ఆర్టీసీ స‌మ్మెకు ఈట‌ల సాయం! కేసీఆర్‌పై కుట్ర‌? బాంబు పేల్చిన బాల్క సుమ‌న్‌..

తెలంగాణ‌లో ఆర్టీసీ స‌మ్మె. రెండేళ్ల క్రితం.. దాదాపు రెండు నెల‌ల పాటు ఉధృతంగా జ‌రిగిన‌ పోరు. స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలంటూ కార్మికులు ప‌ట్టుబ‌ట్టారు. స‌మ్మెకు దిగారు. ప్ర‌భుత్వం పంతానికి పోయింది. ముందు సమ్మె విర‌మించాలంది. కార్మికులు మొండికేశారు. స‌ర్కారు సైతం జ‌గ‌మొండిగా వ్య‌వ‌హ‌రించింది. హైకోర్టు సైతం జోక్యం చేసుకుంది. ప్ర‌భుత్వాన్ని మెట్టుదిగాలంటూ ఆదేశించింది. అయినా, సీఎం కేసీఆర్ ఏమాత్రం త‌గ్గ‌లేదు. కార్మికులూ వెన‌క‌డుగు వేయ‌లేదు. న‌లుగురు ఆర్టీసీ సిబ్బంది ఆత్మ‌హ‌త్య‌కూ దారి తీసింది. బ‌తుక‌మ్మ‌, ద‌స‌రా పండ‌గ‌ల స‌మ‌యంలో బ‌స్సుల బంద్‌తో జ‌నాలు సైతం తీవ్ర ఇబ్బంది ప‌డ్డారు. చివ‌రాఖ‌రికి ఆర్టీసీ కార్మికులు దిగిరావ‌డంతో స‌మ్మె సుఖాంత‌మైంది. ఇదీ జ‌రిగింది.. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే... ఇటు ఆర్టీసీ కార్మికులు, అటు కేసీఆర్ స‌ర్కారు.. మ‌రోవైపు ప్ర‌జ‌లు.. అప్ప‌ట్లో కొన్ని వారాల పాటు తెలంగాణ‌లో ర‌చ్చ ర‌చ్చ న‌డిచింది. ప్ర‌భుత్వంపై పెద్ద ఎత్తున విమర్శ‌లు వ‌చ్చాయి. స‌ర్కారు మొండివైఖ‌రితో సీఎం కేసీఆర్ బాగా బ‌ద్నామ్ అయ్యారు. కేసీఆర్ ప్ర‌భుత్వ ఇమేజ్‌ను అంత‌గా డ్యామేజ్ చేసిన ఆర్టీసీ స‌మ్మె వెనుక ఇంటి దొంగ‌ల హ‌స్తం ఉందంటూ తాజాగా టీఆర్ఎస్ కీల‌క నేత ఆరోపించారు. ఆ ఇంటి దొంగ మ‌రెవ‌రో కాదు ఈట‌ల రాజేంద‌రే అంటూ టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ బాంబు పేల్చడం క‌ల‌క‌లం రేపుతోంది.   అవును, ఈట‌ల రాజేంద‌రే ఆర్టీసీ స‌మ్మె వెనుకున్న అదృశ్య శ‌క్తి అంటూ బాల్క సుమ‌న్ ఆరోపించడం సంచ‌ల‌నంగా మారింది. అప్ప‌టి ఆర్టీసీ జేఏసీ లీడ‌ర్‌ అశ్వ‌త్ధామ‌రెడ్డితో క‌లిసి ఈట‌ల రాజేంద‌ర్ కుట్ర చేశార‌ని అన్నారు. ఆర్టీసీ స‌మ్మెపై కేబినెట్ స‌మావేశం చ‌ర్చ‌ల సారాంశాన్ని ఈట‌ల రాజేంద‌ర్ లీక్ చేశార‌ని బాల్క సుమ‌న్ ఆరోపించారు. స‌మ్మె స‌మ‌యంలో అశ్వ‌త్థామ‌రెడ్డితో ఈట‌ల గంట‌ల త‌ర‌బ‌డి మాట్లాడే వార‌ని అన్నారు. తాజాగా, హుజురాబాద్‌లో ప‌ర్య‌టించిన ఎంపీ బాల్క సుమ‌న్.. మాజీ టీఆర్ఎస్ నేత‌ ఈట‌ల రాజేంద‌ర్‌పై ఇలాంటి ఆరోప‌ణ చేయ‌డం రాజ‌కీయంగా ఆస‌క్తిగా మారింది.  ఎంపీ బాల్క సుమ‌న్‌.. టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు రైట్‌హ్యాండ్ లీడ‌ర్‌. కేటీఆర్‌కు తెలిసిన ప్ర‌తీ విష‌యం దాదాపు బాల్క సుమ‌న్‌కు తెలిసే ఉంటుంది. ఇక కేసీఆర్ కొడుకుగా కేటీఆర్ ద‌గ్గ‌ర ప్ర‌భుత్వానికి సంబంధించిన ప్ర‌తీ స‌మాచారం అందుబాటులో ఉంటుంద‌ని అంటారు. అలా, ఆర్టీసీ స‌మ్మెకు ఈట‌ల రాజేంద‌ర్ ప‌రోక్షంగా స‌హ‌క‌రించ‌డం.. ఆర్టీసీ జేఏసీ నేత అశ్వ‌త్థామ‌రెడ్డిని డైరెక్ట్ చేయ‌డం.. ఇంటెలిజెన్స్ వ‌ర్గాల ద్వారా సర్కారుకు తెలిసి ఉంటుంది. అదే విష‌యం ఇప్పుడు హుజురాబాద్‌లో బాల్క సుమ‌న్ వెల్ల‌డించార‌ని అంటున్నారు. అయితే, ఇక్క‌డ మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏంటంటే.. అప్ప‌టి ఆర్టీసీ నేత అశ్వ‌త్థామ‌రెడ్డి.. ఇటీవ‌ల ఈట‌ల రాజేంద‌ర్‌తో క‌లిసి ఢిల్లీ వెళ్లి బీజేపీలో చేర‌డం విశేషం. సో.. బాల్క సుమ‌న్ ఆరోప‌ణ‌ల్లో నిజం ఉండే ఉంటుంద‌నే అభిప్రాయం రాజ‌కీయ వ‌ర్గాల్లో వ్య‌క్త‌మ‌వుతోంది.  వ‌రుసగా తెలుస్తున్న వివ‌రాల ప్ర‌కారం.. సీఎం కేసీఆర్‌తో ఈట‌ల‌కు కొన్నేళ్లుగా కోల్డ్‌వార్ న‌డుస్తున్న‌ట్టే ఉంది. స‌ర్కారుకు వ్య‌తిరేకంగా ఈట‌ల కుట్ర చేస్తున్నార‌ని ప‌క్కా స‌మాచారం మేర‌కే.. రాజేంద‌ర్‌ను కేబినెట్ నుంచి మెడ‌బ‌ట్టి గెంటేసి ఉంటార‌ని అంటున్నారు. కేసీఆర్ నియంతృత్వ పోక‌డ‌లు న‌చ్చ‌కే.. ఈట‌ల సైతం కేసీఆర్ వ్య‌తిరేక‌ కార్య‌క్ర‌మాల‌ను ప్రోత్స‌హించి ఉంటార‌ని అనుకోవ‌చ్చు అంటున్నారు. ఇలా, ఆ ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య బాగానే గ్యాప్ వ‌చ్చింద‌ని.. అది ఈట‌ల పార్టీ వీడే వ‌ర‌కూ దారి తీసింద‌ని చెబుతున్నారు. ఇప్పుడిప్పుడే హుజురాబాద్‌లో ఎల‌క్ష‌న్ వేడి రాజుకుంది. ఇక ముందుముందు మ‌రెన్ని ర‌హ‌స్యాలు వినాల్సి వ‌స్తుందో చూడాలి....

హుజురాబాద్ పై లేటెస్ట్ సర్వే.. షాకింగ్ రిజల్ట్! 

తెలంగాణ రాజకీయాలన్ని కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం కేంద్రంగానే సాగుతోంది. తన మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ ను కేసీఆర్ తొలగించడం..  తర్వాత గులాబీ పార్టీకి ఈటల గుడ్ బై చెప్పడం జరిగిపోయాయి. అంతేకాదు బీజేపీలో చేరిన ఈటల.. హుజురాబాద్ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. తనపై కేసీఆర్ దుర్మార్గంగా వ్యవహరించారని , కుట్రలు చేశారని ఆరోపిస్తున్న రాజేందర్..  అసెంబ్లీ ఉప ఎన్నికలో తన సత్తా చాటి గులాబీ బాస్ కు షాకివ్వాలని భావిస్తున్నారు. అందుకే ఆయన నియోజకవర్గంలోని గ్రామాలన్ని తిరుగుతున్నారు. తన మద్దతుదారులతో కలిసి బలప్రదర్శన చేస్తున్నారు. అటు కేసీఆర్ కూడా హుజురాబాద్ పైనే ఫోకస్ చేశారు. కేసీఆర్ డైరెక్షన్ లోనే అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఈటలకు చెక్ పెట్టేందుకు పావులు కదుపుతున్నారు. ఇక తమకు పట్టున్న ప్రాంతంలో పట్టు నిలుపుకుని  తామే ప్రత్యామ్నాయని చాటే యోచనలో కాంగ్రెస్ నేతలున్నారు.  జూన్ లో రాజేందర్ రాజీనామా చేశారు కాబట్టి... నవంబర్ వరకు భర్తీ చేయాల్సి ఉంటుంది. పశ్చిమ బెంగాల్ తో పాటు పలు రాష్ట్రాల్లో కొన్ని లోక్ సభ, అసెంబ్లీ సీట్లు ఖాళీగా ఉండటంతో వాటికి సెప్టెంబర్ లో ఎన్నికలు జరపాల్సి ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే హుజూరాబాద్ నియోజకవర్గానికి సెప్టెంబరు నెలలో ఉప ఎన్నిక రావొచ్చని అంచనా వేస్తున్నారు. కరోనా మూడో వేవ్  విరుచుకుపడితే మాత్రం కొంత సమయం వాయిదా పడవచ్చు. అయితే ఉప ఎన్నికకు ఇంకా చాలా సమయం ఉన్నా హుజురాబాద్ లో అప్పుడే రాజకీయం వేడెక్కింది. అన్ని పార్టీల నేతలు హుజురాబాద్ పైనే పడటంతో... నియోజకవర్గంలో ఎన్నికల సందడి కనిపిస్తోంది. హుజురాబాద్ లో ఉప ఎన్నిక జరిగితే ఎవరూ గెలుస్తారన్న దానిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఏపీలోనూ ఈటల నియోజకవర్గంపై ఆసక్తి పెరిగిందని తెలుస్తోంది.  తెలంగాణలో అత్యంత కీలకం కాబోతున్న హుజురాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికల ఎవరూ గెలుస్తారన్న దానిపై సర్వే సంస్థలు రంగంలోకి దిగాయి. హుజూరాబాద్ లో ప్రస్తుతం ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది?  ఎవరు గెలుస్తారు? జనాల మైండ్ సెట్ ఎలా ఉంది? ప్రభుత్వంపై ప్రజలు ఏమనుకుంటున్నారు? అనే విషయాన్ని తెలుసుకునేందుకు విన్ పొలిటికల్ కన్సల్టెన్సీ అనే సర్వే సంస్థ హుజూరాబాద్ నియోజకవర్గంలో సర్వే చేసింది. ఈటల రాజీనామా, బీజేపీలో చేరిన తర్వాతే నిర్వహించిన సర్వే రిపోర్ట్ ను విన్ పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ గురువారం రిలీజ్ చేసింది. సర్వే రిపోర్టులో షాకింగ్ విషయాలు తెలిశాయి.  హుజురాబాద్ లో మొత్తం ఓటర్ల సంఖ్య 2,05,182 ఉండగా ఇందులో పోలయ్యే ఓట్లు లక్షా ఎనభై వేలకు పైనే ఉంటాయని సర్వే సంస్థ అంచనా వేసింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో లక్షా 87 వేల 25 ఓట్లు పోలయ్యాయి.  టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఈటల రాజేందర్ కు 1,04,840 ఓట్లు, కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచిన కౌశిక్ రెడ్డికి 61,121 ఓట్లు రాగా.. రాజేందర్ 47,803 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయితే హుజురాబాద్ నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఈటల రాజేందర్ చేరికతో బలపడిన బీజేపీకి 35 శాతం ఓట్లు వస్తాయని తేలింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ అభ్యర్థికి కేవలం ఒక్క శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈటల చేరికతో అది 35  శాతానికి చేరిందని  విన్ పొలిటికల్ కన్సల్టెన్సీ సర్వేలో తేలింది. కాంగ్రెస్ కు గతంలో కంటే భాగా తగ్గి 20 శాతం ఓట్లు వస్తాయని వెల్లడైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ లో కాంగ్రెస్ కు దాదాపు 35 శాతం ఓట్లు వచ్చాయి. ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే హుజురాబాద్ లో మళ్లీ అధికార పార్టీనే గెలుస్తుందని సర్వేలో స్పష్టమైంది. టీఆర్ఎస్ కు 40 శాతం ఓట్లు రానున్నాయి. అంటే బీజేపీ కంటే ఐదు శాతం ఓట్ల ఆధిక్యంలో ఉంది గులాబీ పార్టీ. ఇతరులకు ఐదు శాతం ఓట్లు వస్తాయని విన్ పొలిటికల్ కన్సల్టెన్సీ సర్వేలో తేలింది.  టిఆర్ఎస్ కు అంతగా ఆదరణ ఎందుకు ఉందని సర్వేలో అడిగిన ప్రశ్నలకు ప్రజల నుంచి వచ్చిన జవాబు కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలేనని తేలింది. బీజేపీకి వచ్చేసరికి ఈటల రాజేందర్ బలమైన బీసీ నేత గా ఉండడంతోపాటు టిఆర్ఎస్ నుంచి గెంటివేయబడడం వల్ల ప్రజల్లో సానుభూతి ఉందని తేల్చింది. అయితే అవినీతి ఆరోపణలు రావడం, ఇప్పటికే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఉండటం ఆయనకు వ్యక్తిగతంగా మైనస్ గా కనిపిస్తున్నాయని సర్వే సంస్థ విన్ పొలిటికల్ కన్సల్టెన్సీ వెల్లడించింది. కాంగ్రెస్ కి వచ్చేసరికి పాడి కౌశిక్ రెడ్డి పై కొద్ది వరకు ప్రజల్లో ఆదరణ ఉన్నప్పటికీ కాంగ్రెస్ పరిస్థితి ఆయనకు మైనస్ గా కనిపిస్తున్నది అని పేర్కొంది. ఈటల రాజేందర్ కు తన సొంత మండలం అయిన కమలాపూర్ లో భారీ మద్దతు ఉండగా పాడి కౌశిక్ రెడ్డి కి తన సొంత మండలం అయిన వీణవంక లో కొద్ది వరకు ప్రజా బలాన్ని కూడగట్టుకోగలిగారు. ఒకవేళ పాడి కౌశిక్ రెడ్డి కనుక టిఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేస్తే టిఆర్ఎస్ పార్టీకి, కౌశిక్ రెడ్డికి బాగా కలిసి రానుందని తెలిపింది. అప్పుడు పోటీ కేవలం టిఆర్ఎస్ బిజెపి ల మధ్య ఉండనుందని, కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోసం కష్టపడాల్సిన పరిస్థితులు ఉంటాయని పొలిటికల్ కన్సల్టెన్సీ సర్వేలో తేటతెల్లమయింది. 

ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ర‌ద్దు.. దిగొచ్చిన జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు..

నారా లోకేశ్ పోరాటం ఫ‌లించింది. సుప్రీంకోర్టు ఆగ్ర‌హంతో జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు దిగొచ్చింది. ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలను ర‌ద్దు చేసింది ప్ర‌భుత్వం. టెన్త్, ఇంటర్ పరీక్షలపై సీఎం జ‌గ‌న్‌ నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫలితాల కోసం హైపవర్ కమిటీని ఏర్పాటు చేస్తామని మంత్రి ఆదిమూల‌పు సురేశ్ ప్ర‌క‌టించారు. హైపవర్ కమిటీ నివేదిక తర్వాత మార్కులపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇతర బోర్డు పరీక్షలు రద్దుతో ఏపీ విద్యార్థులకు నష్టం జరగదన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువులోగా పరీక్షల నిర్వహణ అసాధ్యమని తెలిపారు. జులై 31లోగా ఫలితాలు ప్రకటించడం సాధ్యంకాదని మంత్రి సురేశ్ స్ప‌ష్టం చేశారు.  క‌రోనా క‌ల్లోల స‌మ‌యంలో ప‌ది, ఇంట‌ర్ పరీక్ష‌లు నిర్వ‌హించ వ‌ద్దంటూ, వెంట‌నే ఎగ్జామ్స్ ర‌ద్దు చేయాలంటూ టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ నెల రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. నిత్యం ఆన్‌లైన్లో విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌తో మాట్లాడుతున్నారు. పేరెంట్స్‌, స్టూడెంట్స్ అంతా ఎగ్జామ్స్ వ‌ద్దంటూ ముక్త‌కంఠంతో కోరారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తే.. విద్యార్థుల ప్రాణాల‌కే ముప్పు వాటిల్లుతుంద‌ని అంతా ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. మ‌రోవైపు, సీబీఎస్ఈ సైతం ప‌రీక్ష‌ల‌ను క్యాన్సిల్ చేసింది. ఏపీ, కేర‌ళ మిన‌హా 21 రాష్ట్రాలు ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేసినా.. జ‌గ‌మొండి జ‌గ‌న్ స‌ర్కారు మాత్రం ఎగ్జామ్స్ నిర్వ‌హ‌ణ‌పై ప‌ట్టుద‌ల‌కు పోయింది. ప‌రీక్ష‌లు ర‌ద్దు చేసే ప్ర‌స‌క్తేలేదంటూ మొండిగా వ్య‌వ‌హ‌రించింది. ప‌రీక్ష‌ల‌ను ప‌లుమార్లు వాయిదా వేస్తూ.. జూలై ఆఖ‌రిన నిర్వ‌హిస్తామంటూ పంతానికి పోయింది. ప్ర‌భుత్వం తీరుతో అంతా విసుగెత్తిపోయారు. మ‌రోవైపు, విష‌యం సుప్రీంకోర్టుకు చేర‌డం.. కోర్టు ఏపీ స‌ర్కారుకు మొట్టి కాయ‌లు వేయ‌డంతో.. ఇక విధిలేని ప‌రిస్థితుల్లో.. ఎట్ట‌కేల‌కు ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ర‌ద్దు చేస్తూ ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.  ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై సుప్రీంకోర్టు ఏపీ స‌ర్కారును తీవ్ర స్థాయిలో మంద‌లించింది. పరీక్షల కార‌ణంగా ఒక్క‌రు చ‌నిపోయినా.. ఒక్కొక్క‌రికీ కోటి రూపాయ‌లు ప‌రిహారం ఇవ్వాల్సి ఉంటుంద‌ని సుప్రీంకోర్టు ఏపీ ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించింది. క‌రోనా క‌ల్లోల ప‌రిస్థితుల్లో ఒక్కో గ‌దిలో 15 నుంచి 20 మంది విద్యార్థులను ప‌రీక్ష‌ల‌కు కూర్చోబెట్ట‌డం స‌మంజ‌స‌మా?  ప్ర‌భుత్వ లెక్క‌ల ప్ర‌కార‌మే 28వేల గ‌దులు అవ‌స‌రం అవుతాయి? అది సాధ్య‌మా? రెండో ద‌శ తీవ్రత చూశాక కూడా.. ఇంకా ప‌లు వేరియంట్లు పుట్టుకొస్తున్నాయ‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నా కూడా.. ప్ర‌భుత్వం ఎందుకు ఇలా వ్య‌వ‌హ‌రిస్తోంది.. ప‌రీక్ష‌ల స‌మ‌యంలో మూడో వేవ్ వ‌స్తే ఏం చేస్తారు? అంటూ సుప్రీంకోర్టు ఏపీ స‌ర్కారును తీవ్ర స్థాయిలో త‌ప్పుబ‌ట్టింది.  ఏ ఒక్క విద్యార్థి మృతి చెందినా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని గ‌తంలోనే హెచ్చ‌రించింది సుప్రీంకోర్టు. తాజాగా మ‌రిన్ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. పరీక్షల సమయంలో కోవిడ్ ఉధృతి పెరిగితే దానిపై కూడా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. మార్కుల ఎవల్యూషన్‌పై కూడా తాము నిపుణులతో మాట్లాడి ఒక చార్ట్ ఇస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. సాయంత్రంలోగా ఏపీ ప్ర‌భుత్వ నిర్ణ‌యం వెల్ల‌డించాల‌ని సుప్రీం ఆదేశించ‌డంతో.. జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు త‌ల‌వంచ‌క త‌ప్ప‌లేదు. టెన్త్‌, ఇంట‌ర్ ఎగ్జామ్స్ ర‌ద్దు చేయాల‌నే ప్ర‌భుత్వ‌ నిర్ణ‌యాన్ని అంతా స్వాగ‌తిస్తున్నారు.   

అప్ప‌న్న సాక్షిగా అర్చ‌కుల ర‌చ్చ‌.. యథా రాజా త‌థా..!

ఏపీలో ఆల‌యాలు వివాదాల‌కు కేంద్రంగా మారుతున్నాయి. జ‌గ‌న్‌రెడ్డి ముఖ్య‌మంత్రి అయిన‌ప్ప‌టి నుంచీ ఈ ధోర‌ణి మ‌రింత పెరుగుతోందనే విమ‌ర్శ ఉంది. ఇన్నాళ్లూ టీటీడీలో అర్చ‌క వివాదం చూశాం. ప్ర‌ధాన అర్చ‌కుని హోదా ర‌గ‌డ హైకోర్టు వ‌ర‌కూ వెళ్లింది. ఇక టీటీడీలో అన్య‌మ‌త ర‌చ్చ అంతా ఇంతా కాదు. ఎస్‌వీబీసీ య‌వ్వారంలో టీటీడీ అబాసుపాలైంది. అటు బెజ‌వార దుర్గ‌మ్మ ఆల‌య వెండి ర‌థ సింహాలు మాయం, ఆరోప‌ణ‌ల‌తో ఆల‌య ఈవోపై వేటు.. అంత‌ర్వేది ర‌థం ద‌గ్థం, రామ‌తీర్థం విగ్ర‌హ ధ్వంసం.. ఇలా జ‌గ‌న్‌రెడ్డి అధికారం చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచీ రెండేళ్లుగా ఏపీలోని ఆల‌యాలు వివాదాల‌కు కేంద్రాలుగా మార‌డం క‌ల‌క‌లం రేపుతోంది. తాజాగా, సింహాచ‌లం అప్ప‌న్న స‌న్నిధిలో వ‌ర్గ పోరు అర్చ‌కుల ప‌రువు తీసింది. సింహాచలం అప్పన్న సన్నిధిలో ఆధిపత్య పోరు ముదిరింది. దేవుని సేవ‌లో ఉండాల్సిన అర్చకులు రెండు వర్గాలుగా విడిపోయి ప‌రోక్షంగా దేవ‌దూష‌ణ‌కు పాల్ప‌డ‌టం విమ‌ర్శ‌ల పాల‌వుతోంది. ఒక వర్గం అర్చకులు ఆలపించిన గీతాల‌ను అప‌హాస్యం చేస్తూ మార్ఫింగ్‌కు పాల్ప‌డ్డారు మ‌రో వ‌ర్గం అర్చ‌కులు. వారు పాడిన సింహాచల అప్పన్న పాటలను అన్యమత గీతాలుగా, వీధి పాటలుగా మార్చేసి వీడియోలు వైరల్ చేసింది మరోవర్గం. నిత్యం స్వామివారి సన్నిధిలో గడిపే అర్చకులు ఇలాంటి పనులకు పాల్పడటం చూసి భక్తులు మండిప‌డుతున్నారు. ఇవేం దిక్కుమాలిన ప‌నులంటూ అస‌హ్యించుకుంటున్నారు. ఇటీవ‌ల అప్ప‌న్న‌ ఆలయంలో నారసింహుడి గరుడోత్సవం జరిగింది. ఈ ఉత్సవంలో నార‌సింహ గర్జనలను సీతారాం అనే అర్చకులు ఆలపించారు. ఆ ఆడియోను మరో వ‌ర్గం అర్చకులు మార్ఫింగ్ చేసిన‌ట్టు తెలుస్తోంది. స్వామి వారి గర్జనలను మార్చేసి.. అర్చ‌కుల వీడియోకు మరో మతం గీతాల ఆడియో జోడించారు. మ‌రికొన్ని వీడియోల‌ను వీధిపాటల ఆడియోతో మార్ఫింగ్ చేసి సోషల్‌మీడియాలో వైరల్ చేశారు. ఆ మార్ఫింగ్‌ వీడియో చూసిన మరో వర్గం అర్చకులు.. ఘ‌ట‌న‌పై మండిప‌డుతున్నారు.  అర్చ‌కుల మ‌ధ్య విభేదాలు ఉంటే వారు వారు చూసుకోవాలి కానీ దేవుడితో పరాచకాలు ఆడటమేంటని భక్తులు తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. విష‌యం ముద‌ర‌డంతో.. ఆలయ ఈవో సూర్యకళ.. స్థానాచార్యులు, అర్చకులతో సమావేశం నిర్వహించారు. పూజారుల మధ్య సఖ్యతకు ప్రయత్నించారు. కానీ, అవేవీ ఫలితం ఇచ్చిన‌ట్టు లేవు. అప్ప‌న్న సాక్షిగా జ‌రుగుతున్న అర్చ‌కుల ర‌చ్చ‌ను అంతా త‌ప్పుబ‌డుతున్నారు. ఆల‌యం ప‌రువు తీస్తున్న అర్చ‌కుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని భ‌క్తులు డిమాండ్ చేస్తున్నారు.   

విజయసాయికి వైవీతో చెక్? జగన్ రెడ్డితో అక్కడే చెడిందా?   

విజయసాయి రెడ్డికి చెక్ పడినట్టేనా?  ఆ నేతను ఢిల్లీ పంపబోతోంది అందుకేనా? ఇదే చర్చ వైసీపీతో పాటు ఏపీ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది.ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2గా ఉన్న విజయసాయి రెడ్డి.. వైసీపీలో నెంబర్ టూ స్థానంలో ఉన్నారని చెబుతారు. ఏపీ నుంచి వైసీపీ గెలిచిన తొలి రాజ్యసీటును విజయసాయికి ఇచ్చారంటే ఆతనికి జగన్ రెడ్డి.. ఎంత ప్రాధాన్యత ఇచ్చారో ఊహించవచ్చు. ఢిల్లీలో వైసీపీ వ్యవహారాలు, కేంద్రం పెద్దలతో డీలింగ్స్ అన్ని ఆయనే చూస్తారని చెబుతారు. కాని ఇప్పుడు సీన్ మారినట్లు కనిపిస్తోంది. కొంత కాలంగా జగన్.. విజయసాయి రెడ్డిని దూరం పెట్టారనే ప్రచారం జరుగుతోంది. ఎప్పుడూ జగన్ వెనుక ఉండే సాయిరెడ్డి.. ఇటీవల తాడేపల్లికి రాకపోవడంతో ఈ అనుమాలకు బలం చేకూరుతోంది.  విశాఖలోనూ గతంలో ఉన్నంతగా సాయిరెడ్డికి ప్రస్తుతం పట్టు లేదంటున్నారు.  సీఎం జగన్ తనను దూరం పెట్టడం వల్లే విజయసాయి రెడ్డి ఇటీవల రెచ్చిపోయి ప్రకటనలు చేస్తున్నారనే టాక్ ఉంది. టీడీపీ నేతలను టార్గెట్ చేసి మళ్లీ జగన్ కు దగ్గర కావాలని సాయిరెడ్డి చూస్తున్నారని వైసీపీలోనే చర్చ జరుగుతోంది. అయితే ఇటీవల జరిగిన మాన్సాస్ ట్రస్ట్ విషయంలో విజయసాయి రెడ్డి చేసిన ప్రకటనలు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజును దొంగ అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. రాజుపై సాయిరెడ్డి చేసిన  కామెంట్లపై వైసీపీ నేతల్లోనూ అసంతృప్తి వ్యక్తమైందట. సాయిరెడ్డి వల్ల పార్టీకి చెడ్డపేరు వచ్చిందని కొందరు మంత్రులు అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. విజయసాయి రెడ్డి తీరుపై జగన్ కూడా గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. అందుకే ఆయనకు చెక్ పెట్టాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు. అందుకోసమే ఆయనకు చెక్ పెట్టేలా మరో నేతను ఢిల్లీకి పంపించబోతున్నారని చెబుతున్నారు.  ఢిల్లీలో రాష్ట్ర వ్యవహారాలు చక్కబెట్టేందుకు బలమైన వ్యక్తిని నియమించాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ బాధ్యతను వైసీపీ పార్లెమంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి చూడగా.. ఆయన ప్లేస్ లో మరొకరిని నియమించబోతున్నారని చెబుతున్నారు. తన సొంతబాబాయి వైవీ సుబ్బారెడ్డిని ఢిల్లీకి పంపాలని జగన్ యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీటీడీ ఛైర్మన్ గా ఉన్న ఆయన పదవీ కాలం ఇటీవలే ముగిసింది. పాలకమండలి స్థానంలో స్పెసిఫైడ్ అథారిటీని కూడా ప్రభుత్వం నియమించింది. తొలుత వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం మరో ఏడాది పొడిగిస్తారన్న ప్రచారం జరిగింది. కానీ స్పెసిఫైడ్ అథారిటీ ప్రకటనతో..  వైవీ సుబ్బారెడ్డిని రాజ్యసభ పదవిని కట్టబెట్టి ఢిల్లీకి పంపడం ఖాయమని తెలుస్తోంది.  2014 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా గెలిచిన  వైవీ సుబ్బారెడ్డి.. 2019 ఎన్నికల్లో తన సీటును వదులుకున్నారు. జగనే ఆయనను పక్కన పెట్టి.. కొత్తగా పార్టీలో చేరిన మాగుంటకు టికెట్ ఇచ్చారని అంటారు. ఎంపీ టికెట్ ఇవ్వకపోవడంతో అలకబూనిని వైవీకి.. వైసీపీ విజయం సాధించిన తర్వాత టీటీడీ ఛైర్మన్ గా నియమించారని చెబుతారు. ఇటీవలే ఆయన పదవి కాలం ముగిసింది. సీఎం జగన్ తనకు మరోసారి అవకాశమిస్తే పనిచేస్తానని.. లేదంటే లేదని  వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. అయితే విజయసాయి రెడ్డికి చెక్ పెట్టాలని భావిస్తున్న జగన్.. వైవీని రాజ్యసభకు పంపాలని దాదాపుగా నిర్ణయించారని సమాచారం. వైవీకే వైసీపీ పార్లమెంటరీ పార్టీ పగ్గాలు అప్పగించి.. విజయసాయి రెడ్డిని ఉత్తరాంధ్రకే పరిమితం చేయాలని జగన్ చూస్తున్నారట. జగన్ జైలుకు పోతే సీఎం కావాలనే ఎత్తులు వేస్తున్నారని ప్రచారం ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో విజయసాయి రెడి టచ్ లో ఉన్నారన్న విషయం కూడా జగన్ .. అతన్ని దూరం పెట్టడానికే కారణమనే వాదన కూడా వినిపిస్తోంది.  మరోవైపు సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ప్రతిసారి గందరగోళంగానే మారుతోంది.  ఆయన ఢిల్లీ వెళ్లడం వరకు అంతా బాగానే సాగుతున్నా.. కేంద్ర పెద్దలతో అపాయింట్ మెంట్ విషయంలో క్లారిటీ ఉండటం లేదు.  గతంలో ఓసారి ఢిల్లీ వెళ్లిన సమయంలో చివరి నిముషం వరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన ఖరారు లేదు. హస్తినలో వైసీపీ వ్యవహారాలు చూస్తున్న ఎంపీలు బలమైన లాబీయింగ్ చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి వస్తుందనే భావనలో కూడా వైసీపీ పెద్దలు ఉన్నారంటున్నారు.  వైవీ సుబ్బారెడ్డితో ఈ సమస్య కూడా గాడిన పడవచ్చని జగన్ భావిస్తున్నారని చెబుతున్నారు.  

తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. పాపం ఏపీ! 

తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానున్నది. ఈవీ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ కంపెనీలకు పోటీ ఇస్తున్న ట్రైటాన్ - triton ఈవీ  తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలో సూమారు 2100 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు తన సంసిద్ధతను వ్యక్తం చేసింది. గురువారం  ప్రగతి భవన్లో జరిగిన సమావేశంలో పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ తో సమావేశమై తమ పెట్టుబడి ప్రణాళికను వివరించారు ట్రైటాన్ సంస్థ ప్రతినిధులు. భవిష్యత్తులో భారీగా డిమాండ్ ఉండే ఈవీ రంగంలో పెద్ద ఎత్తున విస్తరించేందుకు తమ కంపెనీ ఇప్పటికే ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నదని మంత్రి కేటీఆర్ కు  కంపెనీ సీఈఓ హిమాన్షు పటేల్ తెలిపారు.  తమ కంపెనీ భారతదేశంలో తయారీ ప్లాంట్ ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉందని ఈమేరకు వివిధ రాష్ట్రాల్లో ఉన్న అవకాశాలను పరిశీలించిన తర్వాత తెలంగాణ కేంద్రంగా తమ కార్యకలాపాలను ముందుకు తీసుకుపోయేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. పెట్టుబడుల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అడ్వాంటేజ్ ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ 2100 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని కంపెనీ తెలిపింది. ఈ మేరకు జహీరాబాద్ నిమ్జ్ లో తయారీ యూనిట్ను ఏర్పాటు చేసేందుకు సుముఖంగా ఉన్నామని తెలిపింది.  తెలంగాణ లో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన ట్రైటాన్ -triton ఎలక్ట్రిక్ వెహికల్ ప్రైవేట్ లిమిటెడ్ కు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. కంపెనీ ప్రతిపాదిస్తున్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ద్వారా భారీ ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాలను ఈ రాష్ర్టంలో ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుందని, కంపెనీ పేర్కొన్న ప్రణాళిక ప్రకారం తొలి ఐదు సంవత్సరాల్లో 50 వేలకు పైగా, సెడాన్లు, లగ్జరీ కార్లు, ఇతర ఎలక్ర్టిక్ వాహానాలను ఉత్పత్తి చేసే అవకాశం ఉందన్నారు. కంపెనీ ప్రతిపాదిస్తున్న సుమారు 2100 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో 25 వేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన తెలంగాణ ఈవీ పాలసీ దేశంలోనే ఒక అత్యుత్తమ పాలసీ అన్నారు. టీఎస్ ఐపాస్ లో మెగా ప్రాజెక్ట్ కి లభించే అన్ని రకాల సహాయ సహకారాలను ప్రభుత్వం తరఫున అందిస్తామని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం క్రమంగా ఈవీ రంగ పెట్టుబడులకు ఒక అత్యంత ఆకర్షణీయ ప్రాంతంగా మారుతుందన్న ఆశాభావాన్ని మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు. 

రోజు కలలో మాంత్రికుడు అత్యాచారం చేస్తున్నాడని మహిళా కేసు.. 

నా నీడ పోయిందని ఆ మధ్య కాలంలో ఓ సినిమా వచ్చింది. ఆ సినిమా పేరు నెపోలియన్. అయితే తాజాగా ఒక వ్యక్తి నిత్యం ఓ వ్యక్తి అత్యాచారం చేస్తున్నాడంటూ ఓ మహిళా కేసు పెట్టింది. ఇందులో వింతేముంది అని మీరు అనుకుంటున్నారా? ఆ నిజమెంతో మీరే చూడండి. అత్యాచారం అంటే అలాంటిలాంటి అత్యాచారం కాదండి బబ్బోయ్ని.. ఆమెను రోజు ఒక మాంత్రికుడు రాత్రిళ్లు కల్లోకి వచ్చి తనపై అత్యాచారం చేస్తున్నాడంటూ ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వింత సంఘటన బిహార్‌లోని ఔరంగాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది.  ఇంతకీ  ఆమె ఎందుకు? ఎలా ? కనెక్ట్ అయిందో మీరే చూడండి. అయితే బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో.. ఔరంగాబాద్‌ జిల్లా, కుద్వ పోలీస్‌ స్టేషన్‌ పరిథిలోని గాంధీ మైదాన్‌ ప్రాంతంలో నివాసం ఉంటుంది ఓ మహిళ. అయితే కొంతకాలంగా  తన కుమారుడికి అనారోగ్యంగా ఉండటంతో ఆమె గత జనవరి నెలలో ప్రశాంత్‌ చతుర్వేది అనే మాంత్రికుడిని ఆశ్రయించింది. భారతీయులం కదా సైన్సు కంటే మాత్రలను మాంత్రికులను నమ్ముకుంటాం.? ఆ మాంత్రికుడు మహిళ కుమారుడి అరోగ్యం కోసం కొన్ని పూజలు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఇదే క్రమంలో 15 రోజుల తర్వాత ఆమె కొడుకు చనిపోయాడు.  కుమారుడి మరణం తర్వాత ఆమె ప్రశాంత్‌ ఉంటున్న కాళీ బరి ఆలయానికి వెళ్లింది. తన కుమారుడు ఎందుకు మరణించాడో చెప్పాలని నిలదీసింది. ఈ నేపథ్యంలో అతడు ఆమెపై అత్యాచారం చేయబోగా.. చనిపోయిన ఆమె కుమారుడు అడ్డుకున్నాడని ఓ మహిళ తెలిపింది. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ప్రశాంత్‌ను విచారించగా ఆమె చెప్పేదంతా అబద్ధమని కొట్టిపాడేశాడు. ఆమెను ఎప్పుడూ కలుసుకోలేదని విచారణలో వెల్లడించాడు. నిందితుడికి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లభించకపోవటంతో పోలీసులు.  

12 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు.. నాగలి పట్టిన జేడీ లక్ష్మినారాయణ

సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్  లక్ష్మీనారాయణ సరికొత్త జీవితం ప్రారంభించారు. సీబీఐకి వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించి రాజకీయ అరంగేట్రం చేసిన లక్ష్మీనారాయణ.. గత ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీగా జనసేన నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు ఆయన మరొ కొత్త రంగాన్ని ఎంచుకున్ని తొలి అడుగు వేశారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా.. నాగలి పట్టి రైతుగా మారారు. ఎడ్ల నాగలితో దుక్కి దున్ని వ్యవసాయ పనులు మొదలు పెట్టారు లక్ష్మినారాయణ.  ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో 12 ఎకరాలు కౌలుకు తీసుకున్నారు లక్ష్మీనారాయణ. ఏరువాక పౌర్ణమి కావడంతో గురువారం వ్యవసాయ పనులను ప్రారంభించారు. నాగలి పట్టి ఉత్సాహంగా పొలం దున్నారు సీబీఐ మాజీ జేడీ. ఎన్నో క్లిష్టతరమైన కేసులను ఛేదించిన లక్ష్మినారాయణ.. సాగు పనులను కూడా ఈజీగానే చేసేస్తున్నారు. వ్యవసాయ పనులు ప్రారంభించిన సందర్భంగా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. కరోనా కాలంలో మన దేశంలో వ్యవసాయ రంగం మాత్రమే ముందుకు వెళ్లగలిగిందని చెప్పారు. గత ఏడాది దేశ వ్యవసాయరంగంలో 3.6 శాతం వృద్ధి రేటు నమోదైందని తెలిపారు. రైతన్నల  వల్లే దేశంలో గోడౌన్లు ఆహార ధాన్యాలతో నిండిపోయాయని లక్ష్మినారాయణ చెప్పారు.  తాను వ్యయం చేస్తూ సాయం చేసేవాడు వ్యవసాయదారుడు అని అన్నదాతలను కీర్తించారు. వ్యవసాయంలో ఇబ్బందులను స్వయంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే 12 ఎకరాలు కౌలుకు తీసుకున్నానని చెప్పారు. తన అనుభవం ద్వారా వ్యవసాయంలో రావాల్సిన మార్పులపై ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇస్తానని తెలిపారు, పురుగుల మందులు చల్లడంలో డ్రోన్ల టెక్నాలజీ రైతులకు అందుబాటులోకి రావాలని లక్ష్మీనారాయణ అభిలషించారు.

చేప కడుపులో.. మందు బాటిల్ ...

టైటిల్ చూసి షాక్ అయ్యారా ? చేపకడుపులు మందు బాటిల్ ఏంటని అనుకుంటున్నారా ? ఇక్కడ రేట్లు పెరిగి పోయి మనుషులకే మందు దొరకడం లేదు ఇక చేపలకు బాటిల్స్ ఎక్కడ దొరికాయి. అని సందేహ పడుతున్నారా ? సందేహం వాడు ఈ వార్త నిజం.. మీరు ఆశ్చర్యపోవడం కాదా ఆ  మత్స్యకారుడు కూడా ఆశ్చర్యపోయాడు.    ఓ మత్స్యకారుడి అదృష్టం పండింది. రోజువారీ లాగే చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు చేప రూపంలో అదృష్టం వలకు చిక్కింది. అయితే, చేపను చేపను బోటులోకి తీసుకొచ్చి పొట్ట కోసి చూసి అవాక్కయ్యాడు. దాని కడుపులో వీస్కీ బాటిల్ దర్శనమిచ్చింది. కడుపు లోపల తెరవని విస్కీ బాటిల్‌ను గుర్తించిన మత్స్యకారులు తెగ సంబరపడిపోయారు. ఇందుకు సంబంధించి వీడియో టిక్‌టాక్ వేదికగా తెగ వైరల్‌గా మారింది.మహాసముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఇద్దరు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. దీంతో వారికి భారీ ఆకారంతో కూడి చేప చిక్కింది. దాని ఎంజాయ్ చేద్దామనుకున్న వారు బోటులోనే కోసేందుకు ప్రయత్నించారు. కానీ, అప్పుడు చేప కడుపులో ఏదో వింత వస్తువును గమనించారు. ఆ అవయవాన్ని కత్తిరించాడు. దాన్ని చూసిన మత్స్యకారుడు సంబరపడిపోయాడు. ఆశ్చర్యం ఏమంటే, ఆ వస్తువు ఫైర్‌బాల్ విస్కీ తెరవని బాటిల్‌గా తేలింది. దీంతో చేపతో పాటు విస్కీని అస్వాదించారు మత్స్యకారులు.. పులిని ఓ ఆట ఆదుకున్న కోతి..  కోతి అంటే కోతి దాని గురించి చాలా మంది చాలా  చెప్పుకుంటారు. ఎవరు ఎన్ని చెప్పిన ఇప్పటికి  దాని గురించి ఎంత చెప్పిన తక్కువే. కోతి తలుచుకోవాలి గాని ఎంతటి వాళ్లకు అయినా చెమటలు పట్టిస్తాయి. అలాగే మనుషులను అలరిస్తాయి. సాధారణంగా కోతి మనుషులతో ఆదుకోవడం వేరు. వాటి జాతి కోతులతో ఆదుకోవడం వేరు కానీ మనం తెలుసుకునే కోతి మాత్రం ఏకంగా పులితోనే ఆడుకుంది.. అదేంటని, అది ఎలా అని అనుకుంటున్నారా ? మీరు చూడండి ఏం జరిగిందో..  సోషల్ మీడియాలో మిలియన్ల ఫోటోలు, జంతువుల వీడియోలు వైరల్‌ అవుతూ ఉంటాయి. ఇలాంటి అనేక వీడియోలు రాత్రికి రాత్రే ఫుల్‌ ట్రెండింగ్‌లోకి రావడం మనం చూస్తూనే ఉంటాం. ఇక తాజాగా ఓ కోతి, చిరుత పులిను ముప్పుతిప్పలు పెట్టిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఓ చెట్టుపై ఎక్కిన కోతిని వేటాడాలని చూసిన చిరుతకు చివరికి నిరాశే మిగిలింది. ఎక్కి కోతిని పట్టుకోవటానికి ప్రయత్నించబోయింది చిరుత. కానీ ఆ కొంటె కోతి ఒక కొమ్మ నుంచి మరొక కొమ్మకు దూకుతూ చిరుతపులిని ముప్పుతిప్పలు పెట్టింది. ఇక చివరికి చేసేది ఏమి లేక ఆ చెట్టు దిగి అక్కడి నుంచి వెళ్లి పోయింది చిరుత…  

సెప్టెంబర్ 10న జియో 4జీ స్మార్ట్‌ఫోన్.. JioPhone Next ప్రత్యేకతలు ఇవే..

అందరూ అనుకుంటున్నట్లుగానే రిలయెన్స్ జియో మరో సంచలనం సృష్టించింది. గూగుల్‌తో కలిసి తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది.  రిలయెన్స్ 44వ ఏజీఎంలో రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముకేష్ అంబానీ JioPhone Next రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. స్మార్ట్‌ఫోన్‌లో ఉండే అన్ని ఫీచర్స్ జియోఫోన్ నెక్స్‌ట్‌లో ఉంటాయి. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.  జియో 4జీ స్మార్ట్‌ఫోన్ రూపొందిస్తుందన్న వార్తలు చాలాకాలంగా వస్తున్నాయి. దీంతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. అంచనాలకు అనుగుణంగానే జియో స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ఉన్నాయి. భారతీయుల కోసం గూగుల్, జియో కలిసి రూపొందించిన ప్రత్యేక స్మార్ట్‌ఫోన్ ఇది. వాయిస్ అసిస్టెంట్, లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్, ఆగ్యుమెంటెడ్ రియాల్టీ ఫిల్టర్స్‌తో స్మార్ట్‌కెమెరా లాంటి అనేక ఫీచర్స్ ఉంటాయి సెప్టెంబర్ 10న వినాయక చవితి సందర్భంగా జియోఫోన్ నెక్స్‌ట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రానుంది. చైనా తర్వాత ఒక దేశంలో అత్యధిక సబ్‌స్క్రైబర్లు ఉన్న నెట్వర్క్ రిలయెన్స్ జియో అని ముకేష్ అంబానీ అన్నారు. ఇండియాలో జియో సబ్‌స్క్రైబర్ల సంఖ్య 40 కోట్లు దాటింది. ప్రపంచంలోనే రెండో అతి పెద్ద మొబైల్ డేటా క్యారియర్‌గా జియో అవతరించింది. జియో యూజర్లు నెలకు 630 కోట్ల మంత్లీ డేటా ఉపయోగిస్తున్నారు. డేటా వినియోగంలో ఏడాదిలోనే 45 శాతం వృద్ధి కనిపించింది. జియో నెట్వర్క్‌ను మరింతగా విస్తరించేందుకు మరిన్ని పెట్టుబడులు పెడుతున్నట్టు ముకేష్ అంబానీ ప్రకటించారు. స్పెక్ట్రం కోసం రూ.57,123 కోట్లు, నెట్వర్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం రూ.15,183 కోట్లు అదనంగా ఖర్చు చేశామన్నారు. ఇండోర్ కవరేజ్, డౌన్‌లోడ్ స్పీడ్, వీడియో స్ట్రీమింగ్ కోసం జియో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగపడుతుందన్నారు. మరో 20 కోట్ల మంది కస్టమర్లను చేర్చుకోగలిగే సత్తా తమకు ఉందని ముకేష్ అంబానీ తెలిపారు. 

ఈట‌ల గెలిచేనా? ఆ ఒక్క‌టీ చేయ‌కుండా ఉంటేనా..!

హుజురాబాద్‌లో ఉప ఎన్నికే రాలేదు.. అప్పుడే గెలుపోట‌ములపై అంచ‌నాలు పెరిగిపోతున్నాయి. ఇంకా టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఎవ‌రో తెలీదు.. అప్పుడే ఎవ‌రు గెలుస్తారంటూ ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు.. అప్ప‌ట్లో కొడంగ‌ల్‌.. మ‌ళ్లీ ఇప్పుడు హుజురాబాద్‌.. అప్పుడు రేవంత్‌రెడ్డి, ఇప్పుడు ఈట‌ల రాజేంద‌ర్‌. కేసీఆర్‌ను ఢీకొట్టి నిల‌బ‌డి గెల‌వ‌డం అంత ఈజీ కానే కాదు. కానీ, దుబ్బాక ఆ అభిప్రాయాన్ని మార్చేసింది. అందుకే, ఇప్పుడు హుజురాబాద్‌లో ఏం జ‌ర‌గ‌బోతుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఈట‌ల కేంద్రంగానే హుజురా..వార్ జ‌రుగబోతోంది. ఆయ‌న ప్ర‌త్య‌ర్థులు ఎవ‌ర‌నే దానితో ప‌ని లేదు. ఈట‌ల గెలుస్తారా? ఓడ‌తారా? అనేదే మెయిన్ పాయింట్‌. ఈట‌ల‌కు అనుకూల అంశాలు, వ్య‌తిరేక అంశాల‌పై విశ్లేష‌ణ‌లు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఈట‌ల గెల‌వచ్చు అనే లెక్క‌కు ఎంత బ‌ల‌ముందో.. ఈట‌ల ఓడిపోవ‌చ్చు అని చెప్ప‌డానికీ అన్నే కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. ఆ రెండు వాద‌న‌ల్లోనూ ప‌స ఉంది కాబ‌ట్టే ఉత్కంఠ మ‌రింత పెరిగిపోతోంది.  హుజురాబాద్ ఈట‌ల ఇలాఖా. ఆయ‌న రాజ‌కీయ అడ్డా. ఆయ‌న ఆ ప్రాంత బిడ్డ‌. ముస‌లికి నీళ్ల‌లో బ‌లం ఉన్న‌ట్టు.. ఈట‌ల‌కు హుజురాబాద్‌లో గ‌ట్టి ప‌ట్టు ఉంద‌నేది అంద‌రూ ఒప్పుకునే విష‌య‌మే. ఊరూరా ఆయ‌న అనుచ‌ర‌వ‌ర్గ‌మే. ఇక కేబినెట్ నుంచి అవ‌మాన‌క‌రంగా వెళ్ల‌గొట్టార‌నే సానుభూతి ఎలానూ ఉండ‌నే ఉంది. ఆర్థికంగానూ బాగా బ‌ల‌మైన నేత కావ‌డం.. ఎంత ఖ‌ర్చుకైనా వెన‌కాడ‌క‌పోవ‌డం అద‌న‌పు అంశాలు. బీజేపీ వ‌ల్ల అంత‌గా లాభం లేక‌పోయినా.. సొంత బ‌లం, బ‌ల‌గ‌మే ఈట‌ల‌ను గెలిపించాల్సి ఉంది. అయితే, గెలిచే అవ‌కాశం ఉన్నా.. గెల‌వ‌డం మాత్రం అంత ఈజీ కాద‌నే వాద‌నా వినిపిస్తోంది. ఈట‌ల తొంద‌ర‌ప‌డ‌కుండా కాస్త వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించి ఉంటే బాగుండేద‌ని అంటున్నారు.  తెలంగాణ వ్యాప్తంగా సీఎం కేసీఆర్‌పై వ్య‌తిరేక‌త నిగూడంగా ఉంది. అది దుబ్బాక లాంటి చోట్ల బ‌య‌ట‌కు పెల్లుబుకుతోంది. హుజురాబాద్‌లోనూ అలానే జ‌రిగే ఛాన్స్ ఉన్నా.. ఈట‌ల చేజేతులారా ఆ అవ‌కాశాన్ని మిస్ చేసుకున్నార‌ని అంటున్నారు. రాజీనామా చేసిన వెంట‌నే బీజేపీలో చేర‌కుండా.. కాస్త చాణ‌క్యం ప్ర‌ద‌ర్శించి ఉంటే అవ‌కాశాలు మ‌రింత మెరుగ్గా ఉండేవ‌ని చెబుతున్నారు. స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలో దిగిఉంటే.. కేసీఆర్‌ మీద కోపంతో ఆయ‌న‌కు అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ స‌పోర్ట్ చేసే అవ‌కాశం ఉండేద‌ని అంటున్నారు. వివిధ ప్ర‌జాసంఘాలు, వివిధ వ‌ర్గాలు సైతం ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా నిలిచేవి. అంతా క‌లిసి క‌ట్టుగా కేసీఆర్‌ను ఓడించేందుకు ముందుకొచ్చేవారు. కోదండ‌రాం సార్‌, కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి సైతం ఈట‌ల‌కు ఈ విష‌యంలో న‌చ్చ‌జెప్పారు. కాంగ్రెస్ సైతం ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే మ‌ద్ద‌తు విష‌యం ఆలోచిస్తామ‌ని చెప్పింది. ఇంత అడ్వాంటేజ్ ఉన్నా.. కేసుల‌కు భ‌య‌ప‌డో, ర‌క్ష‌ణ కోస‌మో.. మ‌రే కార‌ణ‌మో కానీ.. బీజేపీ శిబిరంలో చేరిపోయారు ఈట‌ల రాజేంద‌ర్‌. దీంతో, ఉన్న సానుభూతి పోయింది. కాంగ్రెస్‌కు ప్ర‌త్య‌ర్థి అయ్యారు. బీజేపీ అంటే గిట్ట‌ని మైనార్టీ త‌దిత‌ర వ‌ర్గాల‌కూ దూర‌మ‌య్యారు. బీజేపీలో చేరకుండా.. స్వ‌తంత్రుడిగా బ‌రిలో దిగి ఉంటే.. అంద‌రివాడై.. అంద‌రూ క‌లిసొచ్చి.. ఈట‌ల‌ను గెలిపించుకుని ఉండేవారు. కానీ, ఇప్పుడా ప‌రిస్థితి లేదు. బీజేపీలో చేర‌డం వ‌ల్ల‌.. క‌నీసం కోదండ‌రాం సైతం స‌పోర్ట్ చేయ‌లేని దుస్థితి.  బీజేపీలో చేరాల‌ని ఈట‌ల అంత‌లా కోరుకుంటే.. మ‌రో విధంగా చేసుంటే బాగుండేద‌ని అంటున్నారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేసి.. అంద‌రి మ‌ద్ద‌తుతో ఎమ్మెల్యేగా గెలిచి.. ఆ త‌ర్వాత బీజేపీలో చేరడం స‌రైన ఎత్తుగ‌డ‌నే అభిప్రాయం వినిపిస్తోంది. స్వ‌తంత్రంగా బ‌రిలో దిగితే.. ఈట‌ల గెలుపు సునాయాసంగా ఉండేది. ఆ త‌ర్వాత తాను త‌ల‌చిన‌ట్టే బీజేపీలో చేరి సేఫ్‌గానూ ఉండేవారు. ఇంత ఈజీ ఆప్ష‌న్ వ‌దిలేసి.. అప్పుడే బీజేపీలో చేరడం ఈట‌ల‌ తొంద‌ర‌పాటు నిర్ణ‌య‌మే అంటున్నారు. ఎన్న‌క‌ల‌కు ముందే బీజేపీలో చేర‌డం ఆయ‌న‌కు కాస్త మైన‌స్సే అని భావిస్తున్నారు. అయితే, ఈ ఒక్క ఎన్నిక వ‌ర‌కూ బీజేపీ అని చూడ‌కుండా.. అంతా ఈట‌ల వైపు నిలుస్తార‌నేది మ‌రో అంచ‌నా. చూడాలి.. హుజురాబాద్‌లో ముందుముందు ఏం జ‌రుగుతుందో.. ఎవ‌రి లెక్క ఎవ‌రిని విజ‌య‌తీరాల‌కు చేరుస్తుందో...

ఫేక్ అఫిడవిట్.. ఫేక్ సీఎం!  లోకేష్, రఘురామ రాజు ఫైర్.. 

పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ సమర్పించింది. పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపింది. అయితే ఏపీ సర్కార్ నివేదించిన వివరాలపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వ తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ఈ నేపథ్యంలో జగన్ రెడ్డి సర్కార్ పై విరుచుకుపడ్డారు తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. దేశ అత్యున్నత న్యాయస్థానానికి కూడా ఫేక్ అఫిడవిట్ సమర్పించి మరోసారి ఫేక్ సీఎం అనే పేరుని జగన్ రెడ్డి సార్థకం చేసుకున్నారని విమర్శించారు. పరీక్షల నిర్వహణకు సరైన ప్రణాళిక లేని అఫిడవిట్ సమర్పించి చివాట్లు తిన్నారన్నారు. తమరు ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం పరీక్షల నిర్వహణకు 35 వేల క్లాస్ రూమ్స్ ఉండాలని...అన్ని రూమ్స్,సిబ్బందిని ప్రభుత్వం సిద్ధం చేసిందా? అని లోకేష్ ప్రశ్నించారు.  ప్రాణాల రక్షణకు, పరీక్షల నిర్వహణకు కనీస ఏర్పాట్లు కూడా చెయ్యకుండానే మొండి పట్టుదలతో పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఏముందని సుప్రీం కోర్టు ప్రశ్నించడం జగన్ రెడ్డి మూర్ఖత్వానికి పరాకాష్ట అన్నారు లోకేష్.పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడితే పోయే ఒక్కో ప్రాణానికి కోటి రూపాయిలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోర్టు వ్యాఖ్యానించడం చూస్తే ప్రజల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేదనే విషయం బయటపడిందని తెలిపారు. ఇప్పటికైనా చేసిన తప్పుని సరిదిద్దుకొని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రాణాలు బలితీసుకునే పరీక్షల నిర్వహణ ఆలోచనకి స్వస్తి పలకాలని హితవుపలికారు. వెంటనే పరీక్షలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకొని సుప్రీం కోర్టుకి తెలపాలని లోకేష్ డిమాండ్ చేశారు.  పరీక్షల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖ రాశారు. సుప్రీంకోర్టు సూచనలతో  బోర్డు పరీక్షల రద్దుపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని, పరీక్షలు రద్దు చేయాలని ఆ లేఖలో ఆయన కోరారు. డెల్టా వేరియంట్ వైరస్ తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో పరీక్షలు నిర్వహిస్తామని సుప్రీంకోర్టుకు చెప్పడం శోచనీయమని రఘురామ అన్నారు. పరీక్షలను నిర్వహించడం అంటే విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడటమే అవుతుందన్నారు. పక్కా ప్రణాళిక లేకుండా మొండితనంతో పరీక్షలు నిర్వహించాలని అనుకోవడం మంచిది కాదని సూచించారు. పరీక్షలు నిర్వహిస్తే.. జరగరాని నష్టం చోటు చేసుకుంటే.. సరిదిద్దుకోలేని తప్పు అవుతుందన్నారు. పట్టుదల, పంతాలు, పట్టింపులు పక్కనపెట్టి విద్యార్థుల ప్రాణాలు కాపాడాలని కోరారు. పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ చిత్తశుద్ధిని సుప్రీంకోర్టు శంకించిందని, ఆ విషయాన్ని గుర్తెరగాలన్నారు. ప్రభుత్వ తీరుపై సర్వోన్నత న్యాయస్థానం అనేక అనుమానాలు లేవనెత్తిందన్నారు. కరోనా అనిశ్చితి వాతావరణం కొనసాగుతున్న తరుణంలో పరీక్షల నిర్వహణకే ప్రభుత్వం మొగ్గు చూపటం బాధాకరమైన విషయమన్నారు రఘురామ రాజు. .సుప్రీం చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుని.. పరీక్షల నిర్వహణపై విజ్ఞతతో గౌరవ ప్రదమైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నానని రఘురామ ఆ లేఖలో పేర్కొన్నారు.

సీఎం ముందే ఎస్పీ, సెక్యూరిటీ ఆఫీసర్ ఫైటింగ్

వాళ్లిద్దరు ఉన్నతాధికారులు. ఒకరు జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తుండగా.. మరొకరు రాష్ట్ర ముఖ్యమంత్రి సెక్యూరిటీ ఆఫీసర్ గా ఉన్నారు. అయితే ఏం జరిగిందో ఏమె తెలియద కాని ఇద్దరు అధికారులు రెచ్చిపోయారు. నడిరోడ్డుపై గొడవ పడ్డారు. కొట్టుకున్నారు. ఏకంగా తన్నుకున్నారు. ఇదంతా ముఖ్యమంత్రి ముందే జరగడం మరో షాకింగ్. ముఖ్యమంత్రి ముందే ఇద్దరు ఉన్నతాధికారులు కొట్టుకోవడం చూసి స్థానికులంతా షాకయ్యారు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్ లో జరిగింది.  హిమాచల్ ప్రదేశ్ లోని కులులో  ఓ ఎస్పీ రెచ్చిపోయారు. ఏకంగా సీఎం సెక్యూరిటీ సిబ్బందిపైనే తన ప్రతాపం చూపించారు. ఎస్పీ గౌరవ్ సింగ్ సీఎం సెక్యూరిటీ ఆఫీసర్ చెంప చెళ్లుమనిపించారు. దీంతో అక్కడే ఉన్న ఇతర సీఎం సెక్యూరిటీ సిబ్బంది అంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే తీరుకున్న ఆఫీసర్‌కు కోపం వచ్చింది. మమ్మల్నే కొడతావా అంటూ ఎస్పీని కాలితో తన్నారు. అలా ఎస్పీని తన్నుకుంటూ.. తరుముకుంటూ వెళ్లారు. దీంతో ఎస్పీ ఒక్కసారిగా పరుగులు పెట్టారు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్పీ, సీఎం సెక్యూరిటీ సిబ్బంది.. ఇద్దరిని పక్కకు లాగి గొడవను సద్దుమణిగేలా చేశారు. ఈ ఘర్షణ జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి తన కారులోనే కూర్చొని ఉన్నారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఎయిర్ పోర్టుకు విచ్చేసిన సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి విమానాశ్రయానికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న డీజీపీ ఈ ఘటనపై సమగ్ర వివరణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సీఎం సెక్యూరిటీని ఎస్పీ కొట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి

జగన్ ఆస్తులను ప్రభుత్వ పరం చేయాలి! 

ఆర్థిక నేరగాళ్లపై కేంద్ర సర్కార్ సీరియస్ గా వ్యవహరిస్తోంది. బ్యాంకులను మోసం చేసి విదేశాల‌కు పారిపోయిన‌ విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలకు చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకుంది. అంతేకాదు ఈడీ అటాచ్ చేసిన  మొత్తం రూ.9,371 కోట్ల విలువైన ఆస్తులను రుణాలు ఇచ్చిన బ్యాంకులకు బదిలీ చేసింది. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల ఆస్తుల బదలాయింపుతో ఇప్పుడు ఏపీలో కొత్త చర్చ తెరపైకి వచ్చింది. అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోగన్ రెడ్డి ఆస్తులను ప్రభుత్వ  పరం చేయాలనే డిమాండ్ వస్తోంది. జగన్ అక్రమాస్తులను గుర్తించి ప్రభుత్వ ఖ‌జానాలో  జమ చేయాలని టీడీపీ సీనియర్ నేత  యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు.మాల్యా, నీరప్ మోదీ, చోక్సీ ఆస్తులను కూడా బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వపరం చేశారని చెప్పారు. బ్యాంకులను మోసం చేసిన సొమ్మును తిరిగి బ్యాంకుల పరం చేసినట్లే, ప్రజలను మోసం చేసిన సొమ్మును ప్రజల పరం చేయాలన్నారు. సీబీఐ అఫిడవిట్‌లో పేర్కొన్న జగన్ రూ.43 వేల కోట్ల అక్ర‌మార్జ‌న‌ను ప్రజాపరం చేయాలని య‌న‌మ‌ల అన్నారు. జగన్ పాల్ప‌డ్డ‌ ఆర్థిక నేరాలకు ఆయ‌న‌ అఫిడవిటే అద్దం పట్టిందని  47 పేజీల అఫిడవిట్‌లో 18 పేజీలు ఆర్థిక నేరాల చిట్టానే ఉందని తెలిపారు. డొల్ల కంపెనీలు పెట్టి నిధుల సమీకరణతో పాటు న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణీ నేరాల్లో విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలతో జగన్ పోటీ పడుతున్నారని య‌న‌మ‌ల అన్నారు. భార‌త్‌లోనే అతిపెద్ద ఆర్థిక కుంభకోణం జగన్ క్విడ్ ప్రొకో అవినీతి అని య‌న‌మ‌ల ఆరోపించారు. అంతర్జాతీయ వ‌ర్సిటీల్లో పాఠ్యాంశాలుగా జగన్ ఆర్థిక నేరాల చిట్టాలు ఉన్నాయని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఆర్థిక నేరం హత్య కంటే ప్రమాదకరమని గతంలో సుప్రీంకోర్టు హెచ్చరించిందన్న విషయాన్ని యనమల గుర్తు చేశారు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ లాగే జగన్ అక్రమాస్తులను ప్రభుత్వ పరం చేయాలని డిమాండ్ చేశారు. 

ఒక్క రూపాయి ఇస్తే కోటి రూపాయల గేమ్.. భలే ఉంది ట్విస్ట్.. 

రైలు బండిని నడిపేది పచ్చ జెండా లే.. బతుకు బండిని నడిపేది పచ్చనోటేలే..ఈ మాట  వంద శాతం నిజం. అయినా డబ్బు కావాలి అని ఎవరు అనుకోరు చెప్పండి. డబ్బుకావాలనుకోవడం తప్పు లేదు. ఎలా సంపాదించాలని ఆలోచించకపోవడం తప్పు. దురాశ లేని మనిషి ఉండదు, అత్యాశ లేని ఆశాజీవి ఉండదు. కానీ దురాశ దుఃఖానికి చేటు, అత్యాశ ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ మధ్య కాలంలో సైబర్ క్రైమ్ నేరగాళ్లు ఎక్కువయ్యారు ప్రజలను నిలువునా మోసం చేస్తున్నారు. ఆ విషయం అందరికి తెలుసు ఐన సరే మనుషులు ఈజీ మనీ కి అలవాటు పడిపోతున్నారు. అందుకే ఇలా  మోసపోతున్నారు. ఎంత ప్రయత్నించినా సైబర్‌ నేరగాళ్లకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాం. కొత్త పంధాలను ఎంచుకుంటూ.. ప్రతి నిత్యం ఎక్కడో అక్కడ, ఎవరో ఒకరు ఈ సైబర్‌ ఉచ్చులో పడిపోతున్నారు. గత రెండు రోజుల క్రితమే జాబ్ పేరుతో బిటెక్ స్టూడెంట్స్ దగ్గర దాదాపు రూపాయలు 20 లక్షలకు పైగా దండుకున్నారు. ఆ విషయం మీకు అందరికి తెలిసిందే.. ఇలాంటి వార్తలు తెలుసుకుని కూడా మళ్ళీ జనాలు మోసపోతున్నారు.  తాజాగా టీచర్ అయిన ఓ మహిళ ఈ కేటుగాళ్ల ఉచ్చులో పడి భారీగా డబ్బును పోగొట్టుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..ఫ్రీ ఆఫర్స్ ఆశ చూపి..టోకరా చేశాడు. అసలే మన  ఆఫర్ అంటే  6 నెలలు కూడా క్యూలో నిల్చునే రకం. ఇక వివరాలు ఇలా ఉన్నాయి.  ఆన్‌లైన్ యాప్ OLXలో తన వద్ద ఉన్న 1947వ సంవత్సరం రూపాయి కాయిన్‌ను సదరు టీచర్ అమ్మకానికి పెట్టారు. జూన్ 15న పెట్టిన పోస్టులో తన మొబైల్ నెంబర్‌ను సైతం యాడ్ చేశారు. దీన్ని గమనించిన ఓ కేటుగాడు పక్కా ప్లాన్‌తో స్కెచ్‌ వేసాడు. సదరు టీచర్‌కు ఆ కాయిన్ కొనడానికి నేను రెడీగా ఉన్నానని కోటి రూపాయలు వరకూ ఇవ్వగలనని అన్నాడు. అంతే టీచర్ అది తన 10  ఏళ్ళ జీతం ఒకే సారి వస్తుందని కక్కుర్తి పడింది. . జాక్‌పాట్ తగిలిందని ఆకాశానికి ఎగిరింది టీచర్.. అసలే ఆడవాళ్లు వాళ్లకు సంతోషం వచ్చిన ఆపలేం భాదొచ్చినా ఓదార్చలేము. మొత్తానికి అతని మాటలు టీచర్ నమ్మేసింది. అక్కడితో అతడు నాటకానికి తెరలేపాడు.  డబ్బు పంపించడానికి బ్యాంకు అకౌంట్ వివరాలు అడిగాడు. టీచర్‌ పూర్తి డీటైల్స్‌ ఫుల్ క్లారిటీతో అన్ని వివరాలు చెప్పిన తర్వాత ఆమెకు ఓ స్క్రీన్ షాట్ వచ్చింది. తాను డబ్బులు పంపానని ఇదే ఆ ట్రాన్సక్షన్ స్క్రీన్ షాట్ అని చెప్పాడు. తనకు డబ్బులు రాలేదని తెలుసుకున్న టీచర్ ప్రశ్నించేందుకు అతనికి తిరిగి ఫోన్ చేసింది. అంత పెద్ద మొత్తం అమౌంట్ ఖాతాలో డిపాజిట్ అవడానికి కొన్ని ట్యాక్స్‌లు లాంటివి కట్టాలని చెప్పాడు. కొంచెం ఖర్చు అవుతుందని అలా చేస్తే డబ్బు జమ అవుతుందని అన్నాడు. ఆర్బీఐ, ట్యాక్స్ కూడా కట్టాల్సి ఉందని మరోసారి చెప్పాడు. ఇలా టీచర్ ఫోన్ చేసిన ప్రతిసారి నగదు జమ పూర్తి కావడానికి ఏదో ఒక కారణంతో డబ్బులు అడుగుతూనే ఉన్నాడు. ఆమె ఇస్తూనే ఉంది. ఎన్నిసార్లు మనీ పంపినా ఏదో ఒక కారణం చెప్పడంతో విసిగిపోయిన టీచర్.. కోటి వస్తుందా రాదా అని గట్టిగా నిలదీసింది. దాదాపు లక్షల్లో ట్రాన్సఫర్ చేసిన ఆమెకు రెస్పాన్స్ రావడం ఆగిపోయింది. అప్పటికి తేరుకున్న మహిళ పోలీసులను ఆశ్రయించింది.

కేంద్ర మంత్రి వర్గంలో ఏపీ నుంచి ఎవరు ?

కేంద్ర మంత్రివర్గ విస్తరణ ముహూర్తం ఇంకా ముడిపడలేదు. అయితే, జులై రెండవ వారంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్న నేపధ్యంలో, మంత్రివర్గ విస్తరణ ఈలోగా ఎప్పుడైనా ఉంటుందని ఢిల్లీ వర్గాల సమాచారం.జమ్మూ కశ్మీర్ కు మళ్ళీ రాష్ట్ర హోదా కలిపించే విషయంలో ఆ రాష్ట్రానికిచెందిన వివిధ పార్టీల నాయకులతో ప్రధాని మోడీ గురువారం సమావేసమవుతున్నారు. దీంతో పొలిటికల్ ఫోకస్ అటు మరలింది. మంత్రివర్గ విస్తరణ జాప్యానికి ఇది కూడా ఒక కారణం అంటున్నారు.   తెలుగు రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ నుంచి కేంద్ర మంత్రివర్గంలో ఎవరికి స్థానం దక్కుతుందన్న విషయంలో అటు ఢిల్లీ  రాజకీయ వర్గాల్లో, ఇటు  రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మంత్రివర్గ విస్తరణ మాట బయటకు వచ్చినప్పటి నుంచి, ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఊహాగానాలు మొదలయ్యాయి. అలాగే, అనేక పేర్లు తెర మీదకు వచ్చాయి. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఆంధ్ర ప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యులు, జీవీఎల్ నరసింహ రావు, సీఎం రమేష్  పేర్లు ప్రముఖంగా వినవస్తున్నాయి. ఈ రెండు పేర్లనే కేంద్ర నాయకత్వం పరిశీలిస్తోందని, విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే, ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో  కూడా బీజేపీ నాయకులు, సీఎం రమేష్ కంటే సొంత మనిషి  జీవీఎల్ వైపే మొగ్గుచుపుతున్నట్లు చెపుతున్నారు.  మరో వైపు తెలుగు దేశం పార్టీ నుంచి వచ్చిన సీఎం రమేష్  ఎలాగైనా మంత్రి పదవి సొంతం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆయన తెలుగు దేశం పార్టీలో ఉన్నప్పుడు, సామాజిక సంబంధాలు ఆధారంగా ఏర్పరచుకున్న రాజకీయ సంబంధాలను ,అలాగే, పాత కొత్త, రాజకీయ సామాజిక, సంబంధాలను ఉపయోగించి అయినా మంత్రి వర్గంలో స్థానం సంపాదించాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే,ఆ ప్రయత్నాలే  ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని, ఆయన సన్నిహిత వర్గాలే  అనుమానిస్తున్నాయి.నిజమే కావచ్చును, ఒకప్పుడు ఆయనకు బీజేపీ కీలక నేతలలో కొందరితో మంచి సంబంధాలు ఉంటే ఉండవచ్చును, కానీ, ప్రస్తుతం ఆ నేతల పరిస్థితి ఏమిటన్నది కూడా ఆలోచించుకోవాలని, రమేష్’ను  ఆయన సన్నిహుతులే హెచ్చరిస్తునారు. మరో వంక బీజీపీ సీనియర్ నాయకులు, ముఖ్యంగా పుట్టు బీజేపీ నాయకులు రమేష్’కు  మంత్రివర్గంలోకి తీసుకుంటే రాష్ట్రంలో పార్టీ పరిస్థితి మరింత దిగజారి పోతుందని హెచ్చరిస్తున్నారు. ఒక సారి ఆయన గతాన్ని గుర్తు చేసుకోవాలని అంటున్నారు.ఆయన గతం పార్టీ ఎదుగుదలకు ప్రతిబంధకం అవుతాయని,పార్టీ నేతలు, కార్యకర్తలు పార్టీ అధినాయకత్వందృష్టికి తీసుకు వెళ్ళారని తెలుస్తోంది.  2019 ఎన్నికలవరకు తెలుగు దేశం పార్టీలో క్రియాశీలక పాత్రను పోషించిన సీఎం రమేష్, ఎన్నికల అనంతరం    బీజేపీలో చేరినా ఆయన పాత సంబంధాలను కొనసాగిస్తూనే ఉన్నారన్న ఆరోపణలు, అనుమానాలు తరచు చర్చకు వస్తూనే ఉన్నాయి. ఈ పరిస్థితిలో సీఎం రమేష్’కు  మంత్రి పదవి ఇస్తే ఆయన వల్ల పార్టీకి ఒరిగేదేమీ ఉండదని, బీజేపీ సీనియర్ నాయకులు కుండబద్దలు కొడుతున్నారు. పార్టీ ఐడియాలజీ మీద విశ్వాసంతో కాకుండా, రాజకీయ ఆర్థిక ప్రయోజనాలకోసం పార్టీ పంచన చేరే వారిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలే గానీ, వారికి ఉన్న ఆర్థిక స్థోమతను ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే, దీర్ఘ కాలంలో అంతకు అంత మూల్యం చెల్లించక తప్పదని బీజీపీ సీనియర్లతో పాటుగా ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ నాయకులు కార్యకర్తలు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికీ, ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలలో అవక్రతవకలకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కుంటున్న విని మంత్రి వర్గంలోకి తీసుకుంటే తప్పుడు సంకేతాలు వెళతాయని, సో .. ఎట్టి పరిస్థితిలో అలంటి వారికి  అవకాశం ఇవ్వరాదని అనటున్నారు.  బీజేపీ, సంఘ్ పరివార్ సంస్థలతో పాటుగా, టీడీపీ సహా ఇతర పార్టీల నుంచి  బీజేపీలో చేరిన నాయకులు, పెద్దల సభ సభ్యులు కూడా, రాష్ట్రంలో పార్టీ ఎదుగుదలను దుష్టిలో ఉంచుకుని, జీవీఎల్ నరసింహారావుకు మంత్రి వర్గంలో స్థానం కలిపించాలని అంటున్నారు. నిజానికి, ఏపీ నుంచి ఎవరిని మంత్రి వర్గంలోకి తీసుకోవాలనే విషయంలో కేంద్ర నాయకత్వం వివిధ మార్గాలలో సమాచారన్ని సేకరించిందని రాష్ట్ర పార్టీ నాయకులు చెపుతున్నారు. అయితే, అంతిమ నిర్ణయం ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడే చెప్పలేమని పార్టీ నేతలు, పరిశీలకులు అంటున్నారు.

పీకే వ్యూహం ఏమిటో ? కాంగ్రెస్ మీటింగ్ అందుకేనా? 

ఎదో జరుగుతోంది? ఎమీలేకుంటే, ఎన్నికల వ్యూహకర్త, ప్రశాంత్ కిషోర్ పక్షం రోజులల్లో మూడవసారి ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ను ఎందుకు కలుసుకున్నారు? ఈ భేటీల పర్యవసానంగా కాంగ్రెస్ మొదలు మోడీ వ్యతిరేక పార్టీలు,  నాయకులలో ఇలా ఇంతలా కదలిక ఎందుకు వస్తుంది. ఎన్నిని ఊహాగానాలు ఎందుకు వినిపిస్తాయి? నిప్పు లేనిదే పొగరాదు, ఏదో జరుగుతోంది, రాజకీయ వంటకం ఎదో ఉడుకుతోంది. జూన్ 11వ తేదీన ముంబైలో మొదటిసారిగా శరద్ పవార్’తో సమావేశమైన ప్రశాంత్ కిశోర్, రెండురోజుల క్రితం ఢిల్లీలో రెండవసారి పవార్’తో భేటీ అయ్యారు.. మళ్ళీ బుధవారం, పవార్ ఢిల్లీ నివాసంలో మరో సారి ఆ ఇద్దరు కలుసు కున్నారు. ఓ గంట సేపు రహస్యంగా మంతనాలు సాగించారు. శరద్ పవార్ నివాసంలో  పీకే  సారధ్యంలో ఏడెనిమిది పార్టీల నాయకులు, కొంతమంది మేథావులు సమావేశంమైన 24 గంటల్లోనే కిషోర్ మళ్ళీ పవార్’ను కలుసుకున్నారు. శరద్ పవార్ సారధ్యంలో జరిగిన సమావేశానికి రాజకీయ ప్రాధాన్యత లేదని ఎన్సీపీ నాయకులు చెపుతున్నారు. అలాగే  ఈ సమావేశానికి సూత్రధారి వ్యవహరించిన టీఎంసీ జాతీయ ఉపాధ్యక్షుడు యశ్వంత్ సిన్హా, అప్పుడెప్పుడో తాను తెరిచి, మూసేసిన రాష్ట్రీయ మంచ్’ ను మళ్ళీ తెరమీదకు తెచ్చారు. పవార్ నివాసంలో జరిగిన సమావేశాన్ని  ‘మంచ్ ముచ్చట్ల’ పిచ్చాపాటి సమావేశం మాత్రమే అని, ఈ సమావేశానికి రాజకీయ ప్రధాన్యత అస్సలు లేనే లేదని చెప్పుకొచ్చారు. కావచ్చు, పవార్ నివాసంలో జరిగింది, యశ్వత్ సిన్హా చెప్పినట్లుగా పెద్ద ముత్తయిదువుల క్లాక్షేపం కబుర్లే  అనుకుందాం, అయితే, ఆ సమావేశానికి అంత హైప్ ఎందుకొచ్చింది. థర్డ్ ఫ్రంట్ అని అదనీ, ఇదనీ ఊహాగానాలు ఎందుకు షికారు చేశాయి. అప్పుడే, యశ్వంత్ సిన్హా, ఇది రాష్ట్రీయ మంచ్ సమావేశమే  కానీ, రాజకీయ సమావేశం కాదని, ఈ సమావేశానికి రాజకీయ ప్రాధన్యత లేదని ఎందుకు చెప్పలేదు. అంతకు ముందు పవార్, ప్రశాంత్ కిషోర్ సెకండ్ భేటీ తర్వాత ఎన్సీపీ అధికార ప్రతినిధి, పవార్ సారధ్యంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలు ప్రారంభ మయ్యాయని ఎందుకు ప్రకటించారు? ఇంతాచేసి చివరకు ప్రశాంత్ కోశోర్ తెర మీదకు వచ్చి, ‘థర్డ్ ఫ్రంట్, ఫోర్త్ ఫ్రంట్’తో లాభం లేదు, బీజేపీ ఓడించడం థర్డ్, ఫోర్త్ ఫ్రంట్స్’తో అయ్యే పని  కాదని’ చావు కబురు చల్లగా చెప్పడంలో అంతరం ఏమిటి? అంతలోనే మళ్ళీ పవార్’తో రహస్య భేటీ అంతర్యం ఏమిటి? పవార్, ప్రశాంత్ కిషోర్ భేటీల చుట్టూ చాలా ప్రశ్నలు చక్కర్లు కొడుతున్నాయి. అందుకే, ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే, ఎదో జరుగుతోంది అనేది అందరికీ ఆర్ధమవుతోంది.  నిజానికి ఏమి జరుగుతోంది అనేది కూడా గొప్ప రహస్యం ఏమీ కాదు, ‘బీజేపీని ఓడించాలి ... మోడీని గద్దె దించాలి’, ఇదే ఈ రహస్య భేటీలు, బహిరంగ సమావేశాల సెంట్రల్ థీమ్. ఇదేమీ రహస్యం కాదు. నిజానికి అదేమీ తప్పు కాదు. బీజీపీ ప్రత్యర్ధి పార్టీలు, బీజేపీ ఓటమినే కోరుకుంటాయి. అలాగే, బీజేపీ తమ ప్రత్యర్ధి పార్టీల పతనాన్ని కోరుకుంటుంది. అంతే కానీ, సోనియా/ రాహుల్  కాంగ్రెస్’, పవార్ కాంగ్రెస్, మమతా కాంగ్రెస్ లేదా మరో పార్టీకి మోడీ, షా  జై కొట్టదు. ఇన్ ఫాక్ట్, ‘కాంగ్రెస్ ముక్త భారత్’ అనే నినాదంతోనే బీజేపీ ముందుకు పోతోంది. సో, బీజేపీయేతర పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా జట్టు కట్టండంలో వవిశేషం ఏమీ లేదు. రాజకీయంగా తప్పు కాదు. నిజంగా అలంటి ప్రయత్నం జరుగుతుంటే, అది స్వాగతించవలసిన, సంతోషించదగ్గ పరిణామమే అవుతుంది .   అయితే ఈ క్రతువులో కీలకంగా మారిన, ప్రశాంత్ కిశోర్, వ్యూహం ఏమిటి అన్నదే ఇక్కడ కీలకంగా మారింది. బెంగాల్ ఎన్నిక్లాలకు ముందు ప్రశాంత్ కిషోర్ ఇమేజ్ వేరు, ఇప్పుడు ఆయన ఇమేజ్ లంకలో హనుమంతుడిలా ఎన్నో రెట్లు పెరిగింది. పశ్చిమ బెంగాల్’ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్’ ను ప్రశాంత్ కిషోర్ గెలిపించారు. అదే వండర్ అనుకుంటే, బీజేపీకి 200 ప్లస్ సీట్లు వస్తాయని తొడకొట్టిన అమిత్ షాను సవాలు చేసి మరీ కాషాయ పార్టీని వందలోపు సీట్లకు పరిమితం చేశారు, ప్రశాంత్ కిషోర్. దీంతో ప్రశాంత్ కిషోర్ భయంకరంగా పెరిగిపోయింది. ఆయన  ఇమేజ్ దేశ సరిహద్దులను దాటి అంతర్జాతీయ స్థాయికి చేరింది. అలాగని, ప్రశాంత్  కిషోర్ ఇప్పుడ నడిపిస్తున్న డ్రామా వెనక భారత వ్యతిరేక అంతర్జాతీయ శక్తులు ఉన్నాయని కాదు. కానీ, బెంగాల్ గెలుపు తర్వాత, వ్యూహారచన వ్యాపకానికి స్వస్తి చెపుతున్నానని ప్రకటించిన ఆయన ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరు, చిన్న అనుమానాలకు తావిచ్చేలా ఉందనే సందేహాలు వ్యక్తమసుతున్నాయి.  2019 ఎన్నికల ఓటమి తర్వాత ఇంతవరకు స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో కూడా కదలిక వచ్చింది. తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, చాలాకాలం తర్వాత తొలిసారిగా, ఈరోజు (జూన్ 24) పార్టీ ప్రధాన  కార్యదర్శులు, రాష్ట్రాల ఇంచార్జ్’లతో సమావేశమవుతున్నారు. ఈ సమావేశంలో సంస్థాగత అంశాలతో పాటుగా, వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్టాలలో పరిస్థితిని కూడా చర్చిస్తారని అంటున్నారు. అలాగే, అధికారంలో ఉన్న పంజాబ్, రాజస్థాన్ సహా అధికారంలో లేని కర్నాటక, తెలంగాణ, కేరళ, ఢిల్లీ వంటి అనేక రాష్ట్రాలలో పతాక స్థాయికి చేరిన అంతర్గత కుమ్ములాటలపై కూడా దృష్టి పెడతారని అంటున్నారు.  కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఏమి జరుగుతుంది అనే విషయాన్ని పక్కన పెడితే, ఈ సమావేశం  వెనక కూడా పీకేనే ఉన్నారా? ఆయన వ్యూహంలో భాగంగానే కాంగ్రెస్ లో కదలిక వచ్చిందా, అన్న అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. నిజానికి, ప్రతిపక్ష పార్టీలు రాజీవ్ గాంధీని ప్రదాని అభ్యర్ధిగా అంగీకరిస్తే, బీజేపీ ఓడించేందుకు పనిచేస్తానని ప్రశాంత్ కిషోర్ గతంలో ప్రకటించారు. ఇప్పుడు ఆయన చుట్టూ తిరుగుతున్న విపక్షాల రాజకీయాలకు, ఆయన ఈ ట్వీట్ తోనే శ్రీకారం చుట్టారు. సో ... వ్యూహ రచనలో తనకు తానే సాటి అని నిరూపించుకున్న ప్రశాంత్ కిషోర్, మాంత్రికుడు ఏ చిత్తు కాగితాన్నో, సంచిలో పెట్టి, ఇటూ అటూ తిరగేసి, అందులోంచి, ఏ రెండు వేల నోటునో, ప్రాణమున్న చిలకనో తీసునట్లు, పవార్, కు ముసుగేసి  ఏ రాహుల్ బొమ్మనో  బయటకు తీసిన ఆశ్చర్య పోనవసరం లేదని పిస్తోంది.ఏమి జరుగుతుందో.. చూడవలసిందే.

జగనన్నను ప్రశ్నించవా షర్మిలక్క! అంతా డ్రామానేనా.. ! 

తెలంగాణ‌కు అన్యాయం జ‌రిగితే ఎవ‌రినైనా ఎదిరిస్తా. ఒక్క నీటిబొట్టు తేడా వ‌చ్చినా ఏపీతోనైనా పోరాడ‌తా. లోట‌స్‌పాండ్‌లో రాజ‌కీయ స‌న్నాహ‌క సమావేశంలో వైఎస్ ష‌ర్మిల చేసిన స్టేట్‌మెంట్స్ ఇవి. ఫ‌స్ట్ స్పీచ్ అంటే ఎంత ప‌ర్‌ఫెక్ట్‌గా వ‌ర్క‌వుట్ చేసి ఉంటారు. ఒక్కో పాయింట్ రాసుకుని, లెక్క‌లు వేసుకొని, ఓ స్ప‌ష్ట‌త‌కు వ‌చ్చి.. ప్ర‌సంగిస్తారు. కాబ‌ట్టి, ష‌ర్మిల నోటి నుంచి వ‌చ్చిన తొలి మాట‌ల‌కు అంతటి ప్రాధాన్యం ఉంటుంది. మ‌రి, ఇప్పుడు ఏమైంది? నాలుగు రోజులుగా తెలుగు రాష్ట్రాలు నీళ్ల కోసం లొల్లి లొల్లి చేస్తుంటే.. ష‌ర్మిల‌క్క ఎందుకు మౌనంగా ఉంటున్నారు. పార్టీ పెడ‌తాన‌ని అన్న‌ప్ప‌టి నుంచీ చీమ చిటుక్కుమ‌న్నా స్పందిస్తున్న ష‌ర్మిల‌.. ఇప్పుడు ఏపీ, తెలంగాణ మ‌ధ్య ఏకంగా జ‌ల ఫిరంగులే పేలుతుంటే.. ఆమె నోటి నుంచి ఒక్క ప‌ద‌మైనా బ‌య‌ట‌కు రావ‌డం లేదేంటి? నిరుద్యోగ స‌మ‌స్య‌, రైతుల స‌మ‌స్య‌ల‌పై ట్వీట్ల‌తో నిత్యం ట‌చ్‌లో ఉండే ష‌ర్మిల‌.. నాలుగు రోజులుగా నీటి ప్రాజెక్టుల స‌మ‌స్య‌పై ఒక్క ట్వీట్ కూడా చేయ‌లేదేం? ఇదే ఇప్పుడు పొలిటిక‌ల్‌గా ఇంట్రెస్టింగ్ పాయింట్. వైఎస్ ష‌ర్మిల‌. వైఎస్సార్ త‌న‌య‌గా వైఎస్ జ‌గ‌న్ సోద‌రిగా అంద‌రికీ సుప‌రిచిత‌మే. తాను తెలంగాణ కోడ‌లినంటూ స‌డెన్‌గా ఊడిపడ్డారు. ఎవ‌రూ అడ‌క్క‌ముందే రాజ‌న్న‌రాజ్యం తీసుకొస్తానంటూ ముందుకొచ్చారు. మొద‌ట్లో జ‌నాలు ఆమెను చూసి న‌వ్వుకున్నారు. ఆమె జ‌గ‌న‌న్న బాణమ‌ని కొంద‌రు, కేసీఆర్ కోవ‌ర్ట్ అని మ‌రికొంద‌రు, బీజేపీ పొలిటిక‌ల్ గేమ్ అని ఇంకొంద‌రు.. ఎవ‌రికి తోచిన విధంగా వారు విశ్లేషించారు. ష‌ర్మిల మాత్రం ఇవేమీ ప‌ట్టించుకోకుండా.. ప‌ట్టుద‌ల‌గా ముందుకు వెళ్లారు. ఓ మీడియా ఆమెకు ఫుల్‌గా క‌వ‌రేజ్ ఇచ్చింది. ఖ‌మ్మం స‌భ‌తో త‌న రాజ‌కీయ ఉనికిని ఘ‌నంగా చాటారు ష‌ర్మిల‌. ఆ త‌ర్వాత నిరుద్యోగ స‌మ‌స్య‌పై ఇందిరాపార్కు దీక్ష‌, పోలీసుల‌తో కొట్లాట‌, జాకెట్ చిన‌గ‌డంతో పొలిటిక‌ల్‌గా ఫుల్ మైలేజ్ వ‌చ్చింది. ఆ త‌ర్వాత కూడా ఆ టెంపో కంటిన్యూ చేద్దామ‌నుకున్నా.. క‌రోనా విజృంభించ‌డం, లాక్‌డౌన్ కార‌ణంతో ట్విట్ట‌ర్‌లో యాక్టివ్ అయ్యారు. ప్ర‌తీ ప్రజా స‌మ‌స్య‌పై స్పందిస్తూ.. సీఎం కేసీఆర్‌ను ట్వీట్ల‌తో గిల్లుతూ.. గిచ్చుతూ.. తాను కూడా బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థినేన‌నే అనిపించేలా చేస్తున్నారు. ష‌ర్మిల ఇంత హ‌డావుడి చేస్తున్నా.. టీఆర్ఎస్ నుంచి ఒక చిన్న కౌంట‌ర్ కూడా ప‌డ‌టం లేదు. అస‌లామెను కారు పార్టీ గుర్తించ‌డ‌మే లేదు. దీంతో.. మ‌రింత ఫ్ర‌స్టేష‌న్‌లో మ‌రింతగా మాట‌ల‌కు ప‌దును పెడుతూ విమ‌ర్శ‌ల డోసు పెంచేశారు ష‌ర్మిల‌. ఇంత వ‌ర‌కూ బాగానే ఉంది.. ఇప్పుడిక అస‌లైన‌, అతిపెద్ద‌ స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది. ష‌ర్మిల‌కు శ‌ల్య పరీక్ష‌కు గురి చేస్తోంది. అదే రెండు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల వివాదం. ఇంత‌టి కీల‌క ప‌రిణామంపై ష‌ర్మిల మాట్లాడ‌క‌పోవ‌డం ఆమె చిత్త‌శుద్ధిని శంకిచేలా ఉంది. కృష్ణా న‌దిపై ప్రాజెక్టుల నిర్మాణంపై ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌ల మ‌ధ్య వాట‌ర్ వార్ ఓ రేంజ్‌లో జ‌రుగుతోంది. తెలంగాణ కేబినెట్ స‌మావేశంలో స్వ‌యంగా సీఎం కేసీఆరే ఏపీ తీరును తీవ్ర స్థాయిలో త‌ప్పుబ‌ట్టారు. కేంద్రానికి ఫిర్యాదు చేస్తామ‌ని చెప్పారు. సీఎం కేసీఆర్ వ్యాఖ్య‌ల‌కు ఏపీ నీళ్ల మంత్రి అనిల్‌కుమార్ కౌంట‌ర్ ఇచ్చారు. మా నీళ్లు మేం వాడుకుంటే.. మా ప్రాజెక్టులు మేం క‌ట్టుకుంటే త‌ప్పేంట‌ని గ‌ట్టిగానే ప్రశ్నించారు. మంత్రి అనిల్ కామెంట్స్‌పై తెలంగాణ నుంచి మ‌ళ్లీ రివ‌ర్స్ అటాక్ జ‌రిగింది. మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, వేముల ప్ర‌శాంత్‌రెడ్డిలో చాలా ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఏకంగా సీఎం జ‌గ‌న్‌నే టార్గెట్ చేస్తూ.. వైఎస్సార్ నీళ్ల దొంగ‌.. వైఎస్ జ‌గ‌న్ గ‌జ‌దొంగ‌.. అంటూ కాక రేపారు.  రెండు రాష్ట్రాల మ‌ధ్య ఈ రేంజ్‌లో వాట‌ర్ వార్ న‌డుస్తుంటే.. వైఎస్ ష‌ర్మిల మాత్రం త‌న‌కేం సంబంధం లేద‌న్న‌ట్టు మౌనంగా ఉండ‌టంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. రాజ‌కీయ స‌న్నాహ‌క స‌భ‌లోనే.. తెలంగాణ‌కు అన్యాయం జ‌రిగితే ఎవ‌రినైనా ఎదిరిస్తా. ఒక్క నీటిబొట్టు తేడా వ‌చ్చినా ఏపీతోనైనా పోరాడ‌తా.. అంటూ ఆర్భాటంగా ప్ర‌సంగించి.. ఇప్పుడిక మాట్లాడాల్సిన స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు ముఖం చాటేయ‌డ‌మేంట‌ని తెలంగాణ స‌మాజం నిల‌దీస్తోంది. తెలంగాణ కోసం ఎవ‌రినైనా ఎదిరిస్తా అన్నారుగా.. ఇప్పుడు ఏపీ ప్ర‌భుత్వాన్ని ఎదిరించ‌రా? అని అడుగుతున్నారు. ఏపీ సీఎం త‌న అన్న జ‌గ‌న‌న్న కాబ‌ట్టి నోరు మూసుకున్నారా? కేవ‌లం కేసీఆర్‌ను తిట్ట‌డానికే పార్టీ పెడుతున్నారా? తెలంగాణ ప్ర‌యోజ‌నాల‌ కోసం కాదా? మ‌రి, ఏపీ ప్రాజెక్టుల‌తో తెలంగాణ‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని అంతా మొత్తుకుంటుంటే.. ష‌ర్మిల మాత్రం ఎందుకు నోరు తెర‌వ‌డం లేదు? ఇవే ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ జనాల నుంచి వస్తున్నాయి.  తెలంగాణ కోసం ఎవ‌రినైనా ఎదిరిస్తా అంటే.. అందులో ఏపీ మిన‌హా.. సీఎం జ‌గ‌న్ మిన‌హా.. అని స‌వరించుకోవాలా? తెలంగాణ ఏర్ప‌డిందే నీళ్లు, నిధులు, నియామ‌కాల కోసం. ఈ ముడిట్లో మొద‌టి ప్రాధాన్యం నీళ్లే. ఆ నీళ్ల‌కు మొద‌టి నుంచీ ఏపీతోనే ప్రాబ్ల‌మ్. కృష్ణా జలాల‌ను అక్ర‌మంగా త‌ర‌లించుకుపోతున్నార‌నేది ఏపీపై ప్ర‌ధాన ఆరోప‌ణ‌. మ‌రి, తెలంగాణ‌కు అతి పెద్ద స‌మ‌స్య‌గా మారిన జ‌ల వివాదంపై ష‌ర్మిల మౌనంగా ఉండ‌టం ఏమాత్రం మంచిది కాద‌ని అంటున్నారు. జగనన్న డైరెక్షన్ లోనే తెలంగాణలో షర్మిల పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణలో వైసీపీలో కీలకంగా ఉన్న నేతలే ఆమె వెంట తిరుగుతున్నారు. దీంతో షర్మిల పార్టీ వెనుక జగన్ ఉన్నారనే అనుమానాలు బలపడ్డాయి. తాజాగా జల వివాదానికి సంబంధించి షర్మిల సైలెంటుగా ఉండటంతో... జగనన్న డైరెక్షన్ లోనే ఆమె నడుస్తున్నారనే వాదన మరింత బలపడుతోంది. మ‌రి, కాస్త ఆల‌స్యంగానైనా ష‌ర్మిలా నోరు తెరుస్తారా?  జ‌గ‌న‌న్న తీరును ఏకి పారేస్తారా? చూడాలి.. రాజకీయంగా ష‌ర్మిల‌కు ఇది అగ్నిప‌రీక్షే. 

ఒక్క‌రు చ‌నిపోయినా రూ.కోటి ఇవ్వాలి.. ఏపీకి సుప్రీం స్ట్రాంగ్ వార్నింగ్‌..

పరీక్షల కార‌ణంగా ఒక్క‌రు చ‌నిపోయినా.. ఒక్కొక్క‌రికీ కోటి రూపాయ‌లు ప‌రిహారం ఇవ్వాల్సి ఉంటుంద‌ని సుప్రీంకోర్టు ఏపీ ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించింది. క‌రోనా క‌ల్లోల ప‌రిస్థితుల్లో ఒక్కో గ‌దిలో 15 నుంచి 20 మంది విద్యార్థులను ప‌రీక్ష‌ల‌కు కూర్చోబెట్ట‌డం స‌మంజ‌స‌మా?  ప్ర‌భుత్వ లెక్క‌ల ప్ర‌కార‌మే 28వేల గ‌దులు అవ‌స‌రం అవుతాయి? అది సాధ్య‌మా? రెండో ద‌శ తీవ్రత చూశాక కూడా.. ఇంకా ప‌లు వేరియంట్లు పుట్టుకొస్తున్నాయ‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నా కూడా.. ప్ర‌భుత్వం ఎందుకు ఇలా వ్య‌వ‌హ‌రిస్తోంది.. ప‌రీక్ష‌ల స‌మ‌యంలో మూడో వేవ్ వ‌స్తే ఏం చేస్తారు? అంటూ సుప్రీంకోర్టు ఏపీ స‌ర్కారును తీవ్ర స్థాయిలో త‌ప్పుబ‌ట్టింది.   రాష్ట్రాల బోర్డుల పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సుమారు గంటన్నర పాటు వాదనలు జ‌రిగాయి. పరీక్షల తేదీలు, పరీక్షల నిర్వహణ, విద్యార్థుల సేఫ్టీ అంశంపై ప్రణాళికలు ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది. ఏ ఒక్క విద్యార్థి మృతి చెందినా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని గ‌తంలోనే హెచ్చ‌రించింది సుప్రీంకోర్టు. తాజాగా మ‌రిన్ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. పరీక్షల సమయంలో కోవిడ్ ఉధృతి పెరిగితే దానిపై కూడా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. మార్కుల ఎవల్యూషన్‌పై కూడా తాము నిపుణులతో మాట్లాడి ఒక చార్ట్ ఇస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.  ఇప్పటికే 10, 12 తరగతి పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ ప్రభుత్వం, 11 తరగతి పరీక్షలు నిర్వహిస్తామని కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపాయి. మరోవైపు ఇప్పటికే 21 రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేశాయి. 12 వ తరగతి పరీక్షలు నిర్వహిస్తామని, ప్రత్యామ్నాయం లేదని సుప్రీంకోర్టులో బుధవారం నాడు ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. శుక్రవారం మ‌రోసారి విచార‌ణ జ‌రిపి.. పరీక్షలు నిర్వహించాలా..? లేక, రద్దు చేయాలా..? అనే దానిపై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది.