అంగన్ వాడి కేంద్రం లో బ్లాక్ దందా..

మనుషులకు  రోజు రోజుకి డబ్బు దాహం పెరిగిపోతుంది. డబ్బు ఉంటే అన్ని ఉంటాయి అనే భామతో బతుకుతున్నారు..ఆ డబ్బుకోసం కల్తీ బాటపడుతున్నారు చాలా మంది. లేదంటే ఎక్స్పైరీ డేట్ అయిన వస్తువులు అమ్మడం.. ఇలాంటివి గోదముల్లోనూ, కిరాణ దుకాణాల్లోనూ పాల సెంటర్ లోను జరుగుతుంటాయి.  కొంత మంది  అంగన్ వాడి నిర్వాహకులు  పసిపిల్లల నోటి కాదు బువ్వను గుంజుకుంటున్నారు. తాజాగా ఈ తరహా బురిడీ అంగన్ వాడి కేంద్రం లో జరిగింది. అది ఎక్కడో తెలుసుకుందామా..?  అది మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం అంగన్ వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు అందించే పౌష్టికాహారం బాలామృతం ప్యాకెట్లను కాల పరిమితి ముగిసిన తర్వాత అందజేశారు. ఈ ఘటన జిల్లా కేంద్రంలోని కేసముద్రం మండలం కల్వల గ్రామంలో గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది. సుమారు 8 మంది పిల్లల తల్లిదండ్రులకు అంగన్వాడీ సిబ్బంది ఈ ప్యాకెట్స్ అందజేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని రేణుక, రాధ అనే పిల్లల తల్లులు తెలిపారు. దీనిపై స్పందించిన అంగన్ వాడీ సూపర్వైజర్ విజయ మాట్లాడుతూ.. బాలామృతం ప్యాకెట్స్ కాలపరిమితి ముగిసింది వాస్తవమే అని, ఈ విషయంపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.మొత్తానికి అంగన్ వాడి కేంద్రాల్లో కూడా చివరికి పసిపిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.. పసిపిల్లలు దేవుడి తో సమానం అంటూనే వాళ్ళ గుంతు నొక్కే పని చేస్తున్నారు..  రెండు నెలల బాలుడి హత్య..  రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రెండు నెలల బాలుడిని హత్య చేసిన ఘటన జిల్లాలోని అనాజ్ పూర్‌లో చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు బాలుడిని హత్య చేసి నీటి ట్యాంకులో పడేశారు.  తమ కొడుకు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు బాలుడి కోసం వెతికారు. అయినా చిన్నారి జాడ తెలియకపోవడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సీసీ ఫుటేజ్‌లో బాలుడి ఆచూకీ కోసం వెతికారు. అయినా బాలుడి ఆచూకీ లభించకపోవడంతో ఇంటిపై గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఇంటిపై ఉన్న నీటి ట్యాంకులో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. దుండగులు బాలుడిని హత్య చేసి నీటి ట్యాంకులో పడేసినట్టు గర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సీఎం జ‌గ‌న్‌కు మావోయిస్టుల వార్నింగ్‌.. వైసీపీలో హైటెన్ష‌న్‌..

ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి దాసోహం అయిందని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. తనపై ఉన్న కేసుల కోసమే మోడీ సర్కార్ కు జగన్ గులాం గురి చేస్తున్నారని మావోయిస్టు నేత, ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏవోబీ) స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేశ్ ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో ప్రజలకు ఒరిగిందేమీ లేదంటూ ఆయన మీడియాకు లేఖ పంపారు. తనపై ఉన్న అవినీతి కేసుల నుంచి తప్పించుకునేందుకు ప్రత్యేక హోదా అంశాన్ని జగన్ కేంద్రానికి తాకట్టు పెట్టేశారని  లేఖలో గణేశ్ మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ... అప్పటి టీడీపీ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీకి సాగిలపడిందని ఆరోపణలు చేసిందని, తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా తీసుకువస్తామని వాగ్దానం చేసిందని గుర్తుచేశారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమైన ప్రభుత్వం.. వారిని పక్కదారి పట్టించేందుకే మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చిందని మండిపడ్డారు. కేంద్రం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, దీనికి వ్యతిరేకంగా ప్రజాస్వామిక వాదులు, లౌకికవాదులు గొంతెత్తితే రాజద్రోహం కేసులుపెట్టి జైళ్లలో నిర్బంధిస్తోందని అన్నారు. జగన్ దీనికి మద్దతు ప్రకటిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను విమర్శిస్తున్న మీడియాను సైతం జగన్ వదిలిపెట్టకుండా పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారని మండిపడ్డారు. ‘నవరత్నాలు పథకాలు ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించి, ఉపాధిని కల్పించి అభివృద్ధి చేయలేవు. అమ్మఒడి, ఆరోగ్యశ్రీ వంటి పథకాలతో కార్పొరేట్‌ సంస్థలకు లాభాలను చేకూర్చడమే గానీ, ప్రభుత్వ రంగాన్ని అభివృద్ధి చేయడం కాదు. విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ను కేంద్రం అమ్మేయాలని యత్నిస్తుంటే దానికి జగన్‌ ప్రభుత్వం ఆమోదం తెలిపి, పైకి మాత్రం వ్యతిరేకిస్తున్నట్లు నటిస్తూ కార్మికులను మోసం చేస్తోంది. వైసీపీ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయలేదు. గ్రామ వాలంటీర్లది సేవ అంటూనే రాజకీయ అవసరాలకు, పోలీసు ఏజెంట్లుగా పనిచేయాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారు. ఈ వ్యవస్థ సైతం అవినీతిమయంగా మారుతోంది అని లేఖలో గణేష్ ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం బాక్సైట్‌ తవ్వకాలకు సంబంధించిన జీవో-97 రద్దు చేసినప్పటికీ, అన్‌రాక్‌ కంపెనీతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయలేదని గణేశ్‌ తెలిపారు. బాక్సైట్‌ తవ్వకాలను వ్యతిరేకిస్తున్న మావోయిస్టుల ఏరివేతకు ప్రత్యేక బలగాలను దింపుతున్నారన్నారు. ప్రజా సమస్యలపై గొంతు విప్పుతున్న మేధావులు, రచయితలపైనా ‘ఉపా’ కేసులు ప్రయోగించి జైళ్లలో బంధిస్తున్నారని విమర్శించారు. రాజకీయ పార్టీలపైనా కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని, ఆఖరికి తనను విమర్శిస్తున్న మీడియాను సైతం వదిలి పెట్టకుండా కేసులు పెడుతూ పత్రికా స్వేచ్ఛను కూడా హరిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజా వ్యతిరేక విధానాలను మరుగునపరచి.. తన సొంత మీడియా, పార్టీ శ్రేణుల ద్వారా తన ప్రభుత్వం గొప్ప విజయాలు సాధించిందని భూమి దద్దరిల్లేలాగా జగన్‌ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. జగన్‌ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు అందరూ ముందుకురావాలని గణేశ్‌ ఆ లేఖలో పిలుపిచ్చారు.

యూఎస్ లో మరో తెలుగు తేజం ఘనత.. మెడికల్‌ అసోసియేషన్‌ ఛైర్మన్ గా బాబీ 

అగ్రరాజ్యం అమెరికాలో మరో తెలుగు తేజం అరుదైన ఘనత సాధించారు. ప్రతిష్టాత్మక అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఛైర్మన్‌గా ప్రవాసాంధ్రుడు ముక్కామల శ్రీనివాస్‌(బాబీ) ఎన్నికయ్యారు. ఈ సంఘానికి ఛైర్మన్‌గా ఎన్నికైన తొలి భారతీయుడిగా బాబీ నిలిచారు. కృష్ణాజిల్లా తోట్లవల్లూరుకు చెందిన శ్రీనివాస్‌.. మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రి మాజీ ఛైర్మన్‌ ముక్కామల అప్పారావు కుమారుడు. తోట్లవల్లూరు గ్రామస్తులు కీ.శే అన్నే  వెంకట్రామయ్య , అప్పమ్మ గార్ల మనవడు.  ముక్కామ ల శ్రీనివాస్ (బాబీ) అమెరికన్ మెడికల్ అసోసియేషన్ చైర్మన్ గా ఎన్నికైనందుకు యూఎస్ లో ఎన్నారై సంఘాలు సంతోషం వ్యక్తం చేశాయి.   అమెరికన్ మెడికల్ అసోసియేషన్ చైర్మన్ గా ఎన్నికైన మొట్టమొదటి భారతీయుడు ముక్కామల శ్రీనివాస్ కావడం భారత దేశానికి, తెలుగుజాతికి  గర్వకారణమని కీర్తించాయి. బాబీ ఏఎంఏ ఛైర్మన్ గా ఎన్నిక కావడంతో ఆయన స్వగ్రామం  తోట్లవల్లూరు సంబరం నెలకొంది. గ్రామస్తులు శ్రీనివాస్ కు అభినందనలు తెలిపారు.  1971లో పీటర్స్ బర్గ్ లో జన్మించిన ముక్కమాల శ్రీనివాస్.. మిచిగాన్ లోని ఫ్లింట్లో పెరిగారు. మిచిగాన్ మెడికల్ స్కూల్ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్ అయిన బాబీ.. ఫ్లింట్‌లో ప్రైవేట్ ప్రాక్టీస్‌ చేస్తున్నారు. సుమతి ముక్కమల 1978 నుండి 2000 వరకు ఫ్లింట్‌లో పీడియాట్రిక్స్ అభ్యసించారు. అప్పారావు ముక్కమల 1975 నుండి 2020 వరకు ఫ్లింట్‌లో రేడియాలజీని అభ్యసించారు. బోర్డ్-సర్టిఫైడ్ ఓటోలారిన్జాలజిస్ట్ - హెడ్ మరియు మెడ సర్జన్ అయిన బాబీ ముక్కమాల శ్రీనివాస్ జూన్ 2017 లో అమెరికన్ మెడికల్ అసోసియేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలకు ఎన్నికయ్యారు. డాక్టర్ అప్పారావు ముక్కమల 2007-2008లో మిచిగాన్ స్టేట్ మెడికల్ సొసైటీ అధ్యక్షుడిగా పనిచేశారు. బాబీ ముక్కమల 2020-2021లో మిచిగాన్ స్టేట్ మెడికల్ సొసైటీ అధ్యక్షుడిగా పనిచేశారు. గత 150 ఏళ్లలో ఎంఎస్‌ఎంఎస్ అధ్యక్షులుగా పనిచేసిన ఏకైక తండ్రి, కొడుకుగా  బాబీ అప్పారావు నిలిచారు AMA లో చురుకుగా పనిచేస్తున్న డాక్టర్ శ్రీనివాస్.. AMA యంగ్ ఫిజిషియన్స్ విభాగానికి  మిచిగాన్ ప్రతినిధిగా ఉన్నారు,  AMA ఫౌండేషన్ యొక్క “ఎక్సలెన్స్ ఇన్ మెడిసిన్” లీడర్‌షిప్ అవార్డుకు గెలుచుకున్నారు.  గత 13 సంవత్సరాలుగా, AMA హౌస్ ఆఫ్ డెలిగేట్స్‌కు మిచిగాన్ ప్రతినిధి బృందం సభ్యుడుగా కొనసాగుతున్నారు. 2009 లో AMA కౌన్సిల్ ఆన్ సైన్స్ అండ్ పబ్లిక్ హెల్త్ కు ఎన్నికయ్యారు. 2016 నుండి 2017 వరకు ఛైర్మన్ గా పని చేశారు. ముక్కమాల అప్పారావు మరియు బాబీ ఇద్దరూ 2007 నుండి 2010 వరకు ఒకేసారి AMA కౌన్సిల్‌లలో పనిచేశారు. అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (AMA), అమెరికన్ వైద్యుల సంస్థ.  దీని లక్ష్యం “medicine షధం యొక్క సైన్స్ మరియు కళను ప్రోత్సహించడం మరియు ప్రజారోగ్యం మెరుగుదల. దీనిని 1847 లో ఫిలడెల్ఫియాలో 40 మందికి పైగా వైద్య సంఘాలు మరియు 28 కళాశాలలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 250 మంది ప్రతినిధులు స్థాపించారు. 21 వ శతాబ్దం ప్రారంభంలో AMA లో 240,000 మంది సభ్యులు ఉన్నారు. దీని ప్రధాన కార్యాలయం చికాగోలో ఉంది.  AMA తన సభ్యులకు మరియు ప్రజలకు ఆరోగ్యం మరియు శాస్త్రీయ సమాచారాన్ని వ్యాప్తి చేస్తుంది మరియు మాస్ మీడియా మరియు ఉపన్యాసాల ద్వారా విస్తృతమైన ఆరోగ్య విద్యా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ముఖ్యమైన వైద్య మరియు ఆరోగ్య చట్టాల గురించి దాని సభ్యులకు తెలియజేస్తుంది.  

భార్య సుఖం.. భర్త చావు.. 

ఆడవాళ్ళ కోసం యుద్దాలు జరిగాయి. రాజ్యాలు తగలబడ్డాయి. రాజులు మరణించారు ఇదంతా ఎందుకోసం చెపుతున్నాను అంటే.. ఇన్ని రోజులు సాపకింది నీరులా భర్తకు తెలియకుండా.. భార్య, భార్యకు తెలియకుండా భర్త నడిపిన అక్రమ సంబంధాలు అని లాక్ డౌన్ కారణంగా వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి. ఇంకేముంది ఆ అక్రమ సంబంధాలు ఇంట్లో తెలియడంతో ముందుగా మందలింపులు, ఆ తర్వాత గొడవలు, మితిమీరితే ఒకరినొకరు చంపుకోవడం.తాజాగా తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కోపంతో ఓ మహిళ తన భర్తనే హత్య  చేసింది. ఆ తర్వాత డెడ్‌బాడీ రంగు మారడంతో ఆ మాయలాడి చేసిన నిర్వాహకం  బయటపడింది.   తన సుఖానికి సినిమాకు ముందు వేసే ముకేశ్ యాడ్ లా అడ్డుగా ఉన్నాడని. మూడు ముళ్ళు , ఏడు అడుగులు వేసిన భర్తనే కడతేర్చిందో మహిళ. ఈ ఘటన ప్రకాశం జిల్లా జె.పంగులూరు మండలం తూర్పు కొప్పెరపాడులో ఆలస్యంగా వెలుగు చూసింది. అతని పేరు  కుంచాల రవి వయసు 35 సంవత్సరాలు. అదే గ్రామానికి చెందిన రాజ్యలక్ష్మితో 12 సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. రవి బేల్దారీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రాజ్యలక్ష్మి ఇంట్లో ఖాళీగా ఉంటుంది. అలా ఖాళీగా ఉండడం ఎందుకు అనుకుందో లేదా.. భర్త తనకు సుఖం ఇవ్వడం లేదు అనుకుందో ఏమో గానీ. తన ఇంటికి సమీపంలో ఉండే ఓ వ్యక్తితో కొన్నాళ్లుగా యవ్వారం నడిపింది. ఈ విషయాన్ని గమనించిన రవి, రాజ్యలక్ష్మి ని మందలించాడు.  పద్ధతిగా ఉండాలని భార్యను హెచ్చరించాడు. ఆమె భర్త మాటలు లెక్క చేయలేదు. ఆ తర్వాత కూడా ప్రియుడితో విరహం తీర్చుకునేది. ఎంత చెప్పిన ఆమెలో మార్పు రాకపోవడంతో దంపతుల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తన సుఖానికి అడ్డొస్తున్న భర్తను అడ్డు తొలగించుకోవాలని రాజ్యలక్ష్మి నిర్ణయించుకుంది. అందుకు ఎవరికి అంతుచిక్కని పథకం వేసింది. ఆ పధకాన్ని అమలు చేయడానికి సరైన సమయం కోసం వెయిట్ చేస్తుంది. ఆమె అనుకున్న రోజు రానే వచ్చింది. మంగళవారం రాత్రి మద్యం తాగి ఇంటికొచ్చిన రవికి కూల్‌డ్రింక్‌‌లో విషం కలిపి తాగించగా కొద్దిసేపటికే అతడు చనిపోయాడు. దీంతో కొత్త నాటకానికి తెరదీసిన ఆమె తన భర్త నిద్రలోనే చనిపోయాడంటూ బంధువులకు ఫోన్ చేసి చెప్పింది. దూర ప్రాంతంలో ఉన్న బంధువులు గురువారం చేరుకోవడంతో అప్పటివరకు అంత్యక్రియుల జరపకుండా ఆపారు. అయితే రవి మృతదేహం రంగుమారి ఉండడంతో అనుమానం వచ్చిన వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని రాజ్యలక్ష్మిని నిలదీయగా అసలు విషయం చెప్పింది. దీంతో వారు రవి డెడ్‌బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రాజ్యలక్ష్మిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యోదంతంలో ఆమె ప్రియుడు ప్రమేయం ఉందా? అన్న కోణంలోనూ విచారిస్తున్నారు.                 

రాముడి కంట కన్నీరు.. క‌రోనానే కార‌ణ‌మంటున్న భ‌క్తులు!

క‌లికాలంలో రాముడి కంట క‌న్నీరు కారుతోంది. రాములోరికి ఏం క‌ష్టం వ‌చ్చిందోన‌ని భ‌క్తులు ఆందోళ‌న చెందుతున్నారు. రాముడి క‌న్నీరు తుడిచే ప్ర‌య‌త్నం చేసినా.. కంట నీరు మాత్రం ఆగ‌డం లేదు. ఈ అనూహ్య ప‌రిణామం ఖ‌మ్మం జిల్లాలో చోటు చేసుకుంది. శ్రీరాముని విగ్రహం కంటి వెంట నీరు కారుతుండ‌టం స్థానికంగా కలకలం రేపుతోంది. కొంద‌రు వింత‌గా చూస్తుంటే.. మ‌రికొంద‌రు మాత్రం అరిష్ట‌మంటూ భ‌య‌ప‌డుతున్నారు.  ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం వెంకటయి తండాలోని సమ్మక సారలక్క ఆలయంలో రాముడి విగ్రహం కొలువుదీరి ఉంది. విగ్రహం ఎడమ కంటి నుంచి నీళ్లు కారుతున్నాయి. ఈ విష‌యం చుట్టుప‌క్క‌ల గ్రామాల్లో ప్ర‌చారం జ‌ర‌గ‌డంతో అంతా పెద్ద ఎత్తున త‌ర‌లివ‌స్తున్నారు.  ఐదేళ్లుగా ఈ ఆలయంలో రాముడి కళ్యాణం జరిపిస్తున్నారు గ్రామస్తులు. తన కలలో శ్రీరాముడు కనిపించి కన్నీరు పెట్టుకున్నారని పూజారి చెబుతున్నారు. తెల్లారాక‌ ఆలయానికి వచ్చి చూడగా నిజంగానే రాముడి విగ్ర‌హం కంటి నుంచి నీరు కారుతోంద‌ని అంటున్నారు.  ఘటనపై తండా వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి అరిష్టం జరగబోతోంద‌ని అనుమానిస్తున్నారు. మానవ జాతికి రాబోతున్న ముప్పున‌కు సంకేతమని కొందరు అంటుంటే.. క‌రోనా నేపథ్యంలో రాములోరు కన్నీరు పెట్టుకుంటున్నారు అంటూ ఎవ‌రికి తోచిన విధంగా వారు చర్చించుకుంటున్నారు. ఈ వింతను చూసేందుకు స్థానికులు తరలివస్తున్నారు. గ‌తంలో వినాయ‌కుడి విగ్ర‌హం పాలు తాగడం సంచ‌ల‌నం సృష్టించ‌గా.. తాజాగా ఓ తండాలోని రాముడి విగ్ర‌హం కంటి నుంచి నీరు రావ‌డానికి కార‌ణం ఏంటో క‌నుగొనాల్సి ఉందంటున్నారు.  

ఆట మొదలైంది.. ఘోరీ కడతా ! హుజూరాబాద్ లో ఈటల గర్జన 

బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన కార్యాచరణ మొదలు పెట్టారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ టార్గెట్ గా ఆయన నియోజకవర్గంలో పర్యటించారు. రాజీనామా తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గానికి వచ్చిన రాజేందర్.. తన సత్తా ఏంటో తెలిసేలా బలప్రదర్శన చేశారు. వేలాది మందితో ర్యాలీ తీసి గులాబీ పార్టీలో గుబులు రేపారు. కొవిడ్ భయం వెంటాడుతున్నా ఈటల కోసం వేలాది మంది తరలిరావడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.  హుజూరాబాద్ లో ఉద్వేగంగా ప్రసంగించిన ఈటల రాజేందర్.. కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు. తనను, తన అనుచరులను వేధిస్తే ఘోరీ కడతామని హెచ్చరించారు.  హుజురాబాద్ ప్రజలు ప్రేమకు లోగుతారని చెప్పారు ఈటల. తనకు మద్దతు ఇస్తున్న వారిని ఇంటిలీజెన్స్ అధికారులు వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. తన వాళ్ళను వేధిస్తే ఖబడ్ధార్ అని ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరించారు. చిలుక పలుకులు పలుకుతున్న మంత్రులకు ఆత్మగౌరవము ఉందా అని ఈటల ప్రశ్నించారు. 2024లో జరిగే ఎన్నికలకు హుజురాబాద్ ఉప ఎన్నిక రిహార్సల్ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఆత్మగౌరవ పోరాటానికి హుజురాబాద్ వేదికగా మారిందన్నారు. ఇంటింటికి వెళ్లి అందరిని కలుస్తానని ఈటెల రాజేందర్ తెలిపారు.  మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో పాటు ర్యాలీలో పాల్గొన్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. హుజురాబాద్ లో ఆట మొదలైందని, రేపు వేట గా మారొచ్చని చెప్పారు.ఒక్కరు ఇద్దరం అయ్యాం, ముగ్గురమై ఐదుగురిని వేసుకుని అసెంబ్లీలో బిజెపి ఎల్ పి కార్యాలయం సాధిస్తామని తెలిపారు. ఇప్పటివరకు నీతికి నిజాయితీతో ఉన్న హుజురాబాద్, ఇకపై మందుసీసాలకు బిర్యానులకు పట్టం కట్టాలని కోరినట్లు మంత్రి గంగుల తీరు ఉందని రఘునందన్ మండిపడ్డారు. ప్రకృతి వనం, వైకుంఠధామం లకు కేంద్రమే డబ్బులు ఇచ్చిందన్నారు.  కేంద్రం ఇచ్చిన డబ్బుల తోనే గులాబీ రంగు వేస్తున్నారని ఆరోపించారు.  బీజేపీలో చేరిన తర్వాత తొలిసారి సొంత నియోజవర్గానికి వచ్చిన ఈటల రాజేందర్ కు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. మొదట కాట్రపల్లికి చేరుకున్న ఈటలకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. గ్రామ ఉప సర్పంచ్ శ్రీనివాస్ తో పాటు  ఎనిమిది మంది వార్డు సభ్యులు, కోఆప్షన్ సభ్యులు టిఆర్ఎస్ నుంచి ఈటెల సమక్షంలో బిజెపిలో చేరారు. అక్కడి నుంచి హుజూరాబాద్ వెళ్లారు రాజేందర్. ఈటలకు మద్దతుగా వేలాది మంది తరలివచ్చారు. జై ఈటల నినాదాలాతో హుజూరాబాద్ మార్మోగింది. హుజరాబాద్ నుంచి రాంపూర్,  శాలపల్లి, చెల్పూర్ మీదుగా జమ్మికుంటకు... అక్కడినుంచి కొత్తపల్లి, ధర్మారం, శాయంపేట, నాగులపేట, గండ్ర పల్లి, తణుగుల మీదుగా వావిలాలకు చేరుకున్నారు రాజేందర్.  దాదాపు ఐదు గంటల పాటు సాగిన ఈ ర్యాలీలో అన్ని గ్రామాల్లో మహిళలు, అభిమానులు ఈటలకు ఘన స్వాగతం పలికారు. జమ్మికుంట మండలం నాగారంలో తన ఇష్టదైవమైన భక్తాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేశారు. ముఖ్యమైన కార్యక్రమాలు అన్నీ ఈ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత నే చేపట్టడం ఈటలకు సెంటిమెంట్. ఈటెల వెంట ఎమ్మెల్యే రఘునందన్ రావు, బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ ఉన్నారు.  మరోవైపు ఈటల రాజేందర్ సతీమణి జమున కూడా హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. కమలాపూర్ మండలం గోపాలపురం హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కరీంనగర్ జిల్లా మాజీ చైర్పర్సన్ తుల ఉమ, బిజెపి మీడియా లీగల్ సెల్ మేడ్చల్ జిల్లా అధ్యక్షురాలు ప్రసన్నతో కలిసి ఆమె కమలాపురం మండలంలోని పఅంబాల, గునిపర్తి,  మాదన్నపేట, శనిగరం, గోపాలపురం, బత్తివానిపల్లి లో పర్యటించారు.  తెలంగాణ రాష్ట్రం కోస రాజేందర్ ఎంతో  కష్టపడ్డారని చెప్పారు.  కావాలని తమని  పార్టీ నుండి బయటకి పంపించారని ఆరోపించారు. నియోజకవర్గంలో గతంలో కంటే తమకు రెట్టింపు ఆదరణ లభిస్తుందని తెలిపారు. గతంలో కంటే ఎక్కువ మెజార్టీతో విజయం సాధిస్తామన్నారు ఈటల జమున. 

మరదలి మీద మనసు పారేసుకున్నాడు.. పెళ్లాన్ని చంపేశాడు

భార్య, భర్తల మధ్య మనస్పర్దలు రావడం సహజం.. సమస్యలు వస్తే సర్దుకుపోవాలిగానీ.  ఆ మనస్పర్థలు ఒకరినొకరు చంపుకునేంత వరకు వెళ్ళకూడదు.. ఒక వేళా మ్యాటర్ అక్కడి ఎక్కడివరకు వెళ్లిందంటే అది పెద్ద రీజన్ అయ్యి ఉంటుంది. అతనికి తన మరదలితో ఉండాలనుకున్నాడు..అందుకోసం అతనికి ఒక రీసన్ కనిపింది.. అదే అతని భార్య వేరే వాళ్ళతో చనువుగా ఉండడం ఇక అంతే ఆమెను అడ్డుతొలిగించి మరదలితో కాపురం పెడుదామనుకున్నాడు.. చివరికి ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఇంకెందుకు ఆలస్యం పదండి ముందుకి..    భార్య, భర్తల మధ్య మనస్పర్దలు  ఒకరినొకరు చంపుకునేంత వరకు వెళ్లిందంటే.. రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి అక్రమ సంబంధం, రెండు డబ్బు వివాదం..ఒకరి మీద మరొకరికి ప్రేమ తగ్గిందనో వచ్చే మనస్పర్ధలు ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు. త్వరగానే సమసిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అయితే, పూర్వం పెళ్లి అంటే నమ్మకం ఉండేది  ప్రస్తుత రోజుల్లో భార్య మీద భర్తకు, భర్త మీద భర్తకు నమ్మకం లేకపోవడం వల్లే అనుమానాలు పెరిగిపోతున్నాయి. దాని వాళ్లే ఈ అరాచకాలు జరుతున్నాయి. అనుమానం కలిగేలా ఎవరైనా ప్రవర్తిస్తున్నారంటే ఎవరో ఒకరు తప్పు చేస్తున్నారనే భావన ఎదుటి వ్యక్తికి కలుగుతుంది. అది నిజంగా వివాహేతర సంబంధమని తేలితే ఇద్దరిలో ఒకరు చంపడానికైనా లేదా చవడానికైనా వెనకాడం లేదు ఫ్యాక్షన్ సినిమాలో మర్డర్ సీన్ కంటే దారుణంగా చంపేస్తున్నారు. ఇంకొన్ని ఘటనల్లో తమ వివాహేతర సంబంధాన్ని కంటిస్యూ చేసేందుకు కట్టుకున్న వారినే దారుణంగా కడతేరుస్తున్నారు. ఇలాంటి ఘటనే దేశరాజధాని ఢిల్లీలో గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది. అయితే, ఆ కేసు నుంచి తప్పించుకునేందుక నిందితుడు పోలీసులను కూడా తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించాడు. ఏదైనా తట్టుకోవచ్చు గానీ నమ్మకద్రోహం మాత్రం మాత్రం ఏ ఒక్కరు తట్టుకోలేరు.. ఎప్పుడైతే నమ్మకం నదిలో కలిపేస్తామో ఎలాంటి సంఘటనలకు అవకాశాలు ఉంటాయి.. సో అవి భార్య భర్తల మధ్య తలెత్తకుండా ఉండాలంటే నమ్మకాన్ని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాలి.   వివరాల్లోకివెళితే.. ఢిల్లీకి చెందిన 25ఏళ్ల వికాస్ అనే వ్యక్తి తన భార్య ప్రియాంకను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. అది ఎందుకోసం చేశాడో తెలుసా..? తన మరదలితో ఉన్న వివాహేతర సంబంధాన్ని కొనసాగించేందుకే అతను ఈ దారుణానికి తెగపడ్డాడు . తన భర్త ఇంకొకరితో చనువుగా ఉండటాన్ని భరించలేని ప్రియాంక ఇలాంటి పనులు మానుకోవాలని హెచ్చరించింది. దానితో పాటు మరదలి తో సంభందం పెట్టుకోవడానికి ఇదే సరైన సమయం అనుకున్నాడు.. అందుకోసమే  ఎలాగైన భార్య అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న వికాస్ మంగళవారం రాత్రి ఆమెను దారుణంగా హతమార్చాడు. అనంతరం పోలీస్ కంట్రోల్ రూంకు కాల్ చేసి ఓ కట్టుకథ అల్లాడు. తాను ఇంట్లో లేని సమయంలో గుర్తుతెలియని దొంగలు ఇంట్లోకి చొరబడి తన భార్యను దారుణంగా పొడిచి చంపారని.. అనంతరం ఎస్కేప్ అయ్యారని పోలీసులకు వివరించాడు. తీరా రంగంలోకి దిగిన పోలీసులు అతను చెప్పిన దానికి అక్కడ జరిగిన దానికి పొంతన లేదని గ్రహించారు. తీరా వారి స్టైల్లో విచారించగా అసలు విషయం వెల్లడైంది. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.  

మాన్సాస్‌లో రాచ‌క్రీడ‌!.. పావుగా సంచ‌యిత‌..!

సంచ‌యిత‌. మూన్నాళ్ల ముచ్చ‌ట‌. ఏడాది క్రిత‌మే స‌డెన్‌గా వినిపించిన పేరు. ఏడాది గ‌డిచేలోగా మాన్సాస్ చ‌రిత్ర‌లో క‌లిసిపోయిన పేరు. పే..ద్ద బొట్టు, వ‌దిలేసిన కురుల‌తో ఆమె రూపం విచిత్రం. ఆమె చేష్ట‌లూ అంతే విచిత్రం. గూగుల్‌లో ఆమె పాత ఫోటోలు చూస్తే కంప‌రం. ప‌ద‌వి రాగానే ఓవ‌ర్‌నైట్ అటిట్యూడ్ మారిపోయింది. వైసీపీ ప్ర‌భుత్వం అండ చూసుకొని రెచ్చిపోయారు. అది త‌న‌పై గౌర‌వం కాదు.. అశోక్ గ‌జ‌ప‌తిరాజుపై శ‌త్రుత్వం అనే విష‌యం మ‌రిచారు. అన్నేళ్లూ అంతా త‌న‌ను మ‌రిచి.. స‌డెన్‌గా ఎక్క‌డినుంచో తీసుకొచ్చి మాన్సాస్ పీఠంపై కూర్చోబెట్ట‌డం వెనుక మ‌ర్మం ప‌సిగ‌ట్ట‌లేక‌పోయారు. ఇటు మాన్సాస్‌లోనూ, అటు సింహాచ‌లం దేవ‌స్థానం బోర్డులోనూ ర‌చ్చ రంబోలా చేశారు. పైడిత‌ల్లి అమ్మ‌వారి జాత‌ర‌లో ఆనంద‌గ‌జ‌ప‌తిరాజు కుటుంబాన్ని అవ‌మానింత తీరు అత్యంత దారుణం. న‌డిమంత్ర‌పు సిరి బాగా త‌ల‌కెక్కిన‌ట్టుంది.. అందుకే త‌ల‌బిరుసుత‌నంతో తైత‌క్క‌లాడిందంటూ విమ‌ర్శ‌ల పాలయ్యారు సంచ‌యిత‌. క‌ట్ చేస్తే.. హైకోర్టు తీర్పుతో ఆమె పోస్ట్ ఊస్ట్‌. రాత్రికి రాత్రే ఆమె మాజీ అయిపోయారు. ఆ మ‌ర్నాడే అశోకుడు మాన్సాస్ పీఠం అధిరోహించారు. అప్పుడే ఆయ‌న‌పై క‌క్ష్య‌సాధింపు చ‌ర్య‌లు స్టార్ట్ అయ్యాయి. మాన్సాస్ ట్ర‌స్ట్‌లో అశోక్ హ‌యాంలో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని, వాటిపై విచార‌ణ అవ‌స‌రమంటూ వైసీపీ నేత‌లు, మంత్రులు కుట్ర‌లు స్టార్ట్ చేసేశారు. స‌ర్కారు సంగ‌తి ప‌క్క‌న‌బెడితే.. ఈ ఏడాది కాలంలో అస‌లు మాన్సాస్‌లో ఏం జ‌రిగింద‌నే విష‌యంపై అశోక్ గ‌జ‌ప‌తిరాజు సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టారు. సంచ‌యిత ఛైర్‌ప‌ర్స‌న్ అయ్యాక‌.. మాన్సాస్‌ ట్రస్టు సిబ్బందికి జీతాలే చెల్లించ‌లేద‌నే విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. మ‌రి, ఎందుకు జీతాలు ఇవ్వ‌లేదు? డ‌బ్బులు లేక‌నా? కావ‌ల‌సినంత ఉంది? కావాల‌నే సాల‌రీస్ ఇవ్వ‌కుండా అలా వేధించారు. పిల్ల చేష్ట‌లు కాక మ‌రేంటి?  ద‌శాబ్దాలుగా మాన్సాస్ ట్ర‌స్ట్ కార్యాల‌యం విజ‌య‌న‌గ‌రం రాజావారి కోట‌లోనే ఉండేది. దాన్ని ఉన్న‌ప‌ళంగా విశాఖ జిల్లాకు త‌ర‌లించ‌డం తుగ్ల‌క్ చేష్ట‌ల‌ని త‌ప్పుబ‌డుతున్నారు. ఇక‌, సింహాచ‌లం బోర్డు వ్య‌వ‌హారాల్లోనూ త‌న మ‌నిషిని జొప్పించి.. ఓవ‌రాక్ష‌న్ చేశార‌నే విమ‌ర్శ‌లూ ఉన్నాయి. సింహాచ‌లం దేవాస్థానానికి చెందిన‌ ఐదు గ్రామాల భూముల్లో వివాదం సృష్టించి.. పెద్ద‌ది చేసి.. వాటిని స్వాహా చేసే ప్ర‌య‌త్న‌మూ వైసీపీ నేత‌ల క‌నుస‌న్న‌ల్లో జ‌రిగింద‌నే ఆరోప‌ణ‌లూ వ‌చ్చాయి. తాజాగా, సంచ‌యిత హ‌యాంలో ట్ర‌స్ట్ వ్య‌వ‌హారాల‌పై ఆడిట్ కూడా జ‌ర‌ప‌లేద‌ని తెలిసింది. ఆ విష‌యం తెలిసి అశోక్‌గ‌జ‌ప‌తిరాజే ఆశ్చ‌ర్య‌పోయారు. ఆడిట్‌ జరిపించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులదేనని.. మ‌రి వారు ఎందుక‌లా వ‌దిలేశార‌ని ప్ర‌శ్నించారు. ట్ర‌స్ట్‌లో ఏదో గూడుపుఠాని జ‌రిగుంటుంద‌ని.. త‌న హ‌యాంలో దోపిడీ దారుల‌కు మాన్సాస్‌లో స్థానం లేద‌ని తేల్చి చెప్పారు. ఇక‌, ట్రస్ట్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే అశోక్‌ గజపతిరాజు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. లీజు గడువు పూర్తయిన ట్రస్టు భూములను వేలం వేయాలని ఆదేశించారు. మాన్సాస్‌ ట్రస్ట్‌ కార్యాకలాపాల వివరాలు, పదేళ్లుగా ఆడిటింగ్‌కు చెల్లించిన ఫీజు వివరాలు ఈనెల 21లోగా తెలియజేయాలని అధికారులను ఆదేశించారు.   మ‌రోవైపు, సంచ‌యిత తీరుపై అశోక్ కూతురు అదితి గ‌జ‌ప‌తిరాజు సైతం ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ట్రస్ట్‌కు చైర్‌పర్సన్ చేస్తే.. కోటకే మహారాణీలా ఫీల్ అయిందంటూ సెటైర్లు వేశారు. అధికారం తలకెక్కిన సంచయిత సొంత కుటుంబసభ్యులను సైతం గౌరవించకుండా ప్రవర్తించారన్నారు. గతేడాది పైడితల్లి అమ్మవారి జాతర సందర్భంగా ఆనందగజపతి భార్య సుధాగజపతి, కుమార్తె ఊర్మిళా గజపతి కోట బురుజుపై కూర్చోగా సంచయిత వారిని ఖాళీ చేయించారని ఆవేదన వ్యక్తం చేసిన అదితి.. సంచ‌యిత‌ను అమ్మ‌వారే శిక్షించార‌న్న‌ట్టుగా మాట్లాడారు. మాన్సాస్‌కు చైర్‌పర్సన్‌గా వచ్చి విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందికి జీతాలు చెల్లించకుండా చేశారని మండిపడ్డారు. మాన్సాస్‌ బోర్డులో ఎంపీ, ఎమ్మెల్యే కూడా సభ్యులుగా ఉన్నారని, వారి దృష్టికి తీసుకెళ్లే సంచయిత నిర్ణయాలు తీసుకున్నారా? లేక సొంత నిర్ణయాలా? అన్నది కూడా పరిశీలిస్తామన్నారు అదితి గ‌జ‌ప‌తిరాజు. ఇలా.. ఏడాదికి పైగా మాన్సాస్‌లో మ‌హారాణిలా ఓ వెలుగు వెలిగిన సంచ‌యిత‌.. కోర్టు తీర్పుతో ఆమె ప్ర‌భ ఒక్క‌సారిగా మ‌స‌క‌బారిపోయింది. వైసీపీ ఆడిన రాచ‌క్రీడ‌లో బ‌లిప‌శువుగా మారి.. రాజ కుటుంబం ముందు దోషిగా, ద్రోహిగా నిల‌బ‌డాల్సిన దుస్థితి సంచ‌యిత‌ది.

కొవాగ్జిన్ వ్యాక్సిన్ పరిశీలనకు WHO ఆమోదం.. 

హైదరాబాద్ కేంద్రంగా ఉన్న భారత్ బయోటెక్ ఫార్మా సంస్థ ఉత్పత్తి చేస్తున్న కొవాగ్జిన్ కొవిడ్ వ్యాక్సిన్ పరిశీలనకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం లభించింది. దేశీయ తయారీ సంస్థ కొవాగ్జిన్..  కరోనా వ్యాక్సిన్ అంతర్జాతీయ వినియోగం కోసం భారత్ బయోటెక్ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)కు గతంలో దరఖాస్తు చేసుకుంది.  తాజాగా ఈ దరఖాస్తు పరిశీలనకు డబ్ల్యూహెచ్ఓ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం కొవాగ్జిన్ ను భారత్ లో వినియోగిస్తుండగా, ఇతర దేశాల్లో వినియోగించేందుకు డబ్ల్యూహెచ్ఓ అనుమతి తప్పనిసరి.  అందుకే అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ కొన్నిరోజుల కిందట భారత్ బయోటెక్ డబ్ల్యూహెచ్ఓకు దరఖాస్తు చేసింది. అయితే, పలు దశల క్లినికల్ ట్రయల్స్ కు సంబంధించిన సమగ్ర సమాచారం లోపించిందని డబ్ల్యూహెచ్ఓ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో, డబ్ల్యూహెచ్ఓ కోరిన అదనపు సమాచారాన్ని భారత్ బయోటెక్ పంచుకోవడంతో దరఖాస్తు పరిశీలనకు లైన్ క్లియరైంది. ఈ క్రమంలో ఈ నెల 23న కీలక సమావేశం జరగనుంది. కొవాగ్జిన్ కు సంబంధించిన 3వ దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి సమాచారాన్ని ఈ సమావేశంలో డబ్ల్యూహెచ్ఓకు సమర్పించనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయితే... కొవాగ్జిన్ అత్యవసర వినియోగం కోసం భారత్ బయోటెక్ దాఖలు చేసిన దరఖాస్తును డబ్ల్యూహెచ్ఓ నిపుణుల కమిటీ పరిశీలించనుంది. అపై అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలా, వద్దా అనేది నిర్ణయిస్తారు. దీనిపై భారత్ బయోటెక్ కు చెందిన ఓ అధికారి స్పందిస్తూ... గతంలో తాము అభివృద్ధి చేసిన టైఫాయిడ్, పోలియో, రోటా వైరస్ వ్యాక్సిన్లకు డబ్ల్యూహెచ్ఓ అనుమతులు మంజూరు చేసిందని, ఇప్పుడు కొవాగ్జిన్ విషయంలోనూ తమకు ఎలాంటి సందేహాలు లేవని పేర్కొన్నారు. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియేనని, తమ సంస్థకు ఇదేమీ కొత్త కాదని అన్నారు.

వైసీపీ, బీజేపీ మధ్య వార్! ఢిల్లీ డైరెక్షన్ లోనే జగన్ టార్గెట్? 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనాలు జరగబోతున్నాయా? అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇక గండమేనా? జగన్ రెడ్డిపై బీజేపీ ఫోకస్ చేసిందా? అంటే అవుననే తెలుస్తోంది. ఏపీలో జరుగుతున్న పరిణామాలు అలానే ఉన్నాయి. జగన్ ప్రభుత్వం, వైసీపీ టార్గెట్ గా ఏపీ బీజేపీ నేతలు ఒక్కసారిగా దూకుడు పెంచడం చర్చగా మారింది. కేంద్రం పెద్దల డైరెక్షన్ లోనే కమలం నేతలు స్పీడ్ పెంచారని అంటున్నారు. ఇకపై వైసీపీ టార్గెట్ గానే ఏపీ బీజేపీ కార్యక్రమాలు ఉండనున్నాయని తెలుస్తోంది.  సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో కడప నుండే బీజేపీ వార్ మొదలైనట్లు కనిపిస్తోంది. కడప జిల్లా ప్రొద్దుటూరులో టిప్పుసుల్తాన్ విగ్రహం ఏర్పాటు అంశం వైసీపీ, బీజేపీల మ‌ధ్య రచ్చ రాజేసింది.  స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడుగా కీర్తిస్తూ పట్టణంలోని జిన్నా రోడ్డు స‌ర్కిల్‌లో టిప్పుసుల్తాన్ స‌ర్కిల్ ఏర్పాటు చేస్తుండడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళనకు సిద్ధమవుతోందియ టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటుపై ఏపీ బీజేపీ ప్రెసిడెంట్‌ సోము వీర్రాజు తీవ్రంగా స్పందించారు. భారతీయులను కాఫీరులుగా ముద్ర వేసి ఊచకోత కోసిన పరమ దుర్మార్గుడికి విగ్రహాం ఏర్పాటు చేయడం ఏంటని సోము వీర్రాజు మండిపడ్డారు. విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వల్ల హిందువుల మనోభావాలను దెబ్బతీసినట్లేనని విరుచుకుపడ్డారు. ప్రొద్దుటూరు మత సామరస్యానికి మారుపేరుగా ఉందని, ప్రశాంతంగా ఉన్న పట్టణంలో ఏర్పాటు చేయడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు.టిప్పుసుల్తాన్ క్రూరుడు కాబట్టే గతంలో ఎక్కడ విగ్రహాలు పెట్టలేదని వెల్లడించారు. దేశానికి ఎనలేని సేవ చేసిన మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త అబ్దుల్ కలాం కన్నా టిప్పుసుల్తాన్ గొప్పవాడు కాదని, టిప్పుసుల్తాన్ విగ్రహం స్థానంలో అబుల్ కలాం విగ్రహం ఏర్పాటు చేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ జిన్నా రోడ్డు, మైదుకూరు రోడ్డు కూడలిలో టిప్పు సుల్తాన్ స‌ర్కిల్ ఏర్పాటు చేయాల‌ని కొంద‌రు ముస్లిం పెద్దలు భావించారు. ఈనెల 13న టిప్పుసుల్తాన్ విగ్రహ ఏర్పాటు కోసం ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్రసాద్‌రెడ్డి భూమిపూజ చేశారు. దీంతో అస‌లు వివాదం మొద‌లైంది. ఈ వ్యవ‌హారంపై బీజేపీ, ఆర్ఎస్ఎస్‌, ఇత‌ర హిందూ సంస్థలు తీవ్ర నిర‌స‌న వ్యక్తం చేస్తున్నాయి. ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు టిప్పుసుల్తాన్‌ను దేశ భ‌క్తుడు, చారిత్రక పురుషుడు అంటూ కీర్తించడాన్ని ఖండిస్తోంది భారతీయ జనతా పార్టీ. టిప్పుసుల్తాన్ స‌ర్కిల్ ఏర్పాటుకు కృషి చేస్తాన‌ని చేసిన ప్రక‌ట‌నపై మండిపడుతోంది ఆ పార్టీ. మ‌రోవైపు టిప్పుసుల్తాన్ విగ్రహం ఏర్పాటు అంశం ప‌దిహేనేళ్ల క‌ల అంటున్నారు ముస్లింలు. ఇప్పటికే కర్నాటకలో టిప్పుసుల్తాన్‌ జయంతి కార్యక్రమాల్ని వ్యతిరేకిస్తున్నారు బీజేపీ నేతలు. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాలో, అదీ వైసీపీ ఎమ్మెల్యే సాయంతో ఏర్పాటవుతున్న విగ్రహం కావడం మరింత కాక రేపుతోంది. విగ్రహం ఏర్పాటు అంశాన్ని విర‌మించుకోక‌పోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళ‌న‌కు దిగుతామంటోంది. టిప్పుసుల్తాన్ చ‌రిత్రపై ఎక్కడైనా చర్చించేందుకు తాము సిద్ధమంటున్నారు బీజేపీ నేతలు. అనూహ్యంగా తెరపైకి వచ్చిన టిప్పుసుల్తాన్‌ వ్యవహారం ప్రస్తుతం ప్రొద్దుటూరులో అలజడి సృష్టిస్తోంది. ఈ సెన్సిటివ్‌ ఇష్యూ ఎటు దారితీస్తుందోనని పట్టణ వాసులు ఆందోళన చెందుతున్నారు. 

కోడలిని చంపిన మేనమామ.. ఎందుకో తెలుసా.. ?

ఈ ప్రస్తుత సమాజం లో మన వాళ్ళు ఎవరో పరాయి వాళ్ళు ఎవరో తెలియకుండాపోయింది.. ఎవర్ని మామ్మలో ఎవర్ని మమ్మొదో అర్థం కావడం లేదు.. మేన మామ అంతే తండ్రి తర్వాత తండ్రి అంతటి గౌరవం ఇవ్వాల్సిన వ్యక్తి.. కానీ నేటి సమాజంలో సొంత వాళ్ళే తోడేళ్ళు అవుతున్నారు.. అయినా వాళ్లే మనపైన కాలయముళ్లు అవుతున్నారు. మనవాళ్లే కదా అని నమ్మితే నిలువునా ముంచుతున్నారు.. తాజాగా మేనమామ అని అమ్మినందుకు ఆ అమ్మాయికి ఏం జరిగిందో మీరే చూడండి..  ఆమె ఒకరిని ప్రేమించింది. మరొకరిని ఇష్టం లేని పెళ్లి చేసుకుంది. కొన్నాళ్ల క్రితం ఆమె భర్త కూడా మరణించాడు. ఇక ఆమె చేసింది ఏమిలేక పుట్టేందు దుఃఖం లో మునిగిపోయింది. భర్త పోగానే బంధం కలుపుకుని ఆమె  మేనమామ వచ్చాడు. అయిందేదో అయింది.. ఏడిస్తే చనిపోయిన వాళ్ళు వస్తారా అని ఇంకా వయసు అయిపోయిందేముంది అంటూ మాట్లాడాడు మేనమామ. తన మాజీ ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి నమ్మించాడు. ఆమె కూడా నమ్మింది. చివరికి దారుణంగా హత్య చేశాడు.  వివరాలు ఇలా ఉన్నాయి. కలబుర్గి జిల్లా బళుండగి గ్రామంలో సిద్దరామప్ప కల్లప్ప ఆవటి (43) నివాసం ఉంటున్నాడు. కొన్నాళ్ల క్రితం సోదరి భర్త చనిపోవడంతో కూతురుతో ఉన్న ఆమెను తీసుకోచ్చి తన ఇంట్లోనే నివాసం ఏర్పాటు చేశారు. అయితే సోదరి కూతురు ఆరతి మల్లప్ప (17) అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో ప్రేమలో పడింది. వారిద్దరు కలిసి ఉన్న ఫొటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిని చూసిన మేనమామ ఆగ్రహం చెంది.. కోడలిని చంపాలని ప్లాన్ వేశాడు. ఇందులో భాగంగా కూడలసంగమలో నువ్వు కోరుకున్న ప్రియుడితో వివాహం చేస్తానని మేనమేడలును నమ్మించి తీసుకెళ్లాడు. మార్గమధ్యలో ఆమెపై దాడి చేసి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని బ్రిడ్జి కింద పడేసి పరారీ అయ్యాడు. హతురాలిని గుర్తించిన పోలీసులు మేనమామ కోసం ఆరా తీయగా.. హత్య జరిగిన నాటి నుంచి అదృశ్యం అయినట్లు గుర్తించారు. సాంకేతికను ఉపయోగించి నిందితుడిని అరెస్ట్ చేశారు. హత్య గల కారణాలను విచారించగా.. తాము అల్లారు ముద్దుగా పెంచినా హద్దులు దాటి ప్రవర్తించిదని, అందుకే హత్య చేశానని ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరు పరిచారు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. 

రఘురామను వెంటాడుతున్న సీఐడీ.. సంచలనం జరగబోతుందా? 

ముందు లడ్డూలా దొరికాడనుకున్నారు. కసి తీర్చుకున్నారు. కట్ చేస్తే..కథ అడ్డం తిరిగింది. విషయం సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. అంతే రబ్బర్ బ్యాండ్ జారి వెనక్కి జాడించి ఎలా కొడుతుందో..అలా తగిలింది దెబ్బ ఏపీ సీఐడీ అధికారులకు. అప్పటి దాకా ఎంపీ రఘురామను ఏ సెక్షన్ లో పెట్టి ఏ రేంజ్ లో పిండాలా అని తెగ ఉత్సాహపడినవాళ్లు..  రఘురామ పెట్టిన కంప్లయింట్ల దెబ్బకు కరెంట్ షాక్ కొట్టిన కాకిలా మారిపోయారు. ఇప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలి... ఎంపీని ఎలా చిక్కించుకోవాలి అనేదే వారి టార్గెట్ గా అయిపోయింది. నిను వీడని నీడను నేనే అన్నట్లు రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ పోలీసులు వెంటాడుతున్నారు. చేతికి చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నాడని తెగ బాధపడిపోతున్నట్లే అనిపిస్తోంది. అందుకే కేవలం సంతకం పెట్టలేదన్న ఒక్కకారణంతో మళ్లీ జైలుకు తీసుకుపోవాలని చూస్తున్నారంటే...వారి ఆత్రం, తాపత్రయం అర్ధమైపోతున్నాయి. బెయిల్ వచ్చాక.. ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిపోయి ఢిల్లీకి వెళ్లిపోయారు ఎంపీ రఘురామకృష్ణరాజు. ఆయన లాయర్లు నివేదికలు కోర్టుకు సమర్పించారు.  అయితే బెయిల్ అధికారికంగా రావాలంటే..సుప్రీం ఉత్తర్వుల ప్రకారం రఘురామకృష్ణరాజు గుంటూరు వచ్చి సంతకం చేయాలని.. అలా చేయలేదని కోర్టులో చెప్పడం.. కోర్టు రిమాండ్ పొడిగించడం చకచకా అయిపోయాయి. కనీసం కళ్ల ముందు జరుగుతున్నదానిని కూడా పట్టించుకోకుండా కేవలం కాగితాల ఆధారంగా కథ నడిచిపోయింది. ఇప్పుడు ఏపీ సీఐడీ లెక్క ప్రకారం రఘురామకృష్ణ రిమాండ్ లో ఉన్నట్లే లెక్క..రిమాండ్ లో లేడంటే పారిపోయినట్లు లెక్క.. సో మళ్లీ ఆయనను పట్టుకుని జైల్లో పెట్టాలి.. ఆయన మళ్లీ బయటకు రావాలంటే కోర్టులో అప్పీల్ చేసుకోవాలి.. అదీ ఇప్పుడు కొత్త స్కెచ్,.ఇంత రచ్చ జరిగాక కూడా.. ఈ విధంగా చేస్తున్నారంటే... ఢిల్లీలో రఘురామను సస్పెండ్ చేయించే ప్రయత్నాలు సక్సెస్ కాలేదా అనే అనుమానాలు వస్తున్నాయి. పైకి వైసీపీ నేతలు ఈసారి రఘురామను సస్పెండ్ చేయటం ఖాయమని.. పైన అన్నీ మాట్లాడేశామని చెబుతున్నారు. కాని అలాంటిదేమీ లేదేమో..అందుకే ఈ రూటులో వస్తున్నారేమో అనే డౌట్స్ పెరుగుతున్నాయి.  మరోవైపు రఘురామకృష్ణరాజు స్పీకర్, హోంమంత్రి.. ఇలా అందరికీ తనకు జరిగిన అన్యాయమిది అంటూ ఏకరువు పెట్టేసుకున్నారు. పార్లమెంట్ లో అయితే ఈసారి ఈ ఎపిసోడ్ పై చర్చ జరగడం ఖాయం.ఇప్పటికే కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లకు చెందిన ఎంపీలు రఘురామ ఎపిసోడ్ ను ఖండించడమే కాక..తాము పార్లమంట్ లో లేవనెత్తుతామని ఓపెన్ గా ప్రకటించారు. అప్పటి నుంచి వైసీపీ శిబిరంలో మరింత కలవరం మొదలైంది. పార్లమెంట్ లో చర్చ అనేది ఎక్కడిదాకా పోతుందో అనే ఆందోళన అయితే వైసీపీ నేతల్లో కనపడుతోంది.అందుకే వారు పట్టుదలగా రఘురామకృష్ణరాజును సస్పెండ్ చేయించాల్సిందేనని పావులు కదుపుతున్నారు. ఇప్పటికే పీకల్లోతు కూరుకుపోయిన ఏపీ సీఐడీ అధికారులు..ఇంకా ఏదో చేయాలని తపన పడుతున్నారు. అందుకే అవకాశాలు వెతికి మరీ..కారణాలు సృష్టించుకుని మరీ రఘురామకృష్ణను పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొననీయకుండా అరెస్టు చేయాలని చూస్తున్నారు. సుప్రీంకోర్టు దృష్టిలో కేసు ఉన్నప్పటికీ.. ఏపీ సర్కార్ పెద్దలు ఏ మాత్రం లక్ష్యపెట్టకుండా..తామనుకున్నది తాము చేసుకోవడానికే తెగించి ముందుకు పోతున్నట్లు కనపడుతోంది.

అర్ధరాత్రి అల్లుడికి మర్యాద.. ఒకరు మృతి 

అల్లుడికి కూతురుకు మధ్య తిరుపతిలో వెంకన్న గుడిలో పూజలు జరిగినట్లు నిత్యం గొడవలు జరుగుతున్నాయి. ఇద్దరి మధ్య సఖ్యత లేక సంసారంలో కష్టాలు కొనితెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో అల్లుడిని, కూతురుని ఇంటికి పిలిచిన అత్తామామలు అల్లుడికి అతిగా మర్యాదలు చేశారు. అదే వారు చేసిన పొరపాటు అయింది. మందు వేస్తే ఒక్కచోట ఉండదుగా మానవ జన్మ.. క్షణికావేశంలో దాడి చేసుకోవడంతో ఒకరు మృతిచెందాడు. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో జరిగిందీ ఘటన. తాడేపల్లి మండలం నులకపేటకు చెందిన దుర్గారావు కొన్నాళ్ల క్రితం తన కూతురు లావణ్యను విజయవాడకు చెందిన నరేష్ ఇచ్చి వివాహం చేశారు. కొత్త పెళ్లి కొత్త కాపురం కొన్ని రోజులు సవ్యంగానే సాగిన  వీరి సంసారంలో ఇటీవల గొడవలు రేగాయి. భార్య భర్తల గొడవలపై ఇరు కుటుంబ సభ్యులు ఇద్దరితో మాట్లాడారు. చిన్న గోవాదాలు జరిగితే సర్దుకుపోవాలి నచ్చజెప్పారు.  తరుచు ఆ భార్య భర్తల మధ్య గొడవలు జరగడం కుటుంబ సభ్యులు వాళ్ళకి నచ్చచెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే కారణం ఏంటో తెలియదుగాని  నరేష్ పై కేసు నమోదు అవ్వడం ఆ తర్వాత  జైలుకు కూడా వెళ్లొచ్చాడు. కాగా, బుధవారం అత్తగారింటికి నరేష్ తన భార్యతో కలిసి వచ్చాడు. బాధలో ఉన్న అల్లుడికి మర్యాదల్లో లోటు రాకూడదని ఏర్పాట్లు మందు తీసుకు వచ్చి మత్తు ఎక్కేలా పార్టీ ఘనంగా చేశారు. అయితే సాయంత్రం నుంచి మందు తాగుతున్న నరేష్.. అత్తామామలతో జరిగిన డిస్కర్షన్ లో మాటామాటా పెరిగి తన భార్య లావణ్యపై దాడి దిగాడు. ఇక అల్లుడిని ఆపేందుకు అత్తామామలు రంగంలోకి దిగారు యెంత వద్దని చెప్పిన, పద్ధతి కాదని ప్రయత్నించినా మద్యం మత్తులో ఉన్న అతడు ఆగలేదు. ఈ పెనుగులాటలో మామ దుర్గారావు ఇనుప రాడ్ తో అల్లుడిపై దాడి చేశారు. దీంతో నరేష్ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. భార్య లావణ్య, అత్తామామలను అదుపులోకి తీసుకున్నారు.   

హుజూరాబాద్ కు నిధుల వరద.. కేసీఆర్ ను ఈటల తట్టుకునేనా? 

ఇంకా నోటిఫికేషన్ రానే లేదు. ఎన్నికల హడావుడి అసలే లేదు. జస్ట్ రాజీనామా చేశారంతే. అంతే ఇక రంగంలోకి దిగిపోయారు గులాబీ నేతలు. రేపో మాపో పోలింగ్ అన్నట్లే హల్ చల్ చేస్తున్నారు. ఇన్నాళ్లు హుజూరాబాద్ ఏమైందో తెలియదు గాని..ఇక అది మరో హైదరాబాద్ అయిపోతుందన్నట్లు బిల్డప్ ఇస్తున్నారు. మంత్రి గంగుల కమలాకర్ అయితే ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు. కొన్ని రోజుల్లోనే హుజూరాబాద్ డెవలప్ అయిపోతుంది అంటూ ప్రామిస్ చేసేస్తున్నారు. ఈటల రాజేందర్ వర్సెస్ కేసీఆర్ ఇప్పటిదాకా ఓ లెక్క.. ఇక నుంచి ఓ లెక్క. ఆయన రాజీనామా చేసి బరిలోకి దిగుతున్నాడు. తమని ఇన్నిమాటలన్నవాడు గెలిస్తే ఎలా.. మన పరువేం కావాలి? పోటీ చేసేది బిజెపి తరపున అయినా సరే..బలంగా ఢీకొట్టి పిండి చేసేయాలన్నంత కసిగా కదులుతున్నారు టీఆర్ఎస్ నేతలు. మంత్రి గంగుల కమలాకర్ అయితే అసలు ఇన్నాళ్లు హుజూరాబాద్ లో అభివృద్ధే జరగలేదు..ఎందుకు చేయలేదు ఈటల రాజేందర్...మేం వచ్చాం ఇక చూడండి అభివృద్ధి ఎలా చేస్తామో? ఎన్ని నిధులు ఇస్తామో చూడండి అంటున్నారు.అంటే ఇప్పటిదాకా ఈటల హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు.. ఇక ఇప్పుడు జరుగుతుందంట. అదేమంటే ఈటల కేసీఆర్ ని నిధులు అడగలేదంట..పట్టించుకోలేదంట.. ఇప్పుడు చూడు అంటూ గంగుల గర్జిస్తున్నారు. ఈటల అనుచరులైతే హుజూరాబాద్ కరీంనగర్ జిల్లాలో లేదా..తెలంగాణలో లేదా..కేసీఆర్ దానిని పట్టించుకోరా అంటూ సెటైర్లు వేస్తున్నారు. టీఆర్ఎస్ మాత్రం హూజూరాబాద్ ఉప ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లే కనపడుతుంది. నోటిఫికేషన్ వచ్చాక నిధులు ఇవ్వలేరు కాబట్టి... దాని కంటే ముందే అభివృద్ధి కార్యక్రమాల పేరుతో హడావుడి చేయాలని చూస్తోంది. దాని కోసం ఎన్నినిధులైనా ఇవ్వటానికి కేసీఆర్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. నోటిఫికేషన్ వచ్చేలోపు... ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాలో టార్గెట్లు కూడా పెట్టుకున్నారంట. ఇక ఎలక్షన్ ఇంజనీరింగ్ లో టీఆర్ఎస్ ఎటూ ఆరితేరిపోయింది.  అందుకే ఇప్పటి నుంచే కీలక మైన నేతల ఐడెంటిఫికేషన్ మొదలైపోయింది. వారు ఏ పార్టీ అయినా సరే..కాంగ్రెస్, బిజెపి, వామపక్షాలు..అన్ని పార్టీలలో కొన్నిఓట్లను అయినా వేయించగలిగేవారైతే చాలు...వారిని గుర్తించి..వారికేం కావాలో అవి ఇచ్చే కార్యక్రమం కూడా మొదలు కాబోతుందని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే వాళ్లకు ఫోన్లు వస్తున్నాయనే టాక్ ఉంది. అలా అటు ప్రభుత్వం నుంచి నిధులు... ఇటు పార్టీ నుంచి పైసలు రెండూ కుమ్మరించి హుజూరాబాద్ ను నిలబెట్టుకోవాలని..ఈటల రాజేందర్ కి షాక్ ఇవ్వాలని కేసీఆర్ గట్టి పట్టు మీదున్నట్లు కనపడుతోంది. అభ్యర్ధి విషయంలో కూడా చాలా లెక్కలు వేసుకుంటున్నారు. ఎల్ రమణను టీఆర్ఎస్ లో చేర్చుకుని టిక్కెట్ ఇస్తారని..ప్రచారం జరిగింది. తర్వాత పెద్దిరెడ్డి పేరు వచ్చింది. అప్పటికే కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి పేరు కూడా వినపడింది. ఇప్పుడు తాజాగా వారందరినీ కాదని ముద్దసాని దామోదర రెడ్డి తమ్ముడు ముద్దసాని పురుషోత్తమ్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఆరు నూరైనా.. గెలవాలనే పట్టుదలలో టీఆర్ఎస్ ఉంది. మొత్తం మీద ఎవరు పుణ్యం చేసుకున్నాగాని... హుజూరాబాద్ దశ అయితే మారబోతుందనే అనిపిస్తోంది. నోటిఫికేషన్ కాస్త ఆలస్యంగా వస్తేనే బెటర్.. నియోజకవర్గం డెవలప్ మెంట్ అయిపోతుంది.  

డీజీపీ సభలో మాస్క్ లేకుండా మంత్రి.. చట్టాలు కొందరికి చుట్టమా? 

తెలంగాణ మంత్రుల్లో ఆయన స్పెషల్. కొవిడ్ టైమ్ లో ఆయన మరింత స్పెషల్. వైరస్ మహమ్మారి భయానికి రోడ్లపైకి వచ్చే జనాలంతా మాస్కులు పెట్టుకున్నారు. కొవిడ్ రూల్స్ పాటిస్తూ జాగ్రత్తలు పాటిస్తున్నారు. కాని ఆ మంత్రి మాత్రం ఏనాడు మాస్కు ధరించిన పాపాన పోలేదు. మాస్కు లేకుండా ఆయన ఇంట్లోనే ఉన్నారా అంటే అదీ లేదు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉన్నారు. పార్టీ సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. కార్యకర్తలను, జనాలను కలుస్తూనే ఉన్నారు. అయినా ఆ మంత్రి మాత్రం ఎప్పుడు మాస్క్ ధరించలేదు.   ప్రభుత్వం మాత్రం మాస్క్ లేకుండా బయటికి వస్తే ఫైన్ వేస్తామని ప్రకటించింది. మాస్కు పెట్టుకోకుంటే వెయ్యి రూపాయల ఫైన్ అంటూ  జీవో జారీ చేసింది.ఇంటి గడప దాటి బైటకు వచ్చిన ప్రతీ ఒక్కరూ మాస్కు ధరించాల్సిందేనని, లేకుంటే స్పాట్ ఫైన్ విధిస్తున్నామని, ఎపిడమిక్ యాక్టు ప్రకారం కేసు నమోదు చేస్తున్నామని స్వయంగా డీజీపీ హైకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. లక్షలాది మందిపై కేసులు నమోదు చేసి కోట్లాది రూపాయల ఫైన్ వసూలు చేశారు. కానీ మంత్రి తలసాని మాత్రం మాస్కు పెట్టుకోకుండా లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించారు. ఏకంగా పోలీసు బాస్ పాల్గొన్న కార్యక్రమానికే మాస్క్ లేకుండా హాజరయ్యారు. హైదరాబాద్ నగరంలోని ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్ నూతన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా బుధవారం అతిథిగా హాజరైన మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ మాస్కు పెట్టుకోలేదు. ఆ సభకు డీజీపీ మహేందర్ రెడ్డి, నగర సీపీ అంజనీ కుమార్ పాల్గొన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాస్క్ లేకుండా  పక్కనే ఉన్న డీజీపీ, నగర పోలీసు కమిషనర్ ఈ విషయాన్ని చూసీ చూడనట్లు ఉండిపోవడం ఇప్పుడు వివాదాస్పదమైంది.లాక్‌డౌన్‌ను కఠినంగా అమలుచేస్తున్నామని చెప్తున్న నగర పోలీసు కమిషనర్ .. మాస్క్ లేకుండా తిరిగిన మంత్రిపై  కేసు నమోదు చేయలేదన్నది ప్రశ్నగా మారింది. ప్రజలకు వర్తించే చట్టాలు, లాక్‌డౌన్ నిబంధనలకు మంత్రికి వర్తించవా? అంటూ జనాలు ప్రశ్నిస్తున్నారు. మంత్రి తలసాని తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. అదే సమయంలో పోలీసులు ఎందుకు ఫైన్ వేయలేదంటూ ప్రశ్నిస్తున్నారు. 

మాన్సస్ ట్రస్టుపై విజయసాయి కొత్త స్క్రీన్ ప్లే

అలా హైకోర్టు తీర్పు వచ్చింది. ఇలా వారు పెట్టిన బొమ్మ పదవి పోయింది. అలా మళ్లీ రాజుగారు రంగంలోకి దిగారు. అంతే రెడ్డిగారు కొత్త కథ మొదలెట్టేశారు. యమర్జెంటుగా ఇప్పుడే గుర్తొచ్చినట్లు కహానీ చెప్పేస్తున్నారు. రాజుగారి సంస్థానాన్ని కాపాడాల్సిన గురుతర బాధ్యత ఆయన భుజాల మీదే ఉన్నట్లుగా తెగ ఫీలైపోతూ.. అయ్యగారు చెప్పింది వింటే .. ఆయన మనసులో ఏముందో.. ఎంత కడుపుమంట పుడుతుందో ఎవరికైనా ఈజీగా అర్ధమైపోతుంది.  మాన్సస్ ట్రస్టు విజయనగరం గజపతిరాజుల ఆధీనంలో ఉంది. దానిని స్వాధీనం చేసుకోవడానికి ఒక బొమ్మ సంచయితను తీసుకొచ్చి.. ఆ ట్రస్టు కింద ఉన్న ఆస్తులను కొల్లగొటేయాలనుకున్నారు. కాని ఇప్పుడు హైకోర్టు ఆ ఆటలు ఆడొద్దని చెప్పడంతో... కొత్త ఆట మొదలెట్టారు. మాన్సస్ ట్రస్టులో అక్రమాలు జరిగాయంట..వాటిపై విచారణ చేయాలంట... దేవాదాయశాఖ నిర్ణయించిందంట... ఆ విషయాన్ని దేవాదాయశాఖతో ఏ సంబంధమూ లేని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పడమే హైలెట్. పక్కన బొమ్మలా ఉన్నా మంత్రి వెల్లంపల్లి ..ఏ బొమ్మో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. వ్యవహారమంతా ఎంపీగారే నడిపించారు. మాన్సస్ ట్రస్టులో అక్రమాలు జరిగితే...ఇన్ని రోజులు సంచయిత ఉండి ఏం చేసినట్లు... దేవాదాయశాఖ ఏం చేసినట్లు.. మంత్రి వెల్లంపల్లి ఏం చేసినట్లు.. ఇప్పుడు అశోక్ గజపతిరాజు మళ్లీ ఛైర్మన్ కావడంతోనే అన్నీ గుర్తొచ్చేశాయని అనుకోవాలా.  అంటే అశోక్ గజపతిరాజును తప్పిస్తే అన్నీమన చేతికే అనుకున్నారు.. కాని అది ఇప్పుడు సాధ్యం కాకపోవడంతో.. ఇంకో రూటులో వెళుతున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. వ్యవస్ధలను అధికారం అడ్డుపెట్టుకుని ఏ రేంజ్ లో వాడుకుంటున్నారో.. ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తేనే అర్ధమవుతుంది. అప్పటికప్పుడు ఛైర్మన్ ను మార్చేయడం. ఏ అవగాహన లేని సంచయితను తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి.. వెనక నుంచి ఆట అంతా విజయసాయిరెడ్డి ఆడటం.. మాన్సస్ కింద ఉన్న భూములను వేలం వేయాలని..లీజులకు ఇవ్వాలని..అది కూడా ప్రభుత్వం మొదట స్వాధీనం చేసుకుని..దాని ద్వారా వేరేవారికి ఇచ్చేలా..వారి నుంచి వీరు బెనిఫిట్ పొందేలా ప్లాన్లు రూపొందించారనే ఆరోపణలు వచ్చాయి. లేటుగా అయినా హైకోర్టు వీరి రాచక్రీడ జీవోలను కొట్టేయడంతో.. కథ మొదటికి వచ్చేసింది. అందుకనే ఈసారి స్క్రీన్ ప్లే మార్చి...కొత్త కథతో మళ్లీ మాన్సస్ ఆస్తులను కొట్టేసే ప్లాన్లు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

వాలంటీర్ల‌పై వేటు.. అస‌లెందుకీ సిస్ట‌మ్‌? ఏమిటి ప్ర‌యోజ‌నం?

గ్రామ వాలంటీర్లు. ఏపీలో వీళ్ల‌దే హ‌వా. ప‌ని త‌క్కువ‌.. ఓవ‌రాక్ష‌న్ ఎక్కువ‌. గ్రామాల్లో పెత్త‌న‌మంతా వాళ్ల‌దే. ఒక‌ర‌కంగా స‌మాంత‌ర పాల‌న కొన‌సాగిస్తున్నారనే ఆరోప‌ణ‌లు. వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌కు ఉపాధిహామీ పోస్టులంటూ విప‌క్షం విమ‌ర్శిస్తున్నా.. అస‌లు ఆ ప‌ద‌వి ఎందుకంటూ కోర్టులు ప్ర‌శ్నిస్తున్నా.. స‌ర్కారు మాత్రం వారికే ప్రాధాన్యం ఇస్తోంది. య‌ధారాజా.. త‌ధా వాలంటీర్‌ అన్న‌ట్టు.. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డిలానే వీళ్లు సైతం అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నార‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. స‌ర్పంచ్‌ల‌ను, స‌చివాల‌య సిబ్బందిని డ‌మ్మీ చేసి.. గ్రామ వాలంటీర్లు అరాచ‌కాల‌కు పాల్ప‌డుతున్నారంటూ విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, తూర్పుగోదావరి జిల్లాలో ఏకంగా 33 మంది గ్రామ వాలంటీర్లను తొలగించ‌డమే ఇందుకు నిద‌ర్శ‌నం.  కరోనా ఫీవర్ సర్వేలో జ్వరం లేని వారికి కూడా ఉన్నట్టుగా ఆన్ లైన్ లో పేర్లు నమోదు చేశారనే ఆరోపణలతో 23మంది గ్రామ వాలంటీర్ల‌పై వేటు వేశారు జిల్లా కలెక్ట‌ర్‌. వీరిని విధుల నుంచి తొలగిస్తున్నట్టు తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ చేకూరి కీర్తి ఉత్తర్వులు జారీ చేశారు. కాకినాడ అర్బన్, కాకినాడ రూరల్, రాజమండ్రి అర్బన్, తుని, రాజోలు, అమలాపురం, మామిడికుదురు ప్రాంతాలకు చెందిన గ్రామ వాలంటీర్లు ఇలా క‌లెక్ట‌ర్ ఆగ్ర‌హానికి గుర‌య్యారు. ఒక్క జిల్లాలోనే ఇంత మంది ఉంటే.. ఇక మిగ‌తా జిల్లా క‌లెక్ట‌ర్లు సైతం క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తే.. ఏపీలో స‌గం మంది గ్రామ వాలంటీర్ల పోస్టులు ఊస్ట్ అవుతాయ‌ని ప్ర‌జ‌లు అంటున్నారు.  గ్రామ వాలంటీర్ల‌ను ఎందుకు నియ‌మించారో.. వారితో ఎంత ఉప‌యోగం ఉందో.. సీఎం జ‌గ‌న్‌రెడ్డికే తెలియాలి. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో సోష‌ల్ మీడియాలో పేటీఎం బ్యాచ్‌గా ప‌ని చేసిన వారిలో చాలా మందికి ఈ పోస్టులు క‌ట్ట‌బెట్టార‌నేది టీడీపీ ఆరోప‌ణ‌. ఓ మీటింగ్‌లో స్వ‌యానా విజ‌య‌సాయిరెడ్డే ఆ మాట అంటూ వీడియోలో అడ్డంగా బుక్క‌య్యారని గుర్తు చేస్తున్నారు. గ్రామ వాలంటీర్లు.. గ్రామ సేవ‌కులుగా కాకుండా.. వైసీపీ ఉద్యోగులుగా ప‌ని చేస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు అంత‌టా ఉన్నాయి. ఇప్ప‌టికే ప్ర‌భుత్వ‌ ఉద్యోగులు ఉండ‌గా.. అద‌నంగా వాలంటీర్ల సేవ‌లతో ప‌నేముంద‌నేది కొంద‌రి ప్ర‌శ్న‌.  50 ఇళ్ల‌కో వాలంటీర్ చొప్పున ల‌క్ష‌ల మందిని నియ‌మించింది ఏపీ స‌ర్కారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాల అమ‌లు తీరును ప‌ర్య‌వేక్షించ‌డం, ల‌బ్దిదారుల ఎంపిక‌ను వారికి అప్ప‌గించింది. వాళ్లు రోజూ చేసే ప‌ని ఏముంటుంది? 50 ఇళ్ల‌కు ఓ గ్రామ వాలంటీర్ రోజూ ఏ సేవ‌లు అందిస్తారు? ఎప్పుడో ఓసారి ప‌ని.. మిగ‌తా అంతా రాజకీయం! వారికి జీతాల రూపంలో కోట్ల రూపాయ‌లు దార పోయ‌డం.. అంత మందికి ఉద్యోగాలు క‌ల్పించామంటూ గొప్ప‌గా లెక్క‌లు చూపించుకోవ‌డానికి మిన‌హా.. గ్రామ వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌తో పెద్ద‌గా ఉప‌యోగం లేద‌నేది అనుభ‌వంలోకి వ‌చ్చిన విష‌యం అంటున్నారు. పైగా రాజ‌కీయ విధ్వేషాల‌కు వాలంటీర్ వ్య‌వ‌స్థ కార‌ణ‌మ‌వుతోంద‌నే విమ‌ర్శ కూడా ఉంది. ఇక్క‌డ మ‌రో అంశం ఏంటంటే.. అవి ఎలాగూ ప్ర‌భుత్వ ఉద్యోగాలు కావు.. గట్టిగా తుమ్మితే ఊడిపోయే జాబులు.. వ‌చ్చే జీత‌మూ అంతంత మాత్ర‌మే.. ఆ అనుభ‌వ‌మూ మ‌రే ఉద్యోగానికీ ప‌నికిరాదు.. అయినా.. గ్రామంలో ఫోజులు కొట్టొచ్చ‌నే ఏకైక కార‌ణంతో గ్రామ వాలంటీర్లుగా చేరి త‌మ భ‌విష్య‌త్తును యువ‌త‌ వృధా చేసుకుంటున్నార‌ని అంటున్నారు. చ‌దువుకున్న వారు సైతం వాలంటీర్లుగా చేరి.. త‌మ చ‌దువుతో ఎలాంటి సంబంధంలేని చిన్నాచిత‌క ప‌నులు చేస్తూ.. చాలీచాల‌ని వేత‌నంతో అవ‌స్థ‌లు ప‌డుతూ.. యువ‌త రాజ‌కీయ క్రీడ‌లో పావుగా మారుతోంద‌ని కొంద‌రు అంటున్నారు. రాజ‌కీయ ఉద్యోగులుగా గ్రామ వాలంటీర్లు త‌యార‌య్యారు కాబ‌ట్టే.. తూర్పు గోదావ‌రి జిల్లాలో అంత మందిపై వేటు ప‌డింద‌ని చెబుతున్నారు. 

కర్నూల్ లో టీడీపీ  నేతలను చంపింది వీళ్ళే.. 

రాయలసీమ ఆ పేరు వింటే చాలు. ఫ్యాక్షన్ గుర్తుకు వస్తుంది. వారికి  దూకుడు ఎక్కువ.. వారి కత్తికి పదునెక్కువ. మొత్తానికి వాళ్లకు మూర్ఖత్వం ఎక్కువ. కానీ చాలా మంది రాజకీయ బలిపశువులు అవుతున్నారు. అధికారం సాగించేందుకు అవసరమైతే తలకాయలు తెగాల్సిందే.. తలకాయాలు అంతే ఏ మొక్కవో గొఱ్ఱెవో కాదు మనుషుల మెడకాయలు. అదేదో సినిమాలో చూపినట్టు "సమరసింహా దొరబాబు సల్లంగుండాలే.. మీరు హాయిగుండాలే.. భరత సింహారెడ్డి.. మీరు బాంబులెయ్యలే మేమంతా బాటపట్టాలే.. మీనెత్తి మీద గొడుగులం .. మీ కళ్లకింద చెప్పుళం. .మీ చేతిలోని కత్తులం.. మీరు ఉసుకో ఉసుకో ఉసుకో అంతే ఊరికే వేట కుక్కలా అన్నట్లు"  కొంత మంది ప్రయోజనాల కోసం ఈ ఫ్యాక్షన్ ని పెట్టి పోషిస్తుంటారు.. ఆ విషయం అందరికి తెలిసిందే.. ఇక  రాయలసీమ వాళ్లకు చంపడం,  చావడం, వాళ్లకి కొత్త ఏం కాదు. వాళ్ళు కక్ష కడితే సొంత సొంత అన్న తమ్ముడు అని చూడరు. వెయ్యాలనుకుంటే వేసేస్తారు అదే వాళ్ళకి తెలిసిన పని కొంత కాలంగా ప్రశాంతగా ఉన్న రాయలసీమలో  ఫ్యాక్షన్ మళ్లీ ఊపు అందుకుంది. కత్తులు దుస్తున్నారు. ప్రత్యర్థులపై దాడులు చేస్తున్నారు. అవసరం అయితే  ఖతం చేస్తున్నారు. తాజగా కర్నూల్ జిల్లాలో  ప్రత్యర్థుల దాడితో ఇద్దరు అన్నదమ్ములు ప్రాణాలు కోల్పోమారు. మరణించిన వారిద్దరు సొంత అన్నదమ్ములే. ఈ దాడిలో మరో ముగ్గురు గాయపడ్డారు.   కర్నూలు జిల్లాలో పాత కక్షలు భగ్గుమన్నాయి. ప్రత్యర్థుల దాడిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. టీడీపీ నేతలైన అన్నదమ్ములను వెంటాడిన ప్రత్యర్థులు కత్తులతో వేటాడారు, జంతువుల వెంటాడి విచక్షణా రహితంగా నరికి చంపేశారు. అందరికి ఆ సత్యాలను చూసే అవకాశం దక్కపోవచ్చు కానీ మన వర్మ సినిమాలో చూసినట్లే ఉండొచ్చు ఆ హత్యలు.  అడ్డొచ్చిన వారి అనుచరులపైనా దాడి చేశారు. కర్నూలు జిల్లాలోని గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పెసరవాయి గ్రామానికి చెందిన వడ్డు ప్రతాప్ రెడ్డి, నాగేశ్వర రెడ్డి సొంత అన్నదమ్ములు. వీరు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. గురువారం ఉదయం అనుచరులతో కలిసి వెళ్తున్న వారిపై ప్రత్యర్థి వర్గానికి చెందిన వారు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ప్రతాప్ రెడ్డి, నాగేశ్వరరెడ్డి అక్కడికక్కడే చనిపోగా... మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. వీరి హత్యకు పాత కక్షలే కారణమని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

తెలుగోడు తోప్‌.. నాదెళ్ల టాప్‌.. మైక్రోసాఫ్ట్‌ ఛైర్మన్‌గా స‌త్య‌..

ఎక్క‌డ పుట్టామ‌న్న‌ది కాదు. ఎక్క‌డ చ‌దువుకున్నామ‌న్న‌దీ కాదు. మ‌న‌లో ఎంత టాలెంట్ ఉంద‌నేదే ముఖ్యం. మ‌నం ఎంత క‌ష్ట‌ప‌డ్డామ‌న్న‌ది మ‌రీ ముఖ్యం. ప్ర‌తిభ ఉంటే ఎంత‌టి ఉన్న‌త శిఖ‌రాల‌నైనా అధిరోహించ‌వ‌చ్చు. ఆ కోవ‌కు చెందిన సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జ‌మే స‌త్య‌నాదెళ్ల. తెలుగు నేల‌పై పుట్టి.. ప్ర‌పంచంలోకే అత్యుత్త‌మ టెక్ కంపెనీకి సీఈవోగా ఎదిగారు. తాజాగా, ఆయ‌న ఏకంగా మైక్రోసాఫ్ట్ ఛైర్మ‌న్ అయ్యారు. స‌త్య‌నాదెళ్ల‌ను వ‌రించిన ఆ ప‌ద‌వి.. తెలుగువారంద‌రికీ గ‌ర్వ‌కార‌ణం. తెలుగు ప్ర‌తిభ‌కు నిద‌ర్శ‌నం. మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్లకు మరిన్ని కీలక అధికారాలు కట్టబెట్టింది కంపెనీ. మైక్రోసాఫ్ట్‌ బోర్డు ఛైర్మన్‌గా స‌త్య‌నాదెళ్ల‌ను ఏక‌గ్రీవంగా ఎన్నుకున్నారు బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌. ఛైర్మ‌న్‌గా బోర్డు అజెండాను నిర్ణయించే అధికారం ఇక నాదెళ్ల‌దే. ‘‘వ్యూహాత్మక అవకాశాలను దక్కించుకొనేందుకు, కీలక ఇబ్బందులను గుర్తించేందుకు ఆయనకు వ్యాపారంపై ఉన్న అవగాహన బాగా ఉపయోగపడుతుంది’’ అని మైక్రోసాఫ్ట్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఛైర్మన్‌గా ఉన్న జాన్‌ థామ్సన్ ఇక‌పై స్వతంత్ర డైరెక్టర్‌గా ఉంటారు. 2014లో స్టీవ్‌ బామర్‌ నుంచి సత్య నాదెళ్ల సీఈవో బాధ్యతలను స్వీకరించారు. ఆయన వచ్చాక మైక్రోసాఫ్ట్‌లో కీలక మార్పులు చోటు చేసుకొన్నాయి. కొత్తతరం టెక్నాలజీ వైపు కంపెనీని నడిపించారు. అంతేకాకుండా క్లౌడ్‌ కంప్యూటింగ్‌నపై ఫోక‌స్ పెంచింది. గ‌తంలో పర్సనల్‌ కంప్యూటర్ల సాఫ్ట్‌వేర్‌ ప్యాకేజీల సేవ‌లేపైనే ప్ర‌ధానంగా ప‌ని చేయ‌గా.. సత్య నాదెళ్ల సీఈవో అయ్యాక‌ మొబైల్‌ రంగం వైపు మైక్రోసాఫ్ట్‌ను ప‌రుగులు పెట్టించారు.  సత్యనారాయణ నాదెళ్ల అలియాస్ స‌త్య నాదెళ్ల. తండ్రి నాదెళ్ల యుగంధ‌ర్ 1962 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. స్వ‌స్థ‌లం అనంతపురం జిల్లా, ఎల్లనూరు మండలం, బుక్కాపురం గ్రామం అయినా.. ఉద్యోగ‌రిత్యా హైద‌రాబాద్‌లోనే సెటిల్ అయింది వారి ఫ్యామిలీ. స‌త్య నాదెళ్ల హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్‌లో చ‌దివారు. 1988లో మణిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో బీఈ కంప్లీట్‌ చేశారు. అమెరికాలోని విస్కాన్సిన్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ, చికాగో యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ చేశారు.  అమెరికా పౌరసత్వం తీసుకుని అక్కడే స్థిరపడ్డారు. కొంతకాలం సన్ మైక్రో సిస్టమ్స్‌లో పనిచేసిన తర్వాత 1992లో మైక్రోసాఫ్ట్‌లో చేరారు. 2014 ఫిబ్రవరి 4న మైక్రోసాఫ్ట్ సీఈవోగా నియమితులయ్యారు. తాజాగా, మైక్రోసాఫ్ట్ ఛైర్మ‌న్‌గా ఎంపిక‌వ‌డం విశేషం.  స‌త్య నాదెళ్ల‌కు క్రికెట్ అంటే మహా ఇష్టం. స్కూల్ క్రికెట్ జట్టులో స‌భ్యుడు. క్రికెట్ ఆడ‌టం వ‌ల్లే.. బృందంతో సమన్వయంగా వ్యవహరించడం, నాయకత్వ లక్షణాలను నేర్చుకున్నాన‌ని చెబుతుంటారు. మైక్రోసాఫ్ట్ కంపెనీ వ్య‌వ‌హారాల‌తో క్ష‌ణం తీరిక లేకున్నా ఉన్నా కూడా.. క్రికెట్ మ్యాచ్‌లు ఉంటే మ‌ధ్య మ‌ధ్య‌లో స్కోర్ తెలుసుకుంటార‌ట‌. వ‌న్డేల క‌న్నా టెస్టు మ్యాచ్‌లపైనే ఆస‌క్తిఅట‌. కవితలన్నా నాదెళ్ల‌కు అంతే ఇష్టం. కవితలు రహస్య సంకేతాల్లా అనిపిస్తాయని ఆయ‌న ఓ సంద‌ర్భంలో చెప్పారు. ప్రపంచాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దే అద్భుతమైన సాధనాలను మైక్రోసాఫ్ట్ అందిస్తోందని, అందుకే ఆ కంపెనీలో చేరాన‌నేది స‌త్య నాదెళ్ల చెప్పే మాట‌. ఆయ‌న మైక్రోసాఫ్ట్ ఛైర్మ‌న్ స్థాయికి ఎద‌గ‌డం.. భార‌తీయుల‌కు అందులోనూ ప్ర‌త్యేకించి తెలుగుజాతికి గౌర‌వం.