తెలంగాణలో చంద్రబాబు
వస్తున్నా…మీకోసం అంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సోమవారం మధ్యాహ్నం సుంకేశుల డ్యామ్ దాటి తెలంగాణలో అడుగుపెట్టారు. మహబూబ్నగర్ జిల్లా రాజోళిలో ఆయన ప్రవేశించారు. అక్కడ అయనకు టీడీపీ నేతలు పోతుల సురేష్ పరిటాల రవి అనుచరుడు, ఎర్రబెల్లి దయాకరరావు, రేవంత్రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు తదితరులు స్వాగతం పలికారు. జిల్లాలో మొత్తం 12 రోజుల పాటు 200 కిలోమీటర్లు జరగనుంది. అలంపూర్, గద్వాల్, దేవరకద్ర, నారాయణపేట, మక్తల్, కొడంగల్ లలో యాత్ర జరుగుతుంది. బాబు యాత్రను అడ్డుకుంటారని తెలంగాణవాదులను, విద్యార్థులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అక్కడక్కడా నిరసనల మధ్యే బాబు యాత్ర జరుగుతుంది. పాదయాత్రలో మాదిగ విద్యార్థి ఫెడరేషన్, ఎమ్మార్పీఎస్ బాబుకు మద్దతుగా నడుస్తోంది.