందే తండ్రి కాబోయిన తమ్ముడు కటకటాలపాలయ్యాడు.  అక్కపై  తమ్ముడు లైంగిక దాడి చేసి గర్భవతిని చేసిన ఘటన గ్రేటర్ నోయిడాలో చేటుచేసుకుంది. గ్రేటర్ నోయిడాకు చెందిన ఓ వ్యక్తి తన కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. తండ్రి భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తుండగా.. తల్లి ఇళ్లలో పని చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటుంది. ఆ దంపతులకు ముగ్గురు పిల్లలు. వీరిలో అమ్మాయే పెద్ద. కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు కారణంగా పిల్లలు అంతా ఇంట్లోనే ఉంటున్నారు. ఈ క్రమంలో తన అక్క తమ్ముడు ఇంట్లోనే లైంగికంగా రెండుసార్లు కలుసుకున్నారు. ఈ కరోనా చేసిన పాపం అంత ఇంత కాదు ప్రజలను ఎన్ని విధాలుగా నాశనం చెయ్యాలో అన్ని విధాలుగా నాశనం చేసింది.. అయితే ఇటీవల బాలిక శరీరంలో మార్పులు వస్తుండడాన్ని తల్లి గమనించింది. కూతురు గర్భవతి అయిన విషయాన్ని గుర్తించి నిలదీసింది. వేసే అవకాశం లేక తమ్ముడితో కలిసి తానూ  చేసిన తతంగం అంత వివరించింది. అయితే వారు శృంగారంలో పాల్గొన్నారని, అలా చేస్తే గర్భం వస్తుందన్న విషయం తెలియదని వారిద్దరు చెప్పడంతో తల్లిదండ్రులు షాక్ తిన్నారు. కేవలం ఇంట్లోనే ఆటలు ఆడుకున్నట్లు ఆడుకున్నామని చెప్పడం దిగ్భ్రాంతికి గురి చేసింది. అయినా బాలిక తల్లి చైల్డ్‌లైన్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. పోలీసులు బాలుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, జువెనల్ హోంకు తరలించారు. 

భారతరత్నకు ఆంధ్రులు అర్హులు కాదా?

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి. రాజకీయాలకు అతీతంగా, ప్రజలు ఆయన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన చేసిందంతా మంచి కాకపోవచ్చును, కానీ, అయన చేసిన పనులలో కొన్ని అయినా మంచి పనులున్నాయి.సో.. ఆయన జయంతి రోజు, అయన గుర్తుచేసుకోవడం, నివాళులు అర్పించడం, వీలయితే ఆయనలోని మంచి చెడులను చర్చించుకోవడం మంచిదే, ఒక విధంగా అవసరం కూడా.. అయితే ఆ విషయాన్ని అలా ఉంచితే, ఇంతకుముందు ఎవరైనా ఇలాంటి డిమాండ్ చేశారో లేదో గానీ,  మాజే మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు.    సరే వైఎస్సార్’కు భారత రత్న అందుకునే అర్హత, యోగ్యతా ఉన్నాయా లేవా అనే విషయాన్ని పక్కన పెడితే , తెలుగు వారికి భారత రత్న ఎందుకనో గానీ అందనంత  దూరంగానే ఉంటోంది . కేంద్రంలో కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వమున్నా, బీజేపీ కూటమే అధికారంలో ఉన్నా, తెలుగు వారి భారత రత్న ఆకాంక్ష మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. ఇప్పుడు కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డి  వైఎస్సార్’కు భారతరత్న ఇవ్వాలని కోరుతున్నారు. కానీ, 1996లో ఆయన కన్నమూసిన నాటి నుంచి తెలుగు దేశం పార్టీ , పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మహానటుడు  నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్)కు భారత రత్న ఇవ్వాలని కోరుతూనే ఉంది . ప్రతి మహానాడులో, ఎన్టీఅర్ జయంతి (మే 28) రోజున, ఎన్టీఅర్’కు నివాళులు అర్పించడం ఎంత రివాజుగా వస్తోందో, ఎన్టీఅర్’కు భారత రత్న ఇవ్వాలనే తీర్మానం చేయడం కూడా అంటే రివాజుగా, ఆనవాయితీగా వస్తూనే వుంది. కానీ, చివరకు ఆ ఒక్కటీ అందని ద్రాక్షగానే మిగిలి పోతోంది. కేంద్రంలో స్వయంగా ఎన్టీఅర్ కుమార్తె పురందేశ్వరి మంత్రిగా ఉన్నా, తెలుగు దేశం పార్టీ భాగస్వామ్య పక్షంగా ఉన్న సంకీర్ణ ప్రభుత్వమే ఉన్నా, వర్ధంతులు, జయంతులు వచ్చి పోతూనే ఉన్నాయి కానీ, అన్ని అర్హతలు యోగ్యతలు ఉన్న ఎన్టీఅర్ దక్కవలసిన భారత రత్న గౌరవం దక్కడం లేదు.  ఇక భారత దేశం గర్వించదగిన తెలుగు బిడ్డ పీవీ నరసింహ రావు విషయం అయితే చెప్పనే అక్కర్లేదు. అపర చాణుక్యుడు, బహుభాషా కోవిధుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి ఈ అన్నింటినీ మించి దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి తప్పించి, సంస్కరణలకు శ్రీకారం చుట్టిన మన పీవీకి సైతం భారత రత్న దక్కలేదు. తెలంగాణ ప్రభుత్వం పీవీ శత జయంతి వేడుకలను సంవత్సరం పాటు నిర్వహించింది. ఈ వేడుకలను సుసంపన్నం చేస్తూ జూన్ 27 పేవీ జ్ఞాన భూమిలో పీవీ కాంస్య విగ్రహాన్ని అవిష్కరించారు. ఈ సంవత్సరం పొడుగునా అసెంబ్లీలో తీర్మానం చేయడంతో పాటుగా  దేశ విదేశాలలో పలు వేదికల ద్వారా పీవీకి భారత రత్న ఇవ్వాలని, ప్రపంచ తెలుగు ప్రజలు కేంద్రాన్ని డిమాండ్  చేశారు. పీవీ జీవితాంతం సేవ చేసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత కానీ, పీవీని పట్టించుకోలేదు. చివరకు అయన శవాన్ని కూడా, కాంగ్రెస్ పార్టీ ఎంతో అగౌరవానికి గురిచేసింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ పంపేసి, చేతులు కడుక్కుంది.  పీవీ నరసింహారావు శతజయంతి వేడుకలు ప్రారంభం సందర్భంగా గత సంవత్సరం ఆగష్టు 28 న తెలంగాణ శాసన సభ పీవీ కి భారత రత్న ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపింది. అలాగే, ఈ సంవత్సరం జూన్’ లో ముఖ్యమంత్రి మరో మారు కేంద్రానికి లేఖ రాశారు. ఇప్పటికే ఆలస్యమైంది .. . అసలు కానిదానికంటే, ఎప్పుడో అప్పుడు రావడం కూడా కొంతవరకు మేలే .. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా భారత రత్నకు అర్హులైన పీవీ,ఎన్టీఅర్ వంటి భరత మాత ముద్దు బిడ్డలు తెలుగు గడ్డన ఉన్నారని గుర్తించి, గౌరవిస్తుందని ఆశిద్దాం.

కోడి పొడిచింది.. 10 ఏళ్ళ పిల్లాడు మృతి..

అది తెలంగాణ.  మహబూబాబాద్ జిల్లా. కేసముద్రం మండలం. బేరువాడ గ్రామం. ఈ  గ్రామానికి చెందిన ముదిగిరి రమేష్, శ్రీలత దంపతులకు ఒక్క కుమారుడు, ఒక కుమార్తె సంతానం ఉన్నారు. వీరిలో పెద్దవాడైనా ముదిగిరి అజయ్. ఆ పిల్ల వారి వయసు  10 సంవత్సరాలు.  బుధవారం అదే గ్రామంలో వీరి ఇంటిపక్కన బంధువుల ఫంక్షన్ కు వెళ్ళాడు. అక్కడ ఉన్న తోటి పిల్లలతో ఆటలు ఆడుకుంటూ, సరదాగా ఎంజాయ్ చేశారు..అప్పుడపుడు  ఇంటి సెల్ఫ్ ను పట్టుకొని వేలాడుతున్నాడు అజయ్. . ఆటలు ఆడుకుంటుండగా అక్కడే సెల్ఫ్ మీద పొదిగేసి ఉన్న కోడి పొడిచిండి. ఇది చిన్నపుడు పల్లెటూరిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకసారి జరిగే ఉంటుంది.. కానీ అందరికి జరిగింది వేరు ఇప్పుడు మనం చదివే వార్త వేరు.. కట్ చేస్తే కోడి కరిచినా అజయ్ చనిపోయాడు.. అది ఎలా అని అనుకుంటున్నారా ? ఎలాగో మీరే తెలుసుకోండి..   సాయంత్రం తోటి స్నేహితులతో ఆటలు ఆడుకొని నిద్రలోనే ప్రాణాలు విడిచాడు. కుమారుడు కళ్లెదుటే చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. అప్పటికే అ సెల్ఫ్ మీద కోడిని పొదిగేశారు. అది వాస్తవం ఈ క్రమంలోనే అక్కడ పాము కూడా ఉంది. అజయ్ సెల్ఫ్ మీద చేతి పెట్టినప్పుడు పాము కాటు వేసింది. విషయాన్ని పసిగట్టని బాలుడు తల్లిదండ్రులకు కోడి పొడిచిందని స్థానిక వైద్యుని వద్ద చికిత్స అందజేశారు. చికిత్స అనంతరం కూడా బాలుడు ఆటలు ఆడుకోవడంతో తల్లిదండ్రులు సైతం శ్రద్ద చూపలేదు. సాయంత్రం అజయ్ నిద్రిస్తూ నోటిలో నుండి నూరుగు కక్కుతుండడంతో మహబూబాబాద్ కు తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. గురువారం బేరువాడ గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు కళ్లెదుటే మృతి చెందడం పట్ల తల్లిదండ్రులు, కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

జల వివాదంపై జగన్ షాకింగ్ కామెంట్స్.. 

తెలుగు రాష్ట్రాల మధ్య  సాగుతున్న జల వివాదంపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. కృష్ణాలో తమకు కేటాయించిన నీళ్లను వాడుకుంటే తప్పేంటన్నారు. నీటి కేటాయింపులపై సంతకాలు కూడా చేశారని గుర్తు చేశారు. 881 అడుగులు చేరితే తప్ప పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకు నీళ్లు రావని, శ్రీశైలంలో 885 అడుగుల మేర నీరు ఎన్నిరోజులు ఉందన్నారు. నీటి విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని, కర్ణాటక, తమిళనాడు రాజకీయాల్లో నేనెప్పుడూ వేలు పెట్టలేదన్నారు. రాష్ట్రాల మధ్య సఖ్యత ఉండాలన్నదే తన అభిమతమన్నారు. పాలకుల మధ్య కూడా సఖ్యత ఉండాలని కోరుకుంటున్నానని సీఎ జగన్‌ అన్నారు. కాని తెలంగాణ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం సభలో  మాట్లాడిన జగన్.. కృష్ణా నీటి వివాదంపై ప్రతిపక్షనేత చంద్రబాబును ఉద్దేశించి తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు గాడిదలు కాశారా? అని ప్రశ్నించారు. తెలంగాణతో జల వివాదాలు అందరికీ తెలిసిన విషయమేనని, అయితే టీడీపీ అధినేత చంద్రబాబు ఓ నాలుగైదు రోజులు ఈ అంశంపై మౌనంగా ఉండి, ఇప్పుడిప్పుడే దీనిపై మాట్లాడుతున్నాడని అన్నారు. ఈ సందర్భంగా తాను చంద్రబాబుకు, ఇష్టంవచ్చినట్టుగా మాట్లాడుతున్న తెలంగాణ మంత్రులకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నానంటూ కొన్ని విషయాలు చెప్పారు జగన్.  "దశాబ్దాల తరబడి ఆంధ్ర రాష్ట్రం కలిసి ఉంది. రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ... ఈ మూడూ కలిసిందే ఆంధ్ర రాష్ట్రం. కృష్ణా నదీ జలాలు కోస్తాంధ్రకు ఎంత, తెలంగాణకు ఎంత, రాయలసీమకు ఎంత అనే విభజన ప్రకారమే మొదటి నుంచి కేటాయింపులు జరుగుతూ వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయాక 2015 జూన్ 19వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రం కూడా ఈ నీటి కేటాయింపులపై సంతకాలు చేసింది. ఏపీ, తెలంగాణ, కేంద్రం... ఈ మూడూ సంతకాలు చేసిన ప్రకారం... రాయలసీమకు 144 టీఎంసీలు, కోస్తాకు 367టీఎంసీలు, తెలంగాణకు 298 టీఎంసీలు. పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకు నీళ్లు పోవాలంటే  నీటిమట్టం 881 అడుగులు చేరాలి. శ్రీశైలం డ్యామ్ పూర్తి సామర్థ్యం 885 అడుగులు. గత రెండేళ్లు వర్షాలు బాగా పడ్డాయి. ఆ రెండేళ్లను వదిలేస్తే, అంతకుముందు 20 ఏళ్లుగా శ్రీశైలం డ్యామ్ లో 881 అడుగుల పైచిలుకు నీటిమట్టం ఎన్నిరోజులు ఉందన్న విషయం పరిశీలిస్తే, 20-25 రోజులు మాత్రమే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పోతిరెడ్డిపాడు నుంచి పూర్తి సామర్థ్యం మేరకు నీటిని విడుదల చేసే అవకాశం లేదు. అటు తెలంగాణలో మాత్రం పాలమూరు-రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి సామర్థ్యం పెంచి వాడుకుంటున్నారు. వాటన్నింటి నుంచి 800 అడుగుల లోపే నీటిని తీసుకునే వెసులుబాటు ఉంది. 796 అడుగుల్లోపే తెలంగాణకు విద్యుదుత్పాదన చేసే సౌకర్యం ఉంది. 800 అడుగుల లోపే తెలంగాణ నీటిని వాడుకున్నప్పుడు.. ఏపీలో రాయలసీమ ప్రాజెక్టుకు లిఫ్ట్ ఏర్పాటు చేస్తే తప్పేంటి అని జగన్ అన్నారు.  

షర్మిల పార్టీ వెనకున్నది ఎవరో తెలుసా..?

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టారు. పార్టీ పేరును వైఎస్సార్ టీపీగా అధికారికంగా ప్రకటించారు. పార్టీ జెండా, అజెండాను వెల్లడించారు. అయితే ఏపీ సీఎం సోదరి తెలంగాణలో పార్టీ పెట్టడంపై మొదటి నుంచి అనుమానాలున్నాయి. ఆమె వెనక ఎవరో ఉండి ఇదంతా నడిపిస్తున్నారనే ప్రచారం ఉంది. అన్న జగన్ డైరెక్షన్ లోనే షర్మిల కొత్త పార్టీ పెట్టారని కొందరు వాదిస్తే... జగన్ తో విభేదాలు రావడం వల్లే చెల్లె సొంత దారి చూసుకుందని మరికొందరు చెప్పారు. విజయమ్మతో పాటు గతంలో వైసీపీలో చేసిన నేతలే షర్మిల వెంట ఉండటంతో కుటుంబ సభ్యుల సపోర్ట్ ఆమెకు ఉందనే అభిప్రాయమే మెజార్టీ వర్గాల్లో వ్యక్తమైంది. షర్మిల పార్టీపై రాజకీయ రగడ కూడా జరిగింది. ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు చీల్చేందుకు కేసీఆరే.. జగన్ తో కలిసి షర్మిలతో తెలంగాణలో పార్టీ పెట్టించారని కొన్ని సంఘాలు ఆరోపించాయి. కాంగ్రెస్ కు బలమైన వర్గంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గాన్ని చీల్చే కుట్ర ఇందులో ఉందనే చర్చ జరిగింది. బీజేపీనే షర్మిల వెనకుండి కొత్త పార్టీని నడిపిస్తుందనే వాదన వచ్చింది. షర్మిలకు పడే ఓట్లలో ఎక్కువగా ముస్లిం, క్రిస్టయన్ మద్దతుదారులే ఉంటారనే అంచనా ఉంది. అవన్ని బీజేపీకి దూరంగా ఉండే వర్గాలే.  సో.. తమ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలేలా కమలం పార్టీ షర్మిలతో గేమ్ ఆడిస్తుందని , ఇందుకు జగన్ సపోర్ట్ ఉందని కొందరు చెప్పారు. కాంగ్రెస్ ఓట్లు బ్యాంక్ లక్ష్యంగానే బీజేపీ స్కెచ్ వేసిందని కొందరు హస్తం నేతలు కూడా కామెంట్ చేశారు. తాజాగా షర్మిల పార్టీ అధికారిక ప్రకటన రోజునే .. కాంగ్రెస్ సీనియర్ నేత, తెలంగాణ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ , మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ సంచలన విషయాలు చెప్పారు. కాంగ్రెస్ కు ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లిం, క్రిస్టియన్ ఓట్లను చీల్చడానికే బీజేపీనే.. షర్మిలతో పార్టీ పెట్టించిందని ఆయన ఆరోపించారు. ఢిల్లీలో కూర్చుని అమిత్ షానే ఇదంతా నడిపిస్తున్నారని చెప్పారు. ఏపీ సీఎం జగన్ కు కూడా ఇందులో పాత్ర ఉందన్నారు మధుయాష్కీ. రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడకుండా ఉండేందుకు కేసీఆర్ కూడా వీళ్లకు సహకరిస్తున్నారని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎన్ని కొత్త పార్టీలు వచ్చనా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా ఎవరూ ఆపలేరన్నారు మధుయాష్కీ. కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితంగా ఉండే, ఢిల్లీ రాజకీయ వర్గాలతో మంచి సంబంధాలున్న మధుయాష్కీ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ లక్ష్యంగానే షర్మిల పార్టీ వచ్చిందనే అభిప్రాయమే రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. అయితే షర్మిలతో పార్టీని కేసీఆర్ పెట్టించారా.. మధుయాష్కీ ఆరోపించినట్లు బీజేపీ ఉందా.. లేక షర్మిలే సొంతంగా అడుగులు వేస్తుందా అన్నది తేలాలంటే మరికొంత సమయం ఆగాల్సిందే..

విశాఖ స్టీల్ ప్లాంట్ పై వైసీపీ డ్రామాలు ఇన్నిన్ని కావయా! 

ముందు తేలుకుట్టిన దొంగలా ఊరుకున్నారు. మంట మండుతుంటే భయమేసి వాళ్లూ ఓ కట్టె వెలిగించారు. డ్రామా నడిపించారు. పైవోళ్లకి మాత్రం కన్నుకొట్టారు. కింద ఉద్యమానికీ జై కొట్టారు. ఈలోపు ఎన్నికలు అయిపోయాయి. హమ్మయ్య అనుకున్నారు. ఇక దాని సంగతి వదిలేశారు. ఇదేనా ఉద్యమం అంటే.. ఇదేనా బంద్ చేయటం అంటే అంటూ నడిరోడ్డు మీద జబర్దస్త్ లెవెల్లో స్కిట్లు వేసిన ఎంపీ.. ఆ తర్వాత ఆ విషయం పట్టించుకోవడం మానేశారు. ఇప్పుడు అదే పనిని పైవోళ్లు వేగంగా నడిపించేస్తుంటే.. ఈసారి కనీసం అటువైపు చూడను కూడా చూడటం లేదు.  విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తున్నారనగానే అంతా భగ్గుమన్నారు. పార్టీలకతీతంగా కార్మికులు, ఉద్యోగులు రోడ్డెక్కారు. ఎట్టిపరిస్ధితుల్లో ఆపాల్సిందేనని నినదించారు. అదే ప్రాంతంలో రాజధాని పెట్టి ఏలుదామనుకునే ఏలినవారికి ఈ పరిస్ధితి రుచించలేదు. అందుకే తన సహచర నిందితుడు విజయసాయిరెడ్డిని రంగంలోకి దింపారు. అసలు విశాఖ ఉక్కు కోసం ఏమైనా సమర్పిస్తాం అనే రేంజ్లో విజయసాయిరెడ్డి మంత్రి అవంతి శ్రీనివాస్ ను వెంటబెట్టుకుని ఉద్యమకారుల దగ్గరకెళ్లి మాట్లాడారు. ఉద్యోగసంఘాలు బంద్ కు పిలుపిస్తే.. ఆ బంద్ లో హైడ్రామా నడిపించారు. బంద్ ఇలా జరుపుతారా అంటూ వామపక్షాల కార్యకర్తలనే మీడియా లైవ్ లో ఎగతాళి చేశారు. ఏదో స్కిట్ చేస్తున్నట్లు ప్రశ్నలు, సమాధానాలు నడిపించి.. చివరకు వామపక్ష కార్యకర్తల చేతిలో చీవాట్లు తిన్నారు. అయినా తుడిపేసుకుని కథ ముందుకే నడిపించారు.  మరోవైపు వీరంతా ముందే కేంద్రానికి ఓకె చెప్పేశారని.. ఆ స్టీల్ ఫ్యాక్టరీ కొనడానికి వచ్చిన కంపెనీ ప్రతినిధులతో మీటింగులు పెట్టారని... వైసీపీ ఎంపీలే పార్లమెంటులో వేసిన ప్రశ్నలకు కేంద్రం ఎప్పుడో ప్రవైటీకరణపై క్లారిటీ ఇచ్చిందని..వీరికి విషయం ఎప్పుడో తెలుసని అందరికీ అర్ధమైపోయింది. దీని మీద జగన్మోహన్ రెడ్డి సైతం విశాఖ వచ్చి ఉద్యమ నేతలతో మీటింగ్ మమ అనిపించి.. అసలు స్టీల్ ఫ్యాక్టరీ ఎవరూ కొనడం లేదని.. ఆ కంపెనీ వాళ్లేదో పాపం వస్తే కడపలో పెట్టమని అడిగామని.. విశాఖ వైపు వారు చూడలేనది చిన్న పిల్లలు అబద్ధమాడినంత తియ్యగా చెప్పుకొచ్చారు. ఇన్ని రకాల డ్రామాలు నడిపించారు... చివరకు విశాఖ మున్సిపల్ ఎన్నికలయ్యేవరకు అదే ఊపు కొనసాగించారు. అవి అయిపోయాయి.. ఇక అంతే విశాఖ స్టీల్ ను పట్టించుకోవడమే మానేశారు.  కరోనా వేళ కాస్త మందగించిన ప్రైవేటీకరణ ప్రాసెస్ ను కేంద్రం ఇప్పుడు స్పీడప్ చేసింది.ఇక ప్రయివేటీకరణ తప్పదనే సంకేతాలు వచ్చేస్తున్నాయి. మహా అయితే రెండు, మూడు నెలల్లో అమ్మేస్తారని అర్ధమవుతోంది. అందుకే కార్మికులు,ఉద్యోగులు మళ్లీ రోడ్డెక్కారు. ఇప్పటికీ న్యాయం దక్కని నిర్వాసితులు సైతం వారితో జతకట్టారు. అయినా వైసీపీ నేతలు అటు వైపు చూడటం లేదు. పైగా ప్రయివేటీకరణను అడ్డుకుంటామని..అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే విశాఖ స్టీల్ ప్లాంట్ ను తీసుకుంటుందని బీరాలు పలికిన వైసీపీ ఎంపీలు, మంత్రులు ఇప్పుడు పత్తా లేరు. అవన్నీ అప్పటికప్పుడు ఎగసిపడ్డ జ్వాలను చల్లార్చడానికే చేశారని ఇప్పుడు అర్ధమవుతుంది. కేంద్రంలోని బిజెపికి ఎదురెళ్లి.. విశాఖ స్టీల్ ప్లాంట్ పై తాడో పేడో తేల్చుకునే పరిస్ధితి వైసీపీకి.. దాని అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేనే లేదు. ఇక ప్రతిపక్షాలు రంగంలోకి దిగి.. కార్మికులకు మద్దతుగా నిలబడి..విశాఖ ప్రయివేటీకరణను అడ్డుకోవాలని అందరూ కోరుతున్నారు  

నోట్ల కట్టలతో దొరికినోడు నీతులా.. రేవంత్ కు కేటీఆర్ కౌంటర్ 

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ టార్గెట్ గా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. పీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత జరిగిన సభలోనే కేసీఆర్ పై విరుచుకుపడ్డారు రేవంత్ రెడ్డి. కరోనా కంటే కేసీఆర్ ప్రమాదకరమని కామెంట్ చేశారు. దొర పాలనను అంతం చేస్తామని ప్రకటించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి కేటీఆర్. కెసిఆర్ అనే మహానేత నడుస్తుంటే కొంత మంది బిచ్చగాళ్ళు మొరుగుతున్నారని కామెంట్ చేశారు. అధికారాన్ని గుంజుకుంటామంటూ..కెసిఆర్ ను తిట్టి శునకానందం పొందుతున్నారని విమర్శించారు. టీవీల్లో బ్రేకింగ్ న్యూస్ ల కోసం కెసిఆర్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని కేటీఆర్ మండిపడ్డారు.  ఇక్కడ రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు సీఎం గా ఉన్నారనే విషయం మరచిపోవద్దని కేటీఆర్ సూచించారు. కెసిఆర్ ను ఎదుర్కోవాలంటే కెసిఆర్ కంటే ఎక్కువగా తెలంగాణ ను ప్రేమించగలగాలన్నారు. డైలాగ్ లు కొడితే కెసిఆర్ ను కొట్టలేరన్నారు కేటీఆర్. దుబ్బాక విజయం తో ఎగిరెగిరి పడిన బీజేపీ.. నాగార్జున సాగర్ లో  డిపాజిట్ కోల్పోయిందన్నారు కేటీఆర్. 77 నియోజకవర్గాల పరిధి లో జరిగిన రెండు ఎమ్మెల్సీ సీట్లను టీఆర్ఎస్ గెలిచిందన్నారు. కెసిఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నారన్నారు కేటీఆర్.  కొందరు పాదయాత్రలు చేస్తామని అంటున్నారు..  వారికి శుభాకాంక్షలు .కరోనా తర్వాత ఆరోగ్యమైనా కుదుట పడుతుందంటూ కేటీఆర్ సెటైర్లు వేశారు. పాదయాత్ర చేస్తే నైనా పల్లెలు టీ ఆర్ ఎస్ ప్రభుత్వ హాయం లో అభివృద్ధి చెందిన విషయం తెలుస్తుందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇంతటి అభివృద్ధి ఉందా పాదయాత్ర చేసే నేతకు కనిపిస్తుందని కామెంట్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు రైతు బంధు అమలు చేస్తున్నాయా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ,పాలమూరు ప్రాజెక్టు లకు బీజేపీ జాతీయ హోదా ఎందుకు ఇవ్వదని కేటీఆర్ నిలదీశారు. గతంలో సోనియాను బలి దేవత అన్న కొత్త పీసీసీ అధ్యక్షుడు.. ఇప్పుడు తెలంగాణ తల్లి అంటున్నారని కేటీఆర్ అన్నారు. రేపు చంద్రబాబు ను తెలంగాణ తండ్రి అన్నా అంటారన్నారు. రేవంత్ కు  టీడీపీ పాత వాసనలు పోలేదన్న కేటీఆర్..  టీపీసీసీ కాదు తెలుగుదేశం కాంగ్రెస్ అని హస్తం నేతలే అంటున్నారని చెప్పారు. నోట్ల కట్టలతో దొరికినోడు నీతులు చెబుతున్నాడని మండిపడ్డారు. పార్టీ మారిన వాళ్ళను రాళ్లతో కొట్టాలంటున్న నేత కూడా పార్టీ మారాడా కదా.. మరీ ఆయన్ను ఏ రాయితో కొట్టాలని కేటీఆర్ ప్రశ్నించారు..రాజస్థాన్ లో అశోక్ గెహ్లాట్ కూడా అదే చేశారు ?ఆయన్ను కూడా రాయితో కొట్టాలా ? అన్నారు కేటీఆర్. చిన్న పదవి రాగానే పీఎం పదవి వచ్చినట్టు బిల్డ్ అప్ ఇస్తున్నారని విమర్శించారు. కొత్త సినిమా విడుదలైనప్పుడు ఆగమాగం బ్యాచ్ లా ఉంది రేవంత్ తీరు ఉందన్నారు.బాధ్యతగా మాట్లాడటం నేర్చుకోవాలని కేటీఆర్ సూచించారు

కారెక్కనున్న ఎల్ రమణ? రేవంత్ రాకతో పొలిటికల్ హీట్.. 

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమించడంతో కాంగ్రెస్ లో పుల్ జోష్ కనిపిస్తోంది. కొంత కాలంకా దూకుడు మీదున్న బీజేపీ కూడా వేగంగా పావులు కదుపుతోంది. ఇప్పటివరకు కేంద్ర సహాయమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి... కేబినెట్ బెర్త్ దక్కడంతో కమలనాధుల్లోనూ కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఇక ప్రత్యర్థి పార్టీలకు ధీటుగానే అధికార టీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఇతర పార్టీల్లోని కీలక నేతలు కారెక్కేలా ప్రయత్నాలు చేస్తోంది.  కేసీఆర్ ఆకర్ష్ లో భాగంగానే  టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ టీఆర్ఎస్‌లో చేరడానికి ముహుర్తం ఖారారైందని తెలుస్తోంది. రమణ గులాబీ గూటికి చేరుతారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఖాయమైందని  ఊహాగానాలు వినిపించాయి. తాజాగా గురువారం  సీఎం కేసీఆర్‌తో సమావేశం రమణ కానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌తో కలిసి ఆయన సీఎం కేసీఆర్‌ను కలవనున్నట్లు సమాచారం. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో ఇప్పటి వరకే ఓసారి మంతనాలు జరిపారు ఎల్.రమణ . ఎమ్మెల్సీ పదవి ఇప్పించే బాధ్యత తనదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హామీ ఇచ్చినట్లు సమాచారం. రాజకీయ భవిష్యత్‌ను దృష్ట్యా టీఆర్ఎస్‌లో చేరాలని ఆయన నిర్ణయించుకున్నారట.  బీసీ నాయకునిగా ఎలగందుల రమణకు గుర్తింపు ఉంది . ఈ నినాదంతోనే కరీంనగర్ పార్లమెంటు నుంచి సీనియర్ అయిన చొక్కారావును ఓడించి సంచలనం సృష్టించారు . జగిత్యాలలో జీవన్ రెడ్డిని మట్టి కరిపించి చంద్రబాబు హయాంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. జగిత్యాల నియోజకవర్గంలో మంచి పట్టున్న నాయకుడు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలుగుదేశం నుంచి చాలా మంది నాయకులు బయటకు వెళ్లినా రమణ మాత్రం అలాగే ఉండిపోయారు. 2014 నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

రేవంత్‌.. ప‌వ‌న్‌.. ఎన్టీఆర్‌.. ముగ్గురి ముచ్చ‌టేంటి?

రేవంత్‌రెడ్డి. టీపీసీసీ అధ్య‌క్షులు. తెలంగాణ‌లో ప‌వ‌ర్‌ఫుల్ లీడ‌ర్‌. ఎప్ప‌టికైనా సీఎం అవుతాడ‌ని.. కుదిరితే ఈసారే ముఖ్య‌మంత్రి పీఠం అధిరోహిస్తార‌ని అంటున్నారు. రేవంత్ నాయ‌క‌త్వంలో కాంగ్రెస్ పార్టీ కొత్త ఉత్సాహంతో ఉర‌క‌లేస్తోంది. రేవంత్ దూకుడు మామూలుగా లేదిప్పుడు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌. జ‌న‌సేన అధినేత అలియాస్ ప‌వ‌ర్‌స్టార్‌. ఫుల్‌టైమ్ పాలిటిక్స్‌, పార్ట్‌టైమ్ మూవీస్‌. ప్ర‌స్తుతానికైతే రెండు ప‌డ‌వుల మీద కాళ్ల ప్ర‌యాణం కంటిన్యూ చేస్తున్నారు. తెలుగునాట పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్‌. ఆయ‌న అడుగేస్తే.. నోరు తెరిస్తే.. ఈల‌లు, కేక‌లు. అది సినిమానైనా.. రాజ‌కీయ‌మైనా. అయితే, బీభ‌త్స‌మైన క్రేజ్ అయితే ఉంది కానీ.. అది ఓట్ల రూపంలోకి మాత్రం మార‌డం లేదు. అభిమానులు ఫుల్లు. ఓట్లు నిల్లు. టీడీపీతో తెగ‌దెంపులు చేసుకొని రాజ‌కీయంగా పెద్ద త‌ప్పే చేశారంటారు. మ‌ళ్లీ ఆ రెండు పార్టీలు క‌లిస్తేనే.. ఏపీకి మంచి భ‌విష్య‌త్తని చ‌ర్చించుకుంటున్నారు. ఏనాటికైనా సీఎం అవుతాన‌ని.. రాజ‌కీయాల‌ను మార్చేస్తాన‌నేది ప‌వ‌న్‌ ధీమ‌. అందుకే, అన్నీ ప‌రాజ‌యాలే అయినా.. ఎప్ప‌టికైనా ఒక్క ఛాన్స్ వస్తుంద‌నే న‌మ్మ‌కంతోనే పాలిటిక్స్‌లో క‌మిటిమెంట్‌తో ప‌ని చేస్తున్నారు.  జూనియ‌ర్ ఎన్టీఆర్‌. ఎన్టీఆర్ మ‌న‌వ‌డిగా జూనియ‌ర్‌కు ఫుల్ క్రేజ్‌. నంద‌మూరి వార‌స‌త్వం అద‌న‌పు అడ్వాంటేజ్‌. ఓసారి రాజ‌కీయాల్లో వేలుపెట్టి.. చేయి కాల్చుకున్నారు. ఇప్పుడు ఆకులు ప‌ట్టుకుంటున్నారు. ఏనాటికైనా ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి రావాల‌ని.. వ‌స్తార‌ని.. సీఎం అవుతార‌నేది.. ఆయ‌న అభిమానులు ఆకాంక్ష.   ఇప్పుడు ఈ ముగ్గురి ప్ర‌స్తావ‌న తీసుకురావ‌డానికి కార‌ణం లేక‌పోలేదు. ఓ అంశంలో ఈ ముగ్గురి ప్ర‌వ‌ర్త‌న‌, ప్ర‌తిస్పంద‌న‌పై చ‌ర్చ న‌డుస్తోంది. తాజాగా, టీపీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి స్వీకరించాక‌.. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ శ్రేణుల‌ను ఉద్దేశించి మాట్లాడుతున్న స‌మ‌యంలో ఓ ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న జ‌రిగింది. అభిమానులు ఉత్సాహంతో సీఎం..సీఎం..సీఎం.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆ ప‌రిణామం రేవంత్‌రెడ్డికి తీవ్ర అస‌హ‌నం, ఆగ్ర‌హం తెప్పించింది. అలాంటి నినాదాలు వ‌ద్ద‌ని.. అందరం సమష్టిగా కలిసి పని చేస్తామని... అధిష్ఠానం నిర్ణయాలకు కట్టుబడి ఉంటామంటూ.. ఎవరూ అలాంటి నినాదాలు చేయొద్దంటూ కాస్త గ‌ట్టిగానే హెచ్చ‌రించారు. ఈ రోజు నుంచి జై సోనియా, జై రాహుల్ గాంధీ నినాదాలు మాత్రమే వినిపించాలని, ఎవరైనా వ్యక్తిగత నినాదాలు ఇస్తే పార్టీ నుంచి బహిష్కరిస్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. ఆయ‌న ఇచ్చిన వార్నింగ్ ఇక్క‌డ ఇంట్రెస్టింగ్ పాయింట్‌. సీఎం..సీఎం.. అంటూ నినాదాలు చేయ‌డం రేవంత్‌కు లాభం కంటే న‌ష్ట‌మే ఎక్కువ చేస్తుంద‌నేది ఆయ‌న అంచ‌నాలా ఉంది. కాంగ్రెస్‌లో ఎవ‌రైనా పైకొస్తున్నారంటే తొక్కేసే ప్ర‌యత్నాలు పెరుగుతుంటాయి. అందులోనూ, అధిష్టానం చెప్పే వ‌ర‌కూ ఎవ‌రూ సీఎం అభ్య‌ర్థి కానేకారు. ఫ్యాన్స్ ఇప్ప‌టినుంచే రేవంత్‌రెడ్డిని కాబోయే సీఎంగా ప్ర‌మోట్ చేస్తే.. అది పార్టీ లైన్‌ను విభేదించిన‌ట్టు అవుతుంద‌ని.. అది త‌న‌ను ఇర‌కాటంలో ప‌డేస్తుంద‌నేది రేవంత్ భావ‌న‌లా ఉంది. అందుకే, మ‌న‌సులో త‌న‌కు సీఎం కావాల‌ని ఉన్నా.. తానే కాబోయే సీఎంన‌ని ధీమాగా ఉన్నా.. అభిమానుల‌ను మాత్రం గ‌ట్టిగా హెచ్చ‌రించి.. ఇలాంటి నినాదాలు వ‌ద్దంటూ వార్నింగ్ ఇవ్వ‌డం ఆస‌క్తిక‌రం.  అదే, ప‌వ‌న్‌క‌ల్యాణ్ అలా కాదు. ఆయ‌న స్టైలే వేరు. పీకే క‌నిపిస్తే చాలు సీఎం..సీఎం.. అంటూ ఒక‌టే గోల‌. ఆ నినాదాల‌ను ప‌వ‌న్ సైతం బాగా ఎంజాయ్ చేస్తుంటారు. ప్ర‌సంగాల‌కు ఎంత‌గా డిస్ట‌ర్బ్ అవుతున్నా.. ఎక్క‌డా వారిని స్లోగ‌న్స్ వ‌ద్దంటూ గ‌ట్టిగా వారించింది లేదు. వారి అభిమానం వారిది అంటుంటారు. తాను సీఎం అయితే త‌ప్పేంటి? ఎందుకు కాకూడ‌దు? ఏనాటికైనా తాను సీఎం కావొచ్చున‌ని.. ఆయ‌నే స్వ‌యంగా ప‌లు సంద‌ర్భాల్లో అన్నారు కూడా. అందుకే, తాను సీఎం అవుతానంటూ ఆయ‌న అనుకోవ‌డంతో పాటు.. అభిమానుల‌ను సైతం అలాంటి నినాదాలు చేస్తుంటే తెగ ఎంజాయ్ చేస్తుంటారు.  ఇక‌, జూనియ‌ర్ ఎన్టీఆర్‌. ప్ర‌స్తుతం సినిమాల‌తో ఫుల్‌బిజీ. టీడీపీ కాస్త ఇబ్బందుల్లో ఉండ‌టంతో జూనియ‌ర్ రావాలంటూ ఈ మ‌ధ్య‌ అభిమానులు హ‌డావుడి మొద‌లుపెట్టారు. ఇటీవ‌ల ఓ సినిమా ఫంక్ష‌న్‌లో ఎన్టీఆర్ మాట్లాడుతుండ‌గా.. ఫ్యాన్స్ సీఎం..సీఎం..అంటూ స్లోగ‌న్స్ ఇవ్వ‌డంతో జూనియ‌ర్‌కు చిర్రెత్తుకొచ్చింది. ఆగండి..బ్ర‌ద‌ర్‌.. అంటూ కాస్త గ‌ట్టిగానే వారిని కంట్రోల్ చేశారు. త‌న‌కు ఇప్ప‌ట్లో రాజ‌కీయాల్లోకి వ‌చ్చే ఇంట్రెస్ట్ లేదంటూ ప‌రోక్షంగా స్ప‌ష్టం చేశారు.  ఇలా.. అభిమానుల నుంచి సీఎం..సీఎం..సీఎం... అంటూ వ‌చ్చే నినాదాల‌పై ఈ ముగ్గురు నేత‌ల స్పంద‌న మూడు ర‌కాలుగా ఉండ‌టం ఆస‌క్తికరం. అంద‌రికీ సీఎం కావాల‌నే ఉంటుంది. కానీ, ఓపెన్ అయ్యారు.. ఇంకెక‌రు ఓపెన్ కాకుండా ఉన్నారు.. ఇంకొక‌రు సైలెన్స్ మెయిన్‌టెయిన్ చేస్తున్నారు. ఇలా.. ఎవ‌రి దారులు వారివే. ఎవ‌రి స్టైల్ వారిదే.