జగన్ అసలు రూపం బయట పెడతా.. గోనే ప్రకాష్ సవాల్ 

ఎక్కడికైనా వస్తా ... పులివెందుల కాదు .. ఇడుపలపాయకైనా వస్తా ...  జగన్మోహన్ రెడ్డి అసలు స్వరూపం బయట పెడతా ...  ఇది ఆయన ప్రత్యర్ధులు ఎవరో చేసిన వ్యాఖ్య కాదు, వైఎస్ కుటుంబానికి అత్యంత ఆప్తుడు, తెలంగాణ ప్రాంతానికి చెందిన మాజీ కాంగ్రెస్ నాయకుడు, ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనే ప్రకాశ రావు చేసిన సవాల్. నిజం నిప్పులాంటిది, ముట్టుకుంటే కాలుతుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో సుపరిచితమైన, గోనే ప్రకాశ రావు కూడా అంతే, ఆయనతో పెట్టుకుంటే, అంతే, రాజకీయ ప్రముఖుల చీకటి కోణాలు ఆయన మాటల  ప్రవాహంలో కొట్టుకుని వస్తాయి. ఇక ఆ తర్వాత ఆకులు  పట్టుకున్నా ప్రయోజనం ఉండదు.  అయితే ఇప్పుడు ఆయన పనిగట్టుకుని తిరుపతి వెళ్లి, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు అంతలా విరుచుకు పడ్డారు ... ఒక్క జగన్ రెడ్డిని  మాత్రమే కాదు, ఆయన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల, ఈ అందరినీ మించి, జగన్ రెడ్డి అంతరంగిక ముఠాలోని ఒక్కరినీ వదల కుండా ప్రతి ఒక్కరినీ  పేరు పేరున, ఎందుకు టార్గెట్ చేశారు. ఎందుకు ముఖ్యమంత్రి రాజకీయ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అంతటి వాడిని, ‘బ్రోకర్’ అనేశారు, మళ్ళీ దాని మీద  వివరణ ఎందుకు  ఇచ్చారు, వైఎస్ సోదరుడు వివేకానంద రెడ్డిని కుటుంబ సభ్యులే హత్య చేశారని ఎందుకు కుండబద్దలు కొట్టారు, ఈ హత్యకు సంబంధించి ఇద్దరు ఎంపీలు, అవినాష్ రెడ్డి, విజయసాయి రెడ్డి మీద ఎందుకు అనుమానాలు వ్యక్తం చేశారు, అంటే, అందుకు ప్రత్యేక కారణం అంటూ ఏమీ ఉండకే పోవచ్చును.నిజానికి, గోనే ప్రకాశ రావుతో సన్నిహిత పరిచయం ఉన్నవారు, ఆయన, ఉన్న నిజాలను బయట పెడతారే కానీ,  ఎవరినీ టార్గెట్ చేయరనే అంటారు. అయితే ఉన్న మాటంటే ఉలిక్కి పడే నైజం ఉన్న వారు, నిజాన్ని చూసి భయపడే వారు మాత్రమే ఆయనకు ఉద్దేశాలను అంటగడతారని అంటారు.జగన్ రెడ్డి అభిమానులు అలాగే ఉలిక్కి పడ్డారు.. ఇరుక్కున్నారు.  నిజంగా అటు తెలంగాణలో కానీ, ఇటు ఆంధ్ర ప్రదేశ్’లో కానీ, ఆయన నిజాయతీని ఎవరు సంకించరు. నిజానికి ఆయన  తిరుపతి ప్రెస్క్లబ్’లో శుక్రవారం చేసిన విమర్శలు, వ్యాఖ్యలు చాల కాలంగా మీడియాలో, రాజకీయ వర్గాలలో చర్చకు వస్తూనే ఉన్నాయి. జగన్ రెడ్డి అభిమానులు గోనే ప్రకాష్’కు దమ్ముంటే ఏపీకొచ్చి ప్రెస్ మీట్ పెట్టాలని చేసిన సవాలుకు జవాబుగానే ఆయన తిరుపతి ప్రెస్ క్లబ్’ లో ప్రెస్ మీట్ పెట్టి, జగన్ రెడ్డి నిజరూపాన్ని, అవిష్కరించారు, అదే ఈ మొత్తం వ్యవహారంలో ప్రత్యేకం. అంతే కాదు, నాకు దమ్ముంది ఇక ముందు కూడా ఏపీలో ఎక్కడైనా, చివరకు పులివెందుల, ఇడుపులపాయలో అయినా జగన్ రెడ్డి గురించి మాట్లాడతా అని ప్రతి సవాలు చేశారు. అలాగే, తనను బెదిరిస్తున్న జగన్ రెడ్డి అమెరికా అభిమానులకు కూడా త్వరలో అమెరికా వస్తున్నానని, సినిమాటిక్’గా “మీ వీధికి వస్తా, మీ ఇంటికి వస్తా, మీ ఇంటి పక్కనున్న  హోటల్ కోస్తా” అంటూ సవాలు విసిరారు. మొత్తానికి బంతిని జగన్ రెడ్డి కోర్టులో వేశారు, గోనే ప్రకాశ రావు.   గోనే ప్రకాశ రావు ప్రస్తావించిన, జగన్ మళ్ళీ జైలుకు ప్రస్తావన కొత్తది కాదు. అందులో నిజం లేక పోలేదు.అలాగే,   జగన్, విజయమ్మ, షర్మిల త్రయం ఉభయ తెలుగు రాష్ట్రాలలో సాగిస్తున్న ముక్కోణపు రాజకీయం విషయం ఆయన చేసిన వ్యాఖ్యలో  తప్పు లేదు.  అలాగే, ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ, వాలంటీర్ వ్యవస్థ, వారి జీతభత్యాల విషయంగానీ,  వివేకానంద హత్య గురించి అయన వెలిబుచ్చిన అభిప్రాయాలు, అనుమానాలు గానీ, గీత దాటుతున్న ముఖ్యమంత్రి  రాజకీయ సలహాదారు సజ్జల వారికి ఇచ్చిన  సలహా విషయంగా గానీ, మరో అభిప్రాయనికి తావే లేదు. జగన్ రెడ్డి, షర్మిల మధ్య రాజకీయ   విబేధాలు, కుటుంబ సంబంధాలు  ఎలా ఉన్నా, షర్మిల పెట్టబోయే  పార్టీ పేరు విషయంలో, విజయమ్మ ఏ విధంగా ఎన్ఓసీ ఇస్తారని అడగడం తప్పు కాదు,అందరు అడుగుతున్నదే. నిజానికి షర్మిల రాజకీయ ఎంట్రీ విషయంలో, ఎవరికుండే అనుమానాలు వారికున్నాయి. చివరకు బ్రదర్ అనీల్, క్రైస్తవ సంఘాలు  ఆమెను వెనకుండి నడిపితున్నాయి అనే అనుమనాలు కూడా ఉన్నాయి.   వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలిగా ఉండి షర్మిల దీక్షకు ఎలా మద్దతు తెలుపుతారని ప్రశ్నించారు. ప్రత్యక్షంగా దీక్షలో ఎలా పాల్గొంటారన్నారు. వైఎస్‌ విజమ్మకు, వైఎస్ జగన్ ఎందుకు షోకాజ్ నోటీసు ఇవ్వలేదని ప్రశ్నించారు.ఈ ప్రశ్నలకు, సమాధానం  చెప్పవలసిన బాధ్యత జగన్ అండ్ ఫ్యామిలీ మీద ఉంది.అలాగే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి గురించి చేసిన వ్యాఖ్యలకు గానీ, వాలెంటీర్లకు కనీస వేతన చట్టం అమలు కావడం లేదని ఆయన చేసిన వ్యాఖ్యలకు ఏపీ ప్రభుత్వం, జగన్ రెడ్డి మిత్ర బృందం సమాధానం ఇవ్వాలి .. మొత్తానికి జగన్ రెడ్డి అభిమానులు, పిలిచి మరీ  చీవాట్లు పెట్టించుకున్నారు. ఇక ఈ రచ్చ ఎంతవరకు పోతుందో , ఎవరి కొంప ముంచుతుందో..

ఎమ్మెల్యేనా.. బజారు రౌడీనా! లోకేష్ కథ చూస్తానని వార్నింగ్.. 

కర్నూల్ జిల్లా పాణ్యం నియోజకవర్గంలో జరిగిన జంట హత్యలు దుమారం రేపుతున్నాయి. ఫ్యాక్షన్ హత్యలు జరగడంతో జిల్లా వాసులు ఉలిక్కి పడుతున్నారు.  టీడీపీ నేతలు దారుణ హత్యల వెనుక పాణ్యం వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఉన్నారంటూ టీడీపీ నేత నారా లోకేశ్ తో పాటు పలువురు నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో నారా  లోకేశ్ పై ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మండిపడ్డారు. లోకేశ్ నోరు అదుపులో పెట్టుకోవాలని... లేకపోతే ఆయన కథ చూస్తామని హెచ్చరించారు. రెచ్చగొట్టేలా లోకేశ్ మాట్లాడుతున్నారని అన్నారు. వార్డు మెంబర్ గా కూడా గెలవలేని లోకేశ్... ఒక జోకర్ వంటి వాడని కాటసాని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని అన్నారు. తిట్టాలనుకుంటే తాము కూడా తిట్టగలమని... కాకపోతే ఆ సంస్కృతి తమకు లేదని చెప్పారు. లోకేశ్ ట్విట్టర్లో తప్ప ప్రజల ముందుకు వచ్చి మాట్లాడలేడని అన్నారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహించాల్సిన అవసరం తమకు లేదని కాటసాని అన్నారు. లోకేశ్ సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాడని... వైయస్సార్ కొడుకుగా జగన్ ఎలా మాట్లాడుతున్నారో చూసి లోకేశ్ నేర్చుకోవాలని హితవు పలికారు. పులికి పులి బిడ్డ పుట్టిందని... నక్కకు నక్క బిడ్డ పుట్టిందని ఎద్దేవా చేశారు.  నారా లోకేష్ ను టార్గెట్ చేస్తూ వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఎమ్మెల్యే తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్యేగా ఉంటూ బజారు రౌడీలా మాట్లాడుతున్నారని జనాలు ఫైరవుతున్నారు. ఓపెన్ గానే కథ చూస్తానంటూ బెదిరించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఫ్యాక్షన్ హత్యల వెనుక ఎమ్మెల్యే హస్తం ఉంది కాబట్టే.. ఆయన బరి తెగించి వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. హత్యలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. 

ఫ్రంట్ లైన్ వారియర్స్ పై వివక్షా!  జగన్ సర్కార్ పై కాపునాడు ఫైర్  

కరోనా సమయం లో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేస్తున్న జర్నలిస్టులు పట్ల ప్రభుత్వం వివక్ష చూపడం సరి కాదని సౌత్ ఇండియన్‌ కాపు అసొసియేషన్ ప్రధాన కార్య దర్మి , ఏపీ రాష్ట్ర అధ్యక్షులు వేల్పూరి శ్రీనివాస రావు విమర్శించారు. జర్నలిస్టుల సమస్యలు, అందించాల్సిన సాయంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. సొంత మీడియ సాక్షి కోసం జర్నలిజం వ్యవస్థను సర్వ నాశనం చేయటం మానుకోవాలని హితవు పలికారు శ్రీనివాస రావు.  నిజమైన జర్నలిస్టులకు గుర్తింపు ఇవ్వకపోవడం , మూడు సంవత్సరాలుగా  ఆక్రి డేషన్‌ మంజూరు చేయకపోవడంపై శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. హెల్త్ కార్డులు పంపిణి చేయకపోవడం , ప్రమాద ఇన్సురెన్సు చెల్లించక పోవడంతో చాలా మంది జర్నలిస్టులు ఇబ్బందులు పడ్డారని చెప్పారు. బస్ పాస్ , రైల్వే పాస్ సౌకర్యం కల్పించ కుండా జర్నలిస్టులను నరక యాతన కు గురి చేయటం మీ సర్కార్ కుట్ర లో భాగం కాదా అని ముఖ్యమంత్రిని వేల్పూరి ప్రశ్నించారు . కరోనా కాటుకు సుమారు 50 మంది చనిపోయారని వేల్పూరి ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సోకి చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పేద జర్నలిస్టులందరికి 5 వేలు ఆర్థిక సాయం , మరణించినవారికి 50 లక్షలు ప్రకటించాలని వేల్పూరి CM ను డిమాండ్ చేశారు.  జర్నలిస్టులకు ఇళ్ళస్థలాలు ఇస్తామని హామి ఇచ్చి మోసం చేశారని శ్రీనివాస రావు మండిపడ్డారు. సమాచార ప్రసార శాఖ ఉన్నా కూడా జర్నలిస్టుల సమస్య ల పట్ల మొసలి కన్నీరు కార్చటం సిగ్గుచేటని సీఎంకు రాసిన లేఖలో శ్రీనివాసరావు విమర్శించారు.  యాజమాన్యాల ఉన్న  వ్యక్తిగత గొడవలకి జర్నలిస్టులను బలి చేయటం తగదని ముఖ్యమంత్రికి సూచించారు. ప్రభుత్వ పధకాల ప్రకటనల్లో తన కుటుంబ పత్రిక సాక్షికి 100 కోట్ల రూపాయలు ఇవ్వడం , ఇతర రాష్ట్రాల ప్రభుత్వ అనుకూల పత్రికలకు కోట్ల రూపాయలు ప్రకటనలు ఇచ్చారని ఆరోపించారు.కాని ఏపీ  రాష్ట్రంలో చిన్న పత్రికలకు మొండి చెయ్యి చూపటం దురదృష్టకరమన్నారు. సాక్షి పత్రిక , సాక్షి  Tv కోసం, జర్నలిస్టు వ్యవస్థ ను విచ్చిన్నం చేయవద్దని, జర్నలిస్టులు ఆత్మ గౌరవం కలవారని , తాడేపల్లి రాజమహాల్లో పాలేరులు కాదని CM కి వేల్పూరి హితవు పలికారు.జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఏ పోరాటం చేయటానికైనా కాపునాడు సిద్ధంగా ఉందని ప్రకటించారు. 

అశోకుడే కింగ్‌.. విజ‌యసాయీ ఎనీ డౌట్స్‌?

ఏపీలో పొలిటిక‌ల్‌గా మోస్ట్ ఓవ‌రాక్ష‌న్ ఫెలో ఎవ‌రంటే.. వెంట‌నే విజ‌య‌సాయిరెడ్డినే గుర్తొస్తార‌ని అంటారు. జ‌గ‌న్ త‌ర్వాత జ‌గ‌న్ అంత‌టి వాడిన‌నే ఫీలింగ్ ఆయ‌న‌ది. ఎంతైనా ఏ1 త‌ర్వాత ఏ2 క‌దా. ఆ మాత్రం బిల్డ‌ప్‌ ఉండాల్సిందేన‌నేది వైసీపీ నేత‌ల మాట‌. ఏపీలో ఎక్క‌డ ఏ విష‌యం వ‌చ్చినా.. త‌గుదున‌మ్మా అంటూ ఎగేసుకొస్తారు. అందులోనూ విశాఖ రిలేటెడ్ మేట‌ర్ అయితే మ‌రీను. ఎగ్జిక్యూటివ్ కేపిట‌ల్ అంతా త‌న ఇలాఖే అన్న‌ట్టు.. అన్నిట్లోనూ వేలు, కాలు పెడుతుంటారు. తాజాగా, విశాఖ ప‌రిధి దాటి వెళ్లి మ‌రీ.. విజ‌య‌న‌గ‌రం రాజా వారి మీద నోరు పారేసుకుంటున్నారు. సంచ‌యిత మాటున‌ అప్ప‌నంగా కాజేద్దామ‌నుకున్న‌ వేల కోట్ల ఖ‌రీదైన భూములకు.. అశోకుడి రాక‌తో అడ్డుక‌ట్ట ప‌డుతుంద‌ని తెగ ఇదైపోతున్న‌ట్టున్నారు. అందుకే, కాలు కాలిన పిల్లిలా.. ఎగిరెగిగ‌రి ప‌డుతున్నారని అంటున్నారు.  అశోక్ గ‌జ‌ప‌తిరాజు. విజ‌య‌న‌గ‌రం రాజా వారు. జ‌న్మ‌తః కోట‌కు రాజు. ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. కేంద్ర మంత్రిగానూ చేశారు. ఇన్ని ద‌శాబ్దాల రాజ‌కీయ ప్ర‌స్థానంలో ఒక్క‌టంటే ఒక్క అవినీతి మ‌ర‌క కూడా లేని స‌చ్చీలుడు. సిగ‌రేట్స్ తాగే ఒకే ఒక్క బ్యాడ్ హాబిట్ మిన‌హా.. మ‌రే చెడు వాస‌నా అంట‌ని వైట్ కాల‌ర్ పొలిటిక‌ల్ లీడ‌ర్‌. ఆయ‌న‌కేం ఖ‌ర్మ అవినీతికి పాల్ప‌డ‌టానికి.. అనుభ‌వించ‌డానికి అంతులేని రాజ‌వైభ‌వం.. క‌రిగిపోని సంప‌ద‌.. త‌ర‌గ‌ని ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ. అంతా ఆయ‌న సొంతం. మాన్సాస్ ట్ర‌స్ట్‌కు ఛైర్మ‌న్‌గా ఉంటూ.. ఉత్త‌రాంధ్ర వ్యాప్తంగా విస్త‌రించిన‌ విజ‌య‌న‌గ‌రం రాజుల సేవా కార్య‌క్ర‌మాల‌ను ఏ ఆటంకం లేకుండా చిర‌కాలం కొన‌సాగించ‌డ‌మే ఆయ‌న ల‌క్ష్యం.. సంక‌ల్పం. ఏళ్లుగా ఇదే బాధ్య‌త‌లో ఉన్నారు. ఇక‌పైనా ఉంటారు. అలాంటి ట‌వ‌ర్ ప‌ర్స‌నాలిటీ మీద‌.. రాజ‌కీయాల్లో మేరున‌గ ధీరుడిలాంటి వ్య‌క్తిత్వం మీద.. అవినీతి అబాండాలు వేయ‌డం వైసీపీ నాయ‌కుల‌కే చెల్లింది. అందుకే, విజ‌యసాయిరెడ్డి ఆరోప‌ణ‌ల‌ను చూసి జ‌నం న‌వ్వుకుంటున్నారు. ఉత్త‌రాంధ్ర వాసులైతే.. విజ‌య‌సాయికి శాప‌నార్థాలు పెడుతున్నారట‌.  మాన్సాస్ ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో అంతులేని సంప‌ద ఉంది. నాలుగు జిల్లాల్లో విలువైన భూములున్నాయి. ఇన్నేళ్లూ అవి భ‌ద్రంగా ఉన్నాయి. కొత్త బిచ్చ‌గాళ్లు రాగానే వారి క‌న్ను.. మాన్సాస్ ఆస్తుల మీద ప‌డింద‌ని అంటున్నారు. ఆ భూముల‌కు సంబంధించిన రికార్డులు విజ‌య‌న‌గ‌రం కోట‌లో ఉన్న మాన్సాస్ కార్యాల‌యంలో, న‌మ్మ‌క‌మైన సిబ్బంది ప‌ర్య‌వేక్ష‌ణ‌లో భ‌ద్రంగా ఉండ‌టం.. పాల‌కుల‌కు ఇబ్బందిగా మారింది. అందుకే, అశోకుడిని త‌ప్పించి.. కొత్త జీవోలు తీసుకొచ్చి.. దొడ్డిదారిన సంచ‌యిత‌ను మాన్సాస్ పీఠం మీద కూర్చోబెట్టార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఆమె వ‌చ్చిందే ఆల‌స్యం.. మాన్సాస్ ట్ర‌స్ట్ కార్యాల‌యాన్ని విజ‌య‌న‌గ‌రం కోట నుంచి విశాఖ జిల్లాకు త‌ర‌లించ‌డం వెనుక ద‌స్తావేజుల‌ను కొట్టేసే కుట్ర దాగుంద‌నే ఆరోప‌ణ‌లు కూడా వినిపిస్తున్నాయి. ఆ ద‌స్త్రాల దుమ్ముదులిపి.. మాన్సాస్ భూముల లెక్కాప‌త్రాలు, లోటుపాట్లను త‌మ‌కు అనుకూలంగా మార్చుకొనే ప‌నిలో ఉండ‌గా.. స‌డెన్‌గా హైకోర్టు తీర్పుతో ఆ గూడుపుఠానికి చెక్ ప‌డిన‌ట్టు అయింద‌ని అంటున్నారు. సంచ‌యిత పోయి.. అశోకుడు రావ‌డంతో.. కుట్ర‌దారులు, దోపిడీదారులు ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డార‌ని.. ఆ అస‌హ‌నంతోనే నోటికొచ్చిన‌ట్టు మాట్లాడుతున్నార‌నేది టీడీపీ వాద‌న‌. న‌వ్విపోదురుగాక నాకేటి అన్న‌ట్టు.. అశోక్‌ గజపతిరాజు వందల ఎకరాలు దోచుకున్నార‌ని.. ఆయన అక్రమాలపై విచారణ జరుపుతున్నామ‌ని.. ఏదో ఒక రోజు అశోక్‌ జైలుకెళ్లే పరిస్థితి వస్తుందంటూ జోస్యం చెబుతున్నారు విజ‌య‌సాయి. అంతా ఏ1 జ‌గ‌న్‌రెడ్డి, ఏ2 విజ‌య‌సాయిలానే ఉంటార‌నుకుంటే ఎలా? అశోక్ చరిత్ర ఎలాంటిదో విజ‌య‌న‌గ‌రంలో ఎవ‌రిన‌డిగినా చెబుతారంటూ కౌంట‌ర్ ఇస్తున్నాయి టీడీపీ వ‌ర్గాలు.  అశోక్‌గజపతిరాజు మాన్సాస్‌ ట్రస్టుకు మాత్రమే ఛైర్మన్‌.. విజయనగరం మొత్తానికి రాజు కాదు.. అంటూ విజ‌య‌సాయి ఇస్తున్న స్టేట్‌మెంట్స్ చూసి స్థానికులు న‌వ్వుకుంటున్నారు. ఎవ‌రు రాజులో.. ఎవ‌రు దోపిడీదారులో అంద‌రికీ తెలిసిందేనంటూ చ‌ర్చించుకుంటున్నారు.  ఇక హైకోర్టు సింగిల్ జ‌డ్జి తీర్పు మీద అప్పీల్‌కు వెళ‌తామ‌నేది విజ‌యసాయి తాజా ప్ర‌క‌ట‌న‌. విజ‌య‌న‌గ‌రం రాజుల వీలునామాలో.. కుటుంబంలో మొద‌టి పురుష సంతానం మాన్సాస్ ట్ర‌స్టుకు ఛైర్మ‌న్‌గా ఉండాలంటూ సుస్ప‌ష్టంగా రాసుంది. తాజాగా హైకోర్టు సైతం ఆ ప్ర‌కార‌మే తీర్పు వెలువ‌రించింది. ట్రస్టు వ్యవస్థాపక కుటుంబ సభ్యులుగా సంచ‌యిత గజపతిరాజు, ఊర్మిళ గజపతిరాజు, ఆర్‌వీ సునీత ప్రసాద్‌లను గుర్తిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోల‌ను, సంచ‌యిత నియామ‌క జీవోల‌ను.. మొత్తంగా నాలుగు జీవోలను (71, 72, 73, 74) హైకోర్టు రద్దు చేసింది. అయితే, సుప్రీం తీర్పు ప్రకారం స్త్రీ, పురుషుల మధ్య వ్యత్యాసం లేదంటూ కొత్త పాట అందుకుంది ప్ర‌భుత్వం. మహిళల పట్ల అశోక్‌గజపతిరాజు వివక్షత చూపించారంటూ ఆరోపిస్తోంది. అయితే, ఆ వీలునామా రాసింది అశోక్ కాద‌నే విష‌యం మ‌రిచి.. అది వంశ‌పారంప‌ర్యంగా వ‌స్తున్న నిబంధ‌న అనేది మ‌రుగున పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు విజ‌య‌సాయి.  అప్పన్న భూముల కోసం వేసిన మాస్టర్ ప్లాన్ విఫలం కావడంవల్లే అశోక్ గజపతిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ మండిప‌డుతోంది. ప్రజల కోసం వేలకోట్ల ఆస్తులు త్యాగం చేసిన చరిత్ర అశోక్ గజపతిరాజుదని.. వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకుని జైలుకెళ్లిన చరిత్ర విజయసాయిదంటూ టీడీపీ చెడుగుడు ఆడుకుంటోంది. ఎవ‌రి ఆరోప‌ణ ఎలా ఉన్నా... మాన్సాస్ ఛైర్మ‌న్‌గా అశోక్ గ‌జ‌ప‌తిరాజు ఆసీనుల‌వ‌డంపై స్థానికులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. విజ‌య‌సాయిరెడ్డి చేస్తున్న ఆరోప‌ణ‌ల‌ను అస‌హ్యించుకుంటున్నారు. విజ‌య‌న‌గ‌రం వైభ‌వం, గ‌జ‌ప‌తుల కీర్తిప్ర‌తిష్ట‌త‌ల‌ గురించి విజ‌య‌సాయికేం తెలుస‌ని మండిప‌డుతున్నారు. అంతా, అశోకుడికే ప‌ట్టం క‌డుతున్నారు.

బావ ప్లాన్ తో.. ఒక్క  దెబ్బకి రెండు పిట్టలు.. 

రా హేయ్ రా.. అదే ఏదోటి చేసెయ్యిరా.. చిన్నడోవైపు పడ్డదోవైపు.. చిందేసి చెంగుమంటే పెరగదా ఊపు అని పడుకున్నట్లు. ఇద్దరి మరదళ్ల ముద్దుల బావ అతను. ఒక మరదలికి తెలియకుండా మరొక మరదలితో దాగుడు మూతలు.. ఆడాడు ఆ బావ. ఒకరికి తెలియకుండా మరొకరిని ఇద్దరినీ ప్రేమ పేరుతో ముగ్గులోకి దించాడు. స్వయానా మేనత్తల కూతుళ్లు కావడంతో ఆ ఇద్దరూ ఆ బావకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. చివరికి  పెళ్లి కూడా ఇద్దరినీ చేసుకోవాలని ఉందని ప్రపోజల్ పెట్టాడు. ఇంతకీ ఈ వింత కథ ఎక్కడ జరిగిందని అనుకుంటున్నారా.. మీరే చదివి తెలుసుకోండి..  అది ఆదిలాబాద్ జిల్లా. ఉట్నూర్ మండలం. ఘనపూర్​ గ్రామం. ఆ గ్రామానికి చెందిన వ్యక్తి. అతని పేరు అర్జున్. అతను  ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటున్నారు. అర్జున్ కు ఇద్దరు మేనత్తలు ఉన్నారు. వారికి  ఆడ సురేఖ,  కనక ఉషారాణి అనే ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. వీరిలో ఉషారాణిది ఘన్ పూర్ కాగా, సురేఖ ది శంభూగూడ గ్రామం. ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నట్లు, అర్జున్ ఏకకాలంలో ఒకరికి తెలియకుండా ఒకరికి ప్రేమ కుర్చీఫ్ వేసి. గత  మూడు సంవత్సరాల నుండి ప్రేమించాడు. చివరికి పెళ్లి కూడా ఇద్దరినీ చేసుకోవాలని ఉందని ప్రపోజల్ పెట్టాడు. ఆ ఇద్దరూ కూడా అందుకు సరేననడంతో పెద్దల అంగీకారంతో ఊరందరి సమక్షంలో సంప్రదాయబద్దంగా ఒకే మండపంలో ఇద్దరి మెడలో తాళి కట్టి జంట ముగ్గురయ్యారు. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఆసక్తికర పెళ్లి జరిగింది. నెల రోజుల క్రితం ఇద్దరినీ ప్రేమిస్తున్న సంగతి మరదళ్లకు చెప్పగా వాళ్ళు కూడా పెళ్ళికి ఒకే చెప్పారు. మూడు కుటుంబాల సభ్యులతో మాట్లాడిన ఆ ముగ్గురు బావ మరదళ్ళు గ్రామ పెద్దలతో మాట్లాడి వారిని పెళ్ళికి ఒప్పించారు. దీంతో పెద్దల సమక్ష్యంలో ఈ నెల 14వ తేదిన ముహుర్తం కుదుర్చుకొని ఘన్ పూర్ లో ఆ యువకుడు ఒకే పెళ్లి పందిరిలో గిరిజన సంప్రదాయం ప్రకారం ఇద్దరు యువతుల మెడలో తాళి కట్టి పెళ్ళిచేసుకున్నాడు. ఇప్పుడు ఈ పెళ్లి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.  

2 వేల నోటు.. కలర్ జిరాక్స్ .. యువకుడు అరెస్ట్..

సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నట్లు.  మనుషులు మానవ సంబంధాలు వదిలి.. కోట్లకు పడగలు ఎత్తాలని. కోరుకున్నది అనుభవించాలని. తనకు కావాల్సిందే దక్కించుకోవడానికి ఎంతటి అవాంఛనీయమైన పనులు చేయడానికైనా తెగిస్తున్నారు. ఎలాగైనా డబ్బు సంపాదించాలని మనిషి అవసరం కోసం తయారు చేసుకున్న డబ్బు చుట్టూ మనిషి తిరుగుతున్నాడు. డబ్బు సంపాదించడం అంటే దొడ్డిదారిలో సంపాదించడమే అసలైన వృత్తి కాదు. నిజాయిది తో కూడా మనకు కావాల్సిన డబ్బు సంపాదించుకోవచ్చు. కానీ చాలా మంది అడ్డదారి పడుతున్నారు. తాజాగా ఒక వ్యక్తి నకిలీ నోట్ల తయారీని 2 వేల నోటును కలర్ జిరాక్స్ తీసి తీసి చెలామణి చేస్తున్న యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. అది ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలనుకున్నారా.. అయితే మరి ఇంకెందుకు ఆలస్యం.. పదండి ముందుకు..  నకిలీ నోట్ల తయారీని అరికట్టడానికి 2016లో కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసింది. అనంతరం సరికొత్త టెక్నాలజీతో 2 వేల నోట్లను, రూ. 500 నోట్లను ముద్రించింది.ఆ టైం లో నకిలీ నోట్లకు ఇక చెక్ పెట్టొచ్చు అని.. వచ్చిన కొత్త నోట్ల మీద పెన్ను గీతాలు, పెన్సిల్ గీతాలు ఉన్న వాడుకలోకి రావు అని చాలా కహానీలు చెప్పారు. కొంత మంది అయితే ఏకంగా కొత్త నోటును దాచిపెట్టిన ఆ నోటు ఎక్కడుందో కనిపెట్టొచ్చు అని పెద్ద పెద్ద కథలు చెప్పారు. ఇంత తతంగం ఉన్న కొత్త నోట్లను నకిలీ సృష్టి కష్టమని అప్పట్లో అధికారులు ప్రకటించింది. అయితే తరచుగా మనం నకిలీ నోట్లను పట్టుకున్నట్లు తరచుగా వార్తలు వింటూనే ఉన్నాం.. తాజాగా ఓ యువకుడు నోట్లను ముద్రిస్తే.. కష్టమైన పని అనుకున్నట్లు ఉన్నాడు.. ఏకంగా రెండు వేల రూపాయల నోట్లను జిరాక్స్ తీసి చలామణి చేయడానికి చూసాడు.. ఇప్పుడు కటకటాలు పాలయ్యాడు ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రెండు వేల రూపాయల నకిలీ నోట్లను మారుస్తున్న ఉప్పరి రాజు ప్రసాద్ అనే వ్యక్తిని కేపీహెచ్ బీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి ఆరు 2 వేల రూపాయల నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇతను కలర్ జిరాక్స్ మెషిన్ ఉపయోగించి ఎనిమిది 2 వేల రూపాయల నోట్లు నకలు(జిరాక్స్) తీసినట్లు పోలీసులు చెప్పారు. అయితే ఈ ఉప్పరి రాజు ఇలా నకిలీ నోట్లను చెలామణి చేస్తూ.. పోలీసూలకు పట్టుబడడం ఇదే మొదటి సారి కాదు.. గతంలో కూడా నకిలీ నోట్లు చెలామణి చేస్తూ ఐదు పోలీసు స్టేషన్లలో పట్టుబడి నిందితుడు జుడిష్యల్ కస్టడీకి వెళ్ళి వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.

విజయమ్మ పుస్తకం తప్పుల తడక!  వైఎస్సార్ అనుచరుడి సంచలనం..  

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి సంచలన విషయాలు వెలుగులోనికి వచ్చాయి. వైఎస్సార్ పాలన, జగన్ పాదయాత్ర, షర్మిల పార్టీకి సంబంధించి తీవ్ర  వ్యాఖ్యలు చేశారు.. దివంగత వైఎస్సార్ ముఖ్య అనుచరుడు గోనే ప్రకాష్ రావు. వైఎస్ విజయమ్మ రాసిన నాలో నాతో వైఎస్‌ఆర్ పుస్తకంలోని 172వ పేజిలో తప్పులు రాసారని చెప్పారు.  వైఎస్ పాదయాత్రలో జగన్ కూడా ఉన్నారని విజయమ్మ రాశారని, కాని అది అబద్ధం అని గోనె ప్రకాశ్ రావు ఆరోపించారు. వైఎస్ పాదయాత్ర జరిగినన్ని రోజులు అంబటి, లగడపాటి, భూమన కరుణాకర్ రెడ్డి, సుధీర్ రెడ్టిలు ఉన్నారన్నారు. జగన్ ఎక్కడా వైఎస్ పాదయాత్రలో పాల్గొనలేదన్నారు. అది నిజమని నిరూపిస్తే తిరుపతిలో ఉరేసుకుంటా అంటూ వైఎస్ఆర్, జగన్ అభిమానులకు అని గోనే ప్రకాశ్ రావు సవాల్ విసిరారు. బీజేపీ అనుకుంటే కేసీఆర్, జగన్ జైలుకెళతారని  గోనె ప్రకాష్ రావు అన్నారు. జగన్ బెయిల్ రద్దవుతుందని తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ నేతలు మాట్లాడారని... బెయిల్ రద్దు అయితే జైలుకే కదా వెళ్ళాల్సింది అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రెండు ఈడీ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తుచేశారు.  ఎక్కడైనా ఈ మాటలు మాట్లాడుతానని తెలిపారు. కొందరు ఫోన్లు చేసి కవ్వింపులకు పాల్పడుతున్నారని అన్నారు. ఈ మాటలు ఎక్కడైనా మాట్లాడుతానంటూ కవ్వింపులకు పాల్పడే వారికి ఆయన సవాల్ విసిరారు.  గోనెను గెలికితే  అందరి బండారాలు పురాణాలుగా బయట పెడుతా అని ఆయన హెచ్చరించారు. వైఎస్ షర్మిల పార్టీకి సంబంధించి కీలక కామెంట్లు చేశారు గోనే ప్రకాష్ రావు.జగన్ మోసం చేయడం వల్లే షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతున్నారని చెప్పారు.  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలిగా ఉండి షర్మిల దీక్షకు ఎలా మద్దతు తెలుపుతారని ప్రశ్నించారు. ప్రత్యక్షంగా దీక్షలో ఎలా పాల్గొంటారన్నారు. వైఎస్‌ విజమ్మకు, వైఎస్ జగన్ ఎందుకు షోకాజ్ నోటీసు ఇవ్వలేదని గోనె ప్రకాష్‌రావు ప్రశ్నించారు. ఇక ప్రజాస్వామ్య దేశంలో 124ఎ చట్టం అవసరం లేదన్నారు.  అది రాచరిక కాలం నాటి చట్టమని... ఇప్పుడు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని తెలిపారు. ఇక్కడ ఆ చట్టం అవసరం లేదన్నారు గోనె ప్రకాష్‌రావు. 

చితిని పేర్చుకుని సజీవదహనం! సీఎం జిల్లాలో ఘోరం..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లాలో ఘోరం జరిగింది. టీఆర్ఎస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మల్లన్న సాగర్ నిర్వాసితుడు  సజీవ దహనం చేసుకున్నాడు. సిద్దిపేట జిల్లా తోగుట మండలం వేములఘాట్ లో జరిగిన ఈ విషాద ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.   తొగుట మండలం, వేముల‌ఘాట్ కు చెందిన మల్లారెడ్డి (70) భార్య చనిపోయి ఒంటరిగా జీవిస్తున్నాడు. కూతురు కుమారుడు, మనవడు అప్పుడప్పుడు వచ్చి వెళుతూ ఉండేవాడు. మల్లారెడ్డి ఉంటున్న ఇల్లు మొత్తం మల్లన్నసాగర్ ప్రాజెక్టులో పోయింది. ఈ నేపధ్యంలో ప్రభుత్వం ఇచ్చే డబుల్ బెడ్‌రూం ఇంటికి దరఖాస్తు చేసుకున్నాడు. అధికారులు ఆయనకు ఇల్లు మంజూరు చేశారు.  మల్లారెడ్డి అందులో జీవించసాగాడు.  కానీ…. ఒంటరి వాడు అనే కారణంతో ఇచ్చిన ఇంటిని  అధికారులు వెనక్కు తీసుకున్నారు. అధికారులు ఇంటిని ఖాళీ చేయించారనే కారణంతో మల్లారెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.  గురువారం అర్ధరాత్రి తను నివాసం ఉండే ఇంట్లో చితి పేర్చుకుని… కిరోసిన్ పోసుకుని అందులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు. మల్లారెడ్డి  మనవడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్ రూం ఇంటిని అధికారులు మళ్లీ తిరిగి తీసేసుకోవటంతో  మల్లారెడ్డి... తన ఇంట్లోనే చితి పేర్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని గ్రామస్తులు ఆరోపించారు.  సిద్దిపేటజిల్లా వేములఘాట్ లో  సూసైడ్ చేసుకున్న  మల్లన్న సాగర్ ముంపు బాధితుడు మల్లారెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావును తుక్కాపూర్ వద్ద అరెస్ట్ చేశారు.ఈ సందర్భంగా పోలీసుల తీరుపై రఘునందన్ రావు ఫైరయ్యారు. కేసీఆర్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. మల్లన్న సాగర్ ముంపు బాధితుడు మల్లారెడ్డిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని రఘునందన్ రావు ఆరోపించారు.  ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రాలేదనే మనోవేదనతో మల్లారెడ్డి ఆత్మహత్యకు ఒడిగట్టాడన్నారు. ప్రభుత్వం కూల్చివేసిన ఇంట్లోనే చితి పేర్చుకుని మల్లారెడ్డి చనిపోయారని  ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈటల జోరు.. కారులో కంగారు! హుజూరాబాద్ ఎవరిది? 

ఏ కారణంగా వచ్చినా ఉప ఎన్నికలలో గెలవడం అధికార పార్టీకి అంత కష్టం కాదు. తెలంగాణ ఉద్యమం ఉదృతంగా సాగుతున్న రోజుల్లో, తెలంగాణ కోసం రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు కూడా గెలవలేక పోయారు. ఒక సందర్భంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో  మొత్తం 17 మంది తెరాస ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే, అదులో  కేవలం ఏడుగురు మాత్రమే తిరిగి ఎన్నికయ్యారు. అలాగే, ఐదారు నెలల క్రితం జరిగిన దుబ్బాక ఉపఎన్నికలోనూ, అధికార తెరాస పార్టీ ఓడి పోయింది. ఆ ఊపులోనే, ఆ వెంటనే జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది. ఇంచుమించుగా 50 సీట్లు గెలుచుకుంది. సరే, ఆ తర్వాత కమల దళం జోష్ తగ్గింది అనుకోండి, అది వేరే విషయం.  ఇంతవరకు రాష్ట్రంలో జరిగిన  ఉప ఎన్నికల విషయానికి వస్తే, గడచిన ఏడు సంవత్సరాలలో  దుబ్బాక  మినహా అన్ని ఉప ఎన్నికలలోనూ తెరాస అభ్యర్ధులే  గెలుస్తూ వచ్చారు. చివరకు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ కుమార రెడ్డి రాజీనామా చేసిన నల్గొండ జిల్లా హుజూర్ నగర్, సీటును ఉపఎన్నికల్లో  తెరాస కైవసం చేసుకుంది. ఆకక్ది నుంచి పోటీచేసిన కాంగ్రెస్ అభ్యర్ధి,  ఉత్తమ్ కుమార్  సతీమణి పద్మావతి ఓడిపోయారు. ఇక ఇటీవల జరిగిన నాగార్జున సాగర్ ఉప ఎన్నిక విషయం అయితే చెప్పనే అక్కరలేదు. జానారెడ్డి అంతటి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఫస్ట్ టైమ్’ పోటీచేసిన తెరాస అభ్యర్ధి నోముల భగత్’ చేతిలో ఓటమి చవిచూశారు.  ఇంతవరకు, దుబ్బాకలో తగిలిన చిన్న ఎదురుదెబ్బను పక్కన పెడితే, ఉప ఎన్నికల్లో ఆడుతుపాడుతూ వరస విజయాలు సాధిచిన తెరాస,  హుజురాబాద్’లో చెమటోర్చక తప్పేలా లేదన్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి. మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ అయిన అనంతరం ఈటల చేరితే కాంగ్రెస్ పార్టీలో చేరతారు కాదంటే సొంత పార్టీ పెడతారని తెరాస నాయకత్వం భావించింది. అదైనా, ఇదైనా, ఏదైనా ఉపఎన్నికల్లో ఈటలను ఓడించడం ఈజీ అవుతుందని, తెరాస నాయకులు లెక్కలు కట్టారు. కానీ,ఈటల బీజేపీలో చేరడంతో, కథ కొంచెంగా అడ్డం తిరిగిందని తెరాస కొంచెంగా చికాకు పడుతోందని, ఆపార్టీ నాయకుల సంజాయిషీ టైపు  ప్రకటనలు సూచిస్తున్నాయి.  అలాగని, నియోజక వర్గంలో కాంగ్రెస్ కంటే బీజేపీకి ఎక్కువ బలం ఉందని కాదు, నిజానికి, హుజూరాబాద్’ లో బీజేపీకి ఉనికే లేదు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి కౌశిక్ రెడ్డికి 60 వేల పైచిలుకు ఓట్లు వస్తే బీజేపీ అభ్యర్ధి రఘు పుప్పంకు నిండా రెండువేల ఓట్లు కూడా రాలేదు. ఈ ఎన్నికల్లో ఈటల వరసగా ఆరవసారి 50 వేలకు పైగా మార్జిన్’తో విజయం సాధించారు.   ఈటల బీజేపీలో చేరటం అధికార తెరాసకు ఎందుకు ఇబ్బందిగా  మారిందో వేరే చెప్పనక్కరలేదు , బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. అవసరం అయితే ఉపయోగించేందుకు, ఐటీ,ఈడీ వంటి మంత్రదండాలు కేంద్రం చేతిలో ఉన్నాయి. నిన్నగాక మొన్న జరిగిన ఎన్నికల్లో అద్భుత విజయం సాధించి, కేంద్రాన్ని దీటుగా ఎదుర్కుంటున్న  బెంగాల్ సీఎం మమతా బెనర్జీనే కేంద్రం ఎత్తులకు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. రాష్ట్రంలో తమ పరిస్థితి కూడా  కేంద్ర బిగించిన ఉచ్చులో చిక్కున్న ‘ట్విట్టర్’ పిట్ట పరిస్థితిలానే ఉందని మమత పేర్కొన్నారు. ఇక తెరాస విషయం అయితే చెప్పనే అక్కరలేదు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వివాదాస్పద వ్యసాయ బిల్లుల విషయంలో తెరాస పార్టీ ప్రభుత్వం  యూ’టర్న్ తీసుకున్నాయి. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేక్గగా విపక్షాలతో కలిసి ఆందోళన చేసిన తెరాస, చివరకు ‘కేంద్రం బిల్లులు భేష్’ అంటూ అసెంబ్లీలో ఆ బిల్లులకు ఆమోదం తెలిపింది. వ్యవసాయ  బిల్లుల విషయంలో తెరాస తీసుకున్న ‘యు టర్న్’ కేంద్రంతో కయ్యానికి తెరాస సిద్దంగా లేదన్న విషయం మరోమారు స్పష్టమైంది.  అందుకే ఈటల బీజేపే అభ్యర్ధిగా బరిలో దిగడం, తెరాస నాయకత్వానికి కొంచెం చాలా ఇబ్బందికరంగా మారింది. తిడదా మంటే అత్త కొడుకు, కోడడమంటే అక్క మొగుడు’ అనంట్లుగా బీజేపీని గట్టిగా టార్గెట్ చేయలేక, తికమక పడుతున్నారు. అదలా ఉంటే బీజీపీలో చేరిన తర్వాత తొలిసారిగా హుజురాబాద్ నియోజక వర్గానికి వచ్చిన ఈటల రాజేందర్’కు ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది. అదొకటి అలా ఉంటే, ఈటల ఈ సందర్భంగా తెరాస నాయకులపై చాలా ఘాటైన విమర్శలు చేశారు. ఒక విధంగా కేసీఆర్, ప్రత్యర్ధుల మీద ప్రయోగించే భాషను ఈటల అరువు తీసుకున్నారు. ఆయన భాషనే ఈయన  ప్రయోగించారు. ‘కేసీఆర్ అహంకారానికి హుజురాబాద్ ప్రజలు గోరి కడతారు, రాజరిక పాలనకు బొంద పెడతారు’ వంటి పరుష పదజాలాన్ని ప్రయోగించారు.  అయినా ఈటలకు సమాధానం చెప్పిన తెరాస నాయకులు, మంత్రి కొప్పుల ఈశ్వర్ అవ్వన్నీ  వదిలేసి, ముఖ్యమంత్రి కేసీఆర్, ఈటలకు సముచిత స్థానం ఇచ్చి మంత్రిని చేస్తే,ఆయన వెళ్లి మతతత్వ బీజేపీలో చేరారని  బీజేపీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు, నిజానికి, హుజురాబాద్’లో బీజేపీకి ఉనికే లేదు, అయినా బీజేపీని టార్గెట్ చేస్తున్నారంటే, ఎక్కడో ఏదో భయం వారిని వెంటడుతూనే ఉందని అనుకోవలసి వస్తుందని, పరిశీలకులు సైతం భావిస్తున్నారు.

సీఎం జ‌గ‌న్‌కు షాక్‌!.. సీఎస్‌పై అభియోగాలు.. స‌ర్వీస్ పొడిగింపు వ‌ద్దు..

సీఎం జ‌గ‌న్‌రెడ్డి అవినీతి, అక్ర‌మాల పుట్ట అనేది ప్ర‌తిప‌క్షాల ఆరోప‌ణ‌. అందుకే, జైలుకు వెళ్లార‌ని, ప్ర‌స్తుతం బెయిల్ మీద బ‌య‌ట‌కు వ‌చ్చి పాలిస్తున్నార‌ని.. మ‌ళ్లీ త్వ‌ర‌లోనే జైలుకు వెళ్ల‌క త‌ప్ప‌దంటూ విప‌క్షాలు శ‌పిస్తుంటాయి. ఆయ‌న ఏ1 కాబ‌ట్టే త‌న చుట్టూ అవినీతిప‌రుల‌ను పెట్టుకొని పెంచి పోషిస్తున్నార‌ని మండిప‌డుతుంటాయి. ఏ1 జ‌గ‌న్‌, ఏ2 విజ‌య‌సాయిరెడ్డి నుంచి మొద‌లుపెట్టి.. ప‌లువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్యెల్యేల‌తో పాటు అధికారుల‌పైనా పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు చేస్తుంటారు. తాజాగా, ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆదిత్యానాథ్‌దాస్ టార్గెట్‌గా టీడీపీ విమ‌ర్శ‌లు సంధించింది. సీఎస్ ప‌ద‌వీకాలం పొడిగించొద్దు అంటూ డీవోపీటీకి లేఖ రాయ‌డం క‌ల‌క‌లంగా మారింది.  తీవ్ర నేరారోపణలు ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ పదవీకాలం పొడిగింపు తగదని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్ (డీవోపీటీ)కి టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ లేఖ రాశారు. ఆ లేఖ‌లో సీఎస్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆయ‌న గ‌త చ‌రిత్ర‌, కేసులు, అభియోగాల‌ను త‌వ్విపోశారు. ఆ లేఖ‌లో ఏముందంటే....   ‘‘జూన్‌ 30వ తేదీకి ఆదిత్యనాథ్‌దాస్‌ పదవీ విరమణ చేయాల్సి ఉంది. 2013లో జగన్‌ మోహన్‌రెడ్డిపై సీబీఐ నమోదు చేసిన క్విడ్‌ ప్రోకో కేసుల్లో ఆదిత్యనాథ్‌ దాస్‌ కూడా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. జలవనరుల శాఖ కార్యదర్శిగా ఇండియా సిమెంట్స్‌కు అనధికారికంగా 10లక్షల లీటర్ల నీటి కేటాయింపులో అవసరమైన సహాయ సహకారాలు అందించారనే అభియోగాలు ఆయనపై ఉన్నాయి. రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ఇండియా సిమెంట్స్‌లో పెట్టుబడులు పెట్టారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని జగన్‌మోహన్‌రెడ్డితో పాటు ఆదిత్యనాథ్‌దాస్‌పైనా సీబీఐ వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. తర్వాతి కాలంలో తెలంగాణ హైకోర్టు దాస్‌పై ఉన్న కేసులు రద్దు చేసినప్పటికీ,  2019 సెప్టెంబరులో ఆ కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు తిరిగి నోటీసులు జారీ చేసింది. వ్యక్తి గత లాభాల కోసం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రభుత్వ సేవలు దుర్వినియోగం చేసిన ఆదిత్యనాథ్‌దాస్‌కు సీఎస్‌గా పదవీకాలం తదుపరి పొడిగింపు సరికాదు’’ అని కనకమేడల రవీంద్రకుమార్ డీవోపీటీకి రాసిన‌ లేఖలో తెలిపారు.  లేఖ‌ను టీడీపీ మీడియాకూ రిలీజ్ చేయ‌డంతో.. లెట‌ర్ చూసిన వారంతా.. ఓహో జ‌గ‌న్‌రెడ్డికి అంత‌గా స‌హ‌క‌రించారు కాబ‌ట్టే.. ఇంత మంచి పోస్ట్ ద‌క్కిందా అంటూ చ‌ర్చించుకుంటున్నారు. ఇలాంటి అధికారులు ప్ర‌స్తుత ప్ర‌భుత్వంలో ఇంకా ఎంత‌మంది ఉన్నారు.. వారు ఎలాంటి కీల‌క ప‌ద‌వులు అనుభ‌విస్తున్నారో గుర్తు చేసుకుంటున్నారు. 

కోకాకోలా బెదుర్స్.. ఫెవికాల్ అదుర్స్‌.. వాట్ ఆన్ ఐడియా..

కొన్ని టీవీ ప్రోగ్రామ్స్ కంటే.. బ్రేక్‌లో వ‌చ్చే యాడ్సే బాగుంటాయ‌నేది కొంద‌రి అభిప్రాయం. మిగ‌తా యాడ్స్ మాట‌ ఎలా ఉన్నా.. అన్నిటిలోకీ ఫెవికాల్ యాడ్ సంథింగ్ స్పెష‌ల్‌. ఇప్ప‌టి వ‌ర‌కూ ఇండియ‌న్ యాడ్ ఇండ‌స్ట్రీలో ఫెవికాల్ ప్ర‌క‌ట‌న‌ల్లో క‌నిపించేంత క్రియేటివిటీ మ‌రే అడ్వ‌ర్టైంగ్‌లోనూ క‌నిపించ‌ద‌ని అనేక మంది అంటుంటారు. కాలాన్ని బ‌ట్టి ఎప్ప‌టిక‌ప్పుడూ అప్‌డేట్ అవుతున్నా.. కొత్త‌గా వ‌చ్చే ప్ర‌తీ ఫెవికాల్ యాడ్ కూడా ఆడియ‌న్స్‌ను అంత‌కుమించి ఆక‌ట్టుకుంటున్నాయి. ఫెవికాల్‌.. ఈ బంధం ధృడ‌మైన‌ది.. డౌట్ ఉంటే యూట్యూబ్‌లో ఫెవికాల్ యాడ్స్‌ను సెర్చ్ చేసి చూడండి.. క్రియేటివిటీ ఏ రేంజ్‌లో ఉంటుందో తెలుస్తుంది.. లేటెస్ట్‌గా ఓ పోస్ట‌ర్‌ రూపంలో రిలీజ్ చేసిన ఫెవికాల్ యాడ్‌కు ప్రేక్ష‌కులు ఫిదా అవుతున్నారు. వారెవా.. టైమింగ్ అంటే, క్రియేటివిటీ అంటే ఇలా ఉండాలంటూ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఇటీవ‌ల ఓ ప్రెస్ మీట్‌లో టేబుల్ మీద ఉన్న రెండు కోకాకోలా బాటిల్స్‌ను తీసి ప‌క్క‌న‌పెట్టేశాడు స్టార్ ఫుట్‌బాల్ ప్లేయ‌ర్ క్రిస్టియానో రొనాల్డో. వాట‌ర్ తాగాలంటూ చేతుల‌తో సైగ‌లు చేశాడు. రొనాల్డో దెబ్బ‌కు కోకాకోలా షేర్ వ్యాల్యూ ఒక్క‌రోజులోనే ఏకంగా 29వేల కోట్లు ప‌త‌న‌మ‌వ‌డం సంచ‌ల‌నంగా మారింది. వాల్డ్ వైడ్ ఇది ఇంట్రెస్టింగ్ న్యూస్‌గా మారింది. ఇదే కాన్సెప్ట్‌ని త‌మ‌కు అనుగుణంగా మార్చి ఫెవికాల్ తాజాగా ఓ యాడ్ పోస్ట‌ర్ రిలీజ్ చేసింది. అంతే. ఆ యాడ్ చూసి నెటిజ‌న్లు అబ్బుర‌ప‌డుతున్నారు.  ఓ ప్రెస్ కాన్ఫ‌రెన్స్ టేబుల్ మీద రెండు ఫెవికాల్ డ‌బ్బాలు పెట్టి.. "బాటిల్ జ‌ర‌గ‌దు.. విలువ ప‌డ‌దు.." అంటూ క్యాప్ష‌న్ జోడించారు. అంతే. ఇంకేమీ ఉంద‌డు. చూట్టానికి సింపుల్‌గానే ఉన్నా.. కోకాకోలా-రోనాల్డో ఎపిసోడ్ జ‌రిగిన వెంట‌నే సేమ్ థీమ్‌తో ఇలా రివ‌ర్స్‌లో ఫెవికాల్‌ పోస్ట‌ర్‌ను ట్విట‌ర్‌లో రిలీజ్ చేయ‌డం అడ్వ‌ర్టైజింగ్ వ‌ర్గాల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఫెవికాల్ యాడా-మ‌జాకా.. యాడ్ అదుర్స్‌.. హ్యాట్సాప్ అంటూ..  కామెంట్స్ పెడుతున్నారు నెటిజ‌న్స్‌. 

రెండు నెలల బాలుడి ప్రాణం తీసిన అత్త మామ.. 

మనుషులు మరి క్రూరంగా తయారు అవుతున్నారు. రకరకాల కారణాలు చెప్పుకుని ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడం లేదు. ఇంట్లో పెద్దవాళ్ళ మధ్య గొడవలు. కారణాలు ఏంటో తెలియలేదు.. ఆ గొడవలు ఎందుకు జరిగాయో తెలీదు. కసాయిగా మారుతున్నారు. ఇడ్లీ వేసినంత ఈజీగా మనుషుల ప్రాణాలు తీస్తున్నారు. పెద్దల మధ్య గొడవలు పసివాడి ప్రాణం తీసింది.. ఎందుకు అని తెలుసుకోవాలనుకుంటున్నారా.. మీరే తెలుసుకోండి.. తెలుస్తుంది.  అది రంగారెడ్డి జిల్లా.  అబ్దుల్లాపూర్‌మెట్ మండలం. అనాజ్‌పూర్‌ గ్రామం. ఆ గ్రామానికి చెందిన రంగయ్య కుమార్తె బాలమణి రెండు నెలల క్రితం మగ శిశువుకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో రోజు లాగే గురువారం రాత్రి బాలుడితో పాటు కుటుంబ సభ్యులంతా ఇంట్లో నిద్రించారు. ఉదయం ఉదయం నిద్ర లేచి చూసే సరికి.. బాలుడు కనిపించలేదు.. ఇల్లు అంతా వెతికారు.. ఏమైపోయాడు అని కంగారు పడ్డారు. చివరికి ఆ బాలుడు ఇంటిపైన  ఉన్న నీటి ట్యాంకులో చావమై తేలాడు.  వివ‌రాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన తెల్లవారుజాము నుంచి బాలుడు కనిపించట్లేదని గాలించిన తల్లిదండ్రులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనాజ్‌పూర్‌లో సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పరిశీలించగా పోలీసులుకు ఎలాంటి ఆచూకి ల‌భించలేదు. దీంతో బాలుడి ఇంటిని పోలీసులు అణువణువునా గాలించారు.  చివరకు ఇంటిపైన వెతకగా నీటి ట్యాంకులో బాలుడి మృతదేహం కనిపించింది.  బాలుడి మృత దేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మేనమామ, అత్తే హత్య చేసుంటారన్న అనుమానంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ కలహాలే చిన్నారి హత్యకు కారణమని భావిస్తున్నారు. పసికందును హత్య చేసి ట్యాంకులో పడేశారని తెలిపారు. ఘటనాస్థలిని వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి పరిశీలించారు.  ప్రస్తుతం ఈ ఘటన స్ధానికంగా కలకలం సృష్టించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు.

ర‌ఘురామ ఫిర్యాదుపై స్పీక‌ర్ యాక్ష‌న్‌.. రంగంలోకి కేంద్ర హోంశాఖ‌.. జ‌గ‌న్‌రెడ్డీ గెట్ రెడీ!

పావులు క‌దులుతున్నాయ్‌.. పాపం పండుతోంది.. సీఎం జ‌గ‌న్‌రెడ్డికి వ్య‌తిరేకంగా ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయ్‌.. త‌న‌ను క‌స్ట‌డీలో తీవ్రంగా కొట్టారంటూ ఎంపీ ర‌ఘురామ లోక్‌స‌భ స్పీక‌ర్‌కు ఇచ్చిన ఫిర్యాదుపై యాక్ష‌న్ మొద‌లైపోయింది. బంతి కేంద్ర హోంశాఖ ముందుకు వ‌చ్చింది. ఇక‌, ఏపీ స‌ర్కారుకు ముందుముందు క్రొక‌డైల్ ఫెస్టివ‌లే అంటున్నారు.  నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఇచ్చిన సభాహక్కుల నోటీసుపై లోక్‌సభ స్పీకర్‌ కార్యాలయం స్పందించింది. మే 14న తనని అరెస్ట్‌ చేయడం, ఆ తర్వాత తీవ్రంగా హింసించడంపై స్పీకర్‌ ఓం బిర్లాకు రఘురామ జూన్ 2న‌ ఫిర్యాదు చేశారు. ఏపీ సీఎం జ‌గ‌న్‌, డీజీపీ, సీఐడీ ఏడీజీ, గుంటూరు అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్‌‌పై ఎంపీ రఘురామ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు.  రఘురామకృష్ణం రాజును కస్టోడియల్ టార్చర్‌కు గురి చేయడంపై ఆయన కుమారుడు భరత్‌, టీడీపీ ఎంపీలు కనమేడల రవీంద్రకుమార్‌, రామ్మోహన్‌నాయుడు కూడా స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. అన్ని ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న స్పీకర్‌ కార్యాలయం.. వెంటనే సమగ్ర వివరాలు అందజేయాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ బల్లాను ఆదేశించింది. 15 రోజుల్లో సమగ్ర నివేదిక‌ను పంపాలని లోక్‌స‌భ సెక్ర‌టేరియ‌ట్‌ నోటీసులు పంపింది.    ఎంపీ ర‌ఘురామ ఫిర్యాదుపై లోక్‌స‌భ స్పీక‌ర్ కార్యాల‌యం స్పందించ‌డంతో వివాదం పార్ల‌మెంట్ సీరియ‌స్‌గా తీసుకున్న‌ట్టే క‌నిపిస్తోంది. వెంట‌నే పూర్తి వివ‌రాలు అంద‌జేయాలంటూ కేంద్ర హోంశాఖను ఆదేశించ‌డం కీల‌క ప‌రిణామం. సీఐడీ కేసు ఏపీ స‌ర్కారు డైరెక్ష‌న్‌లోనే జ‌రుగుతోంద‌ని.. కుట్ర‌లో భాగంగానే ర‌ఘురామ‌ను టార్చ‌ర్ చేశార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇదే సమ‌యంలో బెయిల్‌పై ఉన్న ర‌ఘురామ‌పై ప‌రారీలో ఉన్న‌ట్టుగా కేసులోని లూప్‌పోల్స్ వాడుకొని.. మ‌రోసారి అరెస్ట్ చేసేందుకు ఏపీ స‌ర్కారు సిద్ధ‌మ‌వుతోందనే అనుమాన‌మూ వ్య‌క్త‌మ‌వుతోంది. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో.. ర‌ఘురామ ఎపిసోడ్‌లో స‌మ‌గ్ర వివ‌రాలు ఇవ్వాలంటూ స్పీక‌ర్ కార్యాల‌యం కేంద్ర హోంశాఖ‌ను అదేధించ‌డం ఆస‌క్తిక‌రం.  ఇప్పుడిక కేసుపై కేంద్ర హోంశాఖ దృష్టి పెడుతుంది. కేసులు, కుట్ర‌లు, క‌స్ట‌డీలో కొట్ట‌డాలు.. ఇలా అన్ని విష‌యాల‌పైనా వివ‌రాలు ఆరా తీస్తుంది. అప్పుడిక అవుటాఫ్ ఇంట్రెస్ట్‌ వెళ్లే ప‌రిస్థితి ఉండ‌దు. కేంద్ర హోంశాఖ‌ను ఏపీ పెద్ద‌లు ప్ర‌భావితం చేయ‌లేదు. నిజాలు నిక్క‌చ్చిగా బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశ‌మూ ఉంటుంది. ఒక‌వేళ‌ క‌స్ట‌డీలో ర‌ఘురామ‌ను కొట్టార‌నే విష‌యం నిజ‌మ‌ని తేలితే.. విష‌యం పార్ల‌మెంట్ దృష్టికి వెళుతుంది. ఓ ఎంపీపై థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగం రుజువైతే.. పార్ల‌మెంట్‌లో సీఎం ప్ర‌భుత్వం దోషిగా నిల‌బ‌డాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంది. ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా, రాష్ట్రాలు, పార్టీల‌కు అతీతంగా ర‌ఘురామ‌కు మ‌ద్ద‌తు పెరుగుతోంది. ఓ ఎంపీపై జ‌రిగిన దాడిని పార్ల‌మెంట్‌పైన జ‌రిగిన దాడిగానే ప‌రిగ‌ణిస్తామ‌ని ఇప్ప‌టికే ప‌లువురు ఎంపీలు బ‌హిరంగంగానే స్టేట్‌మెంట్స్ ఇచ్చారు. ఈ అంశం త‌ప్ప‌క పార్ల‌మెంట్‌లో లేవ‌నెత్తుతామ‌ని ప్ర‌క‌టించారు. ఆ భ‌యంతోనే ర‌ఘురామ‌పై వేటు వేయాలంటూ వైసీపీ లోక్‌స‌భ‌ స్పీక‌ర్‌కు మ‌రోసారి ఫిర్యాదు కూడా చేసింది.  ఏది ఏమైనా జూలైలో జ‌రిగే పార్ల‌మెంట్ సెష‌న్‌లోనే ర‌ఘురామ అంశం ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఆ లోగా స్పీక‌ర్ కార్యాల‌యం ఘ‌ట‌న‌పై స‌మ‌గ్ర వివ‌రాల‌ను కేంద్రం హోంశాఖ ద్వారా తెప్పించుకుంటోంది. అంటే, ర‌ఘురామ ఎపిసోడ్‌పై పార్ల‌మెంట్ సీరియ‌స్‌గా దృష్టి సారించిన‌ట్టేగా? స్పీక‌ర్ కార్యాల‌య‌మే స్పందించిందంటే మేట‌ర్ మంట పుట్టించేదేగా? అదే జ‌రిగితే.. పార్ల‌మెంట్‌లో సీఎం జ‌గ‌న్‌రెడ్డికి ద‌బిడి దిబిడే... ర‌ఘురామతో పెట్టుకుంటే అంతే...  

ప్రత్యేక హోదాపై జగన్ హ్యాండ్సప్! తాకట్టు పెట్టేసినట్టేనా..? 

ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కు సంజీవని. స్పెషల్ స్టేటస్ ఏపీ హక్కు అని, విభజనతో నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదాతోనే న్యాయం జరుగుతుందనేది ప్రజల భావన. విభజన చట్టంలోనూ దీన్ని పొందు పరిచారు. పార్లమెంట్ లో అప్పటి దేశ ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. కాని విభజన జరిగి ఏడేండ్లు పూర్తైనా ప్రత్యేక హోదా హామీ మాత్రం నెరవేరలేదు. ఏపీతో కేంద్ర ప్రభుత్వాలు ఆటలాడుతున్నాయనే ఆగ్రహం ఏపీ ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్.. ప్రత్యేక హోదా కేంద్రంగానే రాజకీయం చేశారు. తమ పార్టీకి అధికారం ఇస్తే కేంద్రంతో పోరాడి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పారు. కాని ఆయన అధికారంలోకి వచ్చి రెండేండ్లు పూర్తైనా ప్రత్యేక హోదాపై మాత్రం అతిగతీ లేదు.  ప్రత్యేక హోదా సాధించడం కాదు..  కనీసం ఆ పదం కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పలకడం లేదనే విమర్శలు ఉన్నాయి. కేంద్రాన్ని నిలదీస్తానన్న జగన్... కేంద్రం ముందు హోదా ప్రస్తావన కూడా తేవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. మడమ తిప్పేది లేదు.. మాట తప్పేది లేదు అని గొప్పగా చెప్పుకునే జగన్.. ప్రత్యేక హోదా విషయంలో మాత్రం మడమ తిప్పేశారని, కేంద్రానికి తాకట్టు పెట్టేశారనే విపక్షాలు ఆరోపిస్తున్నాయి. తనపై ఉన్న సీబీఐ, ఈడీ కేసుల కోసం ప్రత్యేక హోదా గురించి కేంద్రంతో రాజీ పడ్డారని మండిపడుతున్నాయి. వైసీపీ నేతలు మాత్రం ప్రత్యేక హోదా కోసం పోరాడుతూనే ఉన్నామని చెబుతున్నారు. అయితే తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డే ప్రత్యేక  హోదాపై చేతులెత్తేశారు. కేంద్రం దగ్గర చేసేదిమి లేదంటూ.. ప్రత్యేక హోదా ఇక రాదనే సంకేతమిచ్చారు.  2021-22కు సంబంధించి జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్మోహన్ రెడ్డి.. ప్రత్యేక హోదాపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి కేంద్రాన్ని అడుగుతూనే ఉన్నామని చెప్పారు. అయితే ప్రస్తుతం ఢిల్లీలో సంకీర్ణ సర్కార్ లేదని, కేంద్రం దగ్గర చేసేదేమి లేదని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేలేమంటూ.. తన వల్ల కాదని అంగీకరించారు జగన్. ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో పోరాడుతానని చెప్పిన జగన్... ఇప్పుడు ఏం చేయలేమంటూ హ్యాండ్సప్ అనడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.  లోక్ సభలో వైసీపీకి 22 మంది ఎంపీలున్నారు. లోక్ సభలో నాలుగో అతిపెద్ద పార్టీగా ఉంది వైసీపీ. 22 మంది ఎంపీలున్నా కేంద్రంతో పోరాడలేమని సీఎం జగన్ చెప్పడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. అసలు కేంద్రాన్ని అడగకుండా ఎలా సాధిస్తారని ప్రశ్నిస్తున్నారు. 22 మంది ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రంపై ఒత్తిడి పెరగదా అని కొందరు నిలదీస్తున్నారు. జగన్ వాలకం చూస్తుంటే ప్రత్యేక హోదా తమకు అక్కరలేదని కేంద్రానికి చెప్పినట్లుగా ఉందనే అభిప్రాయం కూడా కొన్ని  వర్గాల నుంచి వస్తోంది.  విపక్షాలు ఆరోపిస్తున్నట్లు తన కేసుల కోసం ప్రత్యేక హోదాను కేంద్రానికి జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టినట్లుగా ఉందని ఏపీ జనాలు అనుమానిస్తున్నారు. సంకీర్ణ సర్కార్ కాకున్నా కొన్ని రాష్ట్రాలు తమకు కావాల్సిన వాటిని సాధించుకుంటున్నాయని చెబుతున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను చూసైనా జగన్ నేర్చుకోవాలని సూచిస్తున్నారు. వ్యక్తిగత ప్రయోజనాలు, కేసుల కోసం రాజీ పడి.. రాష్ట్రానికి జగన్ అన్యాయం చేస్తున్నారని మండిపడుతున్నారు.

11 నుంచి 26 శాతానికి పెరిగిన వ్యతిరేకత! అయినా మోడీనే ప్రపంచ టాప్ లీడర్.. 

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హవా తగ్గిందా? కొంత కాలంగా ఆయన ఇమేజ్ తగ్గుతూ వస్తోందా? వచ్చే ఎన్నికల్లో ఆయనను తప్పించాలని కాషాయ దళం భావిస్తుందా? ఇదే చర్చ కొన్ని రోజులుగా దేశ రాజకీయాల్లో కీలకంగా మారింది. ప్రధాని మోడీపై జనాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనే ప్రచారం జరుగుతోంది. తాజా పరిణామాలపై బీజేపీలో టెన్షన్ పెరుగుతుందని కూడా వార్తలు వచ్చాయి. నిజానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ..  ప్రపంచంలోనే పాపులారిటీలో టాప్ లీడర్. గతంలో పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు నిర్వహించిన సర్వేలో ఆయనకే మొదటి స్థానం దక్కింది. సోషల్ మీడియాలోనూ ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న లీడర్ గా మోడీనే నిలిచారు. ఈ విషయంలో అమెరికా ప్రెసిడెంట్ ను కూడా వెనక్కి నెట్టారు నరేంద్ర మోడీ. అయితే కొవిడ్ సెకండ్ వేవ్ తర్వాత.. భారత ప్రధాని క్రేజీ తగ్గిందనే వార్తలు వచ్చాయి. కరోనా కట్టడిలో మోడీ ప్రభుత్వం విఫలమైందంటూ అంతర్జాతీయ మీడియాలో భారీగా కథనాలు వచ్చాయి. దేశంలో మోడీపై గతంలో ఎప్పుడు లేనంత వ్యతిరేకత కనిపిస్తోంది.  నరేంద్ర మోడీ క్రేజీ తగ్గిందనే వార్తలతో కలవరపడుతున్న కమలనాధులకు ఊరటనిచ్చే న్యూస్ వచ్చింది. ప్రపంచంలో ఎక్కువ పాపులారిటీ  ఉన్న నేతల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీనే మరోసారి టాప్ ప్లేస్ లో నిలిచారు. పలు దేశాల అధినేతలకన్నా ముందు నిలిచారు. 'మార్నింగ్ కన్సల్ట్’ అనే సంస్థ చేసిన సర్వేలో 66 శాతం మంది ప్రధాని నరేంద్ర మోడీనే మళ్లీ దేశాధినేతగా కావాలని కోరుకుంటున్నారట. ‘గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్ ట్రాకర్’ పేరిట ఆ సర్వే ఫలితాలను మార్నింగ్ కన్సల్ట్ వెల్లడించింది. ఈ లిస్టులో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా 13 అగ్రదేశాధినేతల కన్నా ప్రధాని మోడీకే ఎక్కువ మంది జై కొట్టారు.  భారత్ లో 2,126 మందిని సర్వే చేస్తే అందులో 66 శాతం మంది.. ప్రధాని మోడీకి ఓటేశారు. మరో 28 శాతం మంది వ్యతిరేకత వ్యక్తం చేశారు. అయితే గతంతో పోలిస్తే మోడీ స్కోర్ పడిపోయింది. జమ్మూకశ్మీర్ కు స్వతంత్ర ప్రతిపత్తి హోదా కల్పించే 370 అధికరణాన్ని రద్దు చేసిన ఆగస్టు 2019లోమోడీని దేశంలో  82 శాతం మంది ఆమోదించారని, కాని ఇప్పుడది 65 శాతంగానే ఉందని మార్నింగ్ కన్సల్ట్ సంస్థ వెల్లడించింది. 2019లో మోడీని కేవలం 11 శాతం మందే వ్యతిరేకించగా.. ప్రస్తుతం అది 26 శాతానికి పెరిగింది. ఇదే బీజేపీలో కొంత ఆందోళన రేపుతోంది.  65 శాతం మంది ఆమోదంతో మోడీ తర్వాతి స్థానంలో ఇటలీ ప్రధాని మారియో ద్రాఘీ ఉన్నారు. మూడో స్థానంలో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రూస్ మాన్యుయెల్ లోపెజ్ ఓబ్రడార్ (63%) ఉన్నారు.  అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరో స్థానంలో నిలిచారు. ఆయనకు  53 శాతం మంది అమెరికన్లు మద్దతుగా నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ (54%), జర్మనీ చాన్స్ లర్ ఏంజెలా మెర్కెల్ (53%), కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడూ (48%), బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ (44%), దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ (37%), స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ (36%), బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో (35%), ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్ (35%), జపాన్ ప్రధాని యోషిహిదే సూగా (29%) ఉన్నారు. వారం రోజుల సగటు ఆధారంగా ఈ సర్వే ఫలితాలను వెల్లడించినట్టు మార్నింగ్ కన్సల్ట్ పేర్కొంది. సర్వేను ఆన్ లైన్ లో చేసినట్టు తెలిపింది. 

బీ కేర్‌ఫుల్‌.. వ‌దిలిపెట్టం.. వేటాడ‌తాం.. లోకేశ్ స్ట్రాంగ్ వార్నింగ్‌..

మేము సింహం లాంటి వాళ్లం.. అరాచ‌కాల‌కు భ‌య‌ప‌డి పారిపోయే వాళ్లం కాదు.. మిమ్మల్ని వదిలిపెట్టం.. వేటాడతాం.. మా ఓపిక‌ను ప‌రీక్షించొద్దు.. స‌మ‌యం వ‌స్తుందు.. నేనే గుణ‌పాఠం చెబుతా.. అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు టీడీపీ జాతీయ కార్య‌ద‌ర్శి నారా లోకేశ్‌. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏపీలో 27 మంది టీడీపీ కార్యకర్తలను దారుణంగా చంపారని మండిప‌డ్డారు. టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులపై వరుస దాడులు జరుగుతున్నాయని.. ప్రజల ప‌క్షాన పోరాడుతున్న వారిపై దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు.  కర్నూలు జిల్లా పెసరవాయిలో హత్యకు గురైన టీడీపీ నేతలు నాగేశ్వర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి కుటుంబాలను నారా లోకేశ్‌ పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను వారిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబసభ్యులను కోల్పోయామని..  బాధిత కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని.. అన్ని రకాలుగా ఆ కుటుంబాలను ఆదుకుంటామ‌ని.. నారా లోకేశ్‌ హామీ ఇచ్చారు.    ‘‘టీడీపీ కార్యకర్తలను బెదిరించి, నాయకులను చంపితే మేం వెనక్కి తగ్గుతామని అనుకుంటున్నారా? మిమ్మల్ని వదిలిపెట్టం. మా కార్యకర్తలను భయపెడితే పార్టీకి నష్టం తేవచ్చని మీరు అనుకుంటున్నారు. టీడీపీ ఎక్కడికీ పోదు. మేం మీకు భయపడి పారిపోయేవాళ్లం కాదు. ధైర్యంగా నిలబడి ప్రజల తరఫున పోరాడతాం. మా ఓపికను పరీక్షించొద్దు.. బీ కేర్‌ఫుల్‌. సమయం వస్తుంది.. అప్పుడు నేతలు, రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్న అధికారులకు గుణపాఠం చెప్పే బాధ్యతను నేను వ్యక్తిగతంగా తీసుకుంటానని టీడీపీ కార్యకర్తలకు హామీ ఇస్తున్నా’’ అని లోకేశ్‌ అన్నారు.   మంచి పని చేయాలంటే అభివృద్ధి చేయండి. రాయలసీమకు కొత్త పరిశ్రమలు తీసుకురండి. సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేయండి. అవి మీకు చేతకాకే మా కార్యకర్తలు, నేతలపై ఎదురుదాడి చేస్తున్నారని నారా లోకేశ్ మండిప‌డ్డారు.   క‌ర్నూలు జిల్లా పెస‌ర‌వాయికి చెందిన టీడీపీ నేత‌లు నాగేశ్వర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి గురువారం ఉదయం శ్మశానానికి వెళ్తుండ‌గా.. ప్ర‌త్య‌ర్థులు మాటు వేసి హ‌త‌మార్చారు. పక్కా ప్రణాళికతో కారుతో ఢీకొట్టి.. వేట కొడవళ్లు, గొడ్డళ్లతో నరికి వారిని దారుణంగా చంపేశారు. ఘ‌ట‌న‌లో మ‌రో ముగ్గురికి తీవ్ర గాయాల‌య్యాయి. వైసీపీ నాయ‌కులే ఈ హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డార‌ని తెలుస్తోంది. ఆ రెండు వ‌ర్గాల‌కు ఎప్ప‌టినుంచో గొడ‌వ‌లు ఉన్న‌ట్టు స‌మాచారం.

ఏపీలో కర్ఫ్యూ మరింత సడలింపు.. ఆ జిల్లాలో పాత రూల్సే..

ఆంధ్రప్రదేశ్ లో  కర్ఫ్యూ వేళలను మరింత సడలించారు. పగలంతా కర్ఫ్యూ ఎత్తేశారు. కొవిడ్ పై సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు ఏపీలో ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు వరకు సడలింపు ఉండగా.. ఇకపై ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ సడలింపు ఇవ్వాలని కర్ఫ్యూ సీఎం జగన్ నిర్ణయించారు. జూన్‌ 20 నుంచి 30 వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. సాయంత్రం 5 గంటల కల్లా దుకాణాలు మూసివేయాల్సి ఉంటుంది. సాయంత్రం 6 గంటల నుంచి కర్ఫ్యూ కచ్చితంగా అమలవుతుంది.  తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం పాత రూల్సే అమలు చేయనున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ మాత్రమే సడలింపు వర్తించనుంది. కొవిడ్‌ పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్నందున ఈ జిల్లాలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ మాత్రమే సడలింపు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. ప్రభుత్వ కార్యాలయాలన్నీ రెగ్యులర్‌ టైమింగ్స్‌ ప్రకారం నడవనున్నాయి. ఉద్యోగులు అందరూ కార్యాలయాలకు వచ్చేలా మార్పులు చేస్తున్నారు.  ఏపీలో కొవిడ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గతంలో రోజుకు 20 వేలకు పైగా కేసులు నమోదవగా.. ప్రస్తుతం 6 వేలకు పైగా కేసులు వస్తున్నాయి. 

కర్ణాటక టాప్.. యూపీ లాస్ట్! వ్యాక్సినేషన్ లో ఏపీ అంతంతే.. 

దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. టీకాల కొరత ఉన్నా అందుబాటులో ఉన్నంతవరకు సాధ్యమైనంత వేగంగా టీకాల పంపిణికి రాష్ట్రాలకు చర్యలు చేపట్టాయి. కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం గురువారం వరకు దాదాపు 27 కోట్ల టీకాలు వేశారు. ఇందులో 21.58 కోట్ల మందిఒక్క డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. అంటే మొత్తం జనాభాలో 15.74 శాతం మందికి వ్యాక్సిన్ వేసినట్లు లెక్క. కొన్ని రాష్ట్రాల్లో వేగంగా సాగుతుండగా.. ఇంకొన్ని రాష్ట్రాల్లో మాత్రం నెమ్మదిగా సాగుతోంది. జనాభా తక్కువగా ఉన్న చిన్న రాష్ట్రాల్లో స్పీడుగా టీకాల పంపిణి సాగుతుండగా.. పెద్ద రాష్ట్రాలు మాత్రం వెనకబడ్డాయి.  వ్యాక్సినేషన్ రేటు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో గోవా టాప్ ప్లేస్‌లో ఉంది. గోవాలో గురువారంఉదయం వరకు... ఆ రాష్ట్ర జనాభాలో 37.35శాతం మందికి కనీసం మొదటి డోసు వేశారు.  గోవా తర్వాతి స్థానాల్లో సిక్కిం (37.29%), హిమాచల్ ప్రదేశ్ (30.35), త్రిపుర (29.07), కేరళ (26.23), గుజరాత్ (25.69), ఢిల్లీ (25.39) ఉన్నాయి.  వ్యాక్సినేషన్‌లో యూపీ, బీహార్, అసోం, ఝార్ఖండ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు వెనకబడి ఉన్నాయి.  యూపీలో గురువారం వరకు కేవలం 8.53% మంది మాత్రమే టీకా వేసుకున్నారు. బీహార్‌లో 8.61, అసోంలో 11.26, ఝార్ఖండ్‌లో 11.64, తమిళనాడులో 12.10, పశ్చిమ బెంగాల్‌లో 14.16 శాతం మందికి వ్యాక్సిన్ వేశారు. వ్యాక్సినేషన్ లో  తెలుగు రాష్ట్రాల పరిస్థితి  అంతంత మాత్రంగానే ఉంది. తెలంగాణలో ఇప్పటి వరకు 19 శాతం మంది టీకా తీసుకోగా.. ఏపీలో 18శాతం మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. పెద్ద రాష్ట్రాల్లో కర్నాటక మాత్రమే కాస్త మెరుగ్గా ఉంది. అక్కడ ఇప్పటి వరకు 22 శాతం మందికి టీకాలు వేశారు.  అయితే జాతీయ వ్యాక్సినేషన్ రేటు కంటే.. ఏపీ, తెలంగాణ వ్యాక్సిన్ రేటు ఎక్కువ ఉంది.   

ఈట‌ల‌నే సీఎం కేండిడేట్‌? త్వ‌ర‌లోనే తెలంగాణ టూర్‌..

హుజురాబాద్ బైపోల్‌ 2023 అసెంబ్లీ ఎల‌క్ష‌న్స్‌కు రిహార్స‌ల్స్‌. హుజురాబాద్ ఎన్నికల త‌ర్వాత తెలంగాణ వ్యాప్తంగా ప‌ర్య‌టించి బీజేపీని బ‌లోపేతం చేస్తా. కేసీఆర్ అహంకారానికి ప్ర‌జ‌లే ఘోరీ క‌డ‌తారు. ఇవీ కాషాయ కండువా క‌ప్పుకున్నాక తొలిసారి హుజురాబాద్ వ‌చ్చిన ఈట‌ల నోటి నుంచి వ‌చ్చిన మాట‌లు. గ‌తవారం హుజురాబాద్ నుంచి వెళ్లేట‌ప్పుడు గుప్పెడు అనుచ‌రుల‌తో వెళ్లారు. బీజేపీలో చేరి తిరుగొచ్చేట‌ప్పుడు కాషాయ దండుతో క‌దిలొచ్చారు. ఈట‌ల వెనుక జ‌న ప్ర‌భంజ‌నం. ప‌దుల సంఖ్య‌లో కార్లు, వంద‌ల సంఖ్య‌లో బైకులు.. వేలాదిగా యువ‌కులు.. ఇప్పుడు ఈట‌ల ఓ వ్య‌క్తి కాదు.. కాషాయ శ‌క్తి.. కేసీఆర్‌పై పోరాడే యుక్తి. ఈట‌ల హుజురాబాద్ ప‌ర్య‌ట‌న అనేక అంశాల్లో క్లారిటీ ఇచ్చేస్తోంది. రాజేంద‌ర్ వెంటే బీజేపీ నేత‌ల పెద్ద ఎత్తున త‌ర‌లివ‌చ్చారు. ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్‌రావు, మండ‌లి మాజీఛైర్మ‌న్ స్వామిగౌడ్‌, బీజేపీ కోర్‌ కమిటీ సభ్యుడు వివేక్‌, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి.. ఇలా పెద్ద పెద్ద నేత‌లే ఈట‌ల వెంట ఉన్నారు. రేపేమాపో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు బండి సంజ‌య్ సైతం హుజురాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు.  వ‌చ్చిన జ‌నాన్ని, ల‌భించిన స్వాగ‌తాన్ని చూస్తే.. హుజురాబాద్‌లో ఈట‌ల స‌త్తా ఎంతో తేలిపోతుంది. ఆయ‌న ప‌ట్టు ఏమాత్రం స‌డ‌ల‌లేద‌ని తెలుస్తోంది. అధికార‌పార్టీ ఎంత‌గా బెదిరింపుల‌కు పాల్ప‌డినా.. జ‌నం జ‌న‌నేత వెంటే ఉన్నార‌ని అర్థ‌మ‌వుతోంది. ఇదే ఇప్పుడు గులాబీ శిబిరంలో గుబులు రేపుతోంది. అభివృద్ధి ప‌నుల పేరుతో ఇప్ప‌టికే హుజురాబాద్‌లో 30 కోట్లు కుమ్మ‌రించినా.. ప్ర‌జ‌లకు క‌ళ్లెం వేయ‌లేక‌పోయారు. ఆర్థికంగా బాగా బ‌ల‌మున్న‌ ఈట‌ల సైతం అదే స్థాయిలో ఖ‌ర్చు చేస్తుండ‌టంతో పోటీ హోరాహోరీగా సాగుతోంది. టీఆర్ఎస్ కోసం ఇప్ప‌టికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రంగంలోకి దిగి.. మండ‌లాల వారీగా బాధ్య‌త‌లు మీదేసుకుని ప‌ని చేసుకుపోతున్నారు. సొంత ఇలాఖాలో ఈట‌ల సింగిల్ హ్యాండ్‌గా న‌రుక్కొస్తున్నారు. భార్య జ‌మునారెడ్డి ఓవైపు, ఈట‌ల మ‌రోవైపు.. వారికి అండ‌గా అనుచ‌రులు, క‌మ‌ల‌నాథులు మోహ‌రించి కురుక్షేత్ర సంగ్రామానికి న‌గారా మోగించేశారు.  జ‌స్ట్‌.. హుజురాబాద్‌తోనే ఆగేలా లేరు ఈట‌ల రాజేంద‌ర్‌. ఇదే ఊపుతో 2023లో కేసీఆర్‌ను గ‌ద్దె దించే వ‌ర‌కూ విశ్ర‌మించేది లేదంటున్నారు. ఇది అసెంబ్లీ పోరుకు రిహార్స‌ల్స్ అంటూ త్వ‌ర‌లోనే తెలంగాణ వ్యాప్తంగా ప‌ర్య‌టిస్తానంటూ తొడ‌గొట్టారు ఈట‌ల రాజేంద‌ర్‌. ఆయ‌న మాట‌ల్లో అనేక మీనింగ్స్ తీస్తున్నారు విశ్లేష‌కులు. ఈట‌ల ఇప్పుడు స్వ‌తంత్రుడు కాదు. బీజేపీ స‌భ్యులు. ఓ పార్టీలో ఉన్న‌ప్పుడు పార్టీ లైన్ ప్ర‌కార‌మే న‌డుచుకోవాలి.. పార్టీ ఆదేశాల మేర‌కే ప‌ని చేయాలి.. పార్టీ అప్ప‌గించిన బాధ్య‌త‌ల‌ను మాత్ర‌మే నెర‌వేర్చాలి.. సొంతంగా నిర్ణ‌యాలు తీసుకునేందుకు లేదు.. ఈట‌ల‌కు ఆ విష‌యం తెలియందీ కాదు.  మ‌రి, త్వ‌ర‌లోనే తాను తెలంగాణ వ్యాప్తంగా ప‌ర్య‌టించి బీజేపీని బ‌లోపేతం చేస్తాన‌నే మాట‌ల వెనుక మ‌ర్మ‌మేంట‌ని ఆరా తీస్తున్నారు.  ఇప్ప‌టికే ఢిల్లీ పెద్ద‌ల‌తో సుదీర్ఘంగా మంత‌నాలు జ‌రిపిన ఈట‌ల‌కు ఆ మేర‌కు బీజేపీ అగ్ర నాయ‌క‌త్వం నుంచి ఆదేశాలు అందాయా? అంటున్నారు. బీజేపీ హైక‌మాండ్ ఇషారాతోనే తెలంగాణ వ్యాప్తంగా ప‌ర్య‌ట‌న‌కు ఏర్పాట్లు చేసుకుంటున్నారా? అని అనుమానిస్తున్నారు. ఈట‌ల‌ను కేవ‌లం హుజురాబాద్ నేత‌గానే కాకుండా రాష్ట్ర స్థాయి లీడ‌ర్‌గా ప్ర‌మోష‌న్ ఇచ్చేసిన‌ట్టేనా? అంటే, బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు బండి సంజ‌య్‌తో స‌మాన స్థాయిని ఈట‌ల‌కు క‌ల్పించారా? 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇది రిహార్స‌ల్స్ అన్నారంటే.. ఆ అసెంబ్లీ సంగ్రామం సైతం ఈట‌ల నేతృత్వంలోనే సాగుతుంద‌ని సంకేతమా? ఆ లెక్క‌న‌.. బీజేపీ త‌ర‌ఫున ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి కూడా ఈట‌ల రాజేంద‌రేనా? అనే చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతోంది. బీజేపీ అధిష్టానం నుంచి వ‌చ్చిన హింట్‌తోనే ఈట‌ల అలాంటి వ్యాఖ్య‌లు చేశార‌ని.. రాబోయే కాలంలో క‌మ‌లం పార్టీకి కాబోయే కెప్టెన్ ఈట‌ల‌నే అంటున్నారు ఆయ‌న అనుచ‌రులు. అందుకే ఆ జోరు.. ఆ హుషారు..