పవన్ కళ్యాణ్ సినిమా, పూరీ ఆఫీస్ పై దాడి

  కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో తెలంగాణ వాదులను కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని పేర్కొంటూ తెలంగాణ వాదులు జూబ్లీహిల్స్లోని పూరీ జగన్నాథ్ కార్యాలయంపై తెలంగాణవాదులు దాడి చేశారు. ఆయన కార్యాలయం ఆవరణలో ఉన్న నాలుగు కార్ల అద్దాలు పగులగొట్టారు. ఆఫీసులోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తంగా మారింది. కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో తెలంగాణవాదులను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని వారు నిరసన తెలిపారు. ఆ చిత్రాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కెమెరామెన్ గంగతో రాంబాబు తెలంగాణ జిల్లాల్లో నిరసనల వెల్లువెత్తాయి. తెలంగాణవాదులు పలుచోట్ల థియేటర్లలో ప్రదర్శనలు నిలిపివేయాలని ఆందోళనకు దిగారు. ఇదిలా ఉండగా, తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినే వివాదాస్పద సన్నివేశాలు, మాటలు తొలగిస్తామని పూరీ జగన్నాథ్ చెప్పారు.

షర్మిల బాణం ఏ లక్ష్యం కోసం : బొత్స

  జగన్ సోదరి షర్మిల బాణం ఎవరిపైకి, ఏ లక్ష్యం కోసం పెట్టారో చెప్పాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. షర్మిల బాణాన్ని జగన్ చేసిన నేరాలు, ఘోరాలపై వేస్తే మంచిదని అన్నారు . దివంగత వైఎస్ పేరును ఛార్జీషీట్‌లో కాంగ్రెస్ పార్టీ పెట్టలేదని, సీబీఐ పెట్టిందని చెప్పారు. జగన్ కేసులకు కాంగ్రెసు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ పార్లమెంటు సభ్యులే ఇటీవల చెప్పారన్నారు. సొంత పార్టీ ఎంపీలు చెప్పిన విషయాన్ని జగన్ కుటుంబం మరిచిపోయినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. జగన్ పార్టీని ఇబ్బందులకు గురి చేయాలనే ఆలోచన తమకు లేదన్నారు. షర్మిల బాణం ఎవరి పైకి ఎక్కుపెట్టారో తనకైతే తెలియదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతోందని బొత్స విమర్శించారు.

తెలంగాణాలో రాంబాబు రచ్చ, టీఆర్ఎస్ ఫైర్

  దర్శకుడు పూరీ జగన్నాథ్ తెలంగాణవాదులతో కయ్యానికి కాలు దువ్వుతున్నారని కెటిఆర్ మండిపడ్డారు. జరగబోయే పరిణామాలకు తాము ఏమాత్రం బాధ్యులం కాదన్నారు. సినిమా ఇండస్ట్రీని తాము ఎప్పుడూ టార్గెట్ చేయలేదని చెప్పారు. కాగా ఈ సినిమాను బ్యాన్ చేయాలని తెలంగాణ న్యాయవాదులు హెచ్చార్సీని ఆశ్రయించారు. కాంగ్రెసు పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి తెలంగాణకు మోసం చేస్తే పవన్ కల్యాణ్ ఇలా చేశారని టిఆర్ఎస్ శ్రేణులు ధ్వజమెత్తారు. తాము ఈ సినిమాను చూసే ప్రసక్తి లేదన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చి లాభాలు గడించాలనుకుంటే చూస్తూ ఊరుకోమన్నారు. దీనిని తెలంగాణవ్యాప్తంగా అడ్డుకుంటామన్నారు. తెలంగాణవాదుల ఆందోళనలపై కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా డిస్ట్రిబ్యూటర్ దిల్‌రాజు స్పందించారు. పూరీ జగన్నాథ్‌తో మాట్లాడి అభ్యంతరకర సన్నివేశాలను తొలగిస్తామని ఆయన తెలిపారు. సినిమాకు అడ్డుకోవద్దని తెలంగాణవాదులకు ఆయన పిలుపునిచ్చారు.

చంద్రబాబుకి పవన్ క్షమాపణ చెప్పాలి : టిడిపి

  పవన్ కళ్యాణ్ కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా పలు రాజకీయ పార్టీల ఆగ్రహానికి గురవుతోంది. తెలంగాణ అంశాన్ని కించపరిచారని తెలంగాణ వాదులు మండిపడుతుండగా, ఈ సినిమాను ఏకంగా నిషేధించేయాలని తెలుగుదేశం డిమాండ్ చేస్తోంది. ఈ సినిమాలో తమ నేతను టార్గెట్ చేశారనేది తెలుగుదేశం ఆరోపణ. సినిమా సెకండ్‌ హాఫ్‌లో రాజకీయ పార్టీలపై వివాదాస్పద సన్నివేశాలను ఉన్నాయని ప్రత్యేకించి తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును ఉద్దేశించి పరోక్షంగా అనుచిత వ్యాఖ్యలు చేయించారని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేమన సతీష్‌ అంటున్నాడు. ఈ సినిమాను ప్రభుత్వం నిషేధించాలని లేదా నటుడు పవన్‌ కళ్యాణ్‌ వెంటనే తమ అధినేత చంద్ర బాబుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈ నేత డిమాండ్ చేశాడు. చంద్రబాబును ఉద్దే శించి చేసిన ఆ సన్నివేశాలను, వ్యాఖ్యలను తొలగించాలని లేదంటే సినిమాను ఆడనివ్వమని తెలుగుదేశం హెచ్చరిస్తోంది.

పవన్ కళ్యాణ్ సినిమాని అడ్డుకున్న తెలంగాణవాదులు

  పవన్ కళ్యాణ్ కెమెరామన్ గంగతో రాంబాబు సినిమా తెలంగాణ వాదాన్ని కించ పరిచే విధంగా ఉందంటూ..వెంటనే ఎక్కడిక్కడ ప్రదర్శన అక్కడే ఆపేయాలని తెలంగాణ వాదులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఓయూ విద్యార్థులు రంగంలోకి దిగారు. హైదరాబాద్ లోని ఒక థియేటర్ లో ప్రింట్ ను ఎత్తుకెళ్లిన ఘటన కూడా చోటు చేసుకుంది. ఇక తెలంగాణ లోని పలు ప్రాంతాల్లో రాంబాబు ప్రదర్శిస్తున్న థియేటర్ల దగ్గర తెలంగాణ వాదులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ లో సినిమా ఫ్లెక్సీలను తెలంగాణవాదులు దగ్ధం చేశారు. ప్రత్యేక తెలంగాణ నినాదానికి వ్యతిరేకంగా ఈ సినిమా రూపొందించారంటూ కొంతమంది ఆందోళనకు దిగారు. తెలంగాణ ప్రాంతంలో కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్ర ప్రదర్శనను అడ్డుకుంటామని హెచ్చరించారు.

అశోక్ ఖేమ్కా కు చట్టం తెలియదు

  అక్రమాలపై ఉక్కుపాదం మోపిన ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కాను తప్పుపట్టే దిశగా హర్యానాలో పరిణామాలు సాగుతున్నాయి. అవకతవకలు జరిగాయని, నిబంధనలను పాటించలేదంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా, రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్ఎఫ్ మధ్య జరిగిన 3.5 ఎకరాల సేల్ డీడ్‌ను ఐఏఎస్ అధికారి ఖేమ్కా రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే, సేల్ డీడ్ మ్యుటేషన్‌ను రద్దు చేస్తూ ఖేమ్కా ఇచ్చిన ఆదేశాల్లోనే వాస్తవాలను తప్పుగా అన్వయించారని హర్యానా టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ జనరల్ టీసీ గుప్తా మండిపడ్డారు.వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ లైసెన్స్ రెన్యువల్ విషయంలో తమ విభాగం నిబంధనల మేరకే వ్యవహరించిందని సమర్థించారు. హర్యానా ల్యాండ్ కన్సాలిడేషన్ డైరెక్టర్ జనరల్ పదవి నుంచి తాను తప్పుకొన్నానని, తన ఆదేశాలపై ఏదైనా పార్టీ లేదా ప్రభుత్వం ఇబ్బందులు పడితే కోర్టుకు వెళ్లవచ్చునని ఖేమ్కా స్పష్టం చేశారు. గుప్తా లేఖను అసలు విషయం నుంచి పక్కదారి పట్టించే వ్యూహమని అభివర్ణించారు.

ఖుర్షిద్ రాజ్యంలో అధికారులపై రాళ్ళ దాడి

  దమ్ముంటే యూపీలోని తన సొంత నియోజకవర్గం ఫరీదాబాద్ కొచ్చి నిరసన తెలపాలంటూ కేజ్రీవాల్ కి సవాల్ విసిరిన ఖుర్షీద్ అలా జరిగితే కేజ్రీవాల్ తిరిగి వెనక్కెళ్లే అవకాశమే లేదంటూ చేసిన సంచలన వ్యాఖ్య ఇది. ఖుర్షీద్ అన్నట్లుగానే, ఆయన ట్రస్ట్ లో ఆర్ధిక అవకతవకలపై సర్వే చేసేందుకు వెళ్ళిన ఢిల్లీకి చెందిన విలేకరి అభినందన్ మిశ్రా, స్థానిక కన్వీనర్ నేతృత్వంలో ఐఏసీ కార్యకర్తలు ఖుర్షిద్ స్వగ్రామం పితౌరా నుంచి తిరిగి వస్తుండగా కొంతమంది దుండగులు వారిపై దాడి చేసి కొట్టారు. రాళ్లు రువ్వారు. ఈ ఘటనపై తాము పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశామని బాధితులు చెప్పారు. డాక్టర్ జాకీర్ హుస్సేన్ మెమోరియల్ ట్రస్ట్ అక్రమాలపై కథనాలను ప్రసారం చేసినందుకు టీవీ టుడే చైర్మన్, ఎండీ అరుణ్ పూరీ తదితరులపై కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్, ఆయన భార్య లూసీ ఢిల్లీలో పరువు నష్టం కేసును దాఖలు చేశారు.

దిగ్విజయ్ పై సిబిఐ విచారణకు హైకోర్టు ఆదేశం

    కాంగ్రెస్ నాయకుల్లో ఒకరి వేనుక ఒకరు అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోతున్నారు. మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్‌పై ట్రెజర్ ఐలాండ్ స్కాంలో విచారణ జరిపి ఆరు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని సీబీఐని మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశించినట్లు మహేష్ గార్గ్ అనే పిటిషనర్ తరఫున వాదించిన న్యాయవాది డాక్టర్ మనోహర్ దలాల్ తెలిపారు. ఈ స్కాంపై సామాజిక కార్యకర్త మహేష్ గార్గ్ 2009లోనే రాష్ట్ర ఆర్థిక అక్రమాల నిరోధ విభాగానికి ఫిర్యాదు చేశారు. ఇండోర్‌లోని ఎంజీ రోడ్డులో మధ్యప్రదేశ్ హౌసింగ్ బోర్డుతో కలిసి 2002లో ట్రెజర్ ఐలాండ్ అనే మాల్‌ను నిర్మించిన ఎంటర్‌టైన్‌మెంట్ వరల్డ్ డెవలపర్స్‌పై ఆ విభాగం ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. నివాస ప్రాంతంలో అక్రమంగా ఈ మాల్‌ను నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక రాయితీలు ఇచ్చిందని ఆరోపణలొచ్చాయి. దిగ్విజయ్ సింగ్‌తో పాటు మొత్తం 12 మందిపై ఈవోడబ్ల్యు విచారణ జరిపింది. తర్వాత ఆరుగురిపై మాత్రమే కేసు నమోదు చేసి దిగ్విజయ్ సింగ్‌కు క్లీన్‌చిట్ ఇచ్చింది.

మైనార్టీ కుంభకోణం డబ్బుతో టీవీ ఛానెల్ కొనేశారు

  రాష్ట్ర మైనార్టీ శాఖ నిధులను సుమారు 55 కోట్ల రూపాయల మేర నిర్భయంగా స్వాహా చేసిన నిందితులు ఆ డబ్బుతో ఇంకా ప్రారంభంకాని తెలుగు టీవి న్యూస్‌ ఛానల్‌ను కొనుగోలు చేసినట్లు తెలుగువన్‌ డాట్‌ కామ్‌ పరిశోధనలో తేలింది. ఫోర్జరీ డాక్టుమెంట్లతో ఎ.పి. స్టేట్‌ మేనార్టీస్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌ పేరిట  విజయ బ్యాంక్‌ లో ఎక్కౌంట్‌లు ఓపెన్‌ చేసి ప్రభుత్వం విడుదల చేసిన రూ. 80 కోట్లతో 55 కోట్ల రూపాయలు విత్‌డ్రా చేసుకుని ఖర్చు చేశారు. అయితే ఇలా చేసిన ఖర్చులో ఎనిమిది కోట్ల రూపాయలతో  విజయవాడ కేంద్రంగా ఇంకా ప్రారంభం కాని న్యూస్‌ ఛానల్‌  కొనుగోలు చేయడం ఒక కోణమైతే ఆ ఛానల్‌ కు చెందిన ఒక పార్టనర్‌  మరో పార్టనర్‌ను మోసగించి ఈ ఎనిమిది కోట్లలో ఐదు కోట్లు నొక్కేయడం మరో కోణం. ఈ ప్రధాన స్కామ్‌ తో పాటు మినీ స్కాంలో విజయవాడకు చెందిన ఒక వ్యక్తి ( గతంలో జర్నలిస్టుగా పనిచేసిన వ్యక్తి ) హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు టి.వి. జర్నలిస్టులు ప్రధాన పాత్ర పోషించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.  ఈ ముగ్గురిలో ఒకరిని ఇప్పటికే సి.బి.సి.ఐ.డి. అధికారులు ప్రశ్నించగా విజయవాడ వాసి గుట్టు చప్పుడు కాకుండా అమెరికాలోని తమ కుమార్తె వద్దకు చెక్కేయడానికి టికెట్లు బుక్‌ చేసుకున్నాడని అతను నేడో రేపో దేశ సరిహద్దులు దాటి పోతాడని తెలిసింది.        విజయవాడ కేంద్రంగా ఒక న్యూస్‌ ఛానల్‌ ప్రారంభించి నూతన ‘అంకా‘నికి నాంది పలకాలని   ఆ విజయవాడ మాజీ జర్నలిస్టు గత రెండేళ్ళుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపధ్యంలో అతనికి  రియల్‌ ఎస్టేట్‌ తో పాటు పలు వ్యాపారాలు చేస్తున్న వ్యక్తి ఒకరు అభయమివ్వడమే గాక సుమారు మూడు కోట్ల రూపాయలు నిధులు కూడా ఇచ్చాడు. నూతన అంకానికి తెరలేపాలనుకున్న వ్యక్తి మాత్రం తన వంతు పెట్టుబడిపై తాత్సారం చేస్తూ ఛానల్‌ను  తేలేక చేతులెత్తేయడంతో అ్పపటికే అభయం ఇచ్చి నిధులు కూడా విడుదల చేసిన వ్యక్తి తన డబ్బు సంగతేంటని నిలదీయసాగాడు. ఈ నేపధ్యంలో మైనార్టీ స్కాంలో అప్పణంగా డబ్బు కొల్లగొట్టిన నిందితుల్ని  హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు టి .వి. జర్నలిస్టులు నూతన అంకానికి తెరలేపాలనుకున్న విజయవాడ వాసికి పరిచయం చేయడం ఇతను ఇంకా తెరలేపని ఛానల్‌ను ఎనిమిది కోట్లకు విక్రయించడం జరిగింది.  ఈ ఎనిమిది కోట్లలో  కేవలం రూ.3.02 కోట్లను మాత్రమే   అభయ మిచ్చిన వ్యక్తికి ఇచ్చి మిగిలిన ఐదు కోట్లను ముగ్గురు స్వాహా చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సి.బి.సి.ఐ.డి వీరు జరిపిన లావాదేవీలపై సమాచారం ఇవ్వవలసిందిగా ఆదాయ పన్ను శాఖను కోరింది. ఈ శాఖ విచారణలో ఈ మినీ కుంభకోణం బైటపడింది.  

తేల్చుకోవాలనుకుంటున్న తెలంగాణా మంత్రులు

ప్రత్యేకతెలంగాణారాష్ట్రం ఇస్తారా? లేదా? అని తేల్చుకోవాలని తెలంగాణాప్రాంతానికి చెందిన మంత్రులు నిశ్చయించుకున్నారు. తాము ఓ నిశ్చిత అభిప్రాయానికి వచ్చిన తరువాత ఇక ఆగటం ఎందుకని ప్రధానితో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మంత్రులు చెప్పిన అన్ని అంశాలూ క్షుణ్నంగా పరిశీలించాక చివరాఖరున చూద్దామని ఓ చిరునవ్వు నవ్వారు. అలానే ఇతర నేతలు కూడా మంత్రులకు నవ్వుతూ వీడ్కోలు పలికారు. దీనికి కారణం ముందురోజు సిఎంతో సుదీర్ఘచర్చలు, తరువాత రోజు మంత్రులతో మంతనాలు వరుసగా జరగటమే. అయితే కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణాపై ఒక అభిప్రాయానికి రాలేకపోతోందని మంత్రులు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్‌ అధిష్టానం కూడా దీని విషయంలో ఏదో ఒకటి తేల్చేయాలని అనుకుంటున్నా దేశంలోని ఇతర ప్రాంతాల్లో తలెత్తే సమస్యలు పార్టీని నిశ్చితాభిప్రాయం వైపు రానీయటం లేదు. అయితే తాజాగా రాహుల్‌గాంధీ కూడా దీనిపై ఒక అభిప్రాయానికి వచ్చారని తెలుస్తున్నది. ఈ దశలోనే మంత్రులు ముఖేశ్‌, దానం నాగేందర్‌ మినహా మిగిలిన తెలంగాణా మంత్రులందరూ జానారెడ్డి ఆధ్వర్యాన సోనియాకు లేఖ రాశారు. సోనియాగాంధీ ఆ లేఖను పరిశీలించే తెలంగాణా మంత్రులు తమ అభిప్రాయాన్ని తెలియజేసేందుకు అవకాశమిచ్చారు. అయితే తెలంగాణా ఇవ్వటం కష్టమని కాంగ్రెస్ సీనియర్‌ నేతలు కే. కేశవరరావు, కోటమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు భావిస్తున్నారు. వీరి అభిప్రాయానికి తగ్గట్లుగానే పరిస్థితులూ కనిపిస్తున్నాయి. టిఆర్‌ఎస్‌ అధినేత చంద్రశేఖరరావు ఢిల్లీలో ఉండి లాబీయింగు చేసినా రాని స్పందన తెలంగాణా మంత్రులు సాధిస్తారా? లేక తేల్చుకోవాలని వెళ్లి సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వెనుక నడవటానికి సిద్ధపడి వస్తారా? అన్న ఉత్కంఠ రాష్ట్రంలో పెరిగిపోతోంది.

షర్మిల ప్రజాప్రస్థానం టార్గెట్ తెలుగుదేశం

కడప ఎంపి వైఎస్‌ జగన్మోహనరెడ్డి సోదరి, వైకాపా నాయకురాలు షర్మిల పాదయాత్ర ‘మరో ప్రజాప్రస్థానం’ పేరిట ప్రారంభమైంది. ఆమె ఇడుపులపాయలోని తన తండ్రి వైఎస్‌ఘాట్‌లో నివాళులర్పించి పాదయాత్ర ప్రారంభించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి తన రాజకీయజీవితంలో మలుపు కోసం చేపట్టిన రాజకీయప్రస్థానాన్ని తలపించేలా షర్మిల తన పాదయాత్రకు పేరు పెట్టించుకున్నారు. ఈ ప్రస్థానంతో ఆమె రాజకీయజీవితంలో ఎదగగలరో? లేదో? కూడా తేలిపోనుంది. ఈమె ఏకైక టార్గెట్‌ తెలుగుదేశం పార్టీ అధినేత నారాచంద్రబాబు నాయుడు చేపట్టిన మీకోసం వస్తున్నా పాదయాత్ర. అవకాశం దొరికినప్పుడల్లా తన తండ్రి తరహాలో చంద్రబాబుని విమర్శించడం షర్మిల స్టైల్. అయితే అప్పట్లో చంద్రబాబు అధికారంలో ఉన్నారు. కానీ, నేడు ఆయన ప్రతిపక్షనేత. అందువల్ల వెనుకడుగువేయాల్సిన పని లేదని చంద్రబాబు నాయుడు కూడా భావిస్తున్నారు. తాను ఎటువంటి ఆరోపణపైనైనా సమాధానమివ్వటానికి సిద్ధమన్నట్లు చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. దీంతో చంద్రబాబును ఎదుర్కోటానికి షర్మిల కూడా సిద్ధమయ్యారు. తన తల్లి, సోదరుడు ఆరోపించినట్లు కాకుండా విధానపరమైన చంద్రబాబు లోపాలపై ఆమె ఇప్పటికే పలువురు నాయకులతో చర్చించారట. ఈ చర్చల్లో తేలిన అంశాల ఆధారంగా బాబును ఇరకాటంలో పెట్టేందుకు షర్మిల సిద్ధంగా ఉన్నారు. అలానే తమ పార్టీ రాజకీయనేత, రచయిత యండమూరి వీరేంధ్రనాధ్‌తోనూ, సినీరచయిత, నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యంతోనూ షర్మిల ఎటువంటి విమర్శలు బాగా ప్రాచుర్యం పొందుతాయో కనుక్కొన్నారు. వాటికి మాత్రమే షర్మిల ప్రాధాన్యత ఇస్తారని తెలుస్తోంది. ఏదేమైనా పోటీపాదయాత్రల ఘట్టం ప్రారంభమైంది.  

మైనార్టీ కుంభకోణం డబ్బుతో టీవీ ఛానెల్ కొనేశారు

రాష్ట్ర మైనార్టీ శాఖ నిధులను సుమారు 55 కోట్ల రూపాయల మేర నిర్భయంగా స్వాహా చేసిన నిందితులు ఆ డబ్బుతో ఇంకా ప్రారంభంకాని తెలుగు టీవి న్యూస్‌ ఛానల్‌ను కొనుగోలు చేసినట్లు తెలుగువన్‌ డాట్‌ కామ్‌ పరిశోధనలో తేలింది. ఫోర్జరీ డాక్టుమెంట్లతో ఎ.పి. స్టేట్‌ మేనార్టీస్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌ పేరిట  విజయ బ్యాంక్‌ లో ఎక్కౌంట్‌లు ఓపెన్‌ చేసి ప్రభుత్వం విడుదల చేసిన రూ. 80 కోట్లతో 55 కోట్ల రూపాయలు విత్‌డ్రా చేసుకుని ఖర్చు చేశారు. అయితే ఇలా చేసిన ఖర్చులో ఎనిమిది కోట్ల రూపాయలతో  విజయవాడ కేంద్రంగా ఇంకా ప్రారంభం కాని న్యూస్‌ ఛానల్‌  కొనుగోలు చేయడం ఒక కోణమైతే ఆ ఛానల్‌ కు చెందిన ఒక పార్టనర్‌  మరో పార్టనర్‌ను మోసగించి ఈ ఎనిమిది కోట్లలో ఐదు కోట్లు నొక్కేయడం మరో కోణం. ఈ ప్రధాన స్కామ్‌ తో పాటు మినీ స్కాంలో విజయవాడకు చెందిన ఒక వ్యక్తి ( గతంలో జర్నలిస్టుగా పనిచేసిన వ్యక్తి ) హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు టి.వి. జర్నలిస్టులు ప్రధాన పాత్ర పోషించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.  ఈ ముగ్గురిలో ఒకరిని ఇప్పటికే సి.బి.సి.ఐ.డి. అధికారులు ప్రశ్నించగా విజయవాడ వాసి గుట్టు చప్పుడు కాకుండా అమెరికాలోని తమ కుమార్తె వద్దకు చెక్కేయడానికి టికెట్లు బుక్‌ చేసుకున్నాడని అతను నేడో రేపో దేశ సరిహద్దులు దాటి పోతాడని తెలిసింది.        విజయవాడ కేంద్రంగా ఒక న్యూస్‌ ఛానల్‌ ప్రారంభించి నూతన ‘అంకా‘నికి నాంది పలకాలని   ఆ విజయవాడ మాజీ జర్నలిస్టు గత రెండేళ్ళుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపధ్యంలో అతనికి  రియల్‌ ఎస్టేట్‌ తో పాటు పలు వ్యాపారాలు చేస్తున్న వ్యక్తి ఒకరు అభయమివ్వడమే గాక సుమారు మూడు కోట్ల రూపాయలు నిధులు కూడా ఇచ్చాడు. నూతన అంకానికి తెరలేపాలనుకున్న వ్యక్తి మాత్రం తన వంతు పెట్టుబడిపై తాత్సారం చేస్తూ ఛానల్‌ను  తేలేక చేతులెత్తేయడంతో అ్పపటికే అభయం ఇచ్చి నిధులు కూడా విడుదల చేసిన వ్యక్తి తన డబ్బు సంగతేంటని నిలదీయసాగాడు. ఈ నేపధ్యంలో మైనార్టీ స్కాంలో అప్పణంగా డబ్బు కొల్లగొట్టిన నిందితుల్ని  హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు టి .వి. జర్నలిస్టులు నూతన అంకానికి తెరలేపాలనుకున్న విజయవాడ వాసికి పరిచయం చేయడం ఇతను ఇంకా తెరలేపని ఛానల్‌ను ఎనిమిది కోట్లకు విక్రయించడం జరిగింది.  ఈ ఎనిమిది కోట్లలో  కేవలం రూ.3.02 కోట్లను మాత్రమే   అభయ మిచ్చిన వ్యక్తికి ఇచ్చి మిగిలిన ఐదు కోట్లను ముగ్గురు స్వాహా చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సి.బి.సి.ఐ.డి వీరు జరిపిన లావాదేవీలపై సమాచారం ఇవ్వవలసిందిగా ఆదాయ పన్ను శాఖను కోరింది. ఈ శాఖ విచారణలో ఈ మినీ కుంభకోణం హైటపడింది.  

తేల్చుకోవాలనుకుంటున్న తెలంగాణా మంత్రులు

ప్రత్యేకతెలంగాణారాష్ట్రం ఇస్తారా? లేదా? అని తేల్చుకోవాలని తెలంగాణాప్రాంతానికి చెందిన మంత్రులు నిశ్చయించుకున్నారు. తాము ఓ నిశ్చిత అభిప్రాయానికి వచ్చిన తరువాత ఇక ఆగటం ఎందుకని ప్రధానితో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మంత్రులు చెప్పిన అన్ని అంశాలూ క్షుణ్నంగా పరిశీలించాక చివరాఖరున చూద్దామని ఓ చిరునవ్వు నవ్వారు. అలానే ఇతర నేతలు కూడా మంత్రులకు నవ్వుతూ వీడ్కోలు పలికారు. దీనికి కారణం ముందురోజు సిఎంతో సుదీర్ఘచర్చలు, తరువాత రోజు మంత్రులతో మంతనాలు వరుసగా జరగటమే. అయితే కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణాపై ఒక అభిప్రాయానికి రాలేకపోతోందని మంత్రులు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్‌ అధిష్టానం కూడా దీని విషయంలో ఏదో ఒకటి తేల్చేయాలని అనుకుంటున్నా దేశంలోని ఇతర ప్రాంతాల్లో తలెత్తే సమస్యలు పార్టీని నిశ్చితాభిప్రాయం వైపు రానీయటం లేదు. అయితే తాజాగా రాహుల్‌గాంధీ కూడా దీనిపై ఒక అభిప్రాయానికి వచ్చారని తెలుస్తున్నది. ఈ దశలోనే మంత్రులు ముఖేశ్‌, దానం నాగేందర్‌ మినహా మిగిలిన తెలంగాణా మంత్రులందరూ జానారెడ్డి ఆధ్వర్యాన సోనియాకు లేఖ రాశారు. సోనియాగాంధీ ఆ లేఖను పరిశీలించే తెలంగాణా మంత్రులు తమ అభిప్రాయాన్ని తెలియజేసేందుకు అవకాశమిచ్చారు. అయితే తెలంగాణా ఇవ్వటం కష్టమని కాంగ్రెస్ సీనియర్‌ నేతలు కే. కేశవరరావు, కోటమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు భావిస్తున్నారు. వీరి అభిప్రాయానికి తగ్గట్లుగానే పరిస్థితులూ కనిపిస్తున్నాయి. టిఆర్‌ఎస్‌ అధినేత చంద్రశేఖరరావు ఢిల్లీలో ఉండి లాబీయింగు చేసినా రాని స్పందన తెలంగాణా మంత్రులు సాధిస్తారా? లేక తేల్చుకోవాలని వెళ్లి సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వెనుక నడవటానికి సిద్ధపడి వస్తారా? అన్న ఉత్కంఠ రాష్ట్రంలో పెరిగిపోతోంది.

షర్మిల ప్రజాప్రస్థానం టార్గెట్ తెలుగుదేశం

కడప ఎంపి వైఎస్‌ జగన్మోహనరెడ్డి సోదరి, వైకాపా నాయకురాలు షర్మిల పాదయాత్ర ‘మరో ప్రజాప్రస్థానం’ పేరిట ప్రారంభమైంది. ఆమె ఇడుపులపాయలోని తన తండ్రి వైఎస్‌ఘాట్‌లో నివాళులర్పించి పాదయాత్ర ప్రారంభించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి తన రాజకీయజీవితంలో మలుపు కోసం చేపట్టిన రాజకీయప్రస్థానాన్ని తలపించేలా షర్మిల తన పాదయాత్రకు పేరు పెట్టించుకున్నారు. ఈ ప్రస్థానంతో ఆమె రాజకీయజీవితంలో ఎదగగలరో? లేదో? కూడా తేలిపోనుంది. ఈమె ఏకైక టార్గెట్‌ తెలుగుదేశం పార్టీ అధినేత నారాచంద్రబాబు నాయుడు చేపట్టిన మీకోసం వస్తున్నా పాదయాత్ర. అవకాశం దొరికినప్పుడల్లా తన తండ్రి తరహాలో చంద్రబాబుని విమర్శించడం షర్మిల స్టైల్. అయితే అప్పట్లో చంద్రబాబు అధికారంలో ఉన్నారు. కానీ, నేడు ఆయన ప్రతిపక్షనేత. అందువల్ల వెనుకడుగువేయాల్సిన పని లేదని చంద్రబాబు నాయుడు కూడా భావిస్తున్నారు. తాను ఎటువంటి ఆరోపణపైనైనా సమాధానమివ్వటానికి సిద్ధమన్నట్లు చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. దీంతో చంద్రబాబును ఎదుర్కోటానికి షర్మిల కూడా సిద్ధమయ్యారు. తన తల్లి, సోదరుడు ఆరోపించినట్లు కాకుండా విధానపరమైన చంద్రబాబు లోపాలపై ఆమె ఇప్పటికే పలువురు నాయకులతో చర్చించారట. ఈ చర్చల్లో తేలిన అంశాల ఆధారంగా బాబును ఇరకాటంలో పెట్టేందుకు షర్మిల సిద్ధంగా ఉన్నారు. అలానే తమ పార్టీ రాజకీయనేత, రచయిత యండమూరి వీరేంధ్రనాధ్‌తోనూ, సినీరచయిత, నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యంతోనూ షర్మిల ఎటువంటి విమర్శలు బాగా ప్రాచుర్యం పొందుతాయో కనుక్కొన్నారు. వాటికి మాత్రమే షర్మిల ప్రాధాన్యత ఇస్తారని తెలుస్తోంది. ఏదేమైనా పోటీపాదయాత్రల ఘట్టం ప్రారంభమైంది.  

సత్యం కేసులో ఈడీ దూకుడు, 822 కోట్లు జప్తు

  సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసు మరో మలుపు తిరిగింది. రూ. 822 కోట్ల నగదు నిల్వలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈడీ జప్తు చేసింది. ఈడీ జప్తు చేసిన నగదు నిల్వలన్నీ మహింద్రా సత్యం ఖాతాలోనివేనని సమాచారం. రామలింగ రాజుకు చెందిన రూ.120 కోట్ల విలువైన ఆస్తుల అటాచ్‌మెంటుకు సిబిఐకి కోర్టు అనుమతిని ఇచ్చిన విషయం తెలిసిందే. రామలింగ రాజు ఆస్తుల కేసు తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆయన ఆస్తుల అటాచ్‌మెంటుకు అనుమతివ్వాలని సిబిఐ ఇటీవల సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు ఇరువైపుల వాదనల అనంతరం సిబిఐకి అటాచ్‌మెంట్ కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

నటి హేమశ్రీ హత్యకేసు, డ్రైవర్‌ అరెస్ట్

  కన్నడనటి హేమశ్రీ హత్యకేసులో కీలక వివరాలు ఒక్కొటొక్కటిగా బైటపడుతున్నాయి. బుధవారం రాత్రి డ్రైవర్‌ను కూడా పోలీసులు పట్టుకున్నారు. హేమశ్రీ భర్త సురేంద్ర బాబు ఆమెను తరలించడానికి డ్రైవర్ సతీష్ సహరించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసుకి సంబంధించిన మరిన్ని వివరాల్ని సేకరించేందుకు పోలీసులు హేమశ్రీ తల్లిని ప్రశ్ని౦చారు. క్లోరో ఫామ్ ఎక్కువగా ఇచ్చినందువల్లే హేమశ్రీ మృతి చెందిందన్న నిజాన్ని ఆమె భర్త సురేంద్ర పోలీస్ ఇంటరాగేషన్ లో ఇప్పటికే బైటపెట్టేశాడు. సురేంద్ర ఇచ్చిన సమాచారంతో తీగలాగిన బెంగళూరు పోలీసులకు హత్య వెనక మాజీ కార్పొరేటర్ మురళి హస్తం కూడా ఉందన్న విషయం తెలిసిపోవడంతో కేసులో చిక్కుముడి వీడిపోయింది. హేమశ్రీ మృతికి సంబంధించి ఆమె మిత్రుడు మంజునాథ్‌ను కూడా పోలీసులు ప్రశ్నించారు. హేమశ్రీ హత్యకు ముందు అతను ఆమెతో మాట్లాడిన సిడీని విడుదల చేశాడు. తన భర్త సురేంద్ర నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని హేమశ్రీ చెబుతున్నట్లు ఉన్న సీడిని అతను మీడియాకు విడుదల చేశాడు. ఈ నేపథ్యంలోనే మంజునాథ్‌ను పోలీసులు విచారించి, పంపించి వేశారు. అవసరమైతే మళ్లీ పిలుస్తామని పోలీసులు అతనికి చెప్పారు.

షర్మిల మరో ప్రజాప్రస్థానం ఓ రికార్డు : టీడీపి

  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర ఓ రికార్డుకుగా నిలిచిపోతుందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు. ప్రపంచంలో ఎక్కడా ప్రతిపక్షానికి వ్యతిరేకంగా పాదయాత్ర చేసిన చరిత్ర లేదని..ఆ విషయంలో షర్మిల పాదయాత్ర ఓ రికార్డుగా మిగులుతుందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. మ్యాచ్ ఫిక్సింగ్ అన్న పదానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పర్యాయపదం అని, కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలంటున్న వైఎస్ విజయమ్మ మరి గతంలో అవిశ్వాసం పెట్టినప్పుడు ప్రభుత్వాన్ని ఎందుకు పడగొట్టలేకపోయారని ప్రశ్నించారు. రాష్ట్రపతి ఎన్నికలలో ప్రణబ్ ముఖర్జీకి ఓటు వేయడంతోనే ఎవరు ఎవరు కుమ్మక్కయ్యారో ప్రజలకు తెలిసిపోయిందని అన్నారు.

ట్రిపుల్ సెంచరి పూర్తిచేసిన చంద్రబాబు

  చంద్రబాబు మూడో సెంచరీ కొట్టారు. పాదయాత్రలో రెండో జిల్లాలో భాగంగా మూడు వందల కిలోమీటర్ల మైలురాయిని బుధవారం దాటేశాడు. అనంతపురం జిల్లా టీడీపీకి పట్టుగొమ్మ కాబట్టి మంచి స్పందన వచ్చిందన్నారు, కానీ కర్నూలులో కూడా బాబుకు మంచి స్పందనే వస్తోందని తెలుగుదేశం శ్రేణులు సంబరపడుతున్నాయి. ప్రస్తుతానికైతే కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో “వస్తున్నా మీకోసం” పాదయాత్ర కొనసాగింది. 16వ రోజు చాలా సందడిగా గడిచింది. బాబు ఆటోవాలాలతో, మహిళలతో, డ్రైవర్లతో కూలీలతో ఎక్కువగా కలిసి మాట్లాడారు. పలు చోట్ల ఆటోలు ఎక్కారు. ఘనాపురం నుంచి ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ యాత్రకు మంచి స్పందన లభించింది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, సీపీఎం కార్యకర్తలు, గంగపుత్రులు, కురుమ సంఘాలు బాబుకు స్వాగతం పలుకుతూ వచ్చే ఎన్నికల్లో తమకు సీట్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలని వినతులు సమర్పించాయి. ఆదోని సర్కిల్ చేరుకున్నాక ఆయన కొద్దిసేపు ప్రసంగించారు. ఈ పట్టణం తెలుగుదేశం హయాంలోనే అభివృద్ధి చెందిందని అన్నారు. రెండేళ్ల కిందటి వరకు కలిసున్న నేతలు ఇప్పుడు తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ గా వేరుపడి దోచుకోవడానికి సిద్ధమయ్యాయని అన్నారు.