రెండేళ్లుగా చివాట్లే చివాట్లు.. అహంకారమే అసలు సమస్యా?  

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇది మొదటి ఎదురుదెబ్బ కాదు. చివరిది కూడా కాకపోవచ్చును. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి ఇలా కోర్టుల చేత మొట్టి కాయలు వేయించుకోవడం ఆలవాటుగా మారి పోయింది. అదే క్రమంలో ఇప్పుడ మరో మొట్టికాయ గట్టిగా పడింది. ఇంటర్, టెన్త్ పరీక్షలు నిర్వహించేందుకు,ఇది సమయం కాదు. కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. థర్డ్ వేవ్ సిద్ధంగా ఉంది. ఇలాంటి పరిస్థితిలో పరీక్షలు నిర్వహించడం అంటే, పిల్లల ప్రాణాలతో చేలగాడం ఆడడమే అవుతుంది. ఇది కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవం. ఇది తెలుసుకునేందుకు అంత, ‘అజ్ఞానం’ కూడా అవసరం లేదు. అయినా, అపోజిషన్ పరీక్షలు రద్దు చేయమని కోరింది కాబట్టి, అపోజిషన్ను అపోజ్  చేయడమే సర్కార్ విధానంగా పెట్టుకున్న జగన్ రెడ్డి ఆరు నూరైనపరీక్షలు నిర్వహింఛి తీరాలని నిర్ణయించారు. అందుకోసం సుప్రీం కోర్టు వరకు వెళ్లారు. బొక్కబోర్లా పడ్డారు. కోర్టు పెట్టవలసిన నాలుగు పెట్టిన తర్వాత, అమాత్యవర్యులు, ముఖం చిన్నబుచ్చుకుని, మంత్రసాని తనం ఒప్పుకున్నడకు తప్పదన్నట్లుగా పరీక్షలను రద్దు ప్రకటించారు.  ఎందుకు ఇలా జరుగుతోంది? ప్రతి విషయంలో కోర్టుల జోక్యం ఎందుకు అవసరం అవుతుంది? ఇందుకు ఇంకా చాలా కారణాలు ఉంటే  ఉండవచ్చును కానీ, ప్రధాన కారణం మాత్రం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన అహంకార ధోరణే ప్రధాన కారణమనేది అందరి మాట. నిజానికి, ఈ నిజం, ఆయన మంత్రివర్గంలోని మంత్రులకు, అధికారులకు, సలహాదారులకు అందరికీ తెలుసు. అయినా, మొండివాడు రాజుకంటే బలవంతుడు, రాజే మోడీ వాడైతే ... అనుకుంటారో ఏమో కానీ, ఆయన మాటకు ఎదురు చెప్పే సాహసం చేయరు. అయితే, ప్రైవేటుగా ఎవరిని పలకరించినా, ముఖ్యమంత్రి ఒంటెద్దు పోకడల వలన ప్రజాధనం దుర్వినియోగం కావడమే కాకుండా, అధికారులు అవమానాల గురవుతున్నారని, కోర్టుల ముందు తలవంచుకోక తప్పడం లేదని, అన్నిటినీ మించి ప్రజలు ఇప్పందులు పడుతున్నారని అంటారు.   సహజంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే ముందు, అనేక కోణాల్లో మంచి చెడులను అలోచించి నిర్ణయం తీసుకుంటుంది. కానీ, ఏపీలో అందుకు పూర్తి విరుద్ధంగా, ముందు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారు, ఆ తర్వాత మంత్రులు అధికారులు, సలహాదారులు, రాజ్యాంగం ఒకటుందనే విషయాన్ని మరిచి పోయి, అడ్డదారులలో,ఆ నిర్ణయం అమలకు ప్రయత్నిస్తారు. చివరకు  కోర్టుల చీవాట్లతో, కథ ముగుస్తుంది. అందుకే  ప్రారంభంలోనే అనుకున్నట్లుగా, పంచాయతీ కార్యాలయాలకు పార్టీ రంగులు కేసు మొదలు ప్రస్తుత పరీక్షల కేసు వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కోర్టుల్లో ఓడిపోయిన కేసుల సంఖ్య, ఖచ్చితంగా ఎంతుంటుందో కానే, ఖాయంగా సెంచరీ దాటేసిందని మాత్రం చెప్పవచ్చును అంటున్నారు.    అయినా ముఖ్యమంత్రి మాత్రం అదే ధోరణిలో పోతున్నారు.  నిప్పుతో చెలగాటం ఆడితే  చెయ్యి కాలుతుంది, ఇది అందరికీ తెలుసు అయినా, నేనింతే ... అంటే ... వాతలు తప్పవు. ఏపీలో అదే జరుగుతోంది. ప్రస్తుత పరీక్షల విషయాన్నే తీసుకుంటే, సుమారు రెండు నెలలకు పైగా, ప్రతిపక్షాలే కాదు పిల్లల తల్లి తండ్రులు, విద్యావేత్తలు,మేధావులు పరీక్షలు రద్దు చేయమని కోరుతున్నారు. మరో వంక ఇరుగు పొరుగు రాష్ట్రాలతో పాటుగా, 21 రాష్ట్రాలు 10+2 పరీక్షలను రద్దు చేశాయి. చివరకు సీబీఎస్సీ, ఐసీఎస్ఈ’లు కూడా అదే బాటలో నడిచాయి. అయినా, ఊరందరి దారిలో కాకుండా ఏపీ ప్రభుత్వం మరోదారిన పోయింది. దేశంలో మరే రాష్ట్రంలోని విద్యార్ధులకు జరగని తీరని నష్టం, ఒక్క ఏపీ  విద్యార్దులకే జరుగుతుందన్న వితండవాదంతో విధ్యార్ధులను, విద్యార్ధుల తల్లి తండ్రులను మభ్యపెట్టే ప్రయత్నం చేసింది.  ఎంసెట్‌ ర్యాంకుల నిర్ధారణలో ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ ఉందని చెబుతూ వచ్చారు. అది నిజం. అయితే, ఇంటర్ మార్కులకు వెయిటేజీ ముందు నుంచి లేదు, ఈ మధ్య కాలంలో వచ్చింది. ప్రభుత్వం తలచుకుంటే, వెయిటేజీ వచ్చిన దారిలోనే వెనక్కి పోతుంది. అదేమంత  పెద్ద పనికాదు. అయినా, మంత్రిగారు”‘పరీక్షలు రద్దు చేయడం నిమిషం పట్టదు. కానీ, ఇంటర్‌ పరీక్షలకు ఎంసెట్‌ పరీక్షలకు లింకు ఉంది’’ అని చెపుతూ వచ్చారు, చివరకు తప్పని సరి పరిస్థితిలో తూచ్’ అని తప్పుకున్నారు.  సాధారణ సాధారణ పరిస్థితులకు, అసాధారణ పరిస్థితులకు మధ్య వ్యత్యాసం ఉంటుంది .. అందుకే ప్రభుత్వం సాధారణ పరిస్థితులలో అయినా ఒక నిర్ణయం తీసుకునే ముందు ... 360 డిగ్రీలలో పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. పరిస్తితులు అనుకూలించక పోతే, ఏమి చేయాలి అనేది కూడా ముందే అలోచించి కంటిన్జెన్సీ ప్రణాళికను సిద్ధం చేసుకుంటుంది . అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇలాంటి  అన్నిటికీ అతీతం, కుందేటికి మూడే కాళ్ళని నమ్మే ప్రభుత్వం. అందుకే ఇన్ని ఎదురుదెబ్బలు...ఇన్ని చీవాట్లు .. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ... God resists the proud, but gives grace to the humble: అనే   బైబిల్ సూక్తిని గుర్తు చేసుకుని అయినా అహం కొంచెం తగ్గిచుకుంటే.. మంచిది, అంటున్నారు...సామాన్య జనం.

అన్నా క్షమించు.. తప్పు చేశా! కేసీఆర్ కు ఈటల లేఖ..? 

ఇటీవలే కేసీఆర్ మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్.. వైద్యశాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాసినట్టుగా ఉన్న ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను చేసింది తప్పేనని, సమావేశాలు జరిపింది నిజమేనని, తనతో పాటు పెద్దపల్లి జిల్లాకు చెందిన లీడర్లు కూడా హాజరుకావడం నిజమేనని లేఖలో ఈటల ఒప్పుకున్నట్లుగా ఉంది. తామంతా పార్టీకి విధేయులుగా ఉంటామంటూ చెప్పుకొచ్చారు.  మీతో సాన్నిహిత్యం ఎంతో గొప్పదని, మీరు నా వేలు పట్టుకుని నడిపించారని కూడా కేసీఆర్‌ను ఈటల కీర్తించారు.  కేసీఆర్ కు ఈటల రాసినట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖలో ఏముందంటే.. ‘టీఆర్ఎస్ పార్టీలో గత 20 ఏళ్లుగా మీతో సాన్నిహిత్యం చాలా గొప్పది. మీతో కలిసి పని చేసిన ప్రతిక్షణం నేను రాజకీయంగా, వ్యక్తిగతంగా ఎంతో నేర్చుకున్నాను. మీరు పార్టీలో నాకు స్థాయికి మించి ఎన్నో అవకాశాలు ఇచ్చారు. ఇప్పటికీ నాకు గుర్తుంది. మీరిచ్చిన అవకాశంతో నేను హుజురాబాద్ నుండి ఎమ్మెల్యేగా గెలిచినా నాకు అదే పెద్ద పదవని అనుకున్నాను. కానీ  ఆ సమయంలో ఎందరో మీతో సన్నిహితంగా ఉన్నా.. వాళ్ళని కాదని నాకు ఏకంగా మన పార్టీ టీఆర్ఎస్ శాసనసభపక్ష నేతగా అవకాశం ఇచ్చి నన్ను ఎంతో ప్రోత్సహించారు. ఆ ప్రోత్సాహాన్ని నేను మర్చిపోలేను. ఉద్యమ సమయంలో నన్ను వేలు పట్టి నడిపించారు. నన్ను గత ఇరవై ఏళ్ళ నుండి మీ తమ్ముడిలాగా భావిస్తూ వస్తున్నారు. మీరు అవకాశం ఇవ్వకుంటే నేను రాజకీయంగా ఈ స్థాయికి వచ్చేవాడిని కాదు. నాకు రెండు సార్లు మంత్రిగా అవకాశం ఇచ్చి పార్టీలో తగిన గుర్తింపు ఇచ్చారు’  ‘కానీ నిన్నటి నుండి జరిగిన పరిణామాలు నన్ను తీవ్రంగా బాధించాయి. నిన్న నాపై ఆరోపణలతో కొన్ని చానెళ్ళలో వార్తలు రావడం నన్ను తీవ్రంగా కలచివేసింది. నేను చేసిన కొన్ని పనులు తప్పే కావచ్చు. కానీ ఆ పనులు నేను కొందరు వ్యక్తులు తప్పుదోవ పట్టించడం వల్ల చేయాల్సి వచ్చింది. కానీ పార్టీ మీద కానీ, మీ మీద కానీ నాకు ఎల్లప్పుడూ అపారమైన గౌరవం ఉంది. బెంగుళూర్ లో కానీ, పుణేలో కానీ ఇతర చోట్ల నేను పెట్టిన సమావేశం కూడా కొందరి తప్పుడు మాటలతో నేను ముందుకు వెళ్లాల్సి వచ్చింది తప్పితే నాకు వేరే ఇతర ఆలోచన లేదు. అలా సమావేశాలు పెట్టడం, పార్టీకి ఇబ్బంది కలిగించేలా కొన్ని రకాల పనులు చేయటం ముమ్మాటికీ తప్పేనని ఒప్పుకుంటున్నాను. నన్ను మరోసారి పెద్ద మనసుతో మీ తమ్ముడిలా భావించి ఆ తప్పులను సరిదిద్దుకునే అవకాశం నాకు ఇవ్వగలరు. జరిగిన వాటి పట్ల నేను విచారం వ్యక్తం చేస్తూ మీరు నన్ను పెద్ద మనసుతో క్షమిస్తారని ఆశిస్తున్నాను. ఇక నుండి అలాంటి తప్పులను కానీ, పార్టీకి ఇబ్బంది కలిగించేలా ఎలాంటి పనులు చేయనని మీకు మాట ఇస్తున్నాను’ అని తెలిపారు. ‘నాతో పాటు పార్టీకి ఇబ్బంది కలిగించే అట్టి సమావేశంలో పాల్గొన్న పెద్దపల్లి జిల్లా నాయకులు కానీ, ఇతర జిల్లాల నాయకులను కూడా పార్టీకు విధేయంగా పనిచేసేలా చూస్తాను. మీరు నా తప్పులను సరిదిద్దుకోవటానికి ఈ ఒక్కసారికి అవకాశం ఇస్తారని భావిస్తున్నాను. పదవులతో సంబంధం లేకుండా పార్టీను మరింత బలోపేతం చేయటానికి నేను అనుక్షణం సిద్ధంగా ఉంటాను. ఇదే విషయం నేను రామ్ తో అసెంబ్లీలో కలిసినప్పుడు చెప్పాను. ఆనాడు చెప్పిన దానికే ముమ్మాటికీ కట్టుబడి ఉంటాను’  ఇదీ మొత్తంగా ఈటల రాజేందర్ లేఖ సారాంశం. అయితే ఈ లెటర్‌లో మాత్రం తేదీ రాయలేదు. ఇది ముఖ్యమంత్రికి ఈటల రాసిన  లేఖ కావాలనే లీక్ చేశారా? లేక క్రియేట్ చేశారా? అన్నది మాత్రం అర్థం కావడం లేదు.  

మంత్రి పదవి ప్లీజ్.. జగన్ కు సీనియర్ల డిమాండ్

రాజకీయాలలో ఉన్నవారికి పదవీ వ్యామోహం ఉండడం సహజం. అందులోనూ దశాబ్దాల తరబడి రాజకీయాలలో ఉన్నవారికి వయసు పెరిగే కొద్దీ కోరికలు కూడా పెరుగుతూనే ఉంటాయి. ఎమ్మెల్యే అయిన వారికి  మంత్రి  కావాలని ఉంటుంది, మంత్రి అయిన వారికీ ముఖ్యమంత్రి ... అలా.. అలా .. ఆశలు  పైమెట్లకు నిచ్చెనలు వేస్తూనే ఉంటాయి.  అయితే అందరి కోరికలు తీరవు. కొందరి కోరికలు కొంతవరకు తీరి ..ఇక ఆపైన కదలవు. కొందరికి పదవులు వస్తూనే ఉంటాయి కానీ, ఆశించిన పదవి అందని ద్రాక్షగానే మిగిలి పోతుంది .   ప్రణబ్ ముఖర్జీ విషయాన్నే తీసుకుంటే, ప్రధాని పీఠంలో కూర్చోవాలన్నఆయన కోరిక తీరలేదు. చివరకు రాష్ట్ర పతి పదవి దక్కినా.. అన్ని అర్హతలు ఉన్నా ప్రధాని కాలేక పోయాననే బాధ మాత్రం ఆయన్ని వెంటాడింది. ఆ బాధను అయన దాచుకోలేదు. ‘ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్’ పుస్తకంలో అందరితో పంచుకున్నారు. అందులో ఆయన ఇందుకు సంబంధించి ప్రస్తావించిన అంశాలను గమనిస్తే, రాష్ట్రపతి పదవిని అలకరించడం గర్వకారణంగా భావించినా,  ఆయన దాన్నొక కన్సొలేషన్ బహుమతిగానే తీసుకున్నారా అనిపిస్తుంది. ప్రధాని పదవిని ఆశించి భంగపడిన వారు ఒక్క ప్రణబ్ దాదా మాత్రమే కాదు. ఇంకా ఉన్నారు. బీజేపీ అగ్ర నేత ఎల్కే అద్వానీ, అలాగే  కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, కామ్రేడ్ జ్యోతి బసు ఇలా ఎందరినో ప్రధాని పదవి ఇలా ఊరించి, అలా చేజారి పోయింది. 2004 లో సోనియా గాంధీ ఆల్మోస్ట్ చివరి మెట్టువరకు వరకు వెళ్లారు.  మద్దతు ఇస్తున్న ఎంపీలు, పార్టీల లేఖలు పట్టుకుని, రాష్ట్రపతి భవన్’ మెట్లేక్కారు బట్, అక్కడ ఏమైందో ఏమో,సీన్ మారిపోయింది. ఆమె నిరాశగా వెనక్కి వచ్చారు. అదృష్తం మన్మోహన్ సింగ్’ ను వరిచింది. అయితే, ఆమె ప్రధాని కాలేక పోయినా మన్మోహన్ సింగ్ ప్రధానిగా  ఉన్న పదేళ్ళు ఆమె  ‘సూపర్ పీఎం’ గా  చక్రం తిప్పారు.  అంతకు చాలా ముందే, యునైటెడ్ ఫ్రంట్ అధికారంలో ఉన్నరోజుల్లో జ్యోతిబసుకు ప్రధాని అయ్యే అవకాశం వచ్చింది. అయితే ఆయన పార్టీనే అడ్డుపుల్ల వేసింది. అవకాశం చేజారిపోయింది. ఆ తర్వాతి కాలంలో జ్యోతిబసు, అప్పటి పార్టీ  నిర్ణయాన్ని చారిత్రక తప్పిదంగా అభివర్ణించారు. బాధపడ్డారు. అద్వానీ విషయానికి వస్తే పార్టీ రెండు సార్లు ఆయన్ని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించినా, ప్రజలు అవకాశం ఇవ్వలేదు. చివరకు ప్రజలు అవకాశం ఇచ్చే సమయానికి, మోడీ వచ్చి కర్చీఫ్ వేశారు.  ఆయనకు కూడా ప్రణబ్ ముఖర్జీలా రాష్టపతి గౌరవం అన్నా దక్కుతుందని ఆశించినా అదీ అందని ద్రాక్షగానే మిగిలి పోయింది.   ఆం ధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అంతెత్తు పెద్ద కుర్చీ (స్పీకర్ చైర్) మీద ముఖం మొత్తింది.ఇప్పటికే  ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ అధికారంలో  ఉన్న రోజుల్లో చంద్రబాబు నాయుడు మంత్రి వర్గంలో మంత్రిగా పనిచేశారు, ఇప్పుడు మరోసారి మంత్రిగా చేయాలని ఆయన చాలా ఆశపడుతున్నారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్, తమ తొలి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన సమయంలో  రెండున్నర ఏళ్ల తర్వాత మంత్రి వర్గాన్ని సమూలంగా మార్చి కొత్త టీమ్’ కు అవకాశం ఇస్తామని ఇచ్చిన హామీ ఆధారంగా చాలా మంది, ముఖ్యంగా ఫస్ట్ టీమ్’ లో బెర్త్ దక్కని సీనియర్లు సెకండ్ హాఫ్ టీంమ్ పై  ఆశలు పెంచుకుంటున్నారు. అందులో తమ్మినేని కూడా ఉన్నారు. అందుకోసం ఆయన భారీ ప్రయత్నాలే చేస్తున్నారని వినికిడి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయొద్దని భావిస్తున్న తమ్మినేని,చివరిసారిగా ఆ మంత్రి హోదాను అనుభవించి వెళ్లాలని అనుకుంటున్నట్టు వైసీపీ అధిష్టానానికి విన్నవించుకుంటున్నారట. 2019 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో జగన్ రెడ్డి, ‘ఒక్క ఛాన్స్ ప్లీజ్’ అని ఓటర్లను వేడుకుంటే, తమ్మినేని ఇదే నా చివరి ఎన్నిక, ఇకపై పోటీ చేయని, గెలిపించండి ప్లీజ్’ అని ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు. అలాగే, గెలిస్తే తాను మంత్రి కావడం ఖాయమని నియోజకవర్గానికి కావాల్సిన పనులు చేసి పెట్టి వెళ్తానంటూ ఓటర్లకు విజ్ఞప్తులు చేశారు. అనుకున్నట్టే ఎమ్మెల్యేగా గెలిచారు కానీ.. జగన్ ఆయనకు అసెంబ్లీ స్పీకర్ పదవి కట్టబెట్టారు. అయితే అంతకుముందే రెండున్నరేళ్లే పదవుల్లో కొనసాగుతారని జగన్ స్పష్టం చేయడంతో ఆయన నిర్ణయాన్ని కాదనలేకపోయారు. ఇప్పుడు సమయం దగ్గరపడుతుండటంతో ఎలాగైనా మంత్రి కావాలని తమ్మినేని అనుకుంటున్నారట.ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన తమ్మినేని పార్టీలు మారి, ఇంచు మించుగా 15 ఏళ్లకు పైగానే మంత్రి పదవికి దూరమయ్యారు. దీంతో ఈసారి ఎలాగైనా ఒక్కసారి ఆ మంత్రి పదవిని అనుభవించి వెళ్లాలని గాఢంగా కోరుకుంటున్నారట.  తమ్మినేని స్టొరీ ఇలా ఉంటే, గతంలో ఉమ్మడి  రాష్ట్రంలో చంద్రబాబు, వైఎస్ మంత్రివర్గాల్లో  అంతకు ముందు తర్వాత కూడా మంత్రులగా పనిచేసిన ధర్మాన, ఆనం రామనారాయణ రెడ్డి లాంటి మాజీ మంత్రులు, పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీడియాలో క్రియాశీలంగా కనిపించిన,  అంబటి రాంబాబు, రోజా, భూమ కరుణాకర రెడ్డి లాంటి అనేక మంది తమ్మినేనిలానే, గెలిస్తే మంత్రి పదవి గ్యారంటీ అన్న ధీమాతో  ఉన్నారు. అయినా, జగన్ రెడ్డి హోల్సేల్ గా అందరికీ మొండి చేయి చూపించారు. అలంటి వారంతా ఇప్పుడు, ముఖ్యమంత్రి గారు మంత్రి పదవి ప్లీజ్ అని వేడుకుంటున్నారట ...  అంతా .. ఆ దేవుని దయ.

ఏపీ ప్రభుత్వానికో దండం.. భూములను తిరిగిచ్చేసిన రిలయన్స్

ఆంధ్రప్రదేశ్ నుంచి మరో దిగ్గజ సంస్థ తప్పుకుంది. ఇప్పటికే పలు విదేశీ కంపెనీలు తాము పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించాయి. గతంలో సంస్థల ఏర్పాటుకు ముందుకొచ్చిన కొందరు పారిశ్రామిక వేత్తలు వెనక్కి తగ్గారు. ఏపీలో కాకుండా మరో ప్రాంతానికి వెళ్లిపోయారు. గత ప్రభుత్వ హయాంలో ఎంవోయూలు కుదుర్చుకున్న సంస్థలు సైతం ఇప్పుడు పత్తా లేకుండా పోయాయి. ఇందుకు కారణం ప్రస్తుత వైసీపీ సర్కార్ తీరే కారణమంటున్నారు. భూములు అప్పగించకపోవడం, కొత్తకా కొర్రీలు పెట్టడంతో పాటు అధికార పార్టీ లీడర్లు వాటాలు డిమాండ్ చేయడం కూడా కారణమనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా మరో దిగ్గజ సంస్థ ఏపీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.  రిలయన్స్‌ సంస్థకు ఏపీ ప్ర‌భుత్వం తిరుపతి సమీపంలో భూములు ఇచ్చింది.  ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ ఏర్పాటు కోసం గ‌త టీడీపీ స‌ర్కారు 136 ఎకరాలను కేటాయించగా, వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక అందులో 75 ఎకరాలను అప్పగించింది. అయితే, రిలయన్స్‌కు కేటాయించిన భూములకు సంబంధించిన 15 మంది రైతులు ప‌లు  కారణాలతో కోర్టులో కేసులు వేశారు. ఈ కేసులు పరిష్కారం అయ్యే వరకు యూనిట్‌ ఏర్పాటు చేయటానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో తమకు అప్పగించిన  భూముల‌ను తిరిగి రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ(ఏపీఐఐసీ)కు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వెనక్కి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించింది. రూ.15 వేల కోట్ల పెట్టుబడులతో సెట్‌టాప్‌ బాక్సులు, ఇంటర్నెట్‌ వినియోగానికి అవసరమైన డాంగిల్స్‌ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను  విరమించుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించింది. రిలయన్స్ తప్పుకున్న విషయాన్ని  తిరుపతి ఏపీఐఐసీ జోనల్‌ కార్యాలయ ఉన్నతాధికారులు ధ్రువీకరించారు. ఆ భూముల కోసం రిల‌యన్స్  డిపాజిట్‌ చేసిన మొత్తాన్ని తిరిగి ఇచ్చే విష‌యంపై చ‌ర్చిస్తున్న‌ట్లు చెప్పారు. తిరుపతి సమీపంలో భూముల‌కు బ‌దులుగా వడమాలపేట మండలం పాడిరేడు అరణ్యం దగ్గర ఎలాంటి వివాదాలు లేని భూములను కేటాయిస్తామని  ఏపీఐఐసీ అధికారులు న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నం చేసినా రిల‌య‌న్స్  అధికారులు అంగీకరించలేదని తెలుస్తోంది. తమకు భూములు అప్పగించాలని ఎన్నిసార్లు కోరినా అధికారులు స్పందించకపోవడం, కోర్టులో కేసులు వేసిన రైతులతో మాట్లాడాలని చూసినా సాధ్యం కాకపోవడంతో రిలయన్స్ అధికారులు విసిగిపోయారని చెబుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే భారీ పెట్టుబడి వెనక్కి పోయిందనే విమర్శలు విపక్షాల నుంచి వస్తున్నాయి. కొత్త పెట్టుబడులు తేవడంలో విఫలం కావడంతో పాటు గతంలో ఎంవోయూలు చేసుకున్న కంపెనీలు బెదిరించి పంపిస్తున్నారని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు.   

కోడి గుడ్డే కానీ... పెద్ద కథే..

మన టైం బాగాలేకుంటే వాసుదేవుడు గాడిగా కాళ్ళు పట్టుకున్నట్లు ఉంటుంది మన పరిస్టితి. అలాగే జొన్న గింజతో కొడితే ప్రాణం పోయినంత సిల్లీగా గా ఉంటుంది. కొన్ని సార్లు చేసింది చిన్న తప్పే అయినా పెద్ద శిక్షలు పడుతుంటాయి. తప్పు చెయ్యడం శిక్షలు పాడడం ఒక ఎట్టు అయితే. కోడి కత్తికి మనిషి మృతి, కోడిని అరెస్ట్ చేసిన సిల్లీ కేసులు కూడా విన్నాం. కోడిని చంపినా వ్యక్తి అరెస్ట్ అనే సంఘటనలు కూడా విన్న చూశాం.. బట్ కోడి గుడ్డు ఒక వ్యక్తిని గాయాల పాలు చేసింది.. మరో వ్యక్తిని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పింది. భలే ఉంది కదా అయితే మొత్తం వార్త చదవండి ఇంకా కిక్కు ఉంటుంది.  టైం ఎంత చెత్తగా ఉంటుందంటే చెప్పలేం. చిన్న కారణం.. తెచ్చే చిక్కులు తరువాత తీరుబడిగా ఆలోచిస్తే తేలుతాయి తప్పులు. కొంతమంది వ్యక్తులు ఎలా ఉంటారంటే.. చిన్న విషయాన్ని ఒక్కోసారి చాలా ప్రేస్టేజియస్ గా తీసుకుంటారు. కోటి రూపాయలు పోయిన అంత పట్టించుకోరుగాని  వారి అహం దెబ్బ తింటే తట్టుకోలేరు. విపరీతమైన ఫీల్ అవుతారు నానా హంగామా  చేసేస్తారు. దీంతో వారు ఎదుటివారితో చాలా చికాకుగా ప్రవర్తించడమే కాకుండా వారిని ఇబ్బందుల్లోకి నెట్టేసి.. తామూ చిక్కుల్లో పడతారు. అటువంటిదే ఈ సంఘటన కూడా. ఒక్క కోడిగుడ్డు ఒక వ్యక్తిని గాయాల పాలు చేసింది. మరోవ్యక్తిని పోలీసు స్టేషన్ చుట్టూ తిప్పింది. బెంగళూరు లో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఒక యువకుడు చికెన్ కొనడానికి షాప్ కి  వెళ్ళాడు. పాపం చికెన్ కొనడానికి వెళ్లిన వాడు ఈ మధ్య సోషల్ మీడియాలో వీడియోలు ఎక్కువగా చూసినట్లున్నాడు. అయితే చికెన్  అమ్మే వాడు చికెన్  కొడుతున్న సమయంలో అక్కడ ఒక గుడ్డు తీసుకుని సంచిలో వేశాడు. అది చూసిన దుకాణం యజమాని ఆ యువకుడిని కోపంతో దానా ధన్ లాగి కొట్టాడు.  దీంతో ఆ యువకుడు గాయపడ్డాడు. అక్కడితో ఆగక ఈ విషయం పోలీసుల వద్దకు చేరింది. బెంగళూరు బేగూర్ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. 28 ఏళ్ల గోపి ఆర్ ఓ ప్రైవేట్ సంస్థ ఉద్యోగి. ఇతను వైట్ఫీల్డ్ సమీపంలోని చిక్కా బేగూర్ నివాసి. ఆదివారం మధ్యాహ్నం అక్కడికి దగ్గరలోని శాంత కుమార్ అనే వ్యక్తి నడుపుతున్న చికెన్ సెంటర్ కు చికెన్ కోసం వెళ్ళాడు. రెండు కేజీల చికెన్ ఆర్డర్ చేశాడు. చికెన్ సిద్ధం అవుతున్న సమయంలో గోపీ అక్కడ ఉన్న ఒక క్రేట్ నుంచి ఒక గుడ్డును తీసుకున్నాడు. అయితే, ఇది శాంతకుమార్ కు చెప్పకుండా చేశాడు. దీంతో శాంతకుమార్ గుడ్డు ఎందుకు తీశావంటూ గోపీ తో వాగ్వాదం పెట్టుకున్నాడు. నేను చికెన్ డబ్బులు ఇచ్చేటప్పుడు గుడ్డు డబ్బులు కూడా ఇస్తాను అని గోపీ చెప్పాడు. అయితే, శాంత కుమార్ వినిపించుకోకుండా గోపీని దొంగ అంటూ మాట్లాడాడు. దాంతో ఇద్దరి మధ్యా వాదోపవాదనలు గట్టిగా జరిగాయి. ఈ క్రమంలో శాంతకుమార్ కోపం పట్టలేక.. ఇనుప కడ్డీతో గోపీ పై దాడి చేశాడు. దీంతో గోపీ గాయాల పాలయ్యాడు. విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో బెగూర్ పోలీసులు దుకాణ యజమాని శాంత కుమార్ పై క్రిమినల్, బెదిరింపు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు.

రూ. 83 లక్షలు నొక్కేశారు..

వాళ్ళు పధకం వేస్తే.. ఎంత పెద్ద వాడికైనా పంచర్ అవ్వాల్సిందే. వాళ్ళ కన్ను పడితే ఎవరి ఖజానాకైనా కన్నం పడాల్సిందే.. అలా అని వాళ్ళు ఇల్లు ఇల్లు తిరిగి కన్నాలు వేయరు. పథకాలు వేసి ప్రజల ఇండ్లు దోచుకోరు. వాళ్లకు లేనోడు ఉన్నవాడు అని తేడా ఉండదు ఒక రకంగా చెప్పనంటే కరోనా వైరస్ లాంటి వాళ్ళు దోచుకోవడం దాచుకోవడమే వాళ్ళ పని. వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడే  మనీ లో మునిగి తేలుతారు. వాళ్ళు ఎవరో మీకు ఇప్పటికే అర్థం అయి ఉంటుంది . వాళ్ళే సైబర్ నేరగాళ్లు. వాళ్ళు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు, ఏం చేస్తుంటారో అసలు తెలీదు. కానీ వాళ్ళు కొట్టే దెబ్బ మాత్రం చాలా గట్టిగ ఉంటది. ఏదో ఒక సారి ఏదో ఒక రకంగా మన అకౌంట్ లో ఉన్న డబ్బులు గల్లంతు అవుతాయి. వాళ్ళు రంగంలోకి దిగితే మనకు కుచ్చుటోపి పడాల్సిందే.. హైదరాబాద్ లో ఇప్పటి వరకు చాలా మంది ప్రముఖులు మోసపోయారు.  పూర్తి వివరాల్లోకి వెళితే..  హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్ మణప్పురం గోల్డ్ సంస్థకు భారీ కుచ్చుటోపి పెట్టారు. దాదాపు ముప్పై లక్షలు టోకరా వేశారు. హిమాయత్ నగర్ మణప్పురం గోల్డ్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి హిమాయత్‌నగర్ మణప్పురం గోల్డ్ బ్రాంచ్ ఉద్యోగులకు ఫోన్ చేశాడు. తాను సంస్థ ఉన్నతాధికారినంటూ చెప్పాడు. అన్యాయం పుణ్యం ఎరుగని ఉద్యోగులు  వారి లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ ఇచ్చారు. అలా సేకరించిన లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌తో సైబర్ నేరగాడు  రూ. 30 లక్షలు కాజేశాడు. ఇలా ఇద్దరు ఉద్యోగులను బురిడీ కొట్టించారు సైబర్ కేటుగాళ్లు. ఇరువురి ఐడీల నుంచి లాగిన్ అయి.. రూ. 15 లక్షలు చొప్పున మొత్తం రూ. 30 లక్షలు కాజేశారు. ఈ విషయాన్ని సంస్థ ఉన్నతాధికారులు గ్రహించి వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలాఉంటే.. మసాబ్ ట్యాంక్‌కు ప్రాంతానికి చెందిన నిమ్రా సెర్ గ్లాస్ టెక్రాలజీ సంస్థ ఎండీనీ సైతం ఇలాగే బురిడీ కొట్టించారు సైబర్ దొంగలు. నిమ్రా సంస్థ యజమాని ఖాదర్‌ను తప్పుదోవ పట్టించి రూ. 53 లక్షలు కొట్టేశారు. మెటీరియల్ కొనుగోలు కోసం ఒక ఇంటర్నేషనల్ సంస్థతో నిమ్రా సంస్థ యజమాని ఖాదర్ ఒప్పందం చేసుకున్నాడు. ఇందులో భాగంగా డాలర్ల రూపంలో అడ్వాన్స్ మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్ చేశారు. ఇక అంతే ఖాదర్ కదలికలపై  కన్ను వేశారు నేరగాళ్లు.  రెండవ విడత చెల్లింపు సమయంలో ఖాదర్‌ని సైబర్ నేరగాళ్లు ట్రాప్ చేశారు. సంస్థ అధికారులమని, డబ్బును లండన్‌లో ఉన్న వేరే బ్యాంకు ఖాతాకు పంపించాలని స్పూఫ్ ఈమెయిల్ పంపించారు కేటుగాళ్లు.  వారి మాటలు నమ్మిన ఖాదర్.. సమర్పించుకున్నాడు. దాదాపు మొత్తం రూ. 53 లక్షల 23 వేలు ట్రాన్స్‌ఫర్ చేశాడు. మెటీరియల్ విషయమై సంస్థ అసలు అధికారులను సంప్రదించడంతో మోసం బయటపడింది. దాంతో బాధితుడు ఖాదర్.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ రెండు కేసులను నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

ట్రావెల్స్ లో.. భారీగా బంగారం పట్టివేత..

బంగారం ఆ పేరు వింటే కళ్ళు జిగేల్మంటాయి. అది ఆడవాళ్ళకైనా.. మగవాళ్ళకైనా.. లైఫ్ లో ప్రతి ఒక్కరు ఏదో సందర్బంగా బంగారం కొని ధరించాలనుకుంటారు. అందుకే ఆ ప్రాణం లేని బంగారానికి అంత ధర.. అయితే ఈ మధ్య కాలంలో బంగారాన్ని సప్లై చేస్తూ చాలా మంది పోలీసుల చేతికి చిక్కుకుంటున్నారు. ఎయిర్ పోర్ట్ లో అయితేనేమి జాతీయ రహదారి లో అయితేనేమి ప్రయాణం ఏదైనా పోలీసులకు పట్టుపడడం కాయం అయిపోతుంది ఈ రోజుల్లో. అయితే ఆ బంగారు స్మగ్లర్స్ కూడా పోలీసుల కంటికి కనిపించకుండా రకరకాలుగా సప్లై చేస్తున్నారు. పండు ముసలికి సంసారం ఎలా చెయ్యాలో నేర్పడం లాంటిదనే చెప్పాలి పోలీసులకు. వాళ్ళ కుప్పి గంతులు పోలీసుల ముందు ఏ మాత్రం ప్రభావం చూపడం లేదని చెప్పాలి. తాజాగా ఒకటి కాదు రెండు కాదు దాదాపు 5 కేజీల 85 గ్రాముల బంగారాన్ని పట్టుకున్నారు కర్నూల్ పోలీసులు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.    పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎట్ సిఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో లోకల్,సెబ్ పోలీసులు కలిసి వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో హైదరాబాదు నుండి బెంగళూరు వెళుతున్న AP 39 TG8888 విక్షం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లో ప్రయాణిస్తున్న బెంగళూరుకు చెందిన నగల వ్యాపారి మహావీర్ జైన్ దగ్గర ఈ బంగారం పట్టుబడింది. విలువ సరైన పత్రాలు , ఆధారాలు లేని కారణంగా సదరు బంగారం బిస్కెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్నూల్ జిల్లా ఎస్పీ డాక్టర్ పక్కీరప్ప, కాగినెల్లి ఎపియస్, ఇంకా సెట్ అడిషనల్ ఎస్పీ గౌతమి సాలి ఆదేశాల మేరకు పంచ లింగాల రాష్ట్ర సరిహద్దు సిట్ చెక్ పోస్టులో తెల్లవారుజామున చేసిన తనిఖీల్లో పెద్ద ఎత్తున బంగారం చిక్కింది. కాగా, మహావీర్ జైన్ బెంగళూరులోని శివాజీ నగర్ లో ఉన్న అరిహంత్ జ్యువెలరీ షాప్ యజమాని. అతని బ్యాగులో సుమారు 5 కేజీల 85 గ్రామలు (45 బంగారు బిస్కెట్లు , రెండు నెక్లెస్ లు) సోదాల్లో గుర్తించారు . వాటికి సంబంధించి సరైన పత్రాలు , ఎలాంటి ఆధారాలు , ఈ – వే బిల్లులు చూపనందున వాటిని కర్నూల్ తాలూకా పోలీస్ స్టేషన్ నందు తదుపరి చర్య నిమిత్తం అప్పగించారు . ఈ సందర్భంగా కర్నూలు పట్టణ డిఎస్పీ కె.వి మహేష్ , కర్నూలు తాలుకా ఏవి కంటగిరి రాముడు కలిసి తాలూకా పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించి బంగారం వివరాలు వెల్లడించారు. కాగా, చెక్ పోస్టు దగ్గర చేసిన వాహన తనిఖీలలో సిఐ కంటగిరి రాముడు , ఎస్ఐలు ఖాజా వాలి, లక్ష్మి నారాయణ, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

కేసీఆర్ తో భోజనం చేసిన వారికి అస్వస్థత.. వాసాలమర్రిలో అధికారుల  హైరానా.. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించిన యాదాద్రి  భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో పలువురు అస్వస్థతకు గురి కావడం కలకలం రేపింది. సీఎం  కేసీఆర్ దత్తత తీసుకున్న యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రిలో మంగళవారం నిర్వహించిన సహపంక్తి భోజనం చేసిన వారిలో 18 మంది అనారోగ్యానికి  గురయ్యారు. వాంతులు, విరేచనాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సీఎం పక్కన కూర్చుని భోజనం చేసిన వృద్ధురాలు ఆకుల ఆగమ్మ సీఎం సభ అనంతరం వాంతులు చేసుకుంది. రాత్రి మరోమారు వాంతులు, విరేచనాలు కావడంతో కుటుంబ సభ్యులు ఆమెను భువనగిరిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం కోలుకోవడంతో  గురువారం డిశ్చార్జ్  చేశారు.ఆకుల ఆగమ్మను తన దోస్త్ అని గ్రామసభలో ప్రకటించారు కేసీఆర్. ఆమె అస్వస్థతకు గురి కావడంతో అధికారులు ఆందోళన చెందారు.  కేసీఆర్ పర్యటనలో ఏర్పాచు చేసిన సహపంక్తిలో భోజనం చేసిన ఓ బాలిక బుధవారం అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం అదే రోజు డిశ్చార్జ్ చేశారు.  గ్రామానికి చెందిన మరో 16 మంది కూడా వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో బాధపడ్డారని తెలుస్తోంది. విషయం తెలిసిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గ్రామానికి చేరుకుని ఇంటింటికి తిరుగుతూ వైద్యం అందించారు. గ్రామస్థుల అస్వస్థతకు ఆహారం కలుషితం కావడం కారణం కాదని అధికారులు తెలిపారు. సహపంక్తిలో మొత్తం 2500 మంది పాల్గొన్నారని, వారిలో 18 మంది మాత్రమే అనారోగ్యానికి గురయ్యారని తెలిపారు. 

ఆర్టీసీ స‌మ్మెకు ఈట‌ల సాయం! కేసీఆర్‌పై కుట్ర‌? బాంబు పేల్చిన బాల్క సుమ‌న్‌..

తెలంగాణ‌లో ఆర్టీసీ స‌మ్మె. రెండేళ్ల క్రితం.. దాదాపు రెండు నెల‌ల పాటు ఉధృతంగా జ‌రిగిన‌ పోరు. స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలంటూ కార్మికులు ప‌ట్టుబ‌ట్టారు. స‌మ్మెకు దిగారు. ప్ర‌భుత్వం పంతానికి పోయింది. ముందు సమ్మె విర‌మించాలంది. కార్మికులు మొండికేశారు. స‌ర్కారు సైతం జ‌గ‌మొండిగా వ్య‌వ‌హ‌రించింది. హైకోర్టు సైతం జోక్యం చేసుకుంది. ప్ర‌భుత్వాన్ని మెట్టుదిగాలంటూ ఆదేశించింది. అయినా, సీఎం కేసీఆర్ ఏమాత్రం త‌గ్గ‌లేదు. కార్మికులూ వెన‌క‌డుగు వేయ‌లేదు. న‌లుగురు ఆర్టీసీ సిబ్బంది ఆత్మ‌హ‌త్య‌కూ దారి తీసింది. బ‌తుక‌మ్మ‌, ద‌స‌రా పండ‌గ‌ల స‌మ‌యంలో బ‌స్సుల బంద్‌తో జ‌నాలు సైతం తీవ్ర ఇబ్బంది ప‌డ్డారు. చివ‌రాఖ‌రికి ఆర్టీసీ కార్మికులు దిగిరావ‌డంతో స‌మ్మె సుఖాంత‌మైంది. ఇదీ జ‌రిగింది.. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే... ఇటు ఆర్టీసీ కార్మికులు, అటు కేసీఆర్ స‌ర్కారు.. మ‌రోవైపు ప్ర‌జ‌లు.. అప్ప‌ట్లో కొన్ని వారాల పాటు తెలంగాణ‌లో ర‌చ్చ ర‌చ్చ న‌డిచింది. ప్ర‌భుత్వంపై పెద్ద ఎత్తున విమర్శ‌లు వ‌చ్చాయి. స‌ర్కారు మొండివైఖ‌రితో సీఎం కేసీఆర్ బాగా బ‌ద్నామ్ అయ్యారు. కేసీఆర్ ప్ర‌భుత్వ ఇమేజ్‌ను అంత‌గా డ్యామేజ్ చేసిన ఆర్టీసీ స‌మ్మె వెనుక ఇంటి దొంగ‌ల హ‌స్తం ఉందంటూ తాజాగా టీఆర్ఎస్ కీల‌క నేత ఆరోపించారు. ఆ ఇంటి దొంగ మ‌రెవ‌రో కాదు ఈట‌ల రాజేంద‌రే అంటూ టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ బాంబు పేల్చడం క‌ల‌క‌లం రేపుతోంది.   అవును, ఈట‌ల రాజేంద‌రే ఆర్టీసీ స‌మ్మె వెనుకున్న అదృశ్య శ‌క్తి అంటూ బాల్క సుమ‌న్ ఆరోపించడం సంచ‌ల‌నంగా మారింది. అప్ప‌టి ఆర్టీసీ జేఏసీ లీడ‌ర్‌ అశ్వ‌త్ధామ‌రెడ్డితో క‌లిసి ఈట‌ల రాజేంద‌ర్ కుట్ర చేశార‌ని అన్నారు. ఆర్టీసీ స‌మ్మెపై కేబినెట్ స‌మావేశం చ‌ర్చ‌ల సారాంశాన్ని ఈట‌ల రాజేంద‌ర్ లీక్ చేశార‌ని బాల్క సుమ‌న్ ఆరోపించారు. స‌మ్మె స‌మ‌యంలో అశ్వ‌త్థామ‌రెడ్డితో ఈట‌ల గంట‌ల త‌ర‌బ‌డి మాట్లాడే వార‌ని అన్నారు. తాజాగా, హుజురాబాద్‌లో ప‌ర్య‌టించిన ఎంపీ బాల్క సుమ‌న్.. మాజీ టీఆర్ఎస్ నేత‌ ఈట‌ల రాజేంద‌ర్‌పై ఇలాంటి ఆరోప‌ణ చేయ‌డం రాజ‌కీయంగా ఆస‌క్తిగా మారింది.  ఎంపీ బాల్క సుమ‌న్‌.. టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు రైట్‌హ్యాండ్ లీడ‌ర్‌. కేటీఆర్‌కు తెలిసిన ప్ర‌తీ విష‌యం దాదాపు బాల్క సుమ‌న్‌కు తెలిసే ఉంటుంది. ఇక కేసీఆర్ కొడుకుగా కేటీఆర్ ద‌గ్గ‌ర ప్ర‌భుత్వానికి సంబంధించిన ప్ర‌తీ స‌మాచారం అందుబాటులో ఉంటుంద‌ని అంటారు. అలా, ఆర్టీసీ స‌మ్మెకు ఈట‌ల రాజేంద‌ర్ ప‌రోక్షంగా స‌హ‌క‌రించ‌డం.. ఆర్టీసీ జేఏసీ నేత అశ్వ‌త్థామ‌రెడ్డిని డైరెక్ట్ చేయ‌డం.. ఇంటెలిజెన్స్ వ‌ర్గాల ద్వారా సర్కారుకు తెలిసి ఉంటుంది. అదే విష‌యం ఇప్పుడు హుజురాబాద్‌లో బాల్క సుమ‌న్ వెల్ల‌డించార‌ని అంటున్నారు. అయితే, ఇక్క‌డ మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏంటంటే.. అప్ప‌టి ఆర్టీసీ నేత అశ్వ‌త్థామ‌రెడ్డి.. ఇటీవ‌ల ఈట‌ల రాజేంద‌ర్‌తో క‌లిసి ఢిల్లీ వెళ్లి బీజేపీలో చేర‌డం విశేషం. సో.. బాల్క సుమ‌న్ ఆరోప‌ణ‌ల్లో నిజం ఉండే ఉంటుంద‌నే అభిప్రాయం రాజ‌కీయ వ‌ర్గాల్లో వ్య‌క్త‌మ‌వుతోంది.  వ‌రుసగా తెలుస్తున్న వివ‌రాల ప్ర‌కారం.. సీఎం కేసీఆర్‌తో ఈట‌ల‌కు కొన్నేళ్లుగా కోల్డ్‌వార్ న‌డుస్తున్న‌ట్టే ఉంది. స‌ర్కారుకు వ్య‌తిరేకంగా ఈట‌ల కుట్ర చేస్తున్నార‌ని ప‌క్కా స‌మాచారం మేర‌కే.. రాజేంద‌ర్‌ను కేబినెట్ నుంచి మెడ‌బ‌ట్టి గెంటేసి ఉంటార‌ని అంటున్నారు. కేసీఆర్ నియంతృత్వ పోక‌డ‌లు న‌చ్చ‌కే.. ఈట‌ల సైతం కేసీఆర్ వ్య‌తిరేక‌ కార్య‌క్ర‌మాల‌ను ప్రోత్స‌హించి ఉంటార‌ని అనుకోవ‌చ్చు అంటున్నారు. ఇలా, ఆ ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య బాగానే గ్యాప్ వ‌చ్చింద‌ని.. అది ఈట‌ల పార్టీ వీడే వ‌ర‌కూ దారి తీసింద‌ని చెబుతున్నారు. ఇప్పుడిప్పుడే హుజురాబాద్‌లో ఎల‌క్ష‌న్ వేడి రాజుకుంది. ఇక ముందుముందు మ‌రెన్ని ర‌హ‌స్యాలు వినాల్సి వ‌స్తుందో చూడాలి....

హుజురాబాద్ పై లేటెస్ట్ సర్వే.. షాకింగ్ రిజల్ట్! 

తెలంగాణ రాజకీయాలన్ని కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం కేంద్రంగానే సాగుతోంది. తన మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ ను కేసీఆర్ తొలగించడం..  తర్వాత గులాబీ పార్టీకి ఈటల గుడ్ బై చెప్పడం జరిగిపోయాయి. అంతేకాదు బీజేపీలో చేరిన ఈటల.. హుజురాబాద్ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. తనపై కేసీఆర్ దుర్మార్గంగా వ్యవహరించారని , కుట్రలు చేశారని ఆరోపిస్తున్న రాజేందర్..  అసెంబ్లీ ఉప ఎన్నికలో తన సత్తా చాటి గులాబీ బాస్ కు షాకివ్వాలని భావిస్తున్నారు. అందుకే ఆయన నియోజకవర్గంలోని గ్రామాలన్ని తిరుగుతున్నారు. తన మద్దతుదారులతో కలిసి బలప్రదర్శన చేస్తున్నారు. అటు కేసీఆర్ కూడా హుజురాబాద్ పైనే ఫోకస్ చేశారు. కేసీఆర్ డైరెక్షన్ లోనే అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఈటలకు చెక్ పెట్టేందుకు పావులు కదుపుతున్నారు. ఇక తమకు పట్టున్న ప్రాంతంలో పట్టు నిలుపుకుని  తామే ప్రత్యామ్నాయని చాటే యోచనలో కాంగ్రెస్ నేతలున్నారు.  జూన్ లో రాజేందర్ రాజీనామా చేశారు కాబట్టి... నవంబర్ వరకు భర్తీ చేయాల్సి ఉంటుంది. పశ్చిమ బెంగాల్ తో పాటు పలు రాష్ట్రాల్లో కొన్ని లోక్ సభ, అసెంబ్లీ సీట్లు ఖాళీగా ఉండటంతో వాటికి సెప్టెంబర్ లో ఎన్నికలు జరపాల్సి ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే హుజూరాబాద్ నియోజకవర్గానికి సెప్టెంబరు నెలలో ఉప ఎన్నిక రావొచ్చని అంచనా వేస్తున్నారు. కరోనా మూడో వేవ్  విరుచుకుపడితే మాత్రం కొంత సమయం వాయిదా పడవచ్చు. అయితే ఉప ఎన్నికకు ఇంకా చాలా సమయం ఉన్నా హుజురాబాద్ లో అప్పుడే రాజకీయం వేడెక్కింది. అన్ని పార్టీల నేతలు హుజురాబాద్ పైనే పడటంతో... నియోజకవర్గంలో ఎన్నికల సందడి కనిపిస్తోంది. హుజురాబాద్ లో ఉప ఎన్నిక జరిగితే ఎవరూ గెలుస్తారన్న దానిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఏపీలోనూ ఈటల నియోజకవర్గంపై ఆసక్తి పెరిగిందని తెలుస్తోంది.  తెలంగాణలో అత్యంత కీలకం కాబోతున్న హుజురాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికల ఎవరూ గెలుస్తారన్న దానిపై సర్వే సంస్థలు రంగంలోకి దిగాయి. హుజూరాబాద్ లో ప్రస్తుతం ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది?  ఎవరు గెలుస్తారు? జనాల మైండ్ సెట్ ఎలా ఉంది? ప్రభుత్వంపై ప్రజలు ఏమనుకుంటున్నారు? అనే విషయాన్ని తెలుసుకునేందుకు విన్ పొలిటికల్ కన్సల్టెన్సీ అనే సర్వే సంస్థ హుజూరాబాద్ నియోజకవర్గంలో సర్వే చేసింది. ఈటల రాజీనామా, బీజేపీలో చేరిన తర్వాతే నిర్వహించిన సర్వే రిపోర్ట్ ను విన్ పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ గురువారం రిలీజ్ చేసింది. సర్వే రిపోర్టులో షాకింగ్ విషయాలు తెలిశాయి.  హుజురాబాద్ లో మొత్తం ఓటర్ల సంఖ్య 2,05,182 ఉండగా ఇందులో పోలయ్యే ఓట్లు లక్షా ఎనభై వేలకు పైనే ఉంటాయని సర్వే సంస్థ అంచనా వేసింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో లక్షా 87 వేల 25 ఓట్లు పోలయ్యాయి.  టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఈటల రాజేందర్ కు 1,04,840 ఓట్లు, కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచిన కౌశిక్ రెడ్డికి 61,121 ఓట్లు రాగా.. రాజేందర్ 47,803 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయితే హుజురాబాద్ నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఈటల రాజేందర్ చేరికతో బలపడిన బీజేపీకి 35 శాతం ఓట్లు వస్తాయని తేలింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ అభ్యర్థికి కేవలం ఒక్క శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈటల చేరికతో అది 35  శాతానికి చేరిందని  విన్ పొలిటికల్ కన్సల్టెన్సీ సర్వేలో తేలింది. కాంగ్రెస్ కు గతంలో కంటే భాగా తగ్గి 20 శాతం ఓట్లు వస్తాయని వెల్లడైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ లో కాంగ్రెస్ కు దాదాపు 35 శాతం ఓట్లు వచ్చాయి. ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే హుజురాబాద్ లో మళ్లీ అధికార పార్టీనే గెలుస్తుందని సర్వేలో స్పష్టమైంది. టీఆర్ఎస్ కు 40 శాతం ఓట్లు రానున్నాయి. అంటే బీజేపీ కంటే ఐదు శాతం ఓట్ల ఆధిక్యంలో ఉంది గులాబీ పార్టీ. ఇతరులకు ఐదు శాతం ఓట్లు వస్తాయని విన్ పొలిటికల్ కన్సల్టెన్సీ సర్వేలో తేలింది.  టిఆర్ఎస్ కు అంతగా ఆదరణ ఎందుకు ఉందని సర్వేలో అడిగిన ప్రశ్నలకు ప్రజల నుంచి వచ్చిన జవాబు కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలేనని తేలింది. బీజేపీకి వచ్చేసరికి ఈటల రాజేందర్ బలమైన బీసీ నేత గా ఉండడంతోపాటు టిఆర్ఎస్ నుంచి గెంటివేయబడడం వల్ల ప్రజల్లో సానుభూతి ఉందని తేల్చింది. అయితే అవినీతి ఆరోపణలు రావడం, ఇప్పటికే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఉండటం ఆయనకు వ్యక్తిగతంగా మైనస్ గా కనిపిస్తున్నాయని సర్వే సంస్థ విన్ పొలిటికల్ కన్సల్టెన్సీ వెల్లడించింది. కాంగ్రెస్ కి వచ్చేసరికి పాడి కౌశిక్ రెడ్డి పై కొద్ది వరకు ప్రజల్లో ఆదరణ ఉన్నప్పటికీ కాంగ్రెస్ పరిస్థితి ఆయనకు మైనస్ గా కనిపిస్తున్నది అని పేర్కొంది. ఈటల రాజేందర్ కు తన సొంత మండలం అయిన కమలాపూర్ లో భారీ మద్దతు ఉండగా పాడి కౌశిక్ రెడ్డి కి తన సొంత మండలం అయిన వీణవంక లో కొద్ది వరకు ప్రజా బలాన్ని కూడగట్టుకోగలిగారు. ఒకవేళ పాడి కౌశిక్ రెడ్డి కనుక టిఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేస్తే టిఆర్ఎస్ పార్టీకి, కౌశిక్ రెడ్డికి బాగా కలిసి రానుందని తెలిపింది. అప్పుడు పోటీ కేవలం టిఆర్ఎస్ బిజెపి ల మధ్య ఉండనుందని, కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోసం కష్టపడాల్సిన పరిస్థితులు ఉంటాయని పొలిటికల్ కన్సల్టెన్సీ సర్వేలో తేటతెల్లమయింది. 

ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ర‌ద్దు.. దిగొచ్చిన జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు..

నారా లోకేశ్ పోరాటం ఫ‌లించింది. సుప్రీంకోర్టు ఆగ్ర‌హంతో జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు దిగొచ్చింది. ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలను ర‌ద్దు చేసింది ప్ర‌భుత్వం. టెన్త్, ఇంటర్ పరీక్షలపై సీఎం జ‌గ‌న్‌ నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫలితాల కోసం హైపవర్ కమిటీని ఏర్పాటు చేస్తామని మంత్రి ఆదిమూల‌పు సురేశ్ ప్ర‌క‌టించారు. హైపవర్ కమిటీ నివేదిక తర్వాత మార్కులపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇతర బోర్డు పరీక్షలు రద్దుతో ఏపీ విద్యార్థులకు నష్టం జరగదన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువులోగా పరీక్షల నిర్వహణ అసాధ్యమని తెలిపారు. జులై 31లోగా ఫలితాలు ప్రకటించడం సాధ్యంకాదని మంత్రి సురేశ్ స్ప‌ష్టం చేశారు.  క‌రోనా క‌ల్లోల స‌మ‌యంలో ప‌ది, ఇంట‌ర్ పరీక్ష‌లు నిర్వ‌హించ వ‌ద్దంటూ, వెంట‌నే ఎగ్జామ్స్ ర‌ద్దు చేయాలంటూ టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ నెల రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. నిత్యం ఆన్‌లైన్లో విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌తో మాట్లాడుతున్నారు. పేరెంట్స్‌, స్టూడెంట్స్ అంతా ఎగ్జామ్స్ వ‌ద్దంటూ ముక్త‌కంఠంతో కోరారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తే.. విద్యార్థుల ప్రాణాల‌కే ముప్పు వాటిల్లుతుంద‌ని అంతా ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. మ‌రోవైపు, సీబీఎస్ఈ సైతం ప‌రీక్ష‌ల‌ను క్యాన్సిల్ చేసింది. ఏపీ, కేర‌ళ మిన‌హా 21 రాష్ట్రాలు ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేసినా.. జ‌గ‌మొండి జ‌గ‌న్ స‌ర్కారు మాత్రం ఎగ్జామ్స్ నిర్వ‌హ‌ణ‌పై ప‌ట్టుద‌ల‌కు పోయింది. ప‌రీక్ష‌లు ర‌ద్దు చేసే ప్ర‌స‌క్తేలేదంటూ మొండిగా వ్య‌వ‌హ‌రించింది. ప‌రీక్ష‌ల‌ను ప‌లుమార్లు వాయిదా వేస్తూ.. జూలై ఆఖ‌రిన నిర్వ‌హిస్తామంటూ పంతానికి పోయింది. ప్ర‌భుత్వం తీరుతో అంతా విసుగెత్తిపోయారు. మ‌రోవైపు, విష‌యం సుప్రీంకోర్టుకు చేర‌డం.. కోర్టు ఏపీ స‌ర్కారుకు మొట్టి కాయ‌లు వేయ‌డంతో.. ఇక విధిలేని ప‌రిస్థితుల్లో.. ఎట్ట‌కేల‌కు ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ర‌ద్దు చేస్తూ ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.  ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై సుప్రీంకోర్టు ఏపీ స‌ర్కారును తీవ్ర స్థాయిలో మంద‌లించింది. పరీక్షల కార‌ణంగా ఒక్క‌రు చ‌నిపోయినా.. ఒక్కొక్క‌రికీ కోటి రూపాయ‌లు ప‌రిహారం ఇవ్వాల్సి ఉంటుంద‌ని సుప్రీంకోర్టు ఏపీ ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించింది. క‌రోనా క‌ల్లోల ప‌రిస్థితుల్లో ఒక్కో గ‌దిలో 15 నుంచి 20 మంది విద్యార్థులను ప‌రీక్ష‌ల‌కు కూర్చోబెట్ట‌డం స‌మంజ‌స‌మా?  ప్ర‌భుత్వ లెక్క‌ల ప్ర‌కార‌మే 28వేల గ‌దులు అవ‌స‌రం అవుతాయి? అది సాధ్య‌మా? రెండో ద‌శ తీవ్రత చూశాక కూడా.. ఇంకా ప‌లు వేరియంట్లు పుట్టుకొస్తున్నాయ‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నా కూడా.. ప్ర‌భుత్వం ఎందుకు ఇలా వ్య‌వ‌హ‌రిస్తోంది.. ప‌రీక్ష‌ల స‌మ‌యంలో మూడో వేవ్ వ‌స్తే ఏం చేస్తారు? అంటూ సుప్రీంకోర్టు ఏపీ స‌ర్కారును తీవ్ర స్థాయిలో త‌ప్పుబ‌ట్టింది.  ఏ ఒక్క విద్యార్థి మృతి చెందినా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని గ‌తంలోనే హెచ్చ‌రించింది సుప్రీంకోర్టు. తాజాగా మ‌రిన్ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. పరీక్షల సమయంలో కోవిడ్ ఉధృతి పెరిగితే దానిపై కూడా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. మార్కుల ఎవల్యూషన్‌పై కూడా తాము నిపుణులతో మాట్లాడి ఒక చార్ట్ ఇస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. సాయంత్రంలోగా ఏపీ ప్ర‌భుత్వ నిర్ణ‌యం వెల్ల‌డించాల‌ని సుప్రీం ఆదేశించ‌డంతో.. జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు త‌ల‌వంచ‌క త‌ప్ప‌లేదు. టెన్త్‌, ఇంట‌ర్ ఎగ్జామ్స్ ర‌ద్దు చేయాల‌నే ప్ర‌భుత్వ‌ నిర్ణ‌యాన్ని అంతా స్వాగ‌తిస్తున్నారు.   

అప్ప‌న్న సాక్షిగా అర్చ‌కుల ర‌చ్చ‌.. యథా రాజా త‌థా..!

ఏపీలో ఆల‌యాలు వివాదాల‌కు కేంద్రంగా మారుతున్నాయి. జ‌గ‌న్‌రెడ్డి ముఖ్య‌మంత్రి అయిన‌ప్ప‌టి నుంచీ ఈ ధోర‌ణి మ‌రింత పెరుగుతోందనే విమ‌ర్శ ఉంది. ఇన్నాళ్లూ టీటీడీలో అర్చ‌క వివాదం చూశాం. ప్ర‌ధాన అర్చ‌కుని హోదా ర‌గ‌డ హైకోర్టు వ‌ర‌కూ వెళ్లింది. ఇక టీటీడీలో అన్య‌మ‌త ర‌చ్చ అంతా ఇంతా కాదు. ఎస్‌వీబీసీ య‌వ్వారంలో టీటీడీ అబాసుపాలైంది. అటు బెజ‌వార దుర్గ‌మ్మ ఆల‌య వెండి ర‌థ సింహాలు మాయం, ఆరోప‌ణ‌ల‌తో ఆల‌య ఈవోపై వేటు.. అంత‌ర్వేది ర‌థం ద‌గ్థం, రామ‌తీర్థం విగ్ర‌హ ధ్వంసం.. ఇలా జ‌గ‌న్‌రెడ్డి అధికారం చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచీ రెండేళ్లుగా ఏపీలోని ఆల‌యాలు వివాదాల‌కు కేంద్రాలుగా మార‌డం క‌ల‌క‌లం రేపుతోంది. తాజాగా, సింహాచ‌లం అప్ప‌న్న స‌న్నిధిలో వ‌ర్గ పోరు అర్చ‌కుల ప‌రువు తీసింది. సింహాచలం అప్పన్న సన్నిధిలో ఆధిపత్య పోరు ముదిరింది. దేవుని సేవ‌లో ఉండాల్సిన అర్చకులు రెండు వర్గాలుగా విడిపోయి ప‌రోక్షంగా దేవ‌దూష‌ణ‌కు పాల్ప‌డ‌టం విమ‌ర్శ‌ల పాల‌వుతోంది. ఒక వర్గం అర్చకులు ఆలపించిన గీతాల‌ను అప‌హాస్యం చేస్తూ మార్ఫింగ్‌కు పాల్ప‌డ్డారు మ‌రో వ‌ర్గం అర్చ‌కులు. వారు పాడిన సింహాచల అప్పన్న పాటలను అన్యమత గీతాలుగా, వీధి పాటలుగా మార్చేసి వీడియోలు వైరల్ చేసింది మరోవర్గం. నిత్యం స్వామివారి సన్నిధిలో గడిపే అర్చకులు ఇలాంటి పనులకు పాల్పడటం చూసి భక్తులు మండిప‌డుతున్నారు. ఇవేం దిక్కుమాలిన ప‌నులంటూ అస‌హ్యించుకుంటున్నారు. ఇటీవ‌ల అప్ప‌న్న‌ ఆలయంలో నారసింహుడి గరుడోత్సవం జరిగింది. ఈ ఉత్సవంలో నార‌సింహ గర్జనలను సీతారాం అనే అర్చకులు ఆలపించారు. ఆ ఆడియోను మరో వ‌ర్గం అర్చకులు మార్ఫింగ్ చేసిన‌ట్టు తెలుస్తోంది. స్వామి వారి గర్జనలను మార్చేసి.. అర్చ‌కుల వీడియోకు మరో మతం గీతాల ఆడియో జోడించారు. మ‌రికొన్ని వీడియోల‌ను వీధిపాటల ఆడియోతో మార్ఫింగ్ చేసి సోషల్‌మీడియాలో వైరల్ చేశారు. ఆ మార్ఫింగ్‌ వీడియో చూసిన మరో వర్గం అర్చకులు.. ఘ‌ట‌న‌పై మండిప‌డుతున్నారు.  అర్చ‌కుల మ‌ధ్య విభేదాలు ఉంటే వారు వారు చూసుకోవాలి కానీ దేవుడితో పరాచకాలు ఆడటమేంటని భక్తులు తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. విష‌యం ముద‌ర‌డంతో.. ఆలయ ఈవో సూర్యకళ.. స్థానాచార్యులు, అర్చకులతో సమావేశం నిర్వహించారు. పూజారుల మధ్య సఖ్యతకు ప్రయత్నించారు. కానీ, అవేవీ ఫలితం ఇచ్చిన‌ట్టు లేవు. అప్ప‌న్న సాక్షిగా జ‌రుగుతున్న అర్చ‌కుల ర‌చ్చ‌ను అంతా త‌ప్పుబ‌డుతున్నారు. ఆల‌యం ప‌రువు తీస్తున్న అర్చ‌కుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని భ‌క్తులు డిమాండ్ చేస్తున్నారు.   

విజయసాయికి వైవీతో చెక్? జగన్ రెడ్డితో అక్కడే చెడిందా?   

విజయసాయి రెడ్డికి చెక్ పడినట్టేనా?  ఆ నేతను ఢిల్లీ పంపబోతోంది అందుకేనా? ఇదే చర్చ వైసీపీతో పాటు ఏపీ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది.ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2గా ఉన్న విజయసాయి రెడ్డి.. వైసీపీలో నెంబర్ టూ స్థానంలో ఉన్నారని చెబుతారు. ఏపీ నుంచి వైసీపీ గెలిచిన తొలి రాజ్యసీటును విజయసాయికి ఇచ్చారంటే ఆతనికి జగన్ రెడ్డి.. ఎంత ప్రాధాన్యత ఇచ్చారో ఊహించవచ్చు. ఢిల్లీలో వైసీపీ వ్యవహారాలు, కేంద్రం పెద్దలతో డీలింగ్స్ అన్ని ఆయనే చూస్తారని చెబుతారు. కాని ఇప్పుడు సీన్ మారినట్లు కనిపిస్తోంది. కొంత కాలంగా జగన్.. విజయసాయి రెడ్డిని దూరం పెట్టారనే ప్రచారం జరుగుతోంది. ఎప్పుడూ జగన్ వెనుక ఉండే సాయిరెడ్డి.. ఇటీవల తాడేపల్లికి రాకపోవడంతో ఈ అనుమాలకు బలం చేకూరుతోంది.  విశాఖలోనూ గతంలో ఉన్నంతగా సాయిరెడ్డికి ప్రస్తుతం పట్టు లేదంటున్నారు.  సీఎం జగన్ తనను దూరం పెట్టడం వల్లే విజయసాయి రెడ్డి ఇటీవల రెచ్చిపోయి ప్రకటనలు చేస్తున్నారనే టాక్ ఉంది. టీడీపీ నేతలను టార్గెట్ చేసి మళ్లీ జగన్ కు దగ్గర కావాలని సాయిరెడ్డి చూస్తున్నారని వైసీపీలోనే చర్చ జరుగుతోంది. అయితే ఇటీవల జరిగిన మాన్సాస్ ట్రస్ట్ విషయంలో విజయసాయి రెడ్డి చేసిన ప్రకటనలు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజును దొంగ అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. రాజుపై సాయిరెడ్డి చేసిన  కామెంట్లపై వైసీపీ నేతల్లోనూ అసంతృప్తి వ్యక్తమైందట. సాయిరెడ్డి వల్ల పార్టీకి చెడ్డపేరు వచ్చిందని కొందరు మంత్రులు అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. విజయసాయి రెడ్డి తీరుపై జగన్ కూడా గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. అందుకే ఆయనకు చెక్ పెట్టాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు. అందుకోసమే ఆయనకు చెక్ పెట్టేలా మరో నేతను ఢిల్లీకి పంపించబోతున్నారని చెబుతున్నారు.  ఢిల్లీలో రాష్ట్ర వ్యవహారాలు చక్కబెట్టేందుకు బలమైన వ్యక్తిని నియమించాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ బాధ్యతను వైసీపీ పార్లెమంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి చూడగా.. ఆయన ప్లేస్ లో మరొకరిని నియమించబోతున్నారని చెబుతున్నారు. తన సొంతబాబాయి వైవీ సుబ్బారెడ్డిని ఢిల్లీకి పంపాలని జగన్ యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీటీడీ ఛైర్మన్ గా ఉన్న ఆయన పదవీ కాలం ఇటీవలే ముగిసింది. పాలకమండలి స్థానంలో స్పెసిఫైడ్ అథారిటీని కూడా ప్రభుత్వం నియమించింది. తొలుత వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం మరో ఏడాది పొడిగిస్తారన్న ప్రచారం జరిగింది. కానీ స్పెసిఫైడ్ అథారిటీ ప్రకటనతో..  వైవీ సుబ్బారెడ్డిని రాజ్యసభ పదవిని కట్టబెట్టి ఢిల్లీకి పంపడం ఖాయమని తెలుస్తోంది.  2014 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా గెలిచిన  వైవీ సుబ్బారెడ్డి.. 2019 ఎన్నికల్లో తన సీటును వదులుకున్నారు. జగనే ఆయనను పక్కన పెట్టి.. కొత్తగా పార్టీలో చేరిన మాగుంటకు టికెట్ ఇచ్చారని అంటారు. ఎంపీ టికెట్ ఇవ్వకపోవడంతో అలకబూనిని వైవీకి.. వైసీపీ విజయం సాధించిన తర్వాత టీటీడీ ఛైర్మన్ గా నియమించారని చెబుతారు. ఇటీవలే ఆయన పదవి కాలం ముగిసింది. సీఎం జగన్ తనకు మరోసారి అవకాశమిస్తే పనిచేస్తానని.. లేదంటే లేదని  వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. అయితే విజయసాయి రెడ్డికి చెక్ పెట్టాలని భావిస్తున్న జగన్.. వైవీని రాజ్యసభకు పంపాలని దాదాపుగా నిర్ణయించారని సమాచారం. వైవీకే వైసీపీ పార్లమెంటరీ పార్టీ పగ్గాలు అప్పగించి.. విజయసాయి రెడ్డిని ఉత్తరాంధ్రకే పరిమితం చేయాలని జగన్ చూస్తున్నారట. జగన్ జైలుకు పోతే సీఎం కావాలనే ఎత్తులు వేస్తున్నారని ప్రచారం ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో విజయసాయి రెడి టచ్ లో ఉన్నారన్న విషయం కూడా జగన్ .. అతన్ని దూరం పెట్టడానికే కారణమనే వాదన కూడా వినిపిస్తోంది.  మరోవైపు సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ప్రతిసారి గందరగోళంగానే మారుతోంది.  ఆయన ఢిల్లీ వెళ్లడం వరకు అంతా బాగానే సాగుతున్నా.. కేంద్ర పెద్దలతో అపాయింట్ మెంట్ విషయంలో క్లారిటీ ఉండటం లేదు.  గతంలో ఓసారి ఢిల్లీ వెళ్లిన సమయంలో చివరి నిముషం వరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన ఖరారు లేదు. హస్తినలో వైసీపీ వ్యవహారాలు చూస్తున్న ఎంపీలు బలమైన లాబీయింగ్ చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి వస్తుందనే భావనలో కూడా వైసీపీ పెద్దలు ఉన్నారంటున్నారు.  వైవీ సుబ్బారెడ్డితో ఈ సమస్య కూడా గాడిన పడవచ్చని జగన్ భావిస్తున్నారని చెబుతున్నారు.  

తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. పాపం ఏపీ! 

తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానున్నది. ఈవీ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ కంపెనీలకు పోటీ ఇస్తున్న ట్రైటాన్ - triton ఈవీ  తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలో సూమారు 2100 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు తన సంసిద్ధతను వ్యక్తం చేసింది. గురువారం  ప్రగతి భవన్లో జరిగిన సమావేశంలో పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ తో సమావేశమై తమ పెట్టుబడి ప్రణాళికను వివరించారు ట్రైటాన్ సంస్థ ప్రతినిధులు. భవిష్యత్తులో భారీగా డిమాండ్ ఉండే ఈవీ రంగంలో పెద్ద ఎత్తున విస్తరించేందుకు తమ కంపెనీ ఇప్పటికే ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నదని మంత్రి కేటీఆర్ కు  కంపెనీ సీఈఓ హిమాన్షు పటేల్ తెలిపారు.  తమ కంపెనీ భారతదేశంలో తయారీ ప్లాంట్ ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉందని ఈమేరకు వివిధ రాష్ట్రాల్లో ఉన్న అవకాశాలను పరిశీలించిన తర్వాత తెలంగాణ కేంద్రంగా తమ కార్యకలాపాలను ముందుకు తీసుకుపోయేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. పెట్టుబడుల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అడ్వాంటేజ్ ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ 2100 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని కంపెనీ తెలిపింది. ఈ మేరకు జహీరాబాద్ నిమ్జ్ లో తయారీ యూనిట్ను ఏర్పాటు చేసేందుకు సుముఖంగా ఉన్నామని తెలిపింది.  తెలంగాణ లో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన ట్రైటాన్ -triton ఎలక్ట్రిక్ వెహికల్ ప్రైవేట్ లిమిటెడ్ కు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. కంపెనీ ప్రతిపాదిస్తున్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ద్వారా భారీ ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాలను ఈ రాష్ర్టంలో ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుందని, కంపెనీ పేర్కొన్న ప్రణాళిక ప్రకారం తొలి ఐదు సంవత్సరాల్లో 50 వేలకు పైగా, సెడాన్లు, లగ్జరీ కార్లు, ఇతర ఎలక్ర్టిక్ వాహానాలను ఉత్పత్తి చేసే అవకాశం ఉందన్నారు. కంపెనీ ప్రతిపాదిస్తున్న సుమారు 2100 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో 25 వేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన తెలంగాణ ఈవీ పాలసీ దేశంలోనే ఒక అత్యుత్తమ పాలసీ అన్నారు. టీఎస్ ఐపాస్ లో మెగా ప్రాజెక్ట్ కి లభించే అన్ని రకాల సహాయ సహకారాలను ప్రభుత్వం తరఫున అందిస్తామని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం క్రమంగా ఈవీ రంగ పెట్టుబడులకు ఒక అత్యంత ఆకర్షణీయ ప్రాంతంగా మారుతుందన్న ఆశాభావాన్ని మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు. 

రోజు కలలో మాంత్రికుడు అత్యాచారం చేస్తున్నాడని మహిళా కేసు.. 

నా నీడ పోయిందని ఆ మధ్య కాలంలో ఓ సినిమా వచ్చింది. ఆ సినిమా పేరు నెపోలియన్. అయితే తాజాగా ఒక వ్యక్తి నిత్యం ఓ వ్యక్తి అత్యాచారం చేస్తున్నాడంటూ ఓ మహిళా కేసు పెట్టింది. ఇందులో వింతేముంది అని మీరు అనుకుంటున్నారా? ఆ నిజమెంతో మీరే చూడండి. అత్యాచారం అంటే అలాంటిలాంటి అత్యాచారం కాదండి బబ్బోయ్ని.. ఆమెను రోజు ఒక మాంత్రికుడు రాత్రిళ్లు కల్లోకి వచ్చి తనపై అత్యాచారం చేస్తున్నాడంటూ ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వింత సంఘటన బిహార్‌లోని ఔరంగాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది.  ఇంతకీ  ఆమె ఎందుకు? ఎలా ? కనెక్ట్ అయిందో మీరే చూడండి. అయితే బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో.. ఔరంగాబాద్‌ జిల్లా, కుద్వ పోలీస్‌ స్టేషన్‌ పరిథిలోని గాంధీ మైదాన్‌ ప్రాంతంలో నివాసం ఉంటుంది ఓ మహిళ. అయితే కొంతకాలంగా  తన కుమారుడికి అనారోగ్యంగా ఉండటంతో ఆమె గత జనవరి నెలలో ప్రశాంత్‌ చతుర్వేది అనే మాంత్రికుడిని ఆశ్రయించింది. భారతీయులం కదా సైన్సు కంటే మాత్రలను మాంత్రికులను నమ్ముకుంటాం.? ఆ మాంత్రికుడు మహిళ కుమారుడి అరోగ్యం కోసం కొన్ని పూజలు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఇదే క్రమంలో 15 రోజుల తర్వాత ఆమె కొడుకు చనిపోయాడు.  కుమారుడి మరణం తర్వాత ఆమె ప్రశాంత్‌ ఉంటున్న కాళీ బరి ఆలయానికి వెళ్లింది. తన కుమారుడు ఎందుకు మరణించాడో చెప్పాలని నిలదీసింది. ఈ నేపథ్యంలో అతడు ఆమెపై అత్యాచారం చేయబోగా.. చనిపోయిన ఆమె కుమారుడు అడ్డుకున్నాడని ఓ మహిళ తెలిపింది. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ప్రశాంత్‌ను విచారించగా ఆమె చెప్పేదంతా అబద్ధమని కొట్టిపాడేశాడు. ఆమెను ఎప్పుడూ కలుసుకోలేదని విచారణలో వెల్లడించాడు. నిందితుడికి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లభించకపోవటంతో పోలీసులు.  

12 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు.. నాగలి పట్టిన జేడీ లక్ష్మినారాయణ

సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్  లక్ష్మీనారాయణ సరికొత్త జీవితం ప్రారంభించారు. సీబీఐకి వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించి రాజకీయ అరంగేట్రం చేసిన లక్ష్మీనారాయణ.. గత ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీగా జనసేన నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు ఆయన మరొ కొత్త రంగాన్ని ఎంచుకున్ని తొలి అడుగు వేశారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా.. నాగలి పట్టి రైతుగా మారారు. ఎడ్ల నాగలితో దుక్కి దున్ని వ్యవసాయ పనులు మొదలు పెట్టారు లక్ష్మినారాయణ.  ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో 12 ఎకరాలు కౌలుకు తీసుకున్నారు లక్ష్మీనారాయణ. ఏరువాక పౌర్ణమి కావడంతో గురువారం వ్యవసాయ పనులను ప్రారంభించారు. నాగలి పట్టి ఉత్సాహంగా పొలం దున్నారు సీబీఐ మాజీ జేడీ. ఎన్నో క్లిష్టతరమైన కేసులను ఛేదించిన లక్ష్మినారాయణ.. సాగు పనులను కూడా ఈజీగానే చేసేస్తున్నారు. వ్యవసాయ పనులు ప్రారంభించిన సందర్భంగా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. కరోనా కాలంలో మన దేశంలో వ్యవసాయ రంగం మాత్రమే ముందుకు వెళ్లగలిగిందని చెప్పారు. గత ఏడాది దేశ వ్యవసాయరంగంలో 3.6 శాతం వృద్ధి రేటు నమోదైందని తెలిపారు. రైతన్నల  వల్లే దేశంలో గోడౌన్లు ఆహార ధాన్యాలతో నిండిపోయాయని లక్ష్మినారాయణ చెప్పారు.  తాను వ్యయం చేస్తూ సాయం చేసేవాడు వ్యవసాయదారుడు అని అన్నదాతలను కీర్తించారు. వ్యవసాయంలో ఇబ్బందులను స్వయంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే 12 ఎకరాలు కౌలుకు తీసుకున్నానని చెప్పారు. తన అనుభవం ద్వారా వ్యవసాయంలో రావాల్సిన మార్పులపై ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇస్తానని తెలిపారు, పురుగుల మందులు చల్లడంలో డ్రోన్ల టెక్నాలజీ రైతులకు అందుబాటులోకి రావాలని లక్ష్మీనారాయణ అభిలషించారు.

చేప కడుపులో.. మందు బాటిల్ ...

టైటిల్ చూసి షాక్ అయ్యారా ? చేపకడుపులు మందు బాటిల్ ఏంటని అనుకుంటున్నారా ? ఇక్కడ రేట్లు పెరిగి పోయి మనుషులకే మందు దొరకడం లేదు ఇక చేపలకు బాటిల్స్ ఎక్కడ దొరికాయి. అని సందేహ పడుతున్నారా ? సందేహం వాడు ఈ వార్త నిజం.. మీరు ఆశ్చర్యపోవడం కాదా ఆ  మత్స్యకారుడు కూడా ఆశ్చర్యపోయాడు.    ఓ మత్స్యకారుడి అదృష్టం పండింది. రోజువారీ లాగే చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు చేప రూపంలో అదృష్టం వలకు చిక్కింది. అయితే, చేపను చేపను బోటులోకి తీసుకొచ్చి పొట్ట కోసి చూసి అవాక్కయ్యాడు. దాని కడుపులో వీస్కీ బాటిల్ దర్శనమిచ్చింది. కడుపు లోపల తెరవని విస్కీ బాటిల్‌ను గుర్తించిన మత్స్యకారులు తెగ సంబరపడిపోయారు. ఇందుకు సంబంధించి వీడియో టిక్‌టాక్ వేదికగా తెగ వైరల్‌గా మారింది.మహాసముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఇద్దరు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. దీంతో వారికి భారీ ఆకారంతో కూడి చేప చిక్కింది. దాని ఎంజాయ్ చేద్దామనుకున్న వారు బోటులోనే కోసేందుకు ప్రయత్నించారు. కానీ, అప్పుడు చేప కడుపులో ఏదో వింత వస్తువును గమనించారు. ఆ అవయవాన్ని కత్తిరించాడు. దాన్ని చూసిన మత్స్యకారుడు సంబరపడిపోయాడు. ఆశ్చర్యం ఏమంటే, ఆ వస్తువు ఫైర్‌బాల్ విస్కీ తెరవని బాటిల్‌గా తేలింది. దీంతో చేపతో పాటు విస్కీని అస్వాదించారు మత్స్యకారులు.. పులిని ఓ ఆట ఆదుకున్న కోతి..  కోతి అంటే కోతి దాని గురించి చాలా మంది చాలా  చెప్పుకుంటారు. ఎవరు ఎన్ని చెప్పిన ఇప్పటికి  దాని గురించి ఎంత చెప్పిన తక్కువే. కోతి తలుచుకోవాలి గాని ఎంతటి వాళ్లకు అయినా చెమటలు పట్టిస్తాయి. అలాగే మనుషులను అలరిస్తాయి. సాధారణంగా కోతి మనుషులతో ఆదుకోవడం వేరు. వాటి జాతి కోతులతో ఆదుకోవడం వేరు కానీ మనం తెలుసుకునే కోతి మాత్రం ఏకంగా పులితోనే ఆడుకుంది.. అదేంటని, అది ఎలా అని అనుకుంటున్నారా ? మీరు చూడండి ఏం జరిగిందో..  సోషల్ మీడియాలో మిలియన్ల ఫోటోలు, జంతువుల వీడియోలు వైరల్‌ అవుతూ ఉంటాయి. ఇలాంటి అనేక వీడియోలు రాత్రికి రాత్రే ఫుల్‌ ట్రెండింగ్‌లోకి రావడం మనం చూస్తూనే ఉంటాం. ఇక తాజాగా ఓ కోతి, చిరుత పులిను ముప్పుతిప్పలు పెట్టిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఓ చెట్టుపై ఎక్కిన కోతిని వేటాడాలని చూసిన చిరుతకు చివరికి నిరాశే మిగిలింది. ఎక్కి కోతిని పట్టుకోవటానికి ప్రయత్నించబోయింది చిరుత. కానీ ఆ కొంటె కోతి ఒక కొమ్మ నుంచి మరొక కొమ్మకు దూకుతూ చిరుతపులిని ముప్పుతిప్పలు పెట్టింది. ఇక చివరికి చేసేది ఏమి లేక ఆ చెట్టు దిగి అక్కడి నుంచి వెళ్లి పోయింది చిరుత…  

సెప్టెంబర్ 10న జియో 4జీ స్మార్ట్‌ఫోన్.. JioPhone Next ప్రత్యేకతలు ఇవే..

అందరూ అనుకుంటున్నట్లుగానే రిలయెన్స్ జియో మరో సంచలనం సృష్టించింది. గూగుల్‌తో కలిసి తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది.  రిలయెన్స్ 44వ ఏజీఎంలో రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముకేష్ అంబానీ JioPhone Next రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. స్మార్ట్‌ఫోన్‌లో ఉండే అన్ని ఫీచర్స్ జియోఫోన్ నెక్స్‌ట్‌లో ఉంటాయి. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.  జియో 4జీ స్మార్ట్‌ఫోన్ రూపొందిస్తుందన్న వార్తలు చాలాకాలంగా వస్తున్నాయి. దీంతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. అంచనాలకు అనుగుణంగానే జియో స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ఉన్నాయి. భారతీయుల కోసం గూగుల్, జియో కలిసి రూపొందించిన ప్రత్యేక స్మార్ట్‌ఫోన్ ఇది. వాయిస్ అసిస్టెంట్, లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్, ఆగ్యుమెంటెడ్ రియాల్టీ ఫిల్టర్స్‌తో స్మార్ట్‌కెమెరా లాంటి అనేక ఫీచర్స్ ఉంటాయి సెప్టెంబర్ 10న వినాయక చవితి సందర్భంగా జియోఫోన్ నెక్స్‌ట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రానుంది. చైనా తర్వాత ఒక దేశంలో అత్యధిక సబ్‌స్క్రైబర్లు ఉన్న నెట్వర్క్ రిలయెన్స్ జియో అని ముకేష్ అంబానీ అన్నారు. ఇండియాలో జియో సబ్‌స్క్రైబర్ల సంఖ్య 40 కోట్లు దాటింది. ప్రపంచంలోనే రెండో అతి పెద్ద మొబైల్ డేటా క్యారియర్‌గా జియో అవతరించింది. జియో యూజర్లు నెలకు 630 కోట్ల మంత్లీ డేటా ఉపయోగిస్తున్నారు. డేటా వినియోగంలో ఏడాదిలోనే 45 శాతం వృద్ధి కనిపించింది. జియో నెట్వర్క్‌ను మరింతగా విస్తరించేందుకు మరిన్ని పెట్టుబడులు పెడుతున్నట్టు ముకేష్ అంబానీ ప్రకటించారు. స్పెక్ట్రం కోసం రూ.57,123 కోట్లు, నెట్వర్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం రూ.15,183 కోట్లు అదనంగా ఖర్చు చేశామన్నారు. ఇండోర్ కవరేజ్, డౌన్‌లోడ్ స్పీడ్, వీడియో స్ట్రీమింగ్ కోసం జియో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగపడుతుందన్నారు. మరో 20 కోట్ల మంది కస్టమర్లను చేర్చుకోగలిగే సత్తా తమకు ఉందని ముకేష్ అంబానీ తెలిపారు. 

ఈట‌ల గెలిచేనా? ఆ ఒక్క‌టీ చేయ‌కుండా ఉంటేనా..!

హుజురాబాద్‌లో ఉప ఎన్నికే రాలేదు.. అప్పుడే గెలుపోట‌ములపై అంచ‌నాలు పెరిగిపోతున్నాయి. ఇంకా టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఎవ‌రో తెలీదు.. అప్పుడే ఎవ‌రు గెలుస్తారంటూ ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు.. అప్ప‌ట్లో కొడంగ‌ల్‌.. మ‌ళ్లీ ఇప్పుడు హుజురాబాద్‌.. అప్పుడు రేవంత్‌రెడ్డి, ఇప్పుడు ఈట‌ల రాజేంద‌ర్‌. కేసీఆర్‌ను ఢీకొట్టి నిల‌బ‌డి గెల‌వ‌డం అంత ఈజీ కానే కాదు. కానీ, దుబ్బాక ఆ అభిప్రాయాన్ని మార్చేసింది. అందుకే, ఇప్పుడు హుజురాబాద్‌లో ఏం జ‌ర‌గ‌బోతుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఈట‌ల కేంద్రంగానే హుజురా..వార్ జ‌రుగబోతోంది. ఆయ‌న ప్ర‌త్య‌ర్థులు ఎవ‌ర‌నే దానితో ప‌ని లేదు. ఈట‌ల గెలుస్తారా? ఓడ‌తారా? అనేదే మెయిన్ పాయింట్‌. ఈట‌ల‌కు అనుకూల అంశాలు, వ్య‌తిరేక అంశాల‌పై విశ్లేష‌ణ‌లు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఈట‌ల గెల‌వచ్చు అనే లెక్క‌కు ఎంత బ‌ల‌ముందో.. ఈట‌ల ఓడిపోవ‌చ్చు అని చెప్ప‌డానికీ అన్నే కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. ఆ రెండు వాద‌న‌ల్లోనూ ప‌స ఉంది కాబ‌ట్టే ఉత్కంఠ మ‌రింత పెరిగిపోతోంది.  హుజురాబాద్ ఈట‌ల ఇలాఖా. ఆయ‌న రాజ‌కీయ అడ్డా. ఆయ‌న ఆ ప్రాంత బిడ్డ‌. ముస‌లికి నీళ్ల‌లో బ‌లం ఉన్న‌ట్టు.. ఈట‌ల‌కు హుజురాబాద్‌లో గ‌ట్టి ప‌ట్టు ఉంద‌నేది అంద‌రూ ఒప్పుకునే విష‌య‌మే. ఊరూరా ఆయ‌న అనుచ‌ర‌వ‌ర్గ‌మే. ఇక కేబినెట్ నుంచి అవ‌మాన‌క‌రంగా వెళ్ల‌గొట్టార‌నే సానుభూతి ఎలానూ ఉండ‌నే ఉంది. ఆర్థికంగానూ బాగా బ‌ల‌మైన నేత కావ‌డం.. ఎంత ఖ‌ర్చుకైనా వెన‌కాడ‌క‌పోవ‌డం అద‌న‌పు అంశాలు. బీజేపీ వ‌ల్ల అంత‌గా లాభం లేక‌పోయినా.. సొంత బ‌లం, బ‌ల‌గ‌మే ఈట‌ల‌ను గెలిపించాల్సి ఉంది. అయితే, గెలిచే అవ‌కాశం ఉన్నా.. గెల‌వ‌డం మాత్రం అంత ఈజీ కాద‌నే వాద‌నా వినిపిస్తోంది. ఈట‌ల తొంద‌ర‌ప‌డ‌కుండా కాస్త వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించి ఉంటే బాగుండేద‌ని అంటున్నారు.  తెలంగాణ వ్యాప్తంగా సీఎం కేసీఆర్‌పై వ్య‌తిరేక‌త నిగూడంగా ఉంది. అది దుబ్బాక లాంటి చోట్ల బ‌య‌ట‌కు పెల్లుబుకుతోంది. హుజురాబాద్‌లోనూ అలానే జ‌రిగే ఛాన్స్ ఉన్నా.. ఈట‌ల చేజేతులారా ఆ అవ‌కాశాన్ని మిస్ చేసుకున్నార‌ని అంటున్నారు. రాజీనామా చేసిన వెంట‌నే బీజేపీలో చేర‌కుండా.. కాస్త చాణ‌క్యం ప్ర‌ద‌ర్శించి ఉంటే అవ‌కాశాలు మ‌రింత మెరుగ్గా ఉండేవ‌ని చెబుతున్నారు. స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలో దిగిఉంటే.. కేసీఆర్‌ మీద కోపంతో ఆయ‌న‌కు అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ స‌పోర్ట్ చేసే అవ‌కాశం ఉండేద‌ని అంటున్నారు. వివిధ ప్ర‌జాసంఘాలు, వివిధ వ‌ర్గాలు సైతం ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా నిలిచేవి. అంతా క‌లిసి క‌ట్టుగా కేసీఆర్‌ను ఓడించేందుకు ముందుకొచ్చేవారు. కోదండ‌రాం సార్‌, కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి సైతం ఈట‌ల‌కు ఈ విష‌యంలో న‌చ్చ‌జెప్పారు. కాంగ్రెస్ సైతం ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే మ‌ద్ద‌తు విష‌యం ఆలోచిస్తామ‌ని చెప్పింది. ఇంత అడ్వాంటేజ్ ఉన్నా.. కేసుల‌కు భ‌య‌ప‌డో, ర‌క్ష‌ణ కోస‌మో.. మ‌రే కార‌ణ‌మో కానీ.. బీజేపీ శిబిరంలో చేరిపోయారు ఈట‌ల రాజేంద‌ర్‌. దీంతో, ఉన్న సానుభూతి పోయింది. కాంగ్రెస్‌కు ప్ర‌త్య‌ర్థి అయ్యారు. బీజేపీ అంటే గిట్ట‌ని మైనార్టీ త‌దిత‌ర వ‌ర్గాల‌కూ దూర‌మ‌య్యారు. బీజేపీలో చేరకుండా.. స్వ‌తంత్రుడిగా బ‌రిలో దిగి ఉంటే.. అంద‌రివాడై.. అంద‌రూ క‌లిసొచ్చి.. ఈట‌ల‌ను గెలిపించుకుని ఉండేవారు. కానీ, ఇప్పుడా ప‌రిస్థితి లేదు. బీజేపీలో చేర‌డం వ‌ల్ల‌.. క‌నీసం కోదండ‌రాం సైతం స‌పోర్ట్ చేయ‌లేని దుస్థితి.  బీజేపీలో చేరాల‌ని ఈట‌ల అంత‌లా కోరుకుంటే.. మ‌రో విధంగా చేసుంటే బాగుండేద‌ని అంటున్నారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేసి.. అంద‌రి మ‌ద్ద‌తుతో ఎమ్మెల్యేగా గెలిచి.. ఆ త‌ర్వాత బీజేపీలో చేరడం స‌రైన ఎత్తుగ‌డ‌నే అభిప్రాయం వినిపిస్తోంది. స్వ‌తంత్రంగా బ‌రిలో దిగితే.. ఈట‌ల గెలుపు సునాయాసంగా ఉండేది. ఆ త‌ర్వాత తాను త‌ల‌చిన‌ట్టే బీజేపీలో చేరి సేఫ్‌గానూ ఉండేవారు. ఇంత ఈజీ ఆప్ష‌న్ వ‌దిలేసి.. అప్పుడే బీజేపీలో చేరడం ఈట‌ల‌ తొంద‌ర‌పాటు నిర్ణ‌య‌మే అంటున్నారు. ఎన్న‌క‌ల‌కు ముందే బీజేపీలో చేర‌డం ఆయ‌న‌కు కాస్త మైన‌స్సే అని భావిస్తున్నారు. అయితే, ఈ ఒక్క ఎన్నిక వ‌ర‌కూ బీజేపీ అని చూడ‌కుండా.. అంతా ఈట‌ల వైపు నిలుస్తార‌నేది మ‌రో అంచ‌నా. చూడాలి.. హుజురాబాద్‌లో ముందుముందు ఏం జ‌రుగుతుందో.. ఎవ‌రి లెక్క ఎవ‌రిని విజ‌య‌తీరాల‌కు చేరుస్తుందో...