అవును.. ఆ ఇద్దరు ఒకటయ్యారు! అన్న బండారం బయటపెట్టిన చెల్లె..

వైఎస్సార్ టీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఇలా పార్టీ పేరు ప్రకటించి, అలా జెండా ఎగరేసారో లేదు, జగనన్నపై తొలి బాణం వేశారు. అయితే ఆమె తెలిసి, ఈ బాణం సంధించారా, లేక అసలు సమస్యను పక్కదారి  పట్టించేందుకే ఈ వ్యాఖ్య చేశారా, అన్నది అలా ఉంచితే, ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య సాగుతున్న జల వివాదానికి సంబదించి షర్మిలా చేసిన మూడు ముక్కల వ్యాఖ్య, జగనన్నను  అష్ట దిగ్బంధనం చేసింది.  వైఎస్సార్ టీపీ ఆవిర్భావ సభలో షర్మిల, ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీస్తున్న జల వివాదం  అంశాన్ని ప్రస్తావిస్తూ,  ఇద్దరు ముఖ్యమంత్రులు రెండు నిమిషాలు కూర్చొని మాట్లాడుకోలేరా..? జల వివాదాన్ని పరిష్కరించుకోలేరా..? అని ప్రశ్నించారు. అంతే అయితే అది  అలా కొట్టుకుపోయేదేమో కానీ, ఆమె గతంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి చేసుకున్న విందులు వినోదాల వివరాలతో పాటుగా,ఇద్దరు కలిసి ఉమ్మడి శత్రువు (చంద్రబాబు)ను ఓడించారని  అన్నారు. ఆ విధంగా  ఆమె కేసీఆర్, జగన్ రెడ్డి మధ్య ఉన్న సీక్రెట్ లవ్ అఫ్ఫైర్, ను బయట పెట్టార్టు. అంటే, గత ఎన్నికలలో ఇద్దరికీ ఉమ్మడి శత్రువు చంద్రబాబు నాయుడుని ఓడించేందుకు ఆ ఇద్దరూ ఒక టయ్యారని షర్మిల్ చెప్పకనే చెప్పారు.  నిజానికి, ఇది కొత్త విషయం కాదు, 2019 ఎన్నికల్లో చంద్రబాబును ఓడించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైసీపెకి,జగన్ రెడ్డికి  అన్ని విధాల సహాయ సహకారాలు అందించారని, అనేక సందర్భాలలో వివిధ పార్టీల నాయకులు విమర్శించారు. అలాగే, ఎన్నికల తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు, అవును ఆ ఇద్దరూ ... అనుకునేలా చెట్టాపట్టాలేసుకు తిరిగారు. విందులు, వినోదాలు, కౌగిలింతలు, శాలువలు, బొకేలు, పూలదండలు, ఫ్యామిలీ మీట్స్ ఒకటేమిటి, అనేక రకాలుగా ఒకటిగా కలిసి పోయారు. అయితే ఇప్పుడు అదే ఆరోపణ జగనన్న వదిలిన బాణం షర్మిల నోటి నుంచి రావడంతో టీడీపీ ఆరోపణలకు బలం చేకూరింది. అందుకే, ఇప్పుడు షర్మిల ప్రశ్నకు సమాధానం చెప్పమని ఏపీ టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబును ఓడించేందుకు 2019ఎన్నికలకు ముందు నుంచే కేసీఆర్ వ్యూహత్మకంగా జగన్ తో చేతులు కలిపారు. ఒక దశలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్, ఏపీకి వచ్చి మరీ  రిటన్ గిఫ్ట్ ఉంటుందని చంద్రబాబుపై కామెంట్స్ చేశారు. ఆ సమయంలో టీడీపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. అప్పటి నుంచే చంద్రబాబును ఓడించేందుకు పథక రచన చేశారని షర్మిల వ్యాఖ్యలే దానికి నిదర్శనమని టీడీపీ నాయకులు అంటున్నారు. ఎన్నికల సమయంలో జగన్’కు కేసీఆర్ డబ్బులు పంపారని టీడీపీ మొదట్నుంచి ఆరోపిస్తోంది. ఇప్పుడు షర్మిల చేసిన ఒక్క కామెంట్ తో అది రుజువైందని అంటున్నారు విశ్లేషకులు.  షర్మిల చేసిన ఈ ఒక్క కామెంట్ పై తెలుగురాష్ట్రాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. కుట్ర చేసి చంద్రబాబును ఓడించారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. వైసీపీ శ్రేణులు సామెతల చాటున సమాధానం దాట వేస్తున్నారు. టీడిపి ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ అయితే,  తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన జల వివాదం పై ముఖ్యమంత్రి వద్ద షర్మిల అడిగిన ప్రశ్నకు సమాధానం ఉందా అంటూ ప్రశ్నించారు. పార్టీ పుట్టి పుట్టక  ముందే షర్మిల చేసిన వ్యాఖ్యలు ఇంత దుమారం సృష్టిస్తే, ముందుముందు ఇంకెంత రచ్చ చేస్తాయో అన్నమాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.  అయితే, అదే సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ... వైఎస్ షర్మిల ఒకే తల్లి బిడ్డలు ...అనే విషయం మరిచి పోరాదని, అలాగే  వైఎస్సార్ సీపీ, వైఎస్సార్ టీపీ.. కూడా ఒకే దేవుని బిడ్డలు అనే నిజాన్ని, మరిచి పోరాదని కూడా రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అలాగే, షర్మిల పార్టీ వెనక  ముందు ఎవరు న్నారు అనే ప్రశ్నకు ఇంకా స్పష్టమైన సమాధానం రాలేదన్న విషయాన్ని విస్మరించరాదని విశ్లేషకులు అంటున్నారు.చూడాల్సింది చాలా వుంది   

నిమిషానికి 11 చావులు.. కరోనా కన్నా ఆకలి వైరసే డేంజర్

కరోనా మహమ్మారి 20 నెలలుగా ప్రపంచాన్ని వణికిస్తోంది. రూపం మార్చుకుంటూ విజృంభిస్తూ మరణ మృదంగం మోగిస్తోంది. కరోనా కాటుకు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే లక్షలాది మంది చనిపోయారు. కోట్లాది మంది బాధితులుగా మిగిలిపోయారు. ఇంకా కరోనా వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది. ఇటీవలే ఇండియాలో కల్లోలానికి కారణమైన డెల్టా వేరియంట్.. ఇప్పుడు అమెరికా సహా పలు దేశాలను గజగజలాడిస్తోంది. కరోనా మహమ్మారితో నిమిషానికి ఏడుగురు చనిపోతున్నట్లు వివిధ దేశాలు వెల్లడిస్తున్న రిపోర్టుల ఆధారంగా తెలుస్తోంది. కరోనా కంటే మరో డేంజర్ వైరస్ ప్రపంచంలో ఉందని తాజాగా వెల్లడైంది. ఆ వైరస్ తో నిమిషానికి 11 మంది ప్రాణాలు కోల్పోతున్నారని తేలింది. ఆ వైరస్ మరేదో కాదు ఆకలి. అవును తినడానికి తిండి లేక ప్రపంచ వ్యాప్తంగా నిమిషానికి 11 మంది చనిపోతున్నారని ఒక నివేదిక వెల్లడించింది. ‘ద హంగర్ వైరస్ మల్టిప్లైస్ (ఆకలి వైరస్ అధికమైంది)’ పేరిట విడుదల చేసిన ఆ నివేదికలో ఇంకా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తున్న ఆక్స్ ఫాం అనే సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం నిమిషానికి 11 మంది ఆకలికి తట్టుకోలేక, తినడానికి తిండి లేక చనిపోతున్నారు. ఈ ఏడాది కరోనా తెచ్చిన కష్టంతో ప్రపంచంలోని 15.5 కోట్ల మంది తీవ్రమైన ఆహార సంక్షోభంలో కూరుకుపోయారని తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే ఆ సంఖ్య 2 కోట్లు పెరిగిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వారిలో 66 శాతం మంది సైనిక సంక్షోభంలో చిక్కుకున్న దేశంలోని వారేనని తెలిపింది. కరోనా, లాక్ డౌన్ లతో ముదిరిన ఆర్థిక సంక్షోభానికి తోడు యుద్ధ సంక్షోభంతో దాదాపు 5.2 లక్షల మంది ఆకలి చావులకు గురయ్యారని ఆక్స్ ఫాం ఆవేదన వ్యక్తం చేసింది.  చాలా దేశాలు కరోనా ఉన్నా తమ తమ బలగాల పటిష్ఠత కోసం 5,100 కోట్ల డాలర్లను ఖర్చు చేశాయని, అది ప్రపంచంలోని పేదల ఆకలి తీర్చేందుకు ఐక్యరాజ్యసమితి ఖర్చు చేయాలనుకున్న దాని కన్నా ఆరు రెట్లు ఎక్కువని వెల్లడించింది. ఆఫ్ఘనిస్థాన్, ఇథియోపియా, దక్షిణ సూడాన్, సిరియా, యెమన్ వంటి యుద్ధ సంక్షుభిత దేశాల్లో ఆకలి చావుల తీవ్రత చాలా ఎక్కువగా ఉందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. మహమ్మారి వల్ల విధించిన లాక్ డౌన్ లతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని, దాంతో ఆహార పదార్థాల ధరలు ప్రపంచవ్యాప్తంగా 40 శాతం వరకు పెరిగాయని, అది ఈ దశాబ్దంలోనే అత్యంత ఎక్కువని ఆవేదన చెందింది. అది కూడా నిరుపేదలను ఆకలి రాజ్యంలోకి నెట్టేసిందని ఆక్స్ ఫాం నివేదికలో వెల్లడించింది. 

రేవంత్ రెడ్డిపై హరీష్ రావు సంచలనం..

పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకంతో తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెరిగింది. ఇప్పటికే దూకుడుగా వెళుతున్న బీజేపీ మరింత స్పీడ్ పెంచింది. అధికార టీఆర్ఎస్ నేతలు కూడా వాయిస్ పెంచుతున్నారు. పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా జరిగిన సభలో మాట్లాడిన రేవంత్ రెడి... సీఎం కేసీఆర్ తో పాటు గులాబీ లీడర్లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో రేవంత్ కు కౌంటర్లు ఇస్తున్నారు కారు పార్టీ నేతలు. ఆగమాగం బ్యాచ్ అడ్డగోలుగా మాట్లాతుందని కేటీఆర్ కామెంట్ చేశారు. అడ్డంగా పట్టుబడిన దొంగలు కూడా నీతులు చెబుతున్నారంటూ రేవంత్ ను టార్గెట్ చేశారు. తాజాగా మంత్రి హరీష్ రావు కూడా రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.  రేవంత్ రెడ్డి ముసుగులో టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణలో మళ్లీ అడుగుపెట్టారని మంత్రి హరీశ్ రావు అన్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని తెలంగాణలో గెలవాలని చంద్రబాబు ప్రయత్నించారని... అయితే చంద్రబాబుని ఆంధ్రబాబు అంటూ తెలంగాణ ప్రజలు వెళ్లగొట్టారని చెప్పారు. టీడీపీ ముఖం పెట్టుకుని వస్తే చంద్రబాబుని తెలంగాణ ప్రజలు రానివ్వరని... అందుకే తన మనుషులను కాంగ్రెస్ పార్టీలోకి ముందు పంపి, ఇప్పుడు చంద్రబాబు అడుగుపెడుతున్నారని హరీష్ రావు విమర్శించారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన రేవంత్ రెడ్డి ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడిగా వచ్చారని హరీశ్ అన్నారు. వీరిద్దరూ ఓటుకు నోటు కేసులో ఉన్నవాళ్లేనని చెప్పారు హరీష్ రావు.

రేవంత్ రెడ్డా.. కోవర్ట్ రెడ్డా? ఎమ్మెల్యే రోజా హాట్ కామెంట్స్..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి వివాదం కొనసాగుతోంది. ఇరు రాష్ట్రాల మంత్రులతో పాటు వివిధ పార్టీల నేతలు ఘాటు వ్యాఖ్యలు చేస్తూ కాక రేపుతున్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి కేసీఆర్, జగన్ ను టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేశారు. జల వివాదం పేరుతో రాజకీయ డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. రోజా ఇంట్లో కేసీఆర్, జగన్ చర్చలు జరిపారని  అన్నారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు  వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా కౌంటరిచ్చారు.  ’మా ఇంట్లో సీఎం కేసీఆర్, జగన్ ల మంతనాలు జరిగాయని రేవంత్ రెడ్డి అంటున్నారనీ, జగన్ మా ఇంటికి ఎప్పుడు వచ్చాడో రేవంత్ రెడ్డి నిరూపించాలని’ ఎమ్మెల్యే రోజా సవాల్ విసిరారు.  కేసీఆర్ దైవ దర్శనం కోసం తమిళనాడుకు వెళ్తూ మార్గం మధ్యలో ఉన్న మా ఇంటికి వచ్చారే తప్ప ఎలాంటి మంతనాలు జరగలేదని  రోజా స్పష్టం చేశారు. ఆయన రేవంత్ రెడ్డా, కోవర్ట్ రెడ్డో ముందు చెప్పాలని అన్నారు. రేవంత్ రెడ్డి చేస్తున్న రాజకీయం చూస్తుంటే రేవంత్ రెడ్డి ఒక కోవర్ట్ రెడ్డి అని అర్థమవుతోందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడాల్సింది కేంద్ర ప్రభుత్వమేననీ, జలవివాదం పరిష్కరించాల్సింది కేంద్రమే కాబట్టి సీఎం జగన్ ప్రధాని మోడీకి, జలశక్తి మంత్రికి లేఖ రాశారని చెప్పారు. దేశంలోనే వెనుకబడిన ప్రాంతానికి నీళ్లు రాకుండా అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని ఎమ్మెల్యే రోజా ఆవేదన వ్యక్తం చేశారు. జల వివాదంలో అనవసరంగా వాగుతున్నవారి విజ్ఞతకే ఆ విషయాన్ని వదిలేస్తున్నానని అన్నారు. తమ హయాంలో నీటి వివాదాలే లేవని చంద్రబాబు, లోకేష్ అంటున్నారని, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రా, తెలంగాణ పోలీసులు కొట్టుకున్న విషయాన్ని మర్చిపోయారా అని గుర్తు చేశారు. టీడీపీ జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడం చూస్తుంటే.. దెయ్యాలు వేదాలు వళ్లించినట్లు ఉందని వ్యాఖ్యానించారు.

అమ్మాయిని మంచానికి కట్టేసి మరీ..

ఈ ప్రపంచం అభివృద్ధిలో ఆచరణలో ముందుకు వెళ్తుంటే.. కొన్నీ దేశాలు అభివృద్ధిలో వెనక్కి.. అమ్మయిలపై దాడులు చేయడంలో ముందుకు వెళ్తుంది. అన్ని దేశాలు 2021 ఉంటే  దేశాల్లో ఇంకా నైంటీస్లో  ఉన్న ఆచారాలు.. ఆలోచనలతోనే నడుస్తుంది.. కొన్ని దేశ ప్రజల ఆలోచనలు ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటే రాజకీయనాకుల పరిపాలన గ్రౌండ్ ఫ్లోర్ లో ఉందని చెప్పాలి...మహిళల పై అత్యాచారాలు జరుగుతుంటే చోద్యం చూస్తున్నాయి మన ప్రభుత్వాలు. ఇంకా మన దేశంలో కూడా  నాటితో పాలిస్తే మహిళలపై దాడులు చెలరేగిపోతున్నాయి.. తాజాగా బెంగళూరులో బంగ్లాదేశ్ యువతిపై గ్యాంగ్ రేప్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. బెంగళూరులో మే లో బంగ్లాదేశ్ యువతిపై అత్యాచారం జరిగింది. ఈ కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 12 మంది నిందితులను అరెస్ట్ చేశారు. 22ఏళ్ల యువతిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితులు ఆ ఘటనను వీడియో తీసి వైరల్ చేశారు. అరెస్ట్ అయిన 12 మందిలో 11 మంది బంగ్లాదేశ్ వారే కాగా, వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉండడం గమనార్హం. పూర్తి వివరాల్లోకి వెళితే రెండేళ్ల క్రితం బంగ్లాదేశ్ నుంచి బెంగళూరు వచ్చిన బాధిత యువతి ఓ బార్‌లో డ్యాన్సర్‌గా పని చేస్తోంది..  అంతకుముందు కూడా ఆమె దుబాయ్‌లో బార్‌లో పనిచేసేది. భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన యువతి తొలుత హైదరాబాద్‌లో ఓ మసాజ్ పార్లర్‌లో పనిచేసింది. ఈ క్రమంలో తనకు పరిచయం ఉన్న నలుగురు యువకులు, ఇద్దరు యువతులను బంగ్లాదేశ్ నుంచి అస్సాం మార్గంలో భారత్‌లోకి అక్రమంగా రప్పించి అక్కడితో ఉరోకోక బెంగళూరులో స్థిరపడేలా చేసింది. నగరంలోని సుబ్రహ్మణ్యస్వామినగరలో ఇంటిని అద్దెకు తీసుకుని అదే చిరునామాతో ఆధార్ కార్డులను కూడా సమకూర్చిపెట్టింది. వాళ్ళకి మన దేశంలో ఆధార్ కార్డు ఇచ్చారంటే మన వాళ్ళు వందలు అమ్ముడుపోయుంటారు లేకపోతే ఆ అమ్మాయికి ఆధార్ కార్డు ఎలా వస్తుంది.. ఇక ఈ విషయాన్నీ పక్కన పెడితే..   సహాయం చేసినవాడు మోసం చెయ్యడం సర్వసాధారణమైన ఈ రోజుల్లో..ఆమె సాయంతో నగరానికి వచ్చి కుదురుకున్న వారు తర్వాత ఆమెను బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దింపారు. అంతేకాక, ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చే యువతులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని వృభిచారంలోకి దింపేవారు. వారి చెరలో చిక్కుకున్న బాధితురాలు తను వ్యభిచారం మానేసి సొంతంగా స్పా పెట్టుకుంటానని తెగేసి చెప్పింది. ఇప్పటి స్నేహితులే రేపటి పగవారు అని చెప్పినట్లు.. ఈ క్రమంలో వారి మధ్య నగదు లావాదేవీల విషయంలో గొడవ మొదలైంది. స్పా పెట్టవద్దంటూ యువతిని మంచానికి కట్టేసి సామూహిక అత్యాచారానికి పాల్పడి వీడియో తీశారు. ఆమె ప్రైవేటు భాగాలపై మద్యం సీసాలతో దాడిచేశారు. అదే నెల 19న వీడియో సోషల్ మీడియాలో కనిపించింది. ఇది వైరల్ అవుతుండగానే మరో వీడియోను పోస్టు చేశారు. ఈ వీడియోలను చూసిన కొందరు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అప్పట్లోనే నలుగురు యువకులు, ఇద్దరు యువతులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన హకీల్, బంగ్లాదేశ్‌కు చెందిన సాగర్, మహ్మద్ బాబా కేశ్, రియాద్ బాబు, నస్రత్, కాజల్‌లను నిందితులుగా గుర్తించారు. నస్రత్, కాజల్ ఇద్దరూ రియాద్ బాబు భార్యలు కావడం గమనార్హం. రియాద్, సాగర్ పారిపోయే క్రమంలో పోలీసుల కాల్పుల్లో గాయపడ్డారు. నిందితులపై మానవ అక్రమ రవాణా, అత్యాచారం, నిర్భయ తదితర చట్టాల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుని 5 వారాల వ్యవధిలోనే చేధించామని బెంగళూరు పోలీస్ కమిషనర్ కమల్ పంత్ ట్వీట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన చార్జిషీటును కోర్టుకు సమర్పించామని తెలిపిన కమిషనర్.. కేసు దర్యాప్తు చేసిన బృందాన్ని ప్రశంసించారు. అలాగే లక్ష రూపాయల రివార్డును కూడా ప్రకటించారు.       

రాముడి రాజ్యమా.. రౌడీ రాజ్యమా..?

అక్కడ రామ రాజ్యం స్థాపించాలని ఉద్దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ అక్కడ జరుగుతున్న దారుణాలు మరెక్కడా జరగడం లేదు.. రామరాజ్యమా మజాకా అది ఏ రాష్ట్రంలో ఇప్పటికే మీకు అర్థం అయివుంటుంది.. అదే  ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రము. తాజాగా ఇక్కడ ఒక దారుణమైన ఘ‌ట‌న చోటు చేసుకుంది. మరో  మహాభారత గాధను తలపించింది. భారతం లో నిండు సభలో ద్రౌపతి చీర లాగిన విషయం అందరికి తెలిసిందే.. కానీ ఇక్కడ రామరాజ్యంలో నడిరోడ్డు మీద ఓ మహిళా చీరను లాగారు. రామాయణాన్ని, మహాభారతాన్ని తమ బుజాల మీద మోసే బిజెపి పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రము కదా ఆ మాత్రం మహిళనకు అవమానం జరగాలి మరి. అసలు మహిళలు అంటే బిజెపి నాయకులే విలువైయ్యారు.. మొన్నటికి మొన్న ఓ బిజెపి నాయకుడు బాల్యవివాహాలు చేయాలి అని చెప్పాడు.. ఇలా చెపుతూపోతే చరిత్ర మరిచిన నిజాలు ఎన్నో ఉన్నాయి బిజెపి మీద..   వివ‌రాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్‌ ఖేరీ ప‌రిధిలో పంచాయతీ ఎన్నికలకు ఓ అభ్యర్థి నామినేషన్‌ను ప్రతిపాదించ‌డానికి స‌మాజ్ వాదీ పార్టీకి చెందిన ఓ మ‌హిళ నామినేషన్ కేంద్రానికి వెళుతోంది. ఆ స‌మ‌యంలో ఆమె ద‌గ్గ‌ర‌కు వెళ్లిన‌ ప్రత్యర్థులు ఆమెను అడ్డుకున్నారు.. అయినా సరే ముందుకు వెళ్లాలనే ఆమె  ప్రయత్నం వదిలిపెట్టలేదు.. అయితే చివరికి ఆ నీచులు ఆమె చీర కొంగును ప‌ట్టుకుని లాగారు. ఆమె చేతిలోని అభ్యర్థి ప్రతిపాదన పత్రాలను లాక్కున్నారు. మానవత్వం మరిచి మరి నీచంగా ప్రవర్తించారు. ఈ అన్యాయాన్ని చూసి సహించని కొంత మంది ఆమెకు మద్ధతుగా కొంద‌రు ముందుకు వ‌చ్చి విడిపించారు. దీనిపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ప‌లు వివ‌రాలు సేక‌రించారు. స‌మాజ్ వాదీ పార్టీ అభ్యర్థి ఎన్నికలో పోటీలో నిల‌వ‌కుండా చేసి త‌మ అభ్య‌ర్థిని ఏకగ్రీవం చేసేందుకే వాళ్లు ఆమెపై దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. బీజేపీ కార్య‌క‌ర్త‌లే దాడికి పాల్ప‌డ్డార‌ని సమాజ్‌వాదీ పార్టీ నేత‌లు అరోపిస్తున్నారు. అధికార దాహంతోనే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు చెందిన గూండాలు ఇటువంటి దారుణాల‌కు పాల్ప‌డుతున్నార‌ని స‌మాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. మ‌హిళ‌పై దారుణానికి పాల్ప‌డిన ఈ వీడియోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసిన కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ వాద్రా కూడా విమ‌ర్శ‌లు గుప్పించారు. యూపీలో 825 పంచాయతీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.   ఆ ఘటనపై సామాన్య జనం కూడా స్పందిస్తూ..  రామ రాజ్యం అంటే ఇదేనా..?  దేశభక్తులం అని చెప్పుకునే వాళ్ళు మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా.. ? ఆడది అంటే వంటింటికి మాత్రమే పరిమితం కావలి చెపుతున్నారా ? లేదా మహిళలు ఎన్నికల్లో పోటీచేయడం తమకు తమ పార్టీకి ఇష్టం లేదని చెపుతున్నారా? లేదా దళితులు దళితులుగానే ఉండాలి.. ఇంకా మను సిద్ధాంతం ఈ దేశం లో అమలుకావాలని ఆలోచిస్తున్నారా అని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి..           

బీజేపీ జనసేన బంధం .. ఉన్నట్లా .. లేనట్లా ? 

భారతీయ జనతా పార్టీ, ఆంధ్ర ప్రదేశ్’పై ఆశలు వదిలేసుకుందా?ఏమి చేసినా,ఎన్ని రకాలుగా వ్యుహాలు మార్చినా ఫలితం లేకపోవడంతో ఏపీని కమలదళం పక్కన పెట్టేసిందా? అందుకేనా, కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో ఇరుగుపొరుగు రాష్ట్రాలకు ఇచ్చిన కొద్దిపాటి ప్రాధాన్యత కూడా ఏపీకి  ఇవ్వలేదా? అంటే,అవుననే సమాధానమే వస్తోంది.  నిజానికి, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్’లో కూడా బీజేపీకి ఆంధ్ర ప్రాంతం (ప్రస్తుత ఏపీ)లో చెప్పుకోదగ్గ బలం, బలగం ఎప్పుడూ  లేదు. ఎప్పుడో ఒకటి రెండు సందర్భాలలో, ఒంటరిగా పోటీ చేసి కొంత బలాన్ని పుంజుకున్నా,అది ప్రామాణికంగా తీసుకోలేము. (1998 ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగాపోటీ చేసిన బీజేపీ 18 శాతం ఓట్లతో, కాకినాడ, రాజమండ్రి లోక్ సభ స్థానాలను గెలుచుకుంది) అయినా అదంతా గతం. గతానికి ప్రస్తుతానికి మధ్య చాలా చాలా  రాజకీయ మురికి సముద్రంలో కలిసిపోయింది. చివరకు రాష్ట్రమే విడిపోయింది.   ఇక ప్రస్తుతానికి వస్తే, 2014 సార్వత్రిక ఎన్నికలలో తెలుగు దేశం పార్టీతో కలిసి, జనసేన సహకారంతో పోటీ చేసిన కమల దళం, 4.13 శాతం ఓట్లతో రెండు ఎంపీ సీట్లు, నాలుగు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది.అయితే, 2019 ఎన్నికల నాటికి సీన్ మారిపోయింది. బీజేపీ, టీడీపీ, జనసేన విడిపోయాయి.ఎవరి దారిన వారు పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి నోటా కంటే తక్కువ శాతం ఓట్లు పోలయ్యాయి. ఒక్క సీటు రాలేదు.సరే, ఆఎన్నికల్లొ  తెలుగు దేశం పార్టీ కూడా మూల్యం చెల్లించింది. అధికారం కోల్పోయింది.అలాగే, కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కూడా ఓటమి చవిచూశారు. వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.   అదలా ఉంటే ఇక అప్పటి నుంచి బీజేపీ ఒంటరిగా ఎదుగుతామంటూనే, పొత్తుల ప్రయత్నాలు చేస్తోంది. వ్యుహాలు మారుస్తూ రాష్ట్రంలో బలపడేందుకు ఏవేవో  ప్రయోగాలు చేస్తోంది.  పవన్  కళ్యాణ్ పార్టీ, జనసేనతో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకుంది. మరోవంక వైసీపీతో లోపాయికారి బంధం ఏదో బలపడుతున్నసంకేతాలు స్పష్టమవుతున్నాయి. అయితే, వైసీపీ వ్యవహరానై కాసేపు పక్కన పెట్టినా, బీజేపీ, జనసేన పొత్తు కూడా ఉండీ లేనట్లుగా, తుమ్మితే ఊడిపోయే ముక్కులా ఉగిసలాడుతోంది. నిజానికి 2019లో రెండు పార్టీలమధ్య పొత్తు కుదిరిన సమయంలో, అప్పటి బీజేపీ  రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారయణ, పవన్ కళ్యాణ్ సంయుక్త ‘గర్జన’ చేశారు. ఇక పై ప్రతి కార్యక్రమం రెండు పార్టీలు కలిసే చేస్తాయని, వైసీపీ ప్రభుత్వంఫై ఉమ్మడి పోరాటం సాగిస్తామని, పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు పొత్తు ఉంటుందని ప్రకటించారు. ఇక అంతే ఆ తర్వాత కన్నా స్థానంలో సోము వీర్రాజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత కూడా,  రెండు పార్టీలు కలిసి చేసిన పోరాటాలు లేవు. అఫ్కోర్స్, ఒంటరిగా చేసిన పోరాటాలు లేవు, వీధి పోరాటాలు చేసే పరిస్థితులు లేవనుకోండి,అది వేరే విషయం. ఒక్క తిరుపతి ఉపఎన్నిక సందర్భంలో తప్పించి, మరెక్కడా రెండు పార్టీల నాయకులు,కార్యకర్తలు కలసి పనిచేసిన సందర్భం, చేపట్టిన కార్యక్రమం ఒక్కటీ లేదు. తిరుపతి ఫలితం ఏమిటో వేరే చెప్పనక్కర లేదు.  అదలా ఉంటే మొన్నటి మంత్రి వర్గ విస్తరణ సమయంలో పవన్ కళ్యాణ్’కు బెర్త్ ఖాయం అన్న వార్తలు అయితే వచ్చాయి కానీ, అవి గాలి వార్తలని తేలిపోయింది. బెర్త్ ఇవ్వక పొతే పోయారు, ఇతర మిత్ర పక్షాలకు పంపినట్లు ఒక ఆహ్వానం అయినా, పవన్ కళ్యాణ్’కు అందిదో లేదో కూడా అనుమానమే. రెండు పార్టీల మధ్య బీజేపే జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో పొత్తు కుదిరిన తర్వాత ప్రధాని మోడీని పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఒక్కసారి  కూడా కలవలేదు. ఒకే ఒక్కసారి, అమిత్ షాతో అది కూడా విశాఖ ఉక్కు విషయంపై సమావేశమయ్యారు. ఆ సమావేశంలో ఆయన ఏమి హామీ ఇచ్చారో ఏమో కానీ, ఇప్పుడు విశాఖ ఉక్కు విక్రయానికి నిర్ణయం జరిగిపోయింది. టెండర్లకు  తేదీలు ఖరారై పోయాయి. అంటే, పవన్ కళ్యాణ్’కు  రాష్ట్ర నాయకులు ఎంత గౌరవం ఇస్తున్నారో బీజేపీ జాతీయ నాయకులు కూడా అంతే గౌరవం ఇస్తున్నారు అనేందుకు ఇదే నిదర్శనం.    అదలా ఉంటే, పొరుగు రాష్ట్రం తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఇరు పార్టీల మధ్య సంబంధాలు బెడిసి కొట్టాయియి. చివరకు, పవన్ కళ్యాణ్, తెరాస అభ్యర్ది పీవీ కుమార్తె వాణీ దేవికి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగానే పవన్ కళ్యాణ్ తనకు బీజేపీ జాతీయ నాయకులు గౌరవం ఇస్తున్నా, రాష్ట్ర నాయకులు తను పట్టించుకోవడం లేదని ఇవ్వవలసిన గౌరవం ఇవ్వడం లేదని వాపోయారు. ఇదలా ఉంటే,చాలాకాలం తర్వాత ఇటీవల రాష్ర్వనికి వచ్చిన పవన్ కళ్యాణ్, రాష్ట్రంలో నిరుద్యోగులు, రైతులు ఇతర వర్గాల సమస్యలపై  ఉద్యమించేందుకు సిద్డంవుతున్నారు. అయితే, ఈ ఉద్యమాలు ఒంటరిగా చేయాలనే ధోరణి కనిపిస్తోంది. ఈ పరిణామాలను గమనిస్తే, పవన్ కళ్యాణ్, బీజేపీ బంధం తెగిపోనుందా అన్న అనుమానాలు  వ్యక్తమవుతున్నాయి. అదలా ఉంటే, పార్టీ నిర్మాణం కాస్ట్లీ ఎఫైర్’గా మారిందని పవన్ కళ్యాణ్ చేసిన తాజా వ్యాఖ్యలు   చివరకు బ్రదర్ బాటలో పవన్ కూడా  జెండా పీకే’స్తారా అన్న అనుమానాలు కూడా వ్యక్త మవుతున్నాయి. అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్’లో కలిపేసినట్లు పవన్ కళ్యాణ్ జనసేనను బీజేపీలో కలిపెస్తారా? అనే అనుమాలు సైతం వినవస్తున్నాయి. బీజేపీ కూడ అదే కోరుకుంటోంది. చివరకు ఏమవుతుందో.. చూడవలసి ఉందని అంటున్నారు.

రేవంత్ రెడ్డి తొలి పోరాటం ఎక్కడో తెలుసా? 

తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ లీడర్ గా పేరున్న ఎంపీ రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా మరింత దూకుడు పెంచారు. తనకు పదవి ప్రకటించినప్పటి నుంచే సంచలన కామెంట్లతో కాక రేపిన రేవంత్ రెడ్డి.. బాధ్యతలు తీసుకున్న వెంటనే జరిగిన సభలనూ తన స్టాండ్ ఏంటో చెప్పేశారు. అటు ప్రధాని మోడీని, ఇటు సీఎం కేసీఆర్ ను ఏకి పడేశారు. రెండు పార్టీల టార్గెట్ గా తన ఉద్యమం ఉండబోతుందని చెప్పారు. అంతేకాదు తర్వాత రోజే పీసీసీ కమిటీతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ రూపొందించారు. వివిధ ప్రజా సమస్యలపై దశలవారీగా పోరాడాలని నిర్ణయించారు. అందులో భాగంగానే టీపీసీసీ చీఫ్ గా తొలి పోరాటానికి సిద్ధమవుతున్నారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి తొలి పోరాటం ఏ సమస్యపై, ఎక్కడి నుంచి మొదలు పెడతారనే ఆసక్తి కాంగ్రెస్ కేడర్ తో పాటు జనాల్లో కనిపిస్తోంది. అయితే రేవంత్ రెడ్డి తొలి ఉద్యమం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రారంభించబోతున్నారు. ఈ నెల 12న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాని నిర్మల్ లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆందోళన కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. పీసీసీ చీఫ్ గా తన తొలి ఉదయాన్ని సైకిల్ పై మొదలుపెట్టబోతున్నారు రేవంత్ రెడ్డి. పెరిగిన పెట్రో ధరలకు నిరసనగా ఆయన  సైకిల్ ర్యాలీ జరపనున్నారు. పెరిగిన పెట్రోల్ ధరలకు నిరసనగా జులై 12 సోమవారం రోజున దేశ వ్యాప్తంహా సైకిల్ ర్యాలీకి ఏఐసీసీ పిలుపునిచ్చింది.ఏఐసీసీ పిలుపుగా భాగంగా తెలంగాణలోనూ సైకిల్ ర్యాలీలు నిర్వహించబోతున్నారు. ఏఐసీసీ కార్యక్రమాల పర్యవేక్షణ కమిటి చైర్మన్ గా ఉన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి సొంత నియోజకవర్గం నిర్మల్ లో జరగనున్న ఆందోళనలో రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు.  నిర్మల్ లో ఐదు కిలోమీటర్ల మేర పీసీసీ రేవంత్ రెడ్డి సైకిల్ ర్యాలీలో పాల్గొంటారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిగారు బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి నిరసన కార్యక్రమం ఇది. నిర్మల్ నుంచే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు ఆయన శంఖారావం పూరించబోతున్నారు. అదే సమయంలో అన్ని జిల్లా కేంద్రాలలో ఆయా జిల్లాల డీసీసీ అధ్యక్షులు, ఉమ్మడి జిల్లా ఇంఛార్జిలు, ముఖ్యనాయకులతో సమన్వయం చేసుకుని ఈ నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని పీసీసీ నిర్ణయించింది. ప్రధాన పట్టణాలలో ఐదు కిలోమీటర్ల మేర సైకిల్ ర్యాలీలు తీయనున్నారు.ఈ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ పాల్గొని విజయవంతం చేయబోతున్నారు. ఆందోళన కార్యక్రమాలకు సంబంధించి అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ కు ఇంఛార్జీలను నియమించారు. 

సజ్జల ఇక సైలెంటేనా! సలహాదారుల పదవులకు ఎసరు?

ఏపీ ప్రభుత్వంలో ఇప్పుడు ఓ కీలక అధికారి, ఓ కీలక సలహాదారుడు... ఓ పనిలో బిజీ అయిపోయారు. అన్నీ తానై చక్రం తిప్పే ఆ అధికారి, అన్నిటిలోనూ దూరిపోతున్నఆ సలహాదారుడు.. ఇద్దరూ కలిసి ఓ పత్రం తయారు చేయడానికి నానా కసరత్తు చేస్తున్నారు. అదేంటంటే అసలు సలహాదారుడి బాధ్యతలేంటి, అధికారాలేంటి.. పరిధి ఏంటి ... ఇదే ఆ పత్రం. అదేంటి.. వాళ్లకు అవసరం లేదుగా.. ఏదో ఒక పదవిలో కూర్చోబెట్టడం.. వారు ఏదో ఒకటి చేసుకోవడమేగా అనకండి. హైకోర్టు అడిగింది. వీర వినయ విధేయ సాహ్ని మేడమ్ ను ప్రధాన కార్యదర్శి పదవి టైమ్ అయిపోగానే.. ఎక్స్ టెన్షన్లు చేసి.. అవి కూడా అయిపోయాక సలహాదారుగా నియమించారు. ఆ తర్వాత ఎన్నికల కమిషనర్ పదవి ఖాళీగా కాగానే అందులో కూర్చోబెట్టారు. మేడమ్ అర్హతల మీద ఒకరు పిటిషన్ వేస్తే విచారణ చేస్తున్న హైకోర్టు.. అసలు ఈ సలహాదారు పదవి పరిధి ఏంటి..వారు రాజకీయాలు మాట్లాడొచ్చా..ప్రభుత్వ ఉద్యోగుల లెక్క జీతం తీసుకుంటూ ఇదేం తంతు అంటూ ప్రశ్నించింది. ప్రభుత్వాన్ని వెంటనే ఓ అఫిడవిట్ ఫైల్ చేయమని ఆదేశించింది. ఇప్పుడు అందుకే సలహాదారుల్లోకెల్లా పెద్ద సలహాదారుడు అయిన సజ్జల రామకృష్ణారెడ్డిగారు ఇప్పుడు అదే పనిలో బిజీగా ఉన్నారు. వీళ్లేమో తెలివిగా ప్రభుత్వం రాగానే సాక్షిలో సేవలందించే పెద్ద జీతగాళ్లందరినీ ఇక్కడ సలహాదారులుగా చూపించి ఎంచక్కా ఆ జీతాలను ప్రభుత్వం నుంచి ఇప్పిస్తున్నారు. ఆ పదవులు మోసినందుకు.. ప్రభుత్వం చేసే అడ్డమైన పనులను అడ్డంగా సమర్ధించి అప్పటివరకు ఉన్న గౌరవ, మర్యాదలను కోల్పోయారు. ఒకాయన ఆల్ రెడీ రాజీనామా చేసి వెళ్లిపోయాడు. రెండో ఆయన కూడా రెడీగా ఉన్నాడు.  ఇక సజ్జల గారి సంగతి సరేసరి.ఆయనే రాజు ఆయనే మంత్రి అన్నట్లు వ్యవహారం నడిపిస్తున్నారు. మంత్రులతో కలిసి సమీక్షలు నిర్వహిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను కూడా రివ్యూ చేసేస్తారు. రాజకీయంగా ఏ సమాధానం చెప్పాలన్నా ఈయనే తెరపైకి వస్తారు. మంత్రులు చెప్పాల్సినవాటిని కూడా ఈయనే చెప్పేస్తాడు. కేవలం బూతులు తిట్టడానికి మాత్రం  ఒకరిద్దరు స్పెషలిస్టు మంత్రులు మాత్రం వస్తుంటారు..వాటి జోలికి మాత్రం ఈయన పోలేదు.. అంతవరకు సంతోషం. హైకోర్టు అడిగిన దెబ్బకు.. ఇప్పుడు సలహాదారుల లిస్టు తయారు చేసి..ఆ సలహాదారుల బాధ్యతలేంటే, పరిధి ఏంటో రాసుకునే పనిలో ఉన్నారిప్పుడు. వారికి పదవులిస్తూ ఇచ్చిన జీవో కాగితాలను కూడా బయటకు తీసి.. స్టడీ చేస్తున్నారు. ఏ పార్టీకైనా రాజకీయంగాఎన్ కౌంటర్లు చేయడానికి అధికార ప్రతినిధులు ఉంటారు. వీరికి ఉంటారు గాని.. వారంతా కేవలం టీవీ డిబేట్లకే పరిమితం. అది కూడా ఎవరు ఏ చానెల్ కు ఎప్పుడు వెళ్లాలో.. మరో సలహాదారుడు డిసైడ్ చేస్తాడు. ఇక రాజకీయ ప్రకటనలు, ప్రభుత్వ ప్రకటనలు అన్నిటికీ సజ్జలవారు వచ్చేస్తూ ఉంటారు.  ఈ కేసు విషయానికొస్తే మేడమ్ సాహ్ని అయితే సలహాదారురాలిగా ఉండగా... చిన్న పని కూడా చేయలేదు. ఆమె పని చేసినట్లు అధికారికంగానే ఏ రికార్డులు లేవు..కేవలం ఏదో ఒక దాంట్లో పెట్టాలి కాబట్టి పెట్టారంతే. ఇప్పుడు కోర్టుకు వీరేం చెబుతారో... కోర్టు మరి ఏమడుగుతుందో.. అటు ఇటు తిరిగి సలహాదారుల పదవులన్నిటికి ఎసరొస్తుందా..చూడాలి మరి.  

మోడీ టీంలో రైల్వే మంత్రి వెరీ వెరీ స్పెషల్..

ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గ విస్తరణ మాములుగా జరగలేదు. కొవిడ్ పెట్టిన పరీక్షను ప్రామాణికంగా తీసుకుని, భవిష్యత్ సవాళ్ళను సమర్ధవంతంగా ఎదుర్కునే శక్తివంతమైన యువ మేధావి బృందాన్ని ప్రధాని సిద్దం చేసుకున్నారు. నిజమే, మంత్రివర్గ విస్తరణలో రాజకీయ కోణ ముంది. ఎన్నికల అవసరాలలున్నాయి. అ అన్నిటితో పాటుగా దేశ అవసరాలకు కూడా ప్రధాని పెద్ద పీట వేశారనే, అభిప్రాయం రాజకీయ మేధావి వార్గాల్లో వ్యక్తమవుతోంది. పోస్ట్ కొవిడ్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, విద్యావంతులకు ప్రధాని ప్రాధాన్యత ఇచ్చారని, జాతీయమీడియాలో చర్చ మొదలైంది.  ఉదాహరణకు, నూతన మంత్రివర్గంలో కీలకమైన రైల్వే, ఐటి శాఖలను, ఆయన ఎవరో ఎవరికీ తెలియని అశ్వని వైష్ణవకు అప్పగించారు.ఈయన ఒడిశాకు చెందిన మాజీ ఐఎఎస్ అధికారి. అయితే, ఈ అశ్వని వైష్ణవ ఎవరు?ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? ఇంత కీలకమైన శాఖలను, అనుభవం లేని ఆయనకు ఎలా అప్పగించారు?  ఇప్పుడు ఇదే ఇటు రాజకీయ వర్గాల్లో అటు అధికార  పాలనా వర్గాలలో జరుగతున్న చర్చ.ఆయనకు పరిపాలనా అనుభవమే కాదు, ప్రత్యక్ష రాజకీయ అనుభవం కూడా లేదు. రెండేళ్ళ క్రితమే, 2019లో ఆయన రాజ్య  సభకు ఎన్నికయ్యారు.   ఆయన రాజ్యసభ ఎన్నిక కూడా భలే గమ్మత్తుగా, నమ్మశక్యం కానీ విధంగా నాటకీయంగా జరిగింది. ఒడిసా నుంచి ఎన్నికలు జరుగుతున్న మూడు స్థానాలను గెలుచుకోగల బలం అధికార బీజేడీకి  వుంది. ఆ పార్టీ  ముగ్గురు  సభ్యుల పేర్లను ప్రకటిచింది. బీజేడీ ప్రకటించిన  జాబితాలో మన అశ్వనీ వైష్ణవ పేరు కూడా ఉంది. కానీ అరగంటలోనే, ఆయన బీజేడీ  అభ్యర్థి కాదు, తమ పార్టీ  అభ్యర్థి అంటూ బీజేపీ ప్రకటించుకుంది.. నిజానికి, తమ అభ్యర్ధిని గెలిపించుకునే బలం బీజేపీకి లేదు. బీజేడీ, బీజేపీ మిత్ర పక్షమా అంటే అది కూడా కాదు. నిజానికి ఒడిసాలో కాంగ్రెస్ కాలం చేసిన తర్వాత బీజేడీకిబీజేపీనే ప్రధాన ప్రతిపక్షం. అయినా,, ప్రధాని మోదీ స్వయంగా ఫోన్ చేసి కోరడంతో ముఖ్యమంత్రి నవీన్  పట్నాయక్, బీజేపీ తమ అభ్యర్ధిగా ప్రకటించుకున్న అశ్వనీ వైష్ణవ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.  అలా ఆయన  బహుశా దేశ చరిత్రలో ఎక్కడా కనీవినీ ఎరగని రీతిలో రాజ్య సభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  ప్రధాని నరేందర్ మోడీ ప్రభుత్వం రైల్వే రంగంలో కీలక సంస్కరణలు తీసుకు రావాలని, ప్రైవేట్ పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని గత  ఏడేళ్లుగా ప్రయత్నిస్తోంది. ఈక్రమంలో ముగ్గురు మంత్రులు మారారు. అయినా ఆశించిన ఫలితాలు రాలేదు. ప్రధాని మోడీ అన్వేషణ అక్కడ మొదలైంది . అటల్ బిహారీ  వాజపేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన కార్యాలయంలో డిప్యూటీ కార్యదర్శిగా పనిచేసిన వైష్ణవ్ తెరపై కొచ్చారు. ఆయనకు   ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం విభాగంలో విజయవంతంగా పనిచేశారని పేరుంది. ఆ తర్వాత ఆయన ఎంబిఎ కూడా చేశారు. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలలో, ప్రైవేట్ సంస్థలో పనిచేయడమే  గాక, సొంతంగా పరిశ్రమలు నెలకొల్పారు.  ప్రచారానికి దూరంగా లక్ష్యాల మేరకు కష్టపడి పనిచేస్తారనే పేరుంది. ఈ లక్షణాలే ఆయనను ప్రధాని దృష్టికి ఆకట్టుకొనేటట్లు చేసిన్నట్లు కనిపిస్తున్నది. వాజపేయి ప్రధాన మంత్రి పదవి నుండి వైదొలగిన తర్వాత ఆయన వద్ద ప్రైవేట్ కార్యదర్శిగా పనిచేశారు. ఆ సమయంలో ఆయనకు బీజేపీ సీనియర్ నేతలతో పరిచయాలు ఏర్పడ్డాయి. ప్రధాని మోడీ  కొత్త బృందంలో అత్యున్నత విద్యార్హతలు గల మంత్రి కూడా ఈయనే. 1970 లో జోధ్‌పూర్‌లో జన్మించిన వైష్ణవ్ ఇప్పుడు జై నరైన్ వ్యాస్ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ (ఎలక్ట్రానిక్స్,  టెలికమ్యూనికేషన్స్) లో బాచిలర్స్ డిగ్రీలో బంగారు పతకాన్ని సాధించాడు. వైష్ణవ్ 1994 లో ఐఐటి కాన్పూర్ నుండి పారిశ్రామిక నిర్వహణలో ఎం. టెక్ పట్టా పొందారు. అతని వెబ్‌సైట్ ప్రకారం, ఐఐటిలో క్లాస్ టాపర్. అదే సంవత్సరం, సివిల్ సర్వీసెస్ పరీక్షలో వైష్ణవ్ ఎంపికయ్యాడు. యుపిఎస్‌సి పరీక్షలో 27 వ ర్యాంకు సాధించిన ఆయన ఒడిశా క్యాడర్‌లో చేరి ఐఎఎస్‌ను ఎంచుకున్నారు. ఆయనను సుందర్ఘర్, బాలసోర్, కటక్ జిల్లాల్లో పోస్ట్ చేశారు. అక్టోబర్-నవంబర్ 1999 లో ఒడిశాను తాకిన ‘సూపర్ సైక్లోన్’ సమయంలో వైష్ణవ్ చాలా చురుగ్గా పనిచేశారు. ప్రశంసలు అందుకున్నారు. . యుఎస్ నేవీ వెబ్‌సైట్ నుండి తుఫాను పథం గురించి సమాచారాన్ని సేకరించిన ఘనత వైష్ణవ్‌కు ఉంది. దానిని ఆయన  రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి పంపాడు. మరణాల సంఖ్యను తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి అతని సమాచారం సహాయపడింది. మాజీ ప్రధానమంత్రి వాజపేయి  కార్యాలయంలో డిప్యూటీ కార్యదర్శిగా కేంద్ర సర్వీస్ లకు డెప్యూటేషన్ పై వెళ్లెవరకూ 2003  వరకు ఒడిశాలో కొనసాగారు. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని వార్టన్ స్కూల్‌లో ఎంబీఏ కోర్స్ లో  చేరడానికి 2008 లో వైష్ణవ్ ప్రభుత్వానికి రాజీనామా  చేశారు.  అక్కడ ఆయన ఫైనాన్స్,  స్ట్రాటజీ కోర్సులపై దృష్టి పెట్టారు. ఆయన  వెబ్‌సైట్ ప్రకారం, వైష్ణవ్ దక్షిణ ఆసియా కోసం జిఇ ట్రాన్స్‌పోర్టేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా, ఆపై సిమెన్స్‌లో పట్టణ మౌలిక సదుపాయాల వ్యూహానికి అధిపతిగా పనిచేశారు. ఆ తర్వాత ఆటో కాంపోనెంట్స్‌ పరిశ్రమపై దృష్టి పెట్టడానికి తనంతట తానుగా వెంచర్ చేయాలని నిర్ణయించుకున్నారు. గుజరాత్‌లో సుజుకి, హోండా,  హీరోలకు సేవలను అందించే నాలుగు భాగాలను వైష్ణవ ఏర్పాటు చేశారు. ఇక ఇప్పుడు భారతీయ రైల్వేలో పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఏ విధంగా పట్టాలు ఎక్కిస్తారు. ఏ విధంగా లాభాల వెంట పరుగులు తీయిస్తారు అనేది చూడవలసి వుంది.

ఎస్టీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు మళ్లింపు! జగన్ రెడ్డిపై దళిత, గిరిజన సంఘాల ఫైర్ 

జగన్ రెడ్డి ప్రభుత్వ అస్తవ్యస్థ విధానాలు, అనాలోచిత నిర్ణయాలతో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఖజానా ఖాళీ కావడంతో ఏం చేయాలో తెలియక  అడ్డదారులు తొక్కుతోంది. రూల్స్ కు విరుద్దంగా ఇతర శాఖల నిధులను అడ్డగోలుగా వాడేస్తోంది జగన్ సర్కార్. ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ  నిధులను నవరత్నాలకు మళ్లించింది. ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల నుంచి రూ.4341 కోట్లు, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల నుండి రూ.662 కోట్లు  అమ్మఒడికే దారి మళ్లించారని తేలింది.   సబ్ ప్లాన్ నిధులను మళ్లించడం  వివాదాస్పదమవుతోంది. జగన్ రెడ్డి సర్కార్ తీరుపై దళిత, గిరిజన సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ  నిధులను నవరత్నాలకు మళ్లించే హక్కు జగన్‌కు ఎవరిచ్చారని టీడీపీ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. షెడ్యూల్డ్ కులాల కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్లను భ్రష్టు పట్టించిన సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని విమర్శించారు.  రాజ్యాంగ పరంగా దళితులకు, గిరిజనులకు కేంద్రం నుండి వస్తున్న నిధులకు కూడా వైఎస్ ఆర్ పేరు తగిలించి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారని వర్ల రామయ్య మండిపడ్డారు. సబ్ నిధులతో తెలుగుదేశం హయాంలో చంద్రబాబు నాయుడు దళితులకు స్వయం ఉపాధి కల్పిస్తే జగన్ రెడ్డి మాత్రం ముష్టి విసిరినట్లు విసురుతున్నారన్నారు రామయ్య. చంద్రబాబు నాయుడు దళితులకు జేసీబీలు, ఇన్నోవా కార్లు, ట్రాక్టర్లు, వాహనాలు ఇచ్చి వారి సాధికారతను సాయం చేస్తే జగన్ మాత్రం జేసీబీలు పెట్టి కూల్చడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశానని చెబుతున్న జగన్ రెడ్డి ఆ కార్పోరేషన్ల నుంచి ఒక లోన్ అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు.  తెలుగుదేశం పాలనలో 2018-19లో బడ్జెట్ కేటాయింపుల్లో ఎస్సీ వర్గాల అభ్యున్నతికి రూ.14,367 కోట్లు కేటాయించి 90 శాతం ఖర్చు చేశామని వర్ల రాయ్య  గుర్తుచేశారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆర్భాటంగా రూ.15 వేల కోట్లు కేటాయించి... ఖర్చు చేసింది కేవలం రూ. 4,700 కోట్లు మాత్రమేనని చెప్పారు.  2020-21 బడ్జట్‌లో కూడా ఎస్సీ సంక్షేమానికి రూ.15,735 కోట్లు కేటాయించామని అబ్బదాలు చెబుతూ నవరత్నాలకు కూటాయించిన రూ.7525 కోట్ల కలిపి చూపించారన్నారు. 2021-22లో కూడా నవరత్నాలకు కేటాయించిందే దళిత సంక్షేమం కింద లెక్కకట్టి మాయల పకీర్ లెక్కలు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. జగన్ రెడ్డి చెప్పే మోసపు లెక్కలు విని మోసపోవడానికి దళితులు సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. చట్టపరంగా దళితులకు రావాల్సిన నిధులకు పేర్లు తగిలించడం మాని కార్పొరేషన్ల ద్వారా ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దళితులందరూ సంఘటితంగా ప్రభుత్వ దళిత వ్యతిరేక చర్యలకు నిరసనగా పోరాడుతారని వర్ల రామయ్య హెచ్చరించారు.  

విజ‌య‌సాయి త‌లుచుకుంటే ప్రాబ్ల‌మ్ సాల్వ్‌.. విశాఖ ఉక్కుకు సింపుల్ సొల్యూష‌న్‌!

విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌. ఏపీ ముందున్న అతిపెద్ద స‌మ‌స్య‌. ఆంధ్రుల హ‌క్కు అయిన విశాఖ ఉక్కును అంగడి స‌రుకుగా అమ్మేస్తోంది కేంద్ర ప్ర‌భుత్వం. ఆ అమ్మ‌కానికి రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి స‌హ‌కారం ల‌భిస్తోందంటూ కేంద్ర‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌క‌టించారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు దొందుదొందేన‌ని తేలిపోయింది. ఏడాదికి ముందే పోస్కో కంపెనీ ఎండీ సీఎం జ‌గ‌న్‌ను క‌లిసి ఆ మేర‌కు వారిద్ద‌రూ మాట్లాడుకున్నార‌ని తెలుస్తోంది. ఇలా తెర‌వెనుక తానే ఉన్నా.. తెర‌మీద మాత్రం విశాఖ ఉక్కును కాపాడేందుకంటూ త‌న‌వంతు ప్ర‌య‌త్నాలు చేస్తున్నట్టు.. నాట‌కం ర‌క్తి క‌ట్టిస్తున్నార‌ని చెబుతున్నారు. ఇక విశాఖ‌కు సామంత‌రాజైన విజ‌య‌సాయిరెడ్డి అయితే ఏకంగా జీవించేస్తున్నారు. ధ‌ర్నాలు, బంద్‌లు తానే చేయిస్తున్న‌ట్టు.. త‌న డైరెక్ష‌న్‌లోనే విశాఖ ఉక్కు ఉద్య‌మం జ‌రుగుతున్న‌ట్టు.. బాగానే క‌ల‌రింగ్ ఇస్తున్నారు.  అందుకే, ప్ర‌ధాని మోదీకి చాలా క్లోజ్ అయిన విజ‌యసాయిరెడ్డి తలుచుకుంటే విశాఖ ఉక్కు స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌గ‌ల‌రంటూ సీపీఐ నేత నారాయ‌ణ అన్నారు. మోదీ కాళ్ల‌పై పడే విజయసాయిరెడ్డి స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. తాము ఢిల్లీలో ధర్నాకు ప్రయత్నం చేసామని..  కానీ, విజయసాయిరెడ్డి వలన అది సాధ్యంకాలేద‌ని చెప్పారు. సీఎం మోదీకి రాసే ప్రేమలేఖల వల్ల ఉపయోగం లేదంటూ సీఎం జ‌గ‌న్‌పైనా సెటైర్లు వేశారు. ముఖ్య‌మంత్రి ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ ద‌గ్గ‌ర‌ శిబిరానికి జ‌గ‌న్‌ రావాలని, ఆయన ఆధ్వర్యంలో పోరాటం జరగాలని అన్నారు నారాయ‌ణ‌.  విశాఖకు అన్యాయం జరుగుతుంటే.. కంభంపాటి హరిబాబు ఎందుకు మాట్లాడరని నిలదీశారు. విశాఖకు, స్టీల్ ప్లాంట్‌కు న్యాయం జరిగే వరకు.. మిజోరాం గవర్నర్‌గా వెళ్లనని హరిబాబు చెప్పాలన్నారు. కేంద్ర వైఖరిని నిరసిస్తూ మిజోరాం గవర్నర్ పదవిని హరిబాబు తిరస్కరించాలని డిమాండ్ చేశారు.  అన్నీ అదానీకి, అంబానీలకు ఇస్తారా అంటూ ప్రశ్నించారు. దేశాన్ని, సంపదను అమ్మేస్తున్నారని మండిప‌డ్డారు. స్టీల్ ప్లాంట్‌పై కోర్టుకు వెళ్లడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని.. ప్రజాపోరాటాలకు, ప్రాణ త్యాగానికి సిద్ధం కావాలని నారాయణ పిలుపునిచ్చారు.

లవ్ పోయిందని.. సూసైడ్ వీడియో ఫేస్ బుక్ లో  పోస్ట్ చేసిన  యువకుడు.. 

నేను లవ్ లో ఫెయిల్ అయ్యాను. ఇక నేను బతికి సాధించేదేమీ లేదు. జీవితంపై విరక్తి పుడుతోంది. అందుకే చనిపోవాలనుకుంటున్నా. ప్రేమించి మోసం చేసిన వాళ్లు అమ్మాయి అయినా… అబ్బాయి అయినా… ప్రేమలో మోసపోయిన వాళ్లు యువకులైతే ఒక న్యాయం.. యువతి అయితే ఒక న్యాయం ఉంటుందా..? అమ్మాయి జీవితం నాశనమవుతుందంటూ మాటలు చెబుతూ ఆమె కే సపోర్ట్ చేస్తారా.. అమ్మాయికైనా అబ్బాయి కైనా  సరైన శిక్ష విధించాలని కోరుతూ ప్రేమ విఫలమైన ఓ యువకుడు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. నా మరణంతోనైనా ప్రేమలో మోసం చేసే యువతులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పురుగుల మందు తాగేశాడు. అంతే కాకుండా  తాను పురుగుమందు తాగుతున్న వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియోను ఫేస్‌బుక్ లో పోస్ట్ చేయడంతో అప్రమత్తమైన ఆ యువకుడి స్నేహితులు ఒంగోలు తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సెల్ ఫోన్ ట్రాకింగ్ ద్వారా యువకుడిని గుర్తించి రక్షించారు. నెల్లూరులో ఉండే అతని మిత్రుడు ఒకరు దానిని చూసి ఆందోళనకు గురయ్యాడు. వెంటనే ఒంగోలు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రంగంలోకి దిగారు.  ప్రకాశం జిల్లా. పీసీపల్లి మండలం. మారెళ్ల గ్రామానికి చెందిన యువకుడు. అతని  నాగభూషణం. ఒంగోలులో ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తూ స్నేహితులతో కలిసి ఒక గదిలో ఉంటున్నాడు. ఇదే క్రమంలో ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు. ఇక అంటే లవ్ డ్యూయెట్స్ వేసుకున్నారు.. ఆ తర్వాత ఏమైనదో ఏమో తెలియదు సడెన్ గా తెలుగు సినిమాలో లాగే  కొన్నిరోజులుగా వీరిద్దరి మధ్య విబేధాలు వచ్చాయి. అతనితో ఆ యువతి మాట్లాడలేదు. ఆ విషయానికి  అతను కుంగిపోయాడు. మనస్తాపం చెందాడు. ఈ విషయం స్వగ్రామంలో ఉంటున్న అతని తల్లిదండ్రులకు సైతం తెలిసింది. తమ కుమారుడు ఏదైనా అఘాయిత్యానికి పాల్పడతాడని భావించిన తల్లిదండ్రులు ఇద్దరు యువకులను అతడికి కాపలాగా ఉంచారు. వారిద్దరి కళ్లుగప్పి యువకుడు గురువారం తన గది నుంచి వెళ్లిపోయాడు. కాసేపట్లోనే తన ఫేస్‌బుక్‌ లో వీడియో సహా తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు పోస్టింగ్‌ పెట్టాడు. నెల్లూరులో ఉంటున్న స్నేహితుడు ఈ విషయాన్ని గుర్తించి ఒంగోలు తాలూకా పోలీసులకు సమాచారం ఇచ్చారు. సెల్ ఫోన్ సిగ్నల్‌ ఆధారంగా సీఐ శ్రీనివాసరెడ్డి ట్రాకింగ్‌ చేశారు. నగర శివార్లలో బైపాస్‌ వద్ద ఉన్నట్లు గుర్తించి అక్కడకు వెళ్లి పట్టుకున్నారు. అప్పటికే అతను పురుగుమందు తాగడంతో వెంటనే అతన్ని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువకుడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందగానే స్పందించి తమ కుమారుడి ప్రాణాలను కాపాడిన పోలీసులకు యువకుడి కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఘటనకు సంబంధించి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. ప్రేమించిన వాళ్ళు వెళ్లిపోయారని ప్రాణాలు ఎవడైనా తీసుకుంటారా.. అంటే ఫీల్ అవుతారుగాని ప్రాణం అంటే నేటి యువతకి లెక్కకుండా పోయింది.. బతుకు నిచ్చిన అమ్మ నాన్నలను వదిలి ఎవరో అమ్మాయి కోసం చావడం ఏంటి మూర్ఖత్వం కాకపొతే.. అని స్థానికులు, బంధువులు అనుకుంటున్నారు.

నువ్వు ఏమైనా పోటుగాడివా.. రైతుపై వైసీపీ ఎమ్మెల్యే దాష్టికం..

ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ ఎమ్మెల్యేల అరాచకాలు ఆగడం లేదు. తమ సమస్యలపై ప్రశ్నించిన వారిపై ప్రతాపం చూపిస్తున్నారు. తన బాధను చెప్పుకున్న రైతుపై వైసీపీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు తీవ్ర స్థాయిలో ఊగిపోయారు. " నువ్వు ఏమైనా పోటుగాడివి అనుకుంటున్నావా" అంటూ కోపంతో రైతుపై ఎమ్మెల్యే నాగేశ్వరరావు మండిపడ్డారు. ఈ ఘటనతో స్థానికులు షాకయ్యారు.  పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం ఇరగవరం మండలంలోని అర్జునపాలెం గ్రామంలో రైతులపై ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు దినోత్సవ కార్యక్రమం గ్రామంలో జరిగింది.  ఈ సందర్భంగా ఈ కార్యరక్రమంలో ఎమ్మెల్యే నాగేశ్వరరావు పాల్గొన్నారు. మూడు నెలలుగా తనకు ధాన్యం డబ్బులు పడలేదని ఎమ్మెల్యే నాగేశ్వరరావును  ఓ రైతు అడిగాడు. దీంతో కోపోద్రిక్తుడైన ఎమ్మెల్యే, ఆ రైతును  ఉద్దేశించి "నువ్వు ఏమైనా పోటుగాడివి అనుకుంటున్నావా" అంటూ కోపంతో ఊగిపోయారు. దీంతో అక్కడున్న రైతులు విస్తూపోయారు. ధాన్యం డబ్బులు అడిగిన రైతుపై ఎమ్మెల్యే దురుసుగా వ్యవహరించడంపై టీడీపీ తీవ్రంగా స్పందించింది. అన్న‌దాత‌లంటే అంత అలుసా ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వ‌ర‌రావు అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. అధికార‌మ‌దంతో విర్ర‌వీగుతూ రైతుల్నే బెదిరిస్తారా? అష్ట‌క‌ష్టాలు ప‌డి రైతులు తాము పండించిన ధాన్యం అమ్ముకుని మూడు నెల‌లైనా డ‌బ్బులు ఇవ్వ‌లేద‌ని అడిగితే వారినే తిరిగి బెదిరిస్తారా! ఇదేమి అరాచ‌క ప్ర‌భుత్వం? అంటూ నిలదీశారు. వ్య‌వ‌సాయ‌రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేసి, రైతు బ‌తుకు దిన‌దిన‌గండంగా మార్చేసిన జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వంలో రైతు దినోత్స‌వం అంటే, ప్ర‌శ్నించిన రైతుల్ని అవ‌మానించి దౌర్జ‌న్యం చేయ‌డ‌మా? అన్న‌దాత‌ల్ని స‌న్మానించాల్సిన చోట అవ‌మానిస్తారా? అంటూ లోకేష్ మండిపడ్డారు. స‌భ‌లోనే రైతుల్ని బెదిరించిన ఎమ్మెల్యే త‌క్ష‌ణ‌మే వారికి బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ చెప్పాలని డిమాండ్ చేశారు. ధాన్యం బ‌కాయిలు త‌క్ష‌ణ‌మే చెల్లించాలి. లేదంటే అన్న‌దాత‌ల‌కు అండ‌గా వైసీపీ ప్ర‌భుత్వం, ఎమ్మెల్యేల‌కు బుద్ధి చెప్పేవ‌ర‌కూ తెలుగుదేశం పోరాడుతుందని నారా లోకేష్ హెచ్చరించారు

అభివృద్ధి అంటే ఇది.. జగనన్నను చూసి తెలుసుకోండి! 

అభివృద్ధి అంటే ఏంటో తెలుసుకోండి. అభివృద్ధి అంటే మౌలిక సదుపాయాలు కల్పించడం అని అనుకోకండి. అభివృద్ధి అంటే ఏవేవో కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెట్టడం కాదు ..సరిగా తెలుసుకోండి. అభివృద్ధి అంటే రాష్ట్రానికి ఆదాయం పెంచేలా చర్యలు తీసుకోవడం కాదు.. అర్ధం చేసుకోండి. ఇప్పటివరకు పాపం చాలామంది నేతలు, ప్రముఖులు, ఆర్ధిక నిపుణులు రకరకాలుగా అనుకుంటున్నారు. వారందరూ ఒకసారి ఏపీ వస్తే అసలు అభివృద్ధి అంటే ఏంటో తెలిసిపోతుంది. వారు రాసిన పుస్తకాలను తగలబెట్టేసి కొత్త పుస్తకాలు రాయొచ్చు. పాపం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది విని అసలు అభివృద్ధి అంటే ఏంటో తెలుసుకోండి.  బాస్..రైతు దినోత్సవంలో మాట్లాడుతూ గిట్టనివాళ్లు ఏదో చెబుతూ ఉంటారు.. ఒక్కసారి గ్రామాలకు వెళ్లి చూడండి (పట్టణాల సంగతి అడక్కండే) అభివృద్ధి ఏంటో కనపడుతుంది. నాలుగడుగులు వేస్తే ప్రభుత్వ పాఠశాల కనపడుతుంది.. అక్కడ ప్రైవేటు పాఠశాల కన్నాబెటర్ గా ఇంగ్లీషు మీడియంలో పాఠాలు చెబుతుంటారు.. ఇంకో నాలుగడుగులు వేస్తే విలేజ్ క్లినిక్ ఉంటుంది..అక్కడ వైద్య సిబ్బంది అన్ని రకాల మందులతో ఉంటారు. అన్నిటికి రిపేర్లుచేసి కొత్త రంగులు కూడా వేశాం. ఇలా చెప్పుకుంటూ పోయారు జగన్మోహన్ రెడ్డి. అదీ అభివృద్ధి అంటూ ముగించారు. అంటే మనం అర్ధం చేసుకోవలసింది ఏంటంటే పాత భవనాలకు రిపేర్లు చేసి రంగులు వేస్తే చాలు.. అభివృద్ధి జరిగినట్లే. అంగన్ వాడీ సెంటర్లను చంద్రబాబునాయుడు టైములోనే డెవలప్ చేశారు. వాటికి ప్రీ ప్రైమరీ స్కూల్స్ అని పేరు మారిస్తే చాలు అభివృద్ధి జరిగినట్లే.. అలాగే టించర్, టీటీ వేయడానికి నర్సు ఉంటే చాలు అభివృద్ధి జరిగినట్లే.. అదీ సంగతి. స్కూళ్లు, ఆస్పత్రులు రిపేర్లు చేయడంలో తప్పు లేదు.. వాటిని మెరుగుపర్చడంలో తప్పే లేదు.. కాని అదే అభివృద్ధి అని చెప్పుకోవడమే మరీ ఎబ్బెట్టుగా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి అంత గర్వంగా వాటి గురించి చెప్పుకుని అదే అభివృద్ధి అని చెప్పుకోవడమే ఇప్పుడు హాస్యాస్పదంగా మారింది. ఇప్పటివరకు అందరూ పాపం ఇన్ ఫ్రా అభివృద్ధి చేస్తే పెట్టుబడులు వస్తాయని..తద్వారా ఉద్యోగాలు వస్తాయని..దాని వల్ల ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుందని.. దాని వల్ల మార్కెట్ పెరుగుతుందని.. దాని వల్ల ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని.. దాని వల్ల ప్రజలకు మెరుగైనసేవలు అందించొచ్చని .. అదే అభివృద్ధి అనుకునేవారు.ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ చక్రాన్ని విరగ్గొట్టేశారు. ప్రజలకు బ్యాంకుల్లో డబ్బులు వేస్తే చాలు.. రిపేర్లు చేసి రంగులు వేస్తే చాలు.. అప్పులు చేసి డబ్బులు తెస్తే చాలు... ఇవే అభివృద్ధి అనుకోవాలని చెబుతున్నారు.. కాదని చెప్పేవాళ్లు గిట్టనివాళ్లు అంటున్నారు.  ఇంకా నయం... తెలుగుదేశం మీద, చంద్రబాబునాయుడిపైన పగతో అమరావతిని నాశనం చేయడం.. మూడు రాజధానుల పేరుతో కుంపటి పెట్టి అన్ని చోట్ల అనిశ్చితి వచ్చేలా చేయటం..రియల్ఎస్టేట్ వ్యాపారాన్ని పడేయటం.. ఇసుక పాలసీ పేరుతో భవన నిర్మాణ రంగాన్ని కూల్చేయటం.. రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టుల పనులు లేటు చేయడం ..ఇవన్నీ కూడా అభివృద్ధిలో భాగమే అని చెప్పలేదు. పాపం మర్చిపోయారేమో ఈ విషయాలు చెప్పడం.. మనం మాత్రం బాస్ దగ్గర కొత్త ఆర్ధిక పాఠాలు నేర్చేసుకోవడం బెటర్..లేదంటే మనకు ఏదో ఒక పేరు పెట్టేస్తారు సార్.

రోడ్డు కావాలన్న ప్రజలు.. రైతుబంధు, పెన్షన్ డబ్బులు ఇవ్వాలన్న ఎమ్మెల్యే.. 

అది తెలంగాణ రాష్ట్రము. వికారాబాద్ నియోజకవర్గం. అతను ఒక  టీఆరెఎస్ పార్టీ ఎంఎల్ఏ. అభివృద్ధి చేయమంటే.. అది చేయడానికి ప్రజలను చందాలు అడిగాడు. ప్రజలు ఆయన అన్న మాటలు విని ఖంగుతిన్నారు. రోడ్డు వేయడం కోసం ప్రజలు డబ్బులు ఇవ్వడం బాగానే ఉంది.. మరి అంతదానికి ప్రభుత్వం ఎందుకు..? ఆ మాట పక్కన పెడితే నియోజకవర్గ అభివృద్ధి కోసం వచ్చే నిధులు ఏమైతున్నాయి.. ఆ నిధులు కదా ఖర్చు చేయాల్సింది.. అంటే ఆ నిధులు నాయకులూ మింగి రోడ్డు వేయమని ప్రజలు ప్రశ్నిస్తే మీరే డబ్బులు ఇవ్వండి అడగడం ఒక టీఆర్ఎస్ పార్టీ నాయకులకే చెల్లింది.. నియోజకవర్గం అభివృద్ధి చేస్తారని ఎంఎల్ఏ ని గెలిపించుకుంటే.. ఈయన గవర్నమెంట్ నుండి ప్రజలకు కాస్తో కూస్తో పధకాల నుండి వచ్చిన డబ్బులను  లూటీ చేయాలనీ చూశాడు.. అంటే కాదు సిగ్గులేకుండా కొంతమంది జనం మీద పది గణేష్ చందా అడిగినట్లు.. ఈ సార్ కూడా  నేరుగా ప్రజలను ఈ విషయంగా అడిగాడు ఇక అంతే ఈ విషయం విన్న ప్రజలు టైడ్ యార్డ్ లా ఒక్కసారిగా హవాకు అయ్యారు. ఇంతకీ టీఆర్ఎస్ ఎంఎల్ఏ చేసిన ఆ ఘనకార్యం ఏంటో తెలుసుకుందాం..?  వికారాబాద్ జిల్లా పూడురు మండలంలోని పలు గ్రామాల్లో పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పర్యటించారు. ప్రజా సమస్యలపై ఆరా తీశారు. రాజకీయ నాయకులు అంటే తెగిపడిన చుక్కలాగా ఎప్పుడో ఎన్నికలప్పుడు వస్తే.. మళ్ళీ వాళ్ళ మొహం చూడాలి అంటే రాసి పెట్టి ఉండాలి.. అయితే మొత్తానికి ఈ పర్యటన అతని మనసులు దాగిన మాటను తెలిపింది.. పర్యటనలో భాగంగా పూడురు అనుబంధ గ్రామమైన మైసమ్మ గడ్డ తాండా కు వెళ్ళాడు. తండా ప్రజలు ఎన్నికలప్పుడు రోడ్డు వేయిస్తామని హామీ ఇచ్చారని.. వర్షం పడితే గ్రామానికి రాకపోకలు ఇబ్బంది అవుతోందని, తమ గ్రామానికి రోడ్డు వేయించాలని ఎమ్మెల్యేను నిలదీశారు . అయితే, అంత పెద్ద మొత్తం నిధులు వచ్చే పరిస్థితి లేదని ఎమ్మెల్యే చెప్పారు. అయినా శాంతించని కొందరు రోడ్డు కావాలంటూ గట్టిగా అడిగారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఎమ్మెల్యే మహేష్ రెడ్డి.. మీ ఊరికి రోడ్డు కావాలంటే రైతు బంధు, పెన్షన్లు, కళ్యాణ లక్ష్మీ వదులుకోండి.. వెంటనే ఊరికి రోడ్డు వేయిస్తానని బదులిచ్చారు. మొత్తానికి ఆయన కన్ను ప్రజలు వచ్చే పెన్షన్ మీద.. రైతు బందు.. కల్యాణ లక్మి మీద పడింది.. అంతే అది కూడా ప్రజలకు అందడం ఆమనకు ఇష్టంలేదని తేలింది..  అంతే! ఈ సమాధానంతో గ్రామస్తులకు పట్టపగలే చుక్కలు కనబడ్డాయి. పాపం ఏమీ అర్థం కాని కొద్దిమంది ఆశ్చర్యంతో కూడిన కంగారు వల్ల వచ్చిన అయోమయం లుక్స్‌ ఇస్తే, ఎమ్మెల్యే మహేష్ రెడ్డి.. ప్రభుత్వం వద్ద పైసలు లేవు.. మరి ఏం చేయాలే. తర్వాత వేయిస్తాలే.. అంటూ తన సమాధానాన్ని సరిచేసే యత్నం చేసారు.  

రూ.41 వేల కోట్ల తప్పుడు లెక్కలు.. అంతా జగన్మాయ! 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడానికి కూడా అప్పు తేవాల్సిన పరిస్థితి. ప్రతి నెలా పెన్షనర్లకు ఎప్పుడు తమ డబ్బులు వస్తాయో తెలియని గందరగోళ పరిస్థితి. అప్పుల్లో దేశంలోనే మూడో స్థానంలో ఉంది ఏపీ. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసి కేంద్ర ఆర్థికశాఖ వర్గాలే అవాక్కవుతున్నాయంటే ఎంతగా దివాళ తీసిందో అర్థం చేసుకోవచ్చు. ఏపీ ఇంతగా అప్పుల్లో కూరుకుపోవడానికి జగన్ రెడ్డి సర్కార్ అస్తవ్యస్థ, అనాలోచిత విధానాలే కారణమనే ఆరోపణలు వస్తుండగా.. తాజాగా మరో సంచలన విషయం వెలుగు చూసింది.  ఏకంగా 41 వేల కోట్ల రూపాయలకు లెక్కలే లేవని తెలుస్తోంది.  రాష్ట్రప్రభుత్వం జమ ఖర్చుల నిర్వహణపై సంచలన ఆరోపణలు చేశారు పిఏసి చైర్మన్ పయ్యావుల కేశవ్. జమఖర్చుల నిర్వహణపై గవర్నర్ కలిసి పిర్యాదు చేశారు.  నలభైవేల కోట్లకు సరియైన లెక్కలు లేవని పయ్యావుల ఆరోపించారు. ట్రెజరీ కోడ్ ప్రకారం ప్రభుత్వం లోని ఏ శాఖ అయినా ట్రెజరీ నుండి డబ్బు తీసుకునేటప్పుడు అది ఎందుకు తీసుకుంటున్నామో, దేనికి ఖర్చు పెడుతున్నామో బిల్లులో పేర్కొనాలి. కానీ అలాంటిదేమీ చూపించకుండా జగన్ రెడ్డి ప్రభుత్వంలోని వివిధ శాఖలు ప్రత్యేక బిల్లు అంటూ 10,806 బిల్లుల కింద  రూ.41,043 కోట్లను విత్ డ్రా చేశాయి. ఈ బాగోతాన్ని పక్కా ఆధారాలతో పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ బయటపెట్టారు.  ఏడాది క్రితమే ఇది తప్పని ప్రభుత్వాన్ని హెచ్చరించారు పయ్యావుల కేశవ్. అయినా ప్రభుత్వ తీరు మారకపోవడంతో... రాష్ట్రప్రభుత్వ ఆర్ధిక నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని, ఆర్ధిక అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసి ఫిర్యాదు చేసారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 161, 151/2 లను ప్రస్తావిస్తూ... రాష్ట్రప్రభుత్వ కార్యనిర్వాహక అధిపతిగా రాష్ట్ర ఆర్థిక, జమ ఖర్చుల నిర్వహణపై దృష్టి పెట్టాలని... గత రెండు ఆర్ధిక సంవత్సరాలకు సంబందించిన లెక్కలపై కాగ్ తో స్పెషల్ ఆడిట్ జరిపించాలని గవర్నర్ ను కోరారు పయ్యావుల కేశవ్. ఇదే విషయమై రాష్ట్ర ప్రభుత్వానికి కాగ్ రాసిన లేఖలను వినతి పత్రానికి జత చేసారు.   ఇప్పటికే జగన్ రెడ్డిపై అక్రమాస్తుల కేసులున్నాయి. గతంలో షెల్ కంపెనీలు, సూట్ కేసు కంపెనీలు పెట్టి, దొంగలెక్కలు చూపించి ఆస్తులను పెంచుకున్నారనే అభియోగాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దివాళా దిశగా ఉన్నా .. జగన్ & కో లకు చెందిన కంపెనీలు ఆర్ధిక లాభాలతో దూసుకుపోతున్నాయి.  సెబీ ఇచ్చిన సమాచారం మేరకు వైసీపీ ఎంపీ  అయోధ్యరామిరెడ్డికి చెందిన రాంకీ సంస్థల పై ఐటీ దర్యాప్తు జరుగుతోంది. ఇదే సమయంలో ప్రభుత్వ పద్దుల్లో రూ.41 వేల కోట్ల తప్పుడు లెక్కలు ఉండటం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. ఆ రూ.41 వేల కోట్లు ఏమైనట్టు అనే చర్చ జనాల్లో సాగుతోంది. తప్పుడు లెక్కలతో పక్కాగా దర్యాప్తు చేస్తే అసలు దొంగలెవరో తేలుతుందని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.   

రెడ్డి ఎంటర్‌ప్రైజెస్ వసూళ్ల కథ ఏంటీ? రఘురామ మరో సంచలనం..

ఆంధ్రప్రదేశ్ వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్మోరెడ్డిపై పోరాటం చేస్తున్న నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు మరో సంచలనానికి తెర తీశారు. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి అక్రమాలు, వైసీపీ నేతలు దురాగాతాలపై లేఖలు రాస్తూ జగన్ రెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న రఘురామ.. తాజాగా మరో బాంబా పేల్చారు. రెడ్డి ఎంటర్‌ప్రైజెస్ వసూళ్లను ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. వసూళ్ల పర్వానికి సంబంధించి అంశాలను ప్రస్తావిస్తూ.. ఆ కథేంటో తేల్చాలని డిమాండ్ చేశారు.  ఏపీబెవరేజెస్ సంస్థ  సిబ్బంది, రెడ్డి ఎంటర్‌ప్రైజెస్ వసూళ్లను ప్రస్తావిస్తూ ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డికి ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. రాష్ట్రానికి 25 వేల కోట్ల ఆదాయాన్నిచ్చే ఏపీబెవరేజెస్ సంస్థ ఉద్యోగులు..వారి సమస్యలను తమ దృష్టికి తేవాలని ప్రయత్నించారన్నారు. తమరు అవకాశం ఇవ్వకపోవడంతో సమస్యలను తన దృష్టికి తెచ్చినట్లు చెప్పారు. 6 నెలల క్రితం రెడ్డి ఎంటర్‌ప్రైజెస్ ఏజెన్సీ రాష్ట్రంలోని మద్యం షాపుల నుంచి..5 కోట్ల రూపాయలు వసూలు చేసేందుకు పకడ్బందీ ప్లాన్ వేసిందన్నారు. 10,258 మంది ఉద్యోగులకు నెల జీతం చెల్లించాలంటూ మద్యం షాపుల నుంచి ఈ మొత్తం డిమాండ్ చేశారని తెలిపారు ఎంపీ రఘురామ రాజు.  రెడ్డి ఎంటర్ ప్రైజెస్ మరో 10.25 కోట్ల వసూలుకు మరో ప్లాన్ వేసిందని...ఈ సంస్థ వివరాలన్నీ తమరు పరిశీలించాలని ముఖ్యమంత్రి కోరారు నర్సాపురం ఎంపీ. ఈ సంఘటనలపై డిప్యూటీ సీఎంకు ఫిర్యాదు చేసినా విచారణ జరగలేదన్నారు. ఈ ఘటనలపై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రఘురామ లేఖలో పేర్కొన్నారు. ఇటీవలే ఎక్సైజ్ శాఖకు సంబంధించి పలు ప్రాంతాల్లో అవినీతి జరిగినట్లు బయటకి వచ్చింది. ప్రభుత్వ ఖజానాకు జమ చేయాల్సిన డబ్బులను కొందరు సిబ్బందే అక్రమంగా కాజేశారనే తేలింది. ఈ ఘటనలపై దర్యాప్తు కూడా జరుగుతోంది. ఆ నేపథ్యంలో తాజాగా ఎంపీ రఘురామ రాజు చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. అసలు ఏపీబెవరేజెస్ సంస్థలో ఏం జరుగుతోంది, రెడ్డి ఎంటర్‌ప్రైజెస్ వసూళ్లపై సమగ్ర విచారణ జరపాలనే డిమాండ్ జనాల నుంచి వస్తోంది.  రెడ్డి ఎంటర్‌ప్రైజెస్ వసూళ్లపై ముఖ్యమంత్రికి ఎంపీ రఘురామ రాజు రాసిన లేఖ ఇది.. ముఖ్యమంత్రి గారూ, తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు? ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోయీలెవ్వరు? – శ్రీ శ్రీ రాష్ట్రానికి 25 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఇచ్చే అతి ముఖ్యమైన సంస్థ ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇంత ముఖ్యమైన కార్పొరేషన్ కు చెందిన సేల్స్ పర్సన్లు, సూపర్ వైజర్లు తాము ఎదుర్కొంటున్న సమస్యలను మీ దృష్టికి తీసుకురావాలని శతవిధాలా ప్రయత్నించారు. అయితే మీరు వారికి అవకాశం ఇవ్వలేదు. దాంతో ఏఐటియుసి అనుబంధ సంస్థ అయిన ఏపి బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ వారు తమ సమస్యలను నా దృష్టికి తీసుకువచ్చారు. ఈ లేఖ ద్వారా వారి సమస్యలను మీ దృష్టికి తీసుకురావాలని భావిస్తున్నాను. ఆరు నెలల కిందట రెడ్డి ఎంటర్ ప్రైజెస్ అనే అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ రాష్ట్రంలోని మద్యం షాపుల నుంచి 5 కోట్ల రూపాయలు వసూలు చేసేందుకు పకడ్బంది ప్లాన్ వేసింది. తమకు ఉన్న 10,258 మంది ఉద్యోగులకు నెల రోజుల జీతం చెల్లించాలని చెబుతూ రాష్ట్రంలోని మద్యం షాపుల వారి నుంచి ఈ మొత్తం డిమాండ్ చేశారు. మద్యం షాపులకు తదుపరి లైసెన్సులు రెన్యూవల్ కావాలీ అంటే ఈ మొత్తం తమకు చెల్లించాల్సిందేనని వారు వత్తిడి తెచ్చారు. దాంతో కొందరు  ఫిర్యాదు చేయగా సంబంధిత మంత్రి, ఉపముఖ్యమంత్రి ఈ సంఘటనపై విచారణకు ఆదేశించారు. తమ ప్రభుత్వం అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో సహించదని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. రెండు రోజుల్లో దర్యాప్తు నివేదిక తనకు అందాలని ఆదేశాలిచ్చారు.  అదే సమయంలో రెడ్డి ఎంటర్ ప్రైజెస్ మరో 10.25 కోట్ల రూపాయలు వసూలు చేసేందుకు మరో పకడ్బంది ప్లాన్ వేసింది. తన వద్ద పని చేస్తున్న సిబ్బందికి గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు, వారిని ఈఎస్ఐ జాబితాలో చేర్చేందుకు ఒక్కొక్కరూ 10 వేల రూపాయలు తమకు చెల్లించాలని రెడ్డి ఎంటర్ ప్రైజెస్ కోరింది. ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ మద్యం షాపుల్లో పని చేస్తున్న 10,258 మంది సూపర్ వైజర్ల నుంచి, సేల్స్ మెన్ ల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు రెడ్డి ఎంటర్ ప్రైజెస్ స్కెచ్ వేసింది. ఇలా చేయని ఉద్యోగులకు ఈ నెల జీతాలు రావని బెదిరించింది. చట్టపరంగా చెల్లించాల్సిన ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ లను సకాలంలో చెల్లించకుండా ఈ సంస్థ, న్యాయపరమైన చిక్కుల్లో పడుతున్న విషయాన్ని గుర్తించడం లేదు. ఆరు నెలల కిందట ఫిర్యాదు ఇచ్చినప్పుడు వసూళ్ల కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేసిన ఈ సంస్థ, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మళ్లీ కలెక్షన్లు ప్రారంభిస్తున్నది. సికింద్రాబాద్ లోని దక్షిణ మధ్య రైల్వేలో సీనియర్ డిసిఎం గా పని చేస్తున్న ఐఆర్ టి ఎస్ అధికారి అయిన డి.వాసుదేవరెడ్డిని డెప్యుటేషన్ పై తీసుకువచ్చి మీరు ఏపి బెవరేజెస్ కార్పొరేషన్ కు మేనేజింగ్ డైరెక్టర్ గా నియమించారు. ఇలా చట్ట విరుద్ధ కలెక్షన్లు జరుగుతున్నా కూడా ఆయన నోరు మెదపడం లేదు… ఎవరిపైనా చర్యలు తీసుకోవడం లేదు.సూటిగా చెప్పాలంటే ఈ రెడ్డి ఎంటర్ ప్రైజెస్ కు ఔట్ సోర్సింగ్ కార్యకలాపాలలో ఎలాంటి గత అనుభవం లేదు. ఈ మద్యం షాపు ఉద్యోగులతో కూడా ఆ సంస్థకు ఎలాంటి సంబంధం కూడా లేదు. ఈ మద్యం షాపు ఉద్యోగులను జిల్లా కలెక్టర్లు నేరుగా బెవరేజెస్ కార్పొరేషన్ కోసం నియమించారు. ఇలా జిల్లా కలెక్టర్లు బెవరేజెస్ కార్పొరేషన్ కోసం నియమించిన ఉద్యోగులను తమ ఉద్యోగులుగా ఈ సంస్థ తన వెబ్ సైట్ లో చూపిస్తున్నది. అంతే కాదు ఈ సంస్థ ఈ ఒక్క కాంట్రాక్టునే చూపిస్తున్నది తప్ప గతంలో తాను నిర్వహించిన కాంట్రాక్టులను చెప్పడం లేదు. అంటే ఈ సంస్థకు ఎలాంటి పూర్వ అనుభవం కూడా లేదన్నమాట. బెవరేజెస్ కార్పొరేషన్ కోసం నియమితులైన సిబ్బందికి జీతభత్యాలు చెల్లించాలన్న విషయం ముందుకు రాగానే ఈ రెడ్డి ఎంటర్ ప్రైజెస్ తెరపైకి వచ్చింది. దాదాపు 10 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పుకుంటున్న ఇంత ‘‘పెద్ద’’ సంస్థ గురించి ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు కూడా ఒక్క సారి ఈ వివరాలన్నీ పరిశీలించండి. దాదాపుగా రెండు సంవత్సరాలు కావస్తున్నా ఈ ఉద్యోగులకు గుర్తింపు కార్డులు ఇవ్వలేదు. అంతే కాదు వీరికి ఈఎస్ఐ కూడా అమలు చేయడం లేదు. ఈ ఆందోళనలతో బాటు వారిని మరో భయం కూడా వెంటాడుతున్నది. ఒక్కో ఉద్యోగి మూడు లక్షల రూపాయల సెక్యూరిటీ ఇవ్వాలని, అందుకోసం ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను పూచీకత్తుగా తీసుకురావాలని కోరుతున్నారు. వారు ఇప్పటికే APBCL కు రెండు లక్షల రూపాయల పూచీకత్తులను సమర్పించి ఉన్నారు.సాక్షాత్తూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినా ఈ సంఘటనలపై ఎలాంటి విచారణ జరగలేదు. APBCL అధికారుల నుంచి సైతం ఎలాంటి స్పందన లేదు. దాంతో సుమారు 10 వేల మందికి పైగా ఉన్న సిబ్బంది, వారిపై ఆధారపడి ఉన్న మరో 50 వేల మంది కుటుంబ సభ్యులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నందున, వారిని దృష్టిలో ఉంచుకుని తక్షణమే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను ఈ లేఖ ద్వారా మిమ్మల్ని కోరుతున్నాను. చట్టబద్ధంగా ఇవ్వాల్సిన ఈఎస్ఐ సౌకర్యాన్ని, ప్రావిడెంట్ ఫండ్ ను కూడా ఈ సంస్థ అమలు చేసే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలని నేను మిమ్మల్ని వినమ్రంగా కోరుతున్నాను. కార్మిక చట్టాల ప్రకారం వారికి పని గంటలను కూడా నిర్దేశిస్తే మరింత మంచిది. ఇప్పుడు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ. ఈ సమయంలో ఈ సిబ్బందిని ఈఎస్ఐ ఆసుపత్రుల నెట్ వర్క్ పరిధిలోకి తీసుకువచ్చి వారికి వైద్య సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. దురదృష్టవశాత్తూ కరోనాకు గురి అయి ఏ ఉద్యోగి అయినా మరణిస్తే కారుణ్య నియామకాల కింద మరణించిన ఉద్యోగి కుటుంబంలో ఒకరికి ఆ ఉద్యోగం ఇప్పించాలని కూడా నేను కోరుతున్నాను. భవదీయుడు కె.రఘురామకృష్ణంరాజు

త‌ల్లి, చెల్లినే బెట‌ర్‌!.. వాళ్ల‌ను చూసి నేర్చుకో జ‌గ‌న్...

వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి. ఏపీ ముఖ్య‌మంత్రి. అంత‌టివాడిని ప‌ట్టుకొని గ‌జ‌దొంగ అని తిడుతున్నారు. జ‌గ‌న్‌నే కాదు ఆయ‌న తండ్రి దివంగ‌త మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డిని సైతం నీళ్ల‌దొంగ అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌ను రాక్ష‌సులు అంటున్నారు. తెలంగాణ మంత్రులు అంతేసి మాట‌లంటున్నా.. నోరు మూసుకొని ప‌డుతున్నారు జ‌గ‌న్‌. ఎందుకు? స‌హ‌న‌మా? సామ‌ర‌స్య‌మా? చేత‌గానిత‌న‌మా?  వైఎస్ ష‌ర్మిల‌. జ‌గ‌న్ సోద‌రి. అన్న‌లానే తానూ సీఎం అవుదామ‌ని.. తాను తెలంగాణ కోడ‌లినంటూ అక్క‌డ జెండా ఎత్తారు. అజెండా కూడా ప్ర‌క‌టించారు. జ‌గ‌న్‌లా భ‌య‌ప‌డ‌కుండా కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్ర‌జాస‌మ‌స్య‌ల‌తో పాటు త‌న తండ్రి వైఎస్సార్‌పై చేసిన వ్యాఖ్య‌ల‌పైనా ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. జ‌గ‌న్‌లా ఊ-ఆ అన‌కుండా.. ఆడ సివంగిలా చెల‌రేగిపోయారు. వైఎస్సార్‌ను ఎవ‌రైనా కించ‌ప‌రిస్తే ఉరికించి ఉరికించి కొడ‌తామంటూ ఖ‌త‌ర్నాక్ వార్నింగ్ ఇచ్చారు ష‌ర్మిల‌. కాంగ్రెస్‌ను సైతం ఏకిపారేశారు. వైఎస్సార్‌ను టీఆర్ఎస్ పార్టీ నాయ‌కులు తిడుతుంటే కాంగ్రెస్ వాళ్లు చేతికి గాజులు వేసుకుని కూర్చున్నారా? అంటూ ఇజ్జ‌త్ తీసేశారు. జ‌గ‌న్‌కంటే చిన్న‌దైనా.. మ‌హిళైనా.. సీమ బిడ్డ అనిపించుకున్నారు. క‌డ‌ప పౌరుషం చూపించారు. క‌నీసం, ష‌ర్మిలకు వ‌చ్చిన కోపం, ఆవేశంలో స‌గం వంతైనా జ‌గ‌న్‌కు వ‌చ్చుంటే.. ఆయ‌న‌లా నీళ్లు న‌మిలేవారు కాదు. నీతి సూత్రాలు చెప్పేవారు కాదంటున్నారు.  అంతెందుకు.. ష‌ర్మిల వ‌ర‌కు ఎందుకు. వైఎస్ విజ‌య‌మ్మ‌నే తీసుకుందాం. త‌న భ‌ర్త‌ను తిడితే.. ఆ వ‌య‌సులోనూ ఆమెకు ఒళ్లు మండింది. త‌న పెనిమిటి గానీ, త‌న బిడ్డ‌లు కానీ.. దొంగ‌లు, గ‌జ‌దొంగ‌లు కాదంటూ.. దోచుకోవ‌డం, దాచుకోవ‌డం తెలీదంటూ.. త‌న స్థాయిలో గ‌ట్టిగానే కౌంట‌ర్ ఇచ్చారు విజ‌య‌మ్మ‌. క‌నీసం.. ఆ అమ్మ‌కు వ‌చ్చినంత కోప‌మ‌న్నా జ‌గ‌న్‌కు రావ‌డం లేదా? త‌ల్లి, చెల్లిలు అంత స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయితే.. వైఎస్సార్‌ను దొంగ అన్నందుకు తెలంగాణ మంత్రుల‌ను ఏకిపారేస్తే.. ఇక సీమ బిడ్డ‌గా చెప్పుకునే జ‌గ‌న్‌రెడ్డి మాత్రం చాలా సాదాసీదా స్టేట్‌మెంట్స్ ఇస్తూ క‌వ‌ర్ చేసుకుంటున్నారని త‌ప్పుబ‌డుతున్నారు.   తాజాగా, సీఎం జ‌గ‌న్ జ‌ల వివాదంపై స్పందించారు. కొంద‌రు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని అన్నారు. కృష్ణాలో తమకు కేటాయించిన నీళ్లను వాడుకుంటే తప్పేంటన్నారు. నీటి కేటాయింపులపై సంతకాలు చేశారని గుర్తు చేశారు. నీటి విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని, రాష్ట్రాల మధ్య సఖ్యత ఉండాలన్నదే తన అభిమతమన్నారు. పాలకుల మధ్య కూడా సఖ్యత ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. అంతే. ఇంత‌కు మించి గ‌ట్టిగా మాట్లాడింది లేదు. త‌న‌ను గ‌జ‌దొంగ అని, త‌న తండ్రిని నీళ్ల‌దొంగ అని అన్నందుకు తెలంగాణ మంత్రుల‌కు ఎలాంటి వార్నింగ్ ఇవ్వ‌లేదు. క‌నీసం వారి మాట‌ల‌ను ఖండించ‌నూ లేదు. త‌ప్పుబ‌ట్ట‌నూ లేదు. ఇదేం తీరు? బ‌హుషా ఆ విమ‌ర్శ‌ల‌ను ఆయ‌న అంగీక‌రిస్తున్నారేమో అంటున్నారు.  ష‌ర్మిల హెచ్చ‌రించిన‌ట్టు వైఎస్సార్‌ను కించ‌ప‌రిస్తే ఉరికించి కొడ‌తామని గానీ.. త‌న భ‌ర్త మంచోడ‌ని విజ‌య‌మ్మ అన్న‌ట్టు గానీ.. కనీసం వాళ్ల స్థాయిలో కూడా రియాక్ట్ అవ‌లేదు జ‌గ‌న్‌. జ‌స్ట్‌.. కొంద‌రు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టానుసారం మాట్లాడుతున్నార‌ని మాత్ర‌మే అన్నారు. ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్న‌ట్టు.. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోస‌మో.. లేక‌, హైద‌రాబాద్‌లో ఆస్తుల ర‌క్ష‌ణ కోస‌మో.. కార‌ణమేంటో తెలీదు కానీ మ‌రీ ఈస్థాయిలో జ‌గ‌న్‌ దిగ‌జారడాన్ని ఆయ‌న అభిమానులే జీర్ణించుకోలేక‌పోతున్నారు. త‌న‌ను, త‌న తండ్రిని తిట్టినందుకు ప‌డితే ప‌డ్డారు గానీ, క‌నీసం ఏపీ ప్ర‌జ‌ల‌ను  రాక్ష‌సుల‌తో పోల్చినందుకైనా తెలంగాణ మంత్రుల‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చుంటే.. ఆంధ్రుల ఆత్మాభిమానం నిల‌బ‌డేదంటూ సీఎం జ‌గ‌న్ తీరుపై మండిప‌డుతున్నారు ఏపీ ప్ర‌జ‌లు. త‌ల్లి, చెల్లిని చూసైనా రోషం తెచ్చుకొని.. పౌరుషం చూపించాల‌ని డిమాండ్ చేస్తున్నారు.