ఏడాదిలో ఏడు రాష్ట్రాల పోరు.. బీజేపీ, కాంగ్రెస్ యాక్షన్ షురూ..
వచ్చే సంవత్సరం (2022) మొత్తంలో ఏడు రాష్ట్రాలలో శాసన సభ ఎన్నికలు జరుగుతాయి. సంవత్సరం మొదట్లో ఉత్తర ప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాలలో, చివర్లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర్లాలలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు 2024 ఎన్నికలకు దిక్సూచిగా నిలుస్తాయని, రాజకీయ పండితులు విష్లేశిస్తున్నారు. అందుకే 2022 ఎన్నికలు అన్ని పార్టీలకు, మరీ ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు అత్యంత కీలకంగా భావిస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ జరిగే ఏడు రాష్ట్రలకు గానూ, ఆరు రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో వుంది. ఈ ఆరు రాష్ట్రాలలో సహజంగానే కొంత ప్రభుత్వ వ్యతిరేకత వుంది. అందుకు అదనంగా కొవిడ్ సెకండ్ వేవ్’ను ఎదుర్కోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు సృష్టించిన వ్యతిరేకత తోడైంది. ఈ ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజాగ్రహాన్ని తట్టుకుని అధికారాన్ని నిలబెట్టుకోవడం, కమలనాధుల ముందున్న చాలా పెద్ద సవాల్’గా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
మనుగడ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీకి, ప్రస్తుతం అధికారంలో ఉన్న పంజాబ్’ను నిలుపుకోవడంతో పాటుగా అత్యంత కీలకమైన ఉత్తర ప్రదేశ్, గుజరాత్ సహా ఇతర రాష్ట్రాలలో బీజేపీకి, జాతీయ స్థాయిలో ప్రధాన ప్రత్యర్ది కాంగ్రెస్ అనే స్థాయిలో ఫలితాలు సాధించడం అవసరం.ఇటీవల పశ్చిమ బెంగాల్ సహా ఐదు శాసన సభలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనంగా’ ఓడిపోయింది. బెంగాల్ లో జీరోకు చేరింది. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్ సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళ రాష్ట్రంలో హస్తం పార్టీ, వరసగా రెండవసారి ఓడిపోయి 30 ఏళ్ళు పబడిన చరిత్రను తిరగరాసింది. వరసగా రెండవసారి ఓడి పోయింది. అలాగే అస్సాంలో వరసగా రెండవ సారి ఓడి పోయింది.పుదుచ్చేరిలో అధికారం కోల్పోయింది. సో.. 2021 ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే, 2022లో రిపీట్ అయితే, బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలు కూడా 2024 ఎన్నికలలో కాంగ్రెస్ నాయకత్వాన్ని అంగీకరించక పోవచ్చును.
ఎన్నికల ప్రిపరేషన్’కు బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నాలు ప్రారంభించాయి. ప్రధాని నరేంద్రమోడీ మంత్రివర్గ పునర్వ్యస్థీకరణతో ప్రారంభించిన ఎన్నికల ప్రేపరేషన్స్, ఇప్పుడు సంస్థాగత మార్పులు, పార్టీ పక్షాళన దిశగా సాగుతోంది. పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి, పార్లమెంటరీ బోర్డు మొదలు, కార్యనిర్వాహక మండలి ఏర్పాటు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కనీసం ఓ ఐదుగురు మాజీ ముఖ్యమంత్రులు, ఓ అరడజను మంది కేంద్ర మాజీ మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించేందుకు నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది. నిజానికి బీజేపీలో మార్పులు చేర్పులు ఇప్పటికే మొదలయ్యాయి. కేంద్ర మాజీ మంత్రులు రవిశంకర్ ప్రసాద్, తావర్’చంద్ గేహ్లోట్’లను తమిళనాడు,కర్ణాటక గవర్నర్లుగ నియమించారు. ఇంకా అనేక మార్పులు చేర్పులతో, పార్టీని మేకప్ చేసే పని చురుగ్గా సాగుతోంది.
మరో వంక కాంగ్రెస్ పార్టీ కూడా 2022 ఎన్నికల పోరాటానికి సిద్దమవుతోంది. ఇప్పటికే తెలంగాణ, కేరళ సహా కొన్ని రాష్ట్రాలకు పీసీసీ అధ్యక్షులను నియమించిన, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మరో ఇద్దరిని ఎఐసీసీ ఉపాధ్యక్షులుగా నియమించడంతో పాటుగా మరికొన్ని రాష్ట్రల పీసీసీల పక్షాళన ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా, వచ్చే సంవత్సం ఆరంభంలో ఎన్నికలు జరిగే రాష్ట్రలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని నిర్ణయించారు. పంజాబ్, ఉత్తరాఖండ్ పీసీసీ అధ్యక్షుల మార్పు, ఉత్తర ప్రదేశ్, గోవా రాష్ట్రాలకు ఎన్నికల సంఘం ఏర్పాటు పై కాంగ్రెస్ అధినాయకత్వం చర్చలు జరుపుతోందని పార్టీ వర్గాల సమాచారం. అలాగే ఇటీవల ఎన్నికలు జరిగిన పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లోనూ నాయకత్వ మార్పు ఉంటుదని అంటున్నారు.
అదే విధంగా ఏఐసీసీ స్థాయిలో అసమ్మతి (జీ 23) నేతల నుంచి ఒకరినీ యువత నుంచి మరొకరినీ పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా నియమించాలని,అలాగే, లోక్ సభలో పార్టీ నేతగా శశిథరూర్’ను నియమించలాని సోనియా గాంధీ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే పార్టీలో ఒక వర్గం ఏఐసీసీ ఉపాద్యక్షుల నియామక ప్రతిపాదనను వ్యతిరేకిస్తునట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉన్నఎఐసీసీ సలహా మండలిని పునరుద్ధరిస్తే సరిపోతుందని, అంటున్నారు. 2022లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అన్నిరాష్ట్రాలలో పోటీ చేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ సిద్దవుతోంది. ఆలాగే, యూపీ సహా కొన్ని రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు బలంగున్నాయి. అయితే, 2022 ఎన్నికలు 2024 ఎన్నికలు మోడీ వర్సెస్ ఎవరు? అనే ప్రశ్నకు సంధానం ఇవ్వవచ్చును.అలాగే, మోడీ మూడవసారి ప్రధాని అవుతారా లేదా అన్న ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వవచ్చని అంటున్నారు.