తెలంగాణాలో రాంబాబు రచ్చ, టీఆర్ఎస్ ఫైర్

 

దర్శకుడు పూరీ జగన్నాథ్ తెలంగాణవాదులతో కయ్యానికి కాలు దువ్వుతున్నారని కెటిఆర్ మండిపడ్డారు. జరగబోయే పరిణామాలకు తాము ఏమాత్రం బాధ్యులం కాదన్నారు. సినిమా ఇండస్ట్రీని తాము ఎప్పుడూ టార్గెట్ చేయలేదని చెప్పారు. కాగా ఈ సినిమాను బ్యాన్ చేయాలని తెలంగాణ న్యాయవాదులు హెచ్చార్సీని ఆశ్రయించారు. కాంగ్రెసు పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి తెలంగాణకు మోసం చేస్తే పవన్ కల్యాణ్ ఇలా చేశారని టిఆర్ఎస్ శ్రేణులు ధ్వజమెత్తారు. తాము ఈ సినిమాను చూసే ప్రసక్తి లేదన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చి లాభాలు గడించాలనుకుంటే చూస్తూ ఊరుకోమన్నారు. దీనిని తెలంగాణవ్యాప్తంగా అడ్డుకుంటామన్నారు. తెలంగాణవాదుల ఆందోళనలపై కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా డిస్ట్రిబ్యూటర్ దిల్‌రాజు స్పందించారు. పూరీ జగన్నాథ్‌తో మాట్లాడి అభ్యంతరకర సన్నివేశాలను తొలగిస్తామని ఆయన తెలిపారు. సినిమాకు అడ్డుకోవద్దని తెలంగాణవాదులకు ఆయన పిలుపునిచ్చారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.