పవార్ హీరోగా పీకే థర్డ్ ఫ్రంట్! రాహుల్ పరిస్థితి ఏంటో..?
‘బీజేపీని ఓడించాలి, మోడీని గద్దె దించాలి’ ఇదొక్కటే సింగిల్ పాయింట్ ప్రోగ్రాంగా పెట్టుకున్న, బీజేపీ ప్రత్యర్ధి పార్టీలకు, నాయకులకు, తమ వ్యూహరచనతో రాష్ట్రాల స్థాయిలో బీజేపీని మట్టికరిపిస్తున్న ప్రశాంత్ కిశోర్ సహజంగానే ఒక ఆశా కిరణంగా కనిపిస్తున్నారు. మరోవంక, కారణాలు ఏవైనా, ప్రశాంత్ కిశోర్ కూడా, అదే కోరుకుంటున్నారు. బీజేపీని ఓడించడం ఒక్కటే తన ముందున్న కర్తవ్యంగా ఆయన భావిస్తున్నారు. బెంగాల్ విజయం తర్వాత ఎన్నికల వ్యూహ రచన వ్యాపకం నుంచి తప్పు కుంటున్నట్లు ప్రశాంత్ కిషోర్, ఇప్పడు మరింత విస్తృత స్థాయిలో అదే బాధ్యతను మరో రూపంలో బుజానికి ఎత్తుకున్నారు.
ప్రస్తుత పరిస్థితిలో బెజీపీని ఓడించడం, కాంగ్రెస్ సహా ఏ ఒక్క పార్టీతోనూ అయ్యే పని కాదు. ఇది అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలు అన్నీ అంగీకరిస్తున్నదే. అన్ని పార్టీలను, కనీసం ఎన్డీఎ యేతర పార్టీలను ఏకం చేస్తేనే కానీ, బీజేపీని ఓడించడం సాధ్యం కాదు. ఇది కూడా, సో కాల్డ్ జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అంగీకరిస్తున్నదే. అలాగే, అన్నీ పార్టీలు ఏకం కావాలని, ఇంచుమించుగా అన్ని పార్టీలు కోరుకుంటూనే ఉన్నాయి. ఎటొచ్చి పిల్లి మెడలో గంట కట్టేదెవరు?అన్న దగ్గరే ఇంతవరకు అందరి ఆలోచనలు మిగిలి పోయాయి. గతంలో చేసిన అలాంటి ప్రయత్నాలు కూడా మూడు నాళ్ళ ముచ్చటగానే ముగిసి పోయాయి. ఈ నేపధ్యంలోనే, బీజేపీ, మోడీ పట్ల వ్యతిరేక పెరికి పరిస్థితులు అనుకూలిస్తున్న సమయంలో, పిల్లి మెడలో గంట ప్రశ్న మళ్ళీ తెర మీదకు వచ్చింది. ఆ ప్రశ్న చుట్టూనే ప్రాంతీయ, జాతీయ పార్టీల నాయకులు చక్కర్లు కొడుతున్న సమయంలో, నేనున్నానంటూ ముందు కొచ్చారు, ప్రశాంత్ కిశోర్.
ఇప్పుడు ఆయన మార్గ దర్శకత్వంలో, ది మోస్ట్ ఎలిజిబుల్ లీడర్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సారధ్యంలో, జాతీయస్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఒక పక్షం రోజుల క్రితం జూన్ 11 వతేదీన, రాజకీయ వ్యుహకర్త ప్రశాంత్ కిషోర్, ముంబైలో శరద్ పవార్’ను కలవడంతో ఊహాగానంగా మొదలైన బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు, మళ్ళీ నిన్న ఢిల్లీలో పవార్, ప్రశాంత్ సెకండ్ రౌండ్ టాక్స్’తో మరింత కాంక్రీట్ షేప్ తీసుకుంది. ప్రశాంత్ కిషోర్, పవార్ ముంబై సమావేశం తర్వాత ఎలాంటి ప్రకటన లేదు.కానే, ఢిల్లీ రౌండ్ టాక్స్ తర్వాత ఎన్సీపీ అధికార ప్రతినిధి, నవాబ్ మాలిక్ మీడియా ముందుకొచ్చి, శరద్ పవార్ ప్రతిపక్ష పార్టీల నాయకులు అందరినీ ఏకం చేసే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారన్న శుభ వార్తను చెప్పారు.
మంగళవారం జరుగతున్న ఎన్సీపీ కార్యవర్గ సమావేశంలో ఈ విషయమ పై మరింత లోతుగా చర్చించే అవకాశం ఉందని నవాబ్ మాలిక్ సూచనప్రాయంగా చెప్పారు. అలాగే, మంగళవారం సాయత్రం, పవార్ దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితిని చర్చించేందుకు,వివిధ పార్టీల నాయకులతో సమావేశం అవుతున్నారని చెప్పారు. ఈ సమావేశంలో తృణమూల్ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా, ఆర్జేడీ నాయకుడు మనోజ్ ఝా, ఆప్ ప్రతినిధి సంజయ్ సింగ్, ఇతర పార్టీలకు చెందినా పవన్ వర్ర్మ, సంజయ్ సింగ్, డి.రాజా, ఫరూక్ అబ్దుల్లా, కొద్ది మంది మోడీ వ్యతిరేక మేథావులు, కేటీ తులసీ వంటి వారు హాజరావుతున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. అయితే, ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించక పోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకిస్తోంది. ప్రశాంత్ కిషోర్, ‘మిషన్ 2024’ప్రచారం రాహుల్ గాంధీని అభ్యర్ధిని చేద్దామనే, ట్వీట్ తోనే ప్రారంభమైంది. అలాంటిది ఇప్పుడు, కాంగ్రెస్’ను పక్కన పెట్టి, బీజేపే వ్యతిరేక కూటమి ఏర్పాటుకు సన్నాహాలు చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. (ఒక వేళ ఈ సమావేశం రాహుల్ గాంధీకి మద్దతు కూడ గట్టేన్డుకోనేమో అన్న సందేహలు వినవస్తున్నాయి.
అయితే, ప్రధానంగా బీజేపీ, మోడీని ఓడిచడం లక్ష్యంగా మొదలైన ప్రయత్నంగానే దీని చూడాలని, చివరకు ఇది ద్వితీయ ఫ్రంట్ అవుతుందా, తృతీయ ఫ్రంట్ అవుతుందా, అన్నది ప్రస్తుతానికి అప్రస్తుతమని ఎన్సీపీ నాయకుడు ఒకరు చెప్పారు. కాబటి ఫ్రంట్ ‘లో కాంగ్రెస్ రోల్ గురించి ఇప్పుడే చర్చించడం అనవసరంగాన రాజకీయ వర్గాలు చూస్తున్నాయి. అయితే, ఈ మొత్తం ప్రణాలిక వెనక ఉన్నది, నిన్న గాక మొన్న బెంగాల్, తమిళనాడులో మోడీ, షా ద్వయాన్ని చిత్తు చేసిన ప్రశాంత్ కిషోర్ కావడంతో, ఈ పరిణామాలు అందరిలో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్, ఏమైనా చేయగల ఘటన ఘటన సమర్ధుడు, సో.. ఊహాగానాలు వదిలి ... జరిగే పరిణామాలను గమనించడమే ప్రస్తుతానికి ఉభయతారకం.