లవ్ పోయిందని.. శానిటైజర్ తాగి అమ్మాయి మృతి..

ప్రేమ అనేది ఒకప్పుడు అందమైన ప్రపంచం. అదే ప్రేమ ఇప్పుడు అందమైన అబద్దం అని చెప్పవచ్చు.. ఎందుకంటేప్రేమ పేరుతో పెళ్లి తర్వాత చేయాల్సిన పనులన్నీ ముందే చేస్తున్నారు నేటి యువతీ.. అన్ని అనుభవించి ఆ తర్వాత ఆ అమ్మాయి నన్ను మోసం చేసిందని.. ఆ అబ్బాయి నన్ను వాడుకొని మోసం చేశారని చెప్పి చివరికి ప్రాణాలు వీడుతున్నారు.. మరి ఇలాంటి మరణాలకు కారణం ఎవరు పిల్లల దల్లిదండ్రుల.. లేక కామం మత్తులో ఉంది.. తప్పులు చేసే ప్రేమికులదా..? సరే తప్పు ఎవరికేదైనా అమాయకుల ప్రాణాలు పోతున్నాయి.. ఒక్కసారి ఆలోచించండి..ఇక వివరాల్లోకి వెళితే..  ప్రేమించిన యువకుడు పెళ్లికి నో చెప్పడంతో మనస్థాపం చెందిన ఓ యువతి ఆత్యహత్యయత్నం...ప్రేమ పేరుతో శారీరకంగా వాడుకుని ఆపై మోసం..! శానిటైజర్ తాగిన యువతి ఖమ్మం జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్రేమించిన యువకుడు పెళ్లికి నో చెప్పడంతో మనస్థాపం చెందిన ఓ యువతి ఆత్యహత్యయత్నం చేసింది. సెల్ఫీ వీడియో తీసుకుంటూ బాటిల్ శానిటైజర్ తాగేసింది. తన చావుకు కారణమైన ఎవరిని వదిలిపెట్టవద్దని యువతి సుసైడ్ నోట్ కూడా రాసింది. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం చిరునోముల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సింధు.. రావినూతల గ్రామానికి చెందిన వేణు గత నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నారు.  ప్రేమించేటప్పుడు కులాలు, మతాలూ అడ్డురాని వీరి ప్రేమకి పెళ్లి చేసుకో  ప్రియురాలు అడగానే కులం అడ్డువచ్చింది. కులాలు వేరు కావడంతో వేణు పేరెంట్స్ వీరి ప్రేమను ఒప్పుకోలేదు. ఇక వేణు కూడా ప్రేమించి, మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి సింధును శారీరికంగా వాడుకున్నాడు. కానీ పెళ్లి విషయంలో మాత్రం పేరెంట్స్ అంగీకరించడం లేదంటూ మొహం చాటేశాడు. దీంతో సింధు పోలీసులకు కంప్లైంట్ చేసింది. పోలీసులు లైట్ తీసుకున్నారు. అక్కడ కూడా తనకు న్యాయం జరగలేదని సూసైడ్ నోట్‌లో రాసుకొచ్చింది. గతంలో రెండు సార్లు సింధు,  వేణు ఇంటి ముందు ఆందోళనకు దిగింది.. అయినా  కూడా ఆమెకు న్యాయం జరగలేదు. తనకు జరిగిన అన్యాయాన్ని అడగడానికి ఎవరు ముందుకు రాలేదు. వేణు తల్లిదండ్రులు కూడా తనను పిచ్చిపిచ్చిగా బూతులు తిట్టారని సింధు పేర్కొంది. తనలా ఏ అమ్మాయికి అన్యాయం జరగకూడదని చెబుతూ సింధూ సెల్పీ వీడియో తీసుకుంటూ తీసుకొని శానిటైజర్ తాగింది. ప్రస్తుతం ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సింధు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈటల బర్తరఫ్ కు అసలు కారణం ఇదే.. కేటీఆర్ సంచలనం..

తన మంత్రి వర్గం నుంచి సీనియర్ నేత ఈటల రాజేందర్ ను బర్తరఫ్ చేసి సంచలనానితి తెరలేపారు ముఖ్యమంత్రి కేసీఆర్. అప్పటి నుంచి తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిమాలు జరిగాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. తనను మంత్రివర్గం నుంచి తొలగించడంపై కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు ఈటల రాజేందర్. కేసీఆర్ కుటుంబంపైనా ఆరోపణలు చేశారు. బీజేపీలో చేరిన తర్వాత తన ఆరోపణల్లో మరింత తీవ్రత పెంచారు ఈటల. కేసీఆర్ టార్గెట్ గానే ఆయన ముందుకు పోతున్నారు. అయితే ఈటల ఎన్ని విమర్శలు చేసినా.. కరీంనగర్ జిల్లా నుంచే ప్రాతినిద్యం వహిస్తున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మాత్రం స్పందించలేదు. ఈటల విషయంలో కేటీఆర్ సైలెంటుగా ఉండటంపైనా రాజకీయ వర్గాల్లో చర్చలు జరిగాయి.  అయితే తాజాగా ఈటల రాజేందర్ విషయంలో స్పందించారు మంత్రి కేటీఆర్. ఈటల రాజేందర్‌ ను భర్తరఫ్ ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పారు.ఈటలకు టీఆర్ఎస్ ఎలాంటి నష్టం చేయలేదన్నారు. 2003లో ఎంత కష్టమైనా పార్టీ టికెట్ ఇచ్చిందని గుర్తు చేశారు. టీఆర్ఎస్‌లో పదవులు అనుభవిస్తూనే.. ఇతర పార్టీ నేతలతో ఈటల సంప్రదింపులు జరిపారన్నారు కేటీఆర్. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆ భేటీలోనే మాట్లాడితే పోయేదని.. కానీ, సింపతి కోసం ప్రజల దగ్గర మాట్లాడి ఆయనకు ఆయనే దూరమయ్యారని చెప్పారు. ఈటల పార్టీలోకి రాకముందే కమలాపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ బలంగా ఉందన్నారు. హుజూరాబాద్‌లో పార్టీల మధ్యనే పోటీ ఉందని.. వ్యక్తుల మధ్య కాదని కేటీఆర్ అన్నారు. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అసలు పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. ఏడేళ్లలో కేంద్రం దేశంలో ఏం చేసిందో చెప్పే ధైర్యం బీజేపీ నేతలకు ఉందా? అన్నారు. చిల్లర రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. నిరుద్యోగ సమస్యపై తప్ప ప్రతిపక్షాలు మాట్లాడేందుకు సబ్జెక్ట్ లేదని కేటీఆర్ విమర్శించారు. 

సోనూసూద్ ని కొట్టిన హీరో.. రెచ్చిపోయిన సోనూసూద్ అభిమాని.. 

ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ కరోనా సంక్షోభంలో ప్రజలకు సహాయం చేస్తూ  ఆపద్బాంధవుడిగా నిలిచాడు. ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నాడు. ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచాడు. సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించే సోనూసూద్ తన దాతృత్వంతో దేశ ప్రజలకు రియల్ హీరోగా మారాడు. అలాంటి వ్యక్తికి ఏమైనా జరిగితే తట్టుకోవడం అభిమానులకు కష్టసాధ్యమే. అది సినిమా అయినా నిజ జీవితంలో అయినా! సోనూసూద్ ప్రజలందరికీ అండగా నిలబడి అందనంత ఎత్తు ఎదిగాడు.. అయితే సోనుసూద్ ని కొట్టారు.. చివరికి చిర్రెత్తిపోయిన సోనుసూద్అ అభియాని ఏం చేశాడో చూడండి.. అసలు సోను సూద్ ను కొట్టడం అనేదే తప్పు.. అందులోను అది నువ్వు న్యూస్ రాయడం ఇంకా తప్పు అనుకుంటున్నారా.. ఎదురుగా ఉంటే నన్ను కూడా కొట్టాలనిపిస్తుంది కాదు.. సరే మీకు ఏది అనిపించినా మీరు విన్నది నిజం.. అసలు విషానికి వెళ్దాం పదండి..  తెలంగాణలోని సూర్యాపేట జిల్లా హుజూర్‌‌నగర్ మండలం వేపలసింగారానికి చెందిన చండపంగు గురవయ్య, పుష్పలత తమ ఏడేళ్ల కుమారుడు విరాట్‌తో కలిసి ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు సంగారెడ్డి జిల్లా  న్యాల్కల్ వెళ్లారు. అనంతరం కుటుంబ సభ్యులందరూ కలిసి టీవీలో సినిమా చూస్తున్నారు. ఆ సినిమాలో విలన్ అయిన సోనూసూద్‌ను హీరో కొట్టడంతో కోపంతో ఊగిపోయిన ఏడేళ్ల విరాట్ పక్కనే ఉన్న రాయి అందుకుని టీవీని పగలగొట్టేశాడు. దీంతో విస్తుపోయిన కుటుంబ సభ్యులు తేరుకుని టీవీని ఎందుకు పగలగొట్టావని ప్రశ్నించగా అతడు చెప్పిన సమాధానం వారిని మరింత ఆశ్చర్యపరిచింది. సోనూసూద్‌ను కొట్టడంతో తనకు కోపం వచ్చిందని, అందుకే టీవీని పగలగొట్టానని చెప్పడంతో వారు షాక్ తిన్నారు. ఈ విషయం సోనూసూద్ దృష్టికి వెళ్లడంతో, ఆయన దీనిని తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. సోను సూద్ అంటే మాములు విషయమా చెప్పండి.. అతని కోసం ఆ మాత్రం చేయాల్సిందే అని అది చూసిన స్థానికులు ఫంక్షన్ కి వచ్చిన వాళ్ళు  మాట్లాడుకుంటున్నారు.. 

షర్మిల వెనకుంది ఆ ఇద్దరే ..

ఎవరేమనుకున్నా  డోంట్ కేర్ ... సిపిఐ నారాయణ తాను చెప్పదలచుకున్నదేదో  చెప్పేస్తారు..ఎలాంటి శషబిషలులేకుండా కుండ బద్దలు కొట్టేస్తారు. ఒక వేళ ఆయన చెప్పింది తప్పని తేలినా, ఆయనేమీ ఫీలై పోరు ... సారీ చెప్పేస్తారు. అప్పుడెప్పుడో గాంధీ జయంతి రోజున .. పొద్దున్నే లేచి ఇంచక్కా ఇడ్లీతో కోడి కూర లాగించేసి ...అ తర్వాత నాలుక కరుచుకున్నారు. అందుకు ప్రాయశ్చిత్తంగా సంవత్సరం పాటు, ‘నో చికెన్’ దీక్షను కూడా పాటించారు.అలాగే, జీహెచ్ఎంసీ ఎన్నికలలో తెరాసకు వంద సీట్లు వస్తే చెవి కోసుకుంటానన్నారు ... ఆ పని మాత్రం చేయలేదు. నవ్వేసి వదిలేశారు. ఇక అక్కడి నుంచి ఆయన ఆ తరహ, ‘హుమరసం’ వార్తలకు పెట్టింది పేరు .. పేటెంట్ అయిపోయారు.  కొద్ది రోజుల క్రితం సీపీఐ సహా వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు, ఇతర  పార్టీలు, ప్రజా సంఘాలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే, అదంతా వేస్ట్ అని తేల్చేశారు నారాయణ. చిన్న చిట్కా చెప్పేశారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తలచుకుంటే ఒక్క క్షణంలో ప్రైవేటీకరణ ప్రయత్నాలకు బ్రేక్ పడిపోతుందని తేల్చేసారు.  ఇప్పుడు తాజాగా తెలంగాణలో వైఎస్ షర్మిల వైఎస్సార్ టీపీ జెండా ఎగరేయడం వెనక ఎవరున్నారో ... ఒకే ఒక్క మాటతో తేల్చేసారు. ఆమె తెలంగాణలో పార్టీ పెట్టడానికి ఇంకెవరో కాదు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న జగన్ రెడ్డి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దన్న కేసీఆర్ ఉన్నారని, ఆ ఇద్దరే ఆమెను ఆడిస్తున్నారని తేల్చిచెప్పారు. ఎవరికీ అనుమానం అక్కరలేదు, షర్మిల ఇద్దరు ముఖ్యమంత్రుల ముద్దుల చెల్లి, లేదంటే తెలంగాణలో ఇంత స్వేచ్చగా, ధైర్యంగా రాజకీయం చేయగలరా? అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ వ్యతిరేక ఓటును చీల్చేందుకే షర్మిలను తెలుగు ముఖ్యమంత్రులే రంగంలోకి దించారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.రెండు తెలుగు రాష్ట్రల మధ్య సాగుతున్న జల యుద్ధం, కూడా ఆ ఇద్దరు కలిసి రచించిన నాటకమే అన్న అర్థం వచ్చేలా చురకలు వేశారు. ఇద్దరు ముఖ్యమంత్రులు డ్రామాలు ఆపేస్తే జలవివాదం సమసిపోతుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు సీఎంలు డ్రామాలు ఆడుతున్నారని ఆయన అన్నారు.  సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని రెబల్ ఎంపీ రఘురామ వేసిన పిటిషన్‌పైన నారయణ తమదైన స్టైల్లో వ్యాఖ్యలు  చేశారు. అమిత్ షా ఉన్నంత కాలం జగన్ బెయిల్ రద్దు కాదని నారాయణ అన్నారు. జగన్‌కి అమిత్‌ షా అండదండలు పుష్కలంగా ఉన్నాయని ఆయన చెప్పారు. నిజంగా కూడా, బుధవారం సీబీఐ న్యాయస్థానంలో జరిగిన తంతు చూస్తే అదే నిజం అని పిస్తుంది. ఇంతవరకు, ఎలాంటి వాదనలు చేసేది లేదని, కోర్టు నిర్ణయానికి వదిలేసిన  సిబిఐ ఈరోజు ... తమ వాదనలు లిఖిత పూర్వకంగా వినిపిస్తానని అందుకు పది రోజులు సమయం కావాలని కోరింది. ఈ సందర్భంగా విచారణను వాయిదా వేసేందుకే సీబీఐ తరచూ తమ  వైఖరి మార్చుకుంటోందని  రఘురామా కృష్ణం రాజు తరపు న్యాయవాది ఆరోపించారు. అయినా కేసు విచారణ చేస్తున్న సీబీఐ న్యాయస్థానం విచారణను జూలై 26 కు వాయిదా వేసింది.  

జగన్ బెయిల్ కేసులో కొత్త ట్విస్ట్.. సీబీఐ యూటర్న్ తీసుకోనుందా? 

అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ పై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో బుధవారం  విచారణ జరిగింది. ఈ కేసులో ఈనెల 8న జగన్, రఘురామ కృష్ణరాజు తమ వాదనలను లిఖితపూర్వకంగా సమర్పించారు.  సీబీఐ మాత్రం వాదించేది ఏదీ లేదని పిటిషన్ లోని అంశాలను చట్టపరిధిలో, విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవాలని కోర్టును కోరింది. అయితే బుధవారం జరిగిన విచారణలో మాత్రం కీలక పరిణామం చోటు చేసుకుంది.  జగన్ బెయిల్ రద్దు చేయాలన్న కేసులో సీబీఐ లిఖితపూర్వక వాదనలు సమర్పించక పోవడాన్ని కోర్టు దృష్టికి పిటిషనర్ తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కౌంటర్ ధాఖలు చేయడానికి 10 రోజులు గడువు కావాలని సీబీఐ కోరింది. ఇప్పటికే సీబీఐ అధికారులకు రెండు దఫాలు అవకాశమిచ్చారని, ఇప్పుడు మరో అవకాశం ఇవ్వొద్దని కోర్టుకి తెలిపారు పిటిషనర్. సీబీఐ అనేది దర్యాప్తు సంస్థ కాబట్టి చివరిగా ఒకసారి అవకాశం ఇస్తున్నామని కోర్టు తెలిపింది. తదుపరి విచారణను 26కి వాయిదా వేసింది. అయితే గతంలో వాదించేది ఏదీ లేదని పిటిషన్ లోని అంశాలను చట్టపరిధిలో, విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవాలని కోర్టును కోరిన.. సీబీఐ ఈసారి మాత్రం యూటర్న్ తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అందుకే గతంలో చెప్పిన విషయాన్నే చెప్పకుండా 10 రోజుల గడువు కావాలని కోరారని అంటున్నారు. సీబీఐ తీరుతో కేసులో కీలక పరిణామాలు జరగవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  జగన్‌పై ఉన్న కేసుల్లో సాక్షులు, నిందితులుగా ఉన్న అధికారులు ప్రస్తుతం ఏపీలో మంచి హోదాలో పని చేస్తున్నారని వారిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఏపీ సీఎం ప్రభావితం చేసే అవకాశం ఉందని లిఖిత పూర్వక వాదనల్లో పిటిషనర్ తెలిపారు. గతంలో ఐఏఎస్‌గా ఉన్న నిమ్మగడ్డ రమేశ్‌ను ఏపీ సీఎం వేధింపులకు గురిచేశాడని.. అలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయన్నారు. ఐఏఎస్, ఐపీఎస్‌ల ట్రాక్ రికార్డ్ చూడాల్సిన బాధ్యత సీఎస్ పరిధిలో ఉంటుందని, కానీ ప్రత్యేక జీవో ద్వారా సీఎం జగన్ ఆ అధికారులను బదిలీ చేసుకున్నారన్నారు. దీంతో సాక్షులుగా ఉన్న అధికారులను పరోక్షంగా ప్రభావితం చేసే అవకాశం ఉందని, ముమ్మాటికి ఏపీ సీఎంగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి బెయిల్ షరతులను ఉల్లగించారన్నారు. దీంతో 10 రోజుల తర్వాత సీబీఐ దాఖలు చేయనున్న కౌంటర్ లో ఏం ఉండనుంది అన్నది ఇప్పుడు చర్చగా మారింది. వైసీపీలోనూ టెన్షన్ పుట్టిస్తోంది. 

ఈటల ఎఫెక్ట్‌.. ర‌స‌మ‌యికి మ‌ళ్లీ బిస్కెట్‌.. పాట క‌ట్టి తిట్టినా అంద‌లం అందుకేనా?

తెలంగాణ‌ సాంస్కృతిక సార‌థి ఛైర్మ‌న్‌గా ర‌స‌మ‌యి బాల‌కిష‌న్‌. ఇన్నాళ్లూ ఆ పోస్ట్‌లో ఆయ‌నే ఉన్నారు. మ‌రో మూడేళ్ల పాటూ ఆయ‌నే ఉంటారు. ఇందులో అంత ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏముంది అనిపించ‌వ‌చ్చు.  పైపైన చూస్తే అలానే ఉంటుంది. కేసీఆర్ మాస్ట‌ర్ మైండ్ గురించి తెలిసిన వారు ఔరా అన‌క మాన‌రు. మేట‌ర్ అలాంటిది మ‌రి. ర‌స‌మ‌యి ప‌ద‌వి కంటిన్యూ అవ‌డం వెనుక‌.. ఈట‌ల ఎఫెక్ట్.. కేసీఆర్ వ్యూహం దాగుందంటున్నారు. అదెలాగంటే..... ఎమ్మెల్యే ర‌స‌మ‌యి బాల‌కిష‌న్‌.. వంద‌కు వంద శాతం ఈట‌ల రాజేంద‌ర్ మ‌నిషి అని అంటారు. కేసీఆర్ ప్రోత్సాహంతో పాటు ఈట‌ల అండాదండాతోనే ఆయ‌న ఈ స్థాయికి ఎదిగార‌ని చెబుతారు. గ‌తంలో మేం గులాబీ జెండాకు బానిస‌లం కాదు.. ఓన‌ర్ల‌మంటూ ఈట‌ల రాజేంద‌ర్ రెబెల్ కామెంట్స్ చేసిన మ‌ర్నాడే ర‌స‌మ‌యి ఈట‌ల ఇంటికి వెళ్లి మ‌రీ క‌లిసొచ్చారు. నేనుసైతం నీ వెంటేన‌ని మ‌ద్ద‌తు తెలిపార‌ని అంటారు. అంత అనుబంధం వారిద్ద‌రి మ‌ధ్య‌.  ఇక ఈట‌ల ఎపిసోడ్ త‌ర్వాత వార్త‌ల్లోకి వ‌చ్చిన మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డి ఉదంతంలోనూ ర‌స‌మ‌యి యాక్టివ్ పార్టిసిపేష‌న్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. క‌ర్నాట‌క‌లోని హంపిలో మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డి కుమారుడి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా గ్రాండ్‌ పార్టీ జ‌రిగింది. అందులో, ఈట‌ల వ్య‌వ‌హారం ప్ర‌ధానంగా చ‌ర్చ‌కొచ్చింద‌ట‌. కేసీఆర్ నాయ‌క‌త్వం, కేటీఆర్ ఓవ‌రాక్ష‌న్‌పైన టీఆర్ఎస్ ముఖ్య‌నేత‌లు చెవులు కొరుక్కున్నార‌ట‌. కాస్త‌, మందెక్కువైందో లేక‌, మ‌నోడు స్వ‌త‌హాగా మంచి క‌ళాకారుడు కావ‌డ‌మో.. కార‌ణం ఏదైనాగానీ.. కేసీఆర్‌, కేటీఆర్‌ను విమ‌ర్శిస్తూ అప్ప‌టిక‌ప్పుడు పాట క‌ట్టి.. గొంతెత్తి పాడార‌ట ర‌స‌మ‌యి బాల‌కిష‌న్‌. ఆ సంగ‌తి చాలారోజుల త‌ర్వాత ఇటీవ‌ల బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీంతో.. ఈట‌ల త‌ర్వాత నెక్ట్స్ వేటు మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డిపైనే నంటూ ప్ర‌చారం జ‌రిగింది. అయితే, అలా త‌న‌ను విమ‌ర్శించిన వారంద‌రిపైనా వేటు వేసుకుంటూ పోతే.. టీఆర్ఎస్‌లో త‌న కుటుంబం మిన‌హా ఎవ‌రూ మిగ‌ల‌ర‌నే విష‌యం గులాబీ బాస్‌కు తెలియంది కాదు. అందుకే, మంత్రి జ‌గ‌దీష్‌పై యాక్ష‌న్ సంగ‌తి ప్ర‌స్తుతానికైతే ప‌క్క‌న పెట్టేశార‌ని అంటారు.   ఇక ర‌స‌మ‌యి బాల‌కిష‌న్‌. కేసీఆర్‌ను, కేటీఆర్‌ను పాట‌పాడి మ‌రీ తిట్టాడ‌ని తెలుసు. ఆయ‌న ఈట‌ల మ‌నిషి అనీ తెలుసు. అయినా.. ప‌క్క‌న పెట్టేయ‌కుండా.. మ‌రోసారి తెలంగాణ సాంస్కృతిక సార‌థి ఛైర్మ‌న్ చేయ‌డం వెనుక కార‌ణం ఏమై ఉంటుందా? అనే అనుమానం రాక‌మాన‌దు. అక్క‌డే ఉంది కేసీఆర్ తెలివి. కేసీఆర్ ముందున్న మెయిన్ టార్గెట్ హుజురాబాద్‌లో ఈట‌ల‌ను ఓడించ‌డం. ఇప్ప‌టికిప్పుడు ర‌స‌మ‌యిపై వేటు వేస్తే గులాబీ బాస్‌కు క‌లిగే ప్ర‌యోజ‌నం ఏమీ ఉండ‌క‌పోగా.. ర‌స‌మ‌యి ఎంచ‌క్కా పోయి ఈట‌ల‌తో చేతులు క‌లిపి.. ఆయ‌న కోసం.. గ‌జ్జ క‌ట్టి.. పాట పాడి.. బీజేపీని గెలిపించే ప్ర‌య‌త్నం చేస్తారు. అదే, ర‌స‌మ‌యికి మ‌రోసారి ఆ ప‌ద‌వేదో పారేస్తే.. మా కేసీఆర్ మంచోడు.. అంత‌గా తిట్టినా.. తిరిగి త‌న‌కే ఆ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టాడంటూ.. క‌ట్ట‌ప్ప‌లా ప్ర‌గ‌తిభ‌వ‌న్ కోసం క‌ష్ట‌ప‌డి ప‌ని చేస్తాడ‌ని భావించి ఉంటారు కేసీఆర్‌. అందుకే, హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల ముందుర‌.. కీల‌క‌మైన ఈ స‌మ‌యంలో.. ర‌స‌మ‌యిని నొప్పించ‌క‌.. ఆయ‌నెళ్లి ఈట‌ల‌తో చేతులు క‌ల‌పకుండా చేసేలా.. మ‌ళ్లీ సాంస్కృతిక సార‌థి ఛైర్మ‌న్ ప‌ద‌వి బాల‌కిష‌న్‌కే క‌ట్ట‌బెట్టార‌ని అంటున్నారు. మ‌రి, ప‌ద‌వి తీసుకున్న ర‌స‌మ‌యి కేసీఆర్ కోస‌మే ప‌ని చేస్తార‌నే గ్యారంటీ ఉందా? త‌న పెద్ద‌దిక్కు ఈట‌ల‌కు లోపాయికారిగానైన సాయం చేయ‌కుండా ఉంటారా? ఇప్పటికిప్పుడు కాక‌పోయినా.. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల నాటికైనా ర‌స‌మ‌యిపై వేటు ప‌డ‌కుండా ఉంటుందా? ఏమో, రాజ‌కీయాల్లో ఏదైనా సాధ్య‌మే...

మావోయిస్టు కీలక నేత లొంగుబాటు..

దండకారణ్యంలో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. దండకారణ్య స్పెషల్ జోన్ కార్యదర్శి రామన్న కుమారుడు రావుల రంజిత్ అలియాస్ శ్రీకాంత్  లొంగిపోయారు. మావోయిస్టు, ప్లాటూన్ పార్టీ కమిటీ సభ్యుడిగా ఉన్న రావుల రంజిత్  తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి ఎదుట లొంగిపోయారు. దండకారణ్యంలో రావుల రంజిత్ కీలక బాధ్యతలు చేపట్టారు. రెండు సంవత్సరాల క్రితం ఆనారోగ్య  సమస్యతో రామన్న చనిపోయారు. రావుల రంజిత్ కూడా ప్రస్తుతం అనారోగ్యంతో బాధ ప‌డుతుండటంతో ఆయ‌న లొంగిపోయాడు. ఈ సందర్భంగా రంజిత్ కు రూ. 4 లక్షల రివార్డును అందజేశారు డీజీపీ మహేందర్ రెడ్డి.  మావోయిస్టు కార్యక్రమాలపై మావోయిస్టు నేత రామన్న కుమారుడు మావోయిస్టు రంజిత్ విరక్తి చెంది లొంగిపోవడానికి తనను ఆశ్రయించారని డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు. పాఠశాల వయసు నుంచే మావోయిస్టు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారని తెలిపారు. ప్రస్తుతం మావోయిస్టు భావజాలంతో ఎలాంటి ప్రయోజనం లేదనే అభిప్రాయంతో రంజిత్ ఉన్నారన్నారు. రంజిత్ తల్లి సావిత్రి సైతం మావోయిస్టు కీలక సభ్యురాలిగా ఉందని, ఆమెకు విషయం తెలిపే రంజిత్ లొంగిపోయినట్లు డీజీపీ వెల్లడించారు. మిగితా మావోయిస్టులు సైతం మన్యం వీడి జనాల్లోకి రావాలని డీజీపీ పిలుపునిచ్చారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని చెప్పారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన 14 మంది కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నారని వారంతా లొంగిపోవాలని ఆయన సూచించారు. వీరిలో 11 మంది తెలంగాణకు చెందిన వారు కాగా.. మరో ముగ్గురు ఏపీకి చెందిన వారు ఉన్నట్లు తెలిపారు. మావోయిస్టులో చాలా మంది ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నారని చెప్పారు. రావుల రంజిత్‌ స్వస్థలం సిద్దిపేట జిల్లా ముగ్దుర్ మండలం బెక్కల్ గ్రామం. 2010 లో ఆయన నిజామాబాద్ లో పదో తరగతి పూర్తి చేశాడు. 1998 లో రావుల రంజిత్ జన్మించాడు. చిన్నప్పటి నుండి మావోయిస్టు కార్యకలాపాల్లో చురుగ్గా వ్యవహరిస్తూ.. 2017లో రామన్న సలహా మేరకు సెకండ్ బెటాలియన్ లో రంజిత్ చేరాడు. 2017 నుంచి 2019 ఆమ్స్ బెటాలియన్ లో పని చేసిన రంజిత్ 2018 కాసారం దాడి, 2021లో జీరం అటాక్‌లో సైతం పాల్గొన్నట్లు డీజీపీ వెల్లడించారు.

కత్తి మృతి పై కొత్త అనుమానాలు..

జూన్ 26న నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి, రెండు వారలు చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొంది .. జులై 10 తేదీన చనిపోయిన, సినిమా క్రిటిక్, నటుడు, కత్తి మహేష్ మృతిపై, ఇప్పుదు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి, ఆయన చనిపోయిన వార్త వచ్చిన వెంటనే కూడా కొందరు ఆయన మృతిపై అనుమానాలు వ్యక్త పరిచారు. కోలుకున్నారు ... రేపో మాపో డిశ్చార్జ్ అవుతారని భావిస్తున్న సమయంలో, ఆయన చనిపోయారని తెలియడంతో సోషల్ మీడియాలో ఆయన సన్నిహితులు కొందరు, ఇంతలోనే ఏమి జరిగింది, ఎలా చని పోయారు? అన్న అనుమానాలను వ్యక్త పరిచారు. అయినా అధికారులు ఎవరూస్పందించలేదు.   సోమవారం చిత్తూరు జిల్లాలోని మహేశ్ స్వగ్రామంలో జరిగిన అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ, చికిత్స విషయంలో కాకుండా, అసలు ప్రమాదం జరిగిన తీరు పైనే అనుమానాలు వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో కారు కుడిభాగం పూర్తిగా  నుజ్జు నుజ్జు అయినప్పటికీ డ్రైవర్ సురేశ్‌ స్వల్పగాయాలతో బయటపడటం, ఎడమ వైపు కూర్చున్న మహేశ్‌కు తీవ్రంగా గాయపడటం అనుమానాలకు తావిస్తోందన్నారు.అయితే, ప్రమాదం జరిగిన సమయంలో కూడా  ఈ అనుమానాలు వ్యక్తమయ్యాయి. అందుకు పోలీసు అధికారులో మహేష్ సీట్ బెల్ట్ పెట్టుకోక పోవడం వలన ఎగిరెళ్ళి గ్లాస్ పడడంతో అద్దాలు పగిలి కంటి సమీపంలో గుచ్చుకున్నాయని వివరణ ఇచ్చారు.సీట్ బెల్ట్ పెట్టుకోక పోవడం వల్లనే ఆయనకు గాయాలయ్యాయని కూడా వివరణ ఇచ్చారు.అలాగే వైద్యులు కూడా కంటికి మాత్రమే గాయమైందని, కన్ను పోయినా ప్రాణహాని లేదని చెప్పినట్లు వార్తలొచ్చాయి. కంటికి   ఆపరేషన్ కూడా చేశారు. ఆపరేషన్ సక్సెస్ అన్న వార్తలూ వచ్చాయి.  మంద కృష్ణ మాదిగ కత్తి మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ  సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేయడంతో  ఏపీ ముఖ్యమత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం వెంటనే స్పందించింది. విచారణకు ఆదేశించింది. పోలీసులు మెరుపు వేగంతో రంగంలోకి దిగారు.ప్రాధమిక విచారణ ప్రారంభించారు.మహేశ్ కారు డ్రైవర్ సురేష్‌ను విచారణకు పిలిచారు. ప్రమాదం జరిగిన తీరు, ప్రమాదం తర్వాత ఏం జరిగిందన్న దానిపై పోలీసులు డ్రైవర్’  ను విచారించినట్లు సమాచరం. ఆలాగే, ఇతర కోణాల్లోనూ విచారణ మొదలైనట్లు తెలుస్తోంది.  అలాగే మంద కృష్ణ మాదిగ అన్నట్లుగా, కత్తి మహేష్’ కు అనేక మంది శత్రువులుండే అవకాశం లేక పోలేదు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణపై తెలంగాణ ప్రభుత్వం, 2018లో  ఆరు నెలల పాటు నగర  బహిష్కరణ శిక్ష విధించింది.చిత్తూరు జిల్లాలోని ఆయన స్వగ్రామానికి పంపివేసింది. అప్పట్లో ఆయన హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముని అవమానించే విధంగా అవహేళన చేస్తూ చేసిన ప్రసంగం ఇప్పటికీ వైరల్ అవుతూనే వుంది. ఈ నేపధ్యంలోనే ప్రమాదం జరినప్పుడు, చివరకు చనిపోయినప్పుడు కూడా సోషల్ మీడియాలో కొందరు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ  విపరీత వ్యాఖ్యలు చేశారు.  కత్తి మహేష్’ శ్రీరాముని మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ సహా కొందరు సినీ హీరోల మీద అదుపు తప్పిన విమర్శలు చేశారన్న ఆరోపణలున్నాయి. అప్పట్లో పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్  మీడియాలో కత్తి మహేష్’  విపరీతంగా ట్రోల్ చేశారు ..అలాగే, కత్తి ఫాన్స్ కూడా ఎదురు దాడి చేశారు. మీడియాలోనూ చాలా పెద్ద ఎత్తున చర్చల రచ్చ జరిగింది. ఈ నేపధ్యంలో ఆయనకు శత్రువులు ఉండే అవకాశం ఉంటుంది. అయితే, అసలు ఏమి జరిగింది, కత్తి మహేష్ ఎలా కన్ను మూశారు? అనేది మాత్రం విచారణలో గానీ, తేలదు.

మ‌ళ్లీ ఎన్టీఆర్ స్లోగ‌న్స్‌.. వ‌ద్దంటే విన‌ట్లే.. అభిమానులు త‌గ్గ‌ట్లే..

వ‌ద్దు బ్ర‌ద‌ర్‌.. అంటున్నా విన‌ట్లే. ఇది స‌మ‌యం కాదంటున్నా.. వ‌ద‌ల‌ట్లే. రామ‌య్యా.. రావాల‌య్యా అంటూ ఒక‌టే గోల‌. రాను రాను.. నేను రాను అంటున్నా అభిమానులు ఎక్క‌డా త‌గ్గ‌ట్లే. మొన్న కుప్పం.. నిన్న సినిమా ఫంక్ష‌న్‌.. ఇవాళ మ‌చిలీప‌ట్నం. ప్లేస్ మారుతోందే కానీ.. స్లోగ‌న్స్ మాత్రం ఆగ‌డం లేదు. జూనియ‌ర్ ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి రావాలంటూ ఫ్యాన్స్ తెగ హంగామా చేస్తున్నారు. ఓవైపు ఎన్టీఆర్ సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉంటున్నా.. అవ‌న్నీ మాకు అన‌వ‌స‌రం అంటూ.. పొలిటిక‌ల్ ఎంట్రీ ఇవ్వాల్సిందేనంటూ.. ఏకంగా చంద్ర‌బాబు ముందే స్లోగ‌న్స్ చేయ‌డం ఆస‌క్తిక‌ర అంశం. తెలుగు త‌మ్ముళ్లు మ‌ళ్లీ తార‌క‌మంత్రం జ‌పిస్తున్నారు. ఈసారి ప్లేస్ మ‌చిలీప‌ట్నంకు షిఫ్ట్ అయింది. మచిలీపట్నంలో ఇటీవలే చనిపోయిన టీడీపీ నేత కాగిత వెంకట్రావు కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వ‌చ్చారు. అధినేతకు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. చంద్ర‌బాబును తోడ్కొని రావ‌డానికి టీడీపీ శ్రేణులు భారీగా త‌ర‌లివ‌చ్చారు. అయితే, టీడీపీ జెండాల‌తో పాటు అభిమానులు జూనియ‌ర్ ఎన్టీఆర్ ఫోటోతో ఉన్న భారీ జెండాను కూడా ప్ర‌ద‌ర్శించారు. ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి రావాలంటూ చంద్ర‌బాబుకు విన‌బ‌డేలా నినాదాలు కూడా చేశారు.  మొన్నామధ్య చంద్రబాబు సొంత ఇలాఖా కుప్పంలో కూడా ఇలానే తారక్ పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.. నినాదాల‌తో హోరెత్తించారు. అప్పుడు చంద్రబాబు ఆ విష‌యాన్ని అంత సీరియస్‌గా తీసుకోలేదు. కానీ, అదే సీన్ మ‌ళ్లీ ఇప్పుడు మ‌చిలిప‌ట్నంలో రిపీట్ కావ‌డం పార్టీకి ఇబ్బందిక‌ర విష‌య‌మే. ఓవైపు ఎన్టీఆర్ త‌న‌కు ఇప్ప‌ట్లో రాజ‌కీయాల్లోకి వ‌చ్చే ఇంట్రెస్ట్ లేద‌న్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. టీడీపీకి సైతం ఇప్ప‌టికిప్పుడు జూనియ‌ర్‌తో పెద్ద‌గా అవ‌స‌రం కూడా లేదు. చంద్ర‌బాబు ఇప్ప‌టికీ యాక్టివ్‌గా పాలిటిక్స్ చేస్తున్నారు. అటు, నారా లోకేశ్ సైతం స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌కుడిగా నిరూపించుకుంటున్నారు. చంద్ర‌బాబు, లోకేశ్‌ల ఆధ్వ‌ర్యంలో పార్టీ ప‌నితీరు భేషుగ్గానే ఉంది. కేవ‌లం అధికారంలో లేక‌పోవ‌డం ఒక్క‌టే మైన‌స్‌.  జ‌గ‌న్‌రెడ్డి అడ్డ‌గోలు విధానాల‌తో వ‌చ్చే ట‌ర్మ్ ఆయ‌న ఎలాగూ ఓడిపోవ‌డం ఖాయం. చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో మ‌ళ్లీ టీడీపీదే అధికారం. ఇక ఏపీ పాలిటిక్స్‌లో జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు స్పేస్ ఎక్క‌డ ఉంది? అంత అర్జెంట్‌గా ఆయ‌న పొలిటిక‌ల్ ఎంట్రీ ఇవ్వాల్సిన అవ‌స‌రం ఏముంద‌నేది సీనియ‌ర్ల అభిప్రాయం. అయితే, అభిమానుల‌కు ఈ లెక్క‌ల‌న్నీ ప‌డ‌తాయా? అందుకే వారి ప‌ని వారు చేస్తున్నారు. అంత‌మంది సీనియ‌ర్లు ఉండ‌గా.. జూనియ‌ర్ మాత్రం ఇప్ప‌ట్లో రాజ‌కీయాల్లోకి వ‌చ్చే ఛాన్సే లేదు. ఫ్యాన్స్ హ‌డావుడితో ఇటు టీడీపీకి, అటు ఎన్టీఆర్‌కి.. ఇద్ద‌రికీ ఇబ్బందే. ఎందుకొచ్చిన గోల చెప్పండి? అంటూ ఎక్క‌డిక‌క్క‌డ‌ త‌మ్ముళ్ల‌ను శాంత‌ప‌రుస్తున్నారు స్థానిక నాయ‌కులు.   

సుప్రీంకు చేరిన జల వివాదం.. విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారన్న ఏపీ 

తెలుగు రాష్ట్రాల మధ్య కొన్న రోజులుగా సాగుతున్న జల వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. కృష్ణా జలాలు, ప్రాజెక్ట్‌ల అంశంలో తెలంగాణ వైఖరిని తప్పుబడుతూ  దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది జగన్ ప్రభుత్వం.తమకు న్యాయంగా దక్కాల్సిన వాటాకు తెలంగాణ ప్రభుత్వం గండి కొడుతోందని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు పరిధిని నోటిఫై చేయాలని పిటిషన్ లో ఏపీ ప్రభుత్వం కోరింది.  తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఏపీ ప్రభుత్వం ఆరోపించింది. తాగు, సాగు నీటిని ఏపీ ప్రజలకు దక్కకుండా చేస్తూ... తమ రాష్ట్ర ప్రజల హక్కులను తెలంగాణ కాలరాస్తోందని తెలిపింది. విభజన చట్టాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని చెప్పింది. కృష్ణా జలాల పంపిణీ అవార్డును అనుసరించడం లేదని తెలిపింది. జూన్ 28న తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని సుప్రీంకోర్టును కోరింది. విభజన చట్టం ప్రకారం తెలంగాణ ప్రభుత్వం నడుచుకోవడం లేదని ఆరోపించింది ఏపీ సర్కారు. పరిధులను నోటిఫై చేసేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేసింది. జూన్ 28న తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని పిటిషన్‌లో కోరింది.  శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల రిజర్వాయర్ల పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా నియంత్రణ ఉండాలని పేర్కొంది.ప్రాజెక్ట్‌ల దగ్గర CISF భద్రత కల్పించాలని పేర్కొంది. దిగువ రాష్ట్ర ప్రయోజనాల దెబ్బతీసే విధంగా తెలంగాణ వ్యవహరిస్తోందని, సాగు, తాగునీటి అవసరాలకు కాదని విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోందని, దీని నిలువరించాలని కోరింది.  కృష్ణా జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం ముదిరింది. వాటాకు మించి అక్రమంగా నీటిని వాడుకుంటున్నారని రెండు రాష్ట్రాలు ఆరోపించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి ఏపీ సీఎం జగన్ లేఖ కూడా రాశారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం ఆశ్రయించింది. కృష్ణా బోర్డుకు, కేంద్ర జలశక్తికి ఫిర్యాదు చేసినా స్పందన లేదని, కాబట్టే సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వచ్చిందని చెబుతోంది ఏపీ ప్రభుత్వం. 

క‌రివేపాకు అధికారులా? ముఖ్య‌మంత్రిదే త‌ప్పిద‌మా?

ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి. ముఖ్య‌మంత్రి కార్యాల‌యం. ఈ రెండు వ్య‌వ‌స్థ‌లు స‌మ‌న్వ‌యంతో ప‌ని చేసిన‌ప్పుడే సుప‌రిపాల‌న‌. ఏ మాత్రం బ్యాలెన్స్ త‌ప్పినా.. ఆధిప‌త్య పోరు త‌ప్ప‌దు. ఇక ముఖ్య‌మంత్రే తాను చెప్పినట్టు చేసే అధికారిని నెత్తిన పెట్టుకోవ‌డం.. త‌న‌కు కావ‌ల‌సిన ప‌నులు చేయించుకోవ‌డం.. చేస్తుంటే ఇక ఆ ఆఫీస‌ర్‌కు అడ్డూఅదుపు ఏముంటుంది? ఆయ‌న‌ ఎవ‌రి మాట లెక్క చేస్తారు? సీఎం త‌ర్వాత తానే సీఎం అన్నంత‌గా బిల్డ‌ప్ కొట్ట‌రూ? ఏపీ సీఎంవోలో అదే జ‌రుగుతోంద‌ని అంటున్నారు. ఐఏఎస్ ప్ర‌వీణ్ ప్ర‌కాశ్‌కు సీఎం జ‌గ‌న్‌రెడ్డి ఓవ‌ర్ ప్ర‌యారిటీ ఇవ్వ‌డం.. ఆయ‌నిప్పుడు ఏకు మేకై కూర్చోవ‌డం.. త‌న‌దే రాజ్య‌మ‌న్న‌ట్టు.. ఏకంగా సీఎస్‌నే లెక్క చేయ‌క‌పోవ‌డం జ‌రుగుతోంద‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. గ‌త సీఎస్ ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యంను సైతం ఇలానే కేర్ చేయ‌క‌పోవ‌డం.. సీఎం జ‌గ‌న్ సైతం ప్ర‌వీణ్‌ప్ర‌కాశ్‌కే స‌పోర్ట్ చేయ‌డంతో.. ఎల్వీ ఆక‌స్మికంగా సీఎస్ ప‌ద‌వి వీడాల్సి వ‌చ్చింది. రెండేళ్లుగా జ‌గ‌న్ స‌పోర్ట్‌తో సీఎంవోలో హ‌వా చెలాయించిన ప్ర‌వీణ్ ప్ర‌కాశ్ యాక్ష‌న్‌.. ఓవ‌రాక్ష‌న్‌గా మార‌డమే ఆయ‌న అధికారాల‌కు కోత ప‌డటానికి కార‌ణ‌మ‌ని అంటున్నారు. సీఎం జ‌గ‌న్ సైతం ఇన్నాళ్లూ ప్ర‌వీణ్‌ప్రకాశ్‌ను నెత్తిన పెట్టుకొని.. నిబంధ‌న‌లు వ‌ర్తించ‌కున్నా.. త‌న‌కు న‌చ్చిన ప‌నుల‌న్నీ చేయించుకొని.. ఇప్పుడిక ప‌క్క‌న పెట్టేయడానికి సిద్ధ‌మ‌వుతున్నార‌ని అంటున్నారు.  సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి (రాజకీయ) బాధ్యతల నుంచి సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ప్రవీణ్‌ ప్రకాష్‌ని తప్పించింది ప్ర‌భుత్వం. ప్రవీణ్‌ ప్రకాష్‌ ముఖ్యమంత్రికి ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తూనే, చాలాకాలంగా జీఏడీ (రాజకీయ) ముఖ్యకార్యదర్శి పోస్టునూ పూర్తి అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నారు.  సాధారణంగా సీఎం కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులెవరికీ ఇతర శాఖల బాధ్యతలు ఇవ్వరు. కానీ, ఎల్వీ సుబ్రహ్మణ్యం సీఎస్‌గా ఉన్నప్పుడు కొన్ని రకాల ఉత్తర్వులు జారీచేయడానికి అంగీకరించలేదట‌. బ‌హుషా గ‌త చేదు అనుభ‌వంతో ఆయ‌న అలాంటి జీవోలు ఇవ్వ‌డానికి నిరాక‌రించి ఉంటారు. దీంతో సీఎస్‌ జారీ చేయాల్సిన ఆదేశాలను సీఎం అనుమతితో జీఏడీ పొలిటికల్‌ సెక్రటరీ ఇవ్వవొచ్చంటూ ప్రవీణ్‌ప్రకాశ్‌తో ఓ జీవో జారీచేయించి త‌న ప‌నులు చ‌క్క‌బెట్టుకున్నార‌ట సీఎం జ‌గ‌న్‌.  అప్ప‌టి సీఎస్ ఎల్వీతో విభేదించిన ప్రవీణ్‌ప్రకాశ్‌ ఆయన తొలగింపులో కీలకపాత్ర వహించారని చెబుతారు. ఆ తర్వాత సీఎస్‌ నీలం సాహ్ని.. ప్రవీణ్‌ ప్రకాశ్‌కు దారికి అడ్డురాక‌పోవ‌డంతో స‌మ‌స్య తలెత్తలేదు. సీఎం కనుసన్నల్లో నడుస్తూ ఇతర అధికారులను వేధింపులకు గురిచేసినట్టు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ప్రస్తుత సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌కు ప్రవీణ్‌ ప్రకాశ్‌ వ్యవహారశైలి బొత్తిగా నచ్చలేదట‌. సీఎంకు ప‌లుమార్లు ఫిర్యాదు కూడా చేశార‌ని తెలుస్తోంది.  కీలక బాధ్యతల్లో ఉన్న ప్రవీణ్‌ ప్రకాష్‌ ఇటీవల తీసుకున్న కొన్ని నిర్ణయాలు ముఖ్యమంత్రి జగన్‌కు కూడా ఆగ్రహం తెప్పించాయ‌ని అంటున్నారు. వాణిజ్య పన్నులు, స్టాంపులు రిజిస్ట్రేషన్‌ విభాగాల్ని... రెవెన్యూ శాఖ నుంచి ఆర్థికశాఖకు మార్చే విషయంలో ప్రవీణ్‌ ప్రకాష్‌ సొంత నిర్ణయాలు తీసుకోవడంపై సీఎం అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఆయా విభాగాల అధికారులతో చర్చించకుండా, సీఎస్‌ అభిప్రాయాన్నీ పరిగణనలోకి తీసుకోకుండా... ప్రవీణ్‌ ప్రకాష్‌ ఆ జీవో విడుదలయ్యేలా చేసినట్టు సమాచారం. ఆ అంశంపై సీఎస్‌ అభిప్రాయాన్ని తన దృష్టికి తేకుండానే, ప్రవీణ్‌ ప్రకాష్‌ ఉత్తర్వులు జారీ చేయించారన్న విషయం సీఎం దృష్టికి రావడంతో, ఆయనను తక్షణం జీఏడీ ముఖ్యకార్యదర్శి పోస్టు నుంచి తప్పించాలని ఆదేశించార‌ని అంటున్నారు. జీఏడీ పొలిటికల్‌ సెక్రటరీ హోదాలో ఆయన తీసుకున్న నిర్ణయాలు కొన్నింటిని సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ తప్పుబట్టినట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల కిందట కోర్టుల్లో ప్రతిసారీ ప్రభుత్వానికి మొట్టికాయలు పడుతున్న వైనంపై ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఇందులో కూడా ప్రవీణ్ ప్ర‌కాశ్‌ నిర్ణయాలపై అధికారుల మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. దీంతో ఆయన అధికారాలకు కత్తెర వేయాల్సిందేనని సీఎస్‌ పట్టుబట్టడంతో ముఖ్యమంత్రి వేటు వేశార‌ని చెబుతున్నారు.  ఇన్నాళ్లూ ముఖ్య‌మంత్రే ప్ర‌వీణ్‌ప్ర‌కాశ్‌కు అద‌న‌పు అధికారాలు క‌ట్ట‌బెట్టి.. అవ‌స‌రానికి వాడేసుకొని.. ఆ చ‌నువుతో ప్ర‌వీణ్ ప్రకాశ్ సైతం హ‌ద్దు మీర‌డంతో.. ఇప్పుడు క‌రివేపాకులా ఆ సీనియ‌ర్ అధికారిని ప‌క్క‌న పెట్టేశార‌ని అంటున్నారు. ప్రస్తుతం ఏపీభవన్‌ ముఖ్య రెసిడెంట్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న అభయ్‌ త్రిపాఠి ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఆయన స్థానంలో ప్రవీణ్‌ప్రకాశ్‌ను ఢిల్లీలోని ఏపీభవన్‌కు పంపేస్తార‌ని కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇలా అవ‌స‌రం ఉన్న‌న్నాళ్లూ చంక‌న ఎక్కించుకోవ‌డం.. ఆ త‌ర్వాత కింద‌ప‌డేయ‌డం జ‌గ‌న్‌రెడ్డికి కామ‌నే అంటున్నారు.

అప్పులతో కిడ్నీలు అమ్ముదామని దంపతులు.. సైబర్ నేరగాళ్ల చేతిలో 48 లక్షలు మోసం..

ఓపెన్ చేస్తే.. అది హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ఉండే దంపతులు.. ఆ దంపతుల పేర్లు మోది వెంకటేశ్‌, లావణ్య లు. ఖైరతాబాద్ లో స్థానికంగా స్టేషనరీ, బ్యాంగిల్‌ స్టోర్‌ రన్ చేస్తూ లైఫ్ ని లీడ్ చేస్తూ.. కాస్తో కూస్తో చంపాదించిన డబ్బులతో రెండేళ్ల క్రితం సొంతగా ఇళ్లు కట్టుకునేందుకు పనులు ప్రారంభించారు. ఇందుకు ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ద్వారా మొదట రూ.34 లక్షలు, తర్వాత మరో రూ.10 లక్షలు లోన్ తీసుకున్నారు. ఇల్లు రెడీ అయ్యేసరికి దాదాపు రూ.1.50 కోట్ల అప్పులయ్యాయి. గత రెండు సంవత్సరాల నుండి కరోనా లాక్‌డౌన్‌ పరిస్థితుల నేపథ్యంలో వ్యాపారం దాదాపు మూతపడింది. అవసరాలు, అప్పులు పెరుగుతున్నాయి. మరోవైపు అప్పులిచ్చినవారి నుంచి ఒత్తిళ్లు పెరిగాయి. అప్పులు చేయకూడదు ఆ అప్పులు ఎప్పటికి ముప్పు అని అనుకున్నారు. అయినా సరే వాళ్ళను నమ్మి  అప్పులిచ్చిన వారికి ఎలాగైనా తిరిగివ్వాలని ఫిక్స్ అయ్యారు ఆ  భార్యాభర్తలిద్దరూ.. అందుకోసం వింటేనే గుండె తరుక్కుపోయే పని చేశారు. తమ  కిడ్నీలు అమ్ముకోవడానికి సిద్దపడ్డారు. గూగుల్‌లో సెర్చ్ చేసి బుక్కయ్యారు…. కిడ్నీలు అమ్ముకోవాలి అనుకున్న ఆ దంపతులు. ఆ కిడ్నీలు కొనేవారు ఎవరో ఎక్కడ ఉంటారో తెలియక.. ఆ దంపతులు గూగుల్‌లో సెర్చ్ చేశారు. వీళ్ళ అవసరాన్ని పసిగట్టి మొదట ఓ వ్యక్తి పరిచయమై.. ముందు రిజిస్ట్రేషన్‌ ఫీజు కడితే చాలన్నాడు. ఆ తర్వాత కిడ్నీకి బీమా, కరెన్సీ ఎక్స్ఛేంజ్‌ల కోసమంటూ మొత్తం రూ.10 లక్షల వరకు వసూలు చేశాడు. ఇలా  అతనికి మరిన్ని డబ్బులు ఇవ్వలేక వెంకటేష్ మరో  వ్యక్తిని సంప్రదించారు. అతనూ రూ.12 లక్షల వరకు గుంజేశాడు. ఇలా మొత్తం నలుగురిని ఆన్‌లైన్‌లో సంప్రదించారు. ఓ వ్యక్తి కేవలం రిజిస్ట్రేషన్‌ ఫీజు కడితే రావాల్సిన మొత్తంలో సగం అకౌంట్లలో వేస్తానని నమ్మించాడు. చెప్పినట్లే రెండు ఖాతాల్లో డబ్బులు జమైనట్లు కనిపించాయి. రెండు, మూడు రోజుల్లో ఆ డబ్బులు తీసుకోవచ్చని చెప్పాడు. కానీ, విత్‌డ్రా చేద్దామంటే అవ్వట్లేదు. అతన్ని తిరిగి సంప్రదించగా.. ఆర్థికశాఖ, ఎయిర్‌ఫోర్స్‌ అథారిటీ, ఐటీ శాఖ సర్టిఫికెట్లు అవసరమంటూ డబ్బులు కట్టించుకున్నాడని బాధిత దంపతులు కంప్లైంటులో పేర్కొన్నారు. మోసపోవడానికి కూడా ఒక హద్దు ఉంటుందని తెలుసుకోలేకపోయారు. వెంకటేష్ కు  సైబర్‌ మోసగాళ్లు మాయమాటలు చెప్పి రూ.40.38 లక్షల వరకు కాజేశారు. ఈ సమాజంలో ఒకటి జీవితం అంటే మరొకడికి లెక్కలేకుండా పోయింది.. వెంకటేష్ ధర్మం కోసం అప్పు ఇచ్చిన వాళ్లకి తిరిగి ఇవ్వాలని తన ప్రాణాలు పణంగా పెట్టి కిడ్నీలు అమ్మి వాళ్ళ అప్పు తీర్చాలనుకున్నాడు.. అయినా సైబర్ నేరగాళ్లు వాళ్ళని కనికరించలేదు.. అలా అని ధర్మం కోసం నిలబడుదామన్న వెంకటేష్ కి దేవుడు కూడా అండగా నిలవలేదు..  దొంగ నోట్లు ఇచ్చి.. ముంచేశారు.. మరో వ్యక్తి డబ్బులు తీసుకునేందుకు బెంగళూరుకు వస్తే.. తమ మనుషులు అడ్వాన్స్‌ చెల్లిస్తారని చెప్పాడు. అప్పటికి తాము మోసమోతున్నాం అని గ్రహించలేకపోయారు.. అంటే వాళ్ళ కళ్ళ ముందు అప్పులోళ్లు కనిపిస్తున్నారు గాని.. తమ్ము మోసపోతున్నాం అని తెలుసుకోలేకపోయారు. చివరికి అది నిజమేనని నమ్మి వారు అక్కడికి వెళ్లారు. ఇద్దరు వ్యక్తులు హోటల్‌కు వచ్చి లాకర్‌ తెరిచి డబ్బులు చూపించారు. నోట్లు నలుపు రంగులో ఎందుకు ఉన్నాయని ప్రశ్నించగా.. ఇదంతా ఆర్‌బీఐ డబ్బు అని, రసాయనాలతో క్లీన్ చేయాల్సి ఉంటుందని నమ్మించారు. కొన్నింటిని శుభ్రం చేసి చూపించారు. వాటిని ఓ ప్యాకెట్‌లో కట్టి ఇచ్చి.. 48 గంటల వరకు తెరవకూడదన్నారు. ముంబై నుంచి రసాయనాలు తెప్పించాలంటూ వారు డబ్బులు కట్టించుకున్నారని, ఇందుకు తెలిసినవారి దగ్గర బంగారాన్ని తాకట్టు పెట్టినట్లు దంపతులు వెల్లడించారు. తీరా హైదరాబాద్‌కు వచ్చాక ప్యాకెట్‌ తెరిచిచూస్తే అవన్నీ దొంగ నోట్లని తెలిసిందని వారు వాపోయారు.

టెక్నికల్ అసిస్టెంట్‌ పై.. పెట్రోల్ పోసి నిప్పు అంటించిన సర్పంచ్..

శాంతి, స్వేచ్ఛలకు  నిలమైన మన దేశంలో విలయం మొదలవుతుంది. మనుషులను మనుషులు చంపుకునే సంస్కృతి రెచ్చిపోతుంది.. కొందరు  కులాల పై దాడిచేస్తే.. మరికొందరు జాతులపై దాడులు చేస్తున్నారు.. ఇంకొందరు రాజ్యాంగంపై దాడిచేస్తున్నారు.. ఇంకొందరు ప్రభుత్వ అధికారులపై దాడిచేస్తున్నారు. మహిళా విషయమైతే ఇక చెప్పనక్కర్లేదు. పేరు ఏదైనా ప్లేస్ ఏదైనా కావొచ్చు కానీ దాడులు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. రోజురోజుకి ఈ  దారుణాలు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. సర్పంచ్ అనే పదవికి మన దేశంలో అత్యున్నత గౌరవం ఉంది. సర్పంచ్ అందరికి  ఆదర్శనంగా ఉండాలి..  కానీ తనకు పని చేయడం లేదని.. ఒక అధికారిపై పెట్రోల్ పోసి అంటించాడు.. అది నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని ఉపాధి హామీ కార్యాలయంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కార్యాలయంలో టెక్నికల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న రాజుపై పాతసావ్లీ గ్రామ సర్పంచ్ సాయినాథ్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రాజు గట్టిగా కేకలు వేస్తూ.. అరిచాడు. దీంతో సిబ్బంది మొత్తం ప్రమాద ఘటనకు వచ్చి రాజును కుబీర్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి, ప్రాథమిక చికిత్స అందించి, అనంతరం భైంసాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే.. కుబీర్ గ్రామంలో గ్రావెల్ వర్క్స్ విషయంలో మాస్టర్‌పై సంతకం చేయాలని సర్పంచ్ సాయినాథ్ రాజును అడిగాడు. దీంతో రాజు నిరాకరించాడు. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన సర్పంచ్ రాజుపై పెట్రోల్ దాడికి దిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.    

హుజురాబాద్ రంగంలోకి రేవంత్ రెడ్డి.. ఇక తీన్మారే..! 

తెలంగాణ రాజకీయాలన్ని హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రంగానే సాగుతున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో త్వరలో అక్కడ ఉప ఎన్నిక జరగనుంది. దీంతో హుజురాబాద్ ఉప ఎన్నిక అన్ని పార్టీలకు సవాల్ గా మారింది. బీజేపీలో చేరిన ఈటల.. తన నియోజకవర్గంలో  సత్తా చాటి గులాబీ బాస్ కు షాక్ ఇవ్వాలని భావిస్తున్నారు. అందుకే ఆయన నియోజకవర్గంలో జోరుగా పర్యటిస్తున్నారు. ఉప ఎన్నికను అత్యంత కీలకంగా భావిస్తున్న టీఆర్ఎస్ బాస్.. మండలానికో ఇంచార్జ్ ని నియమించి నేతలను పరుగులు పెట్టిస్తున్నారు. మంత్రి హరీష్ రావుకు హుజురాబాద్ బాధ్యతలు అప్పగించారని తెలుస్తోంది. టీఆర్ఎస్, బీజేపీలు దూకుడుగా వెళుతుండగా.. కాంగ్రెస్ మాత్రం హుజురాబాద్ లో ఇప్పటివరకు కొంత సైలెంట్ గానే ఉంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా హుజురాబాద్ పై ఫోకస్ చేయడం లేదనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగారు రేవంత్ రెడ్డి.  హుజురాబాద్ అసెంబ్లీ ఇంఛార్జీలను సమన్వయ కర్తలను, మండల బాధ్యులను ప్రకటించారు  టీపీసీసీ అధ్యక్షులు  రేవంత్ రెడ్డి. హుజురాబాద్ అసెంబ్లీ ఇంచార్జి గా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజా నర్సింహను నియమించారు. నియోజక ఎన్నికల సమన్వయ కర్తలుగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ,  ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ను నియమించారు. మండలాల వారీగా పార్టీ ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించారు రేవంత్ రెడ్డి. వీణవంక మండల ఇంచార్జులుగా ఆది శ్రీనివాస్, సింగీతం శ్రీనివాస్, జమ్మికుంట మండలానికి విజయ రమణ రావ్, రాజ్ ఠాగూర్.. జమ్మికుంట టౌన్ బాధ్యతలు మాజీ ఎంపీ రాజయ్య, ఈర్ల కొమురయ్యకు అప్పగించారు.  హుజురాబాద్ మండలానికి టి. నర్సారెడ్డి, లక్షన్ కుమార్.. హుజురాబాద్ టౌన్ కు బొమ్మ శ్రీరాం, జువ్వాడి నర్సింగరావు ఇంచార్జులుగా ఉండనున్నారు. ఇల్లంతకుంట మండలం బాధ్యతలను నాయిని రాజేందర్ రెడ్డి, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డికి అప్పగించారు. కమలపూర్ మండలంలో పార్టీ వ్యవహారాలను మాజీ మంత్రి కొండా సురేఖ, దొమ్మటి సాంబయ్య పర్యవేక్షించనున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక కంట్రోల్ రూమ్ సమన్వయ కర్తగా కరీంనగర్ డీసీసీ ప్రెసిడెంట్ కవ్వంపల్లి సత్యనారాయణను నియమించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.  2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డి.. ఇటీవలే పార్టీకి రాజీనామా చేశారు. తనకు టీఆర్ఎస్ టికెట్ వచ్చిందంటూ కౌశిక్ రెడ్డి మాట్లాడిన ఆడియో లీక్ కావడంతో పీసీసీ సీరియస్ గా స్పందించింది. ఇంతలోనే తనే పార్టీకి రాజీనామా చేశారు కౌశిక్ రెడ్డి. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు కౌశిక్ రెడ్డి. ఈటల రాజేందర్ కు అమ్ముడుపోయిన రేవంత్ రెడ్డి.. హుజురాబాద్ ఉప ఎన్నికను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. టీవీ ఇంట్వర్యూల్లో హుజురాబాద్ లో కాంగ్రెస్ గెలవదని చెబుతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డికి ధమ్ముంటే హుజురాబాద్ లో డిపాజిట్ తీసుకురావాలని కూడా కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి... ఇంచార్జులను నియమించారని అంటున్నారు. కాంగ్రెస్ కూడా రేసులోకి రావడంతో హుజురాబాద్ నియోజకవర్గంలో ఇక తీన్మార్ జరగనుందనే చర్చ సాగుతోంది. 

ఏపీ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు తగ్గింపు? క్లారిటీ కావాలన్న రఘురామ.. 

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వోద్యోగుల పదవీ విరమణ వయస్సు 57 సంవత్సరాలకు తగ్గించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. పదవి విరమణ వయస్సు తగ్గించాలని జగన్ సర్కార్ నిర్ణయించిందని, త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందనే చర్చ ఉంది. కొన్ని రోజులుగా దీనిపై ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రిటైర్మెంట్ వయసు తగ్గిస్తారేమోనన్న ఆందోళన ఉద్యోగుల్లో కనిపిస్తోంది. మరోవైపు సోషల్ మీడయాలో చక్కర్లు కొడుతున్న కథనం సంవత్సరం కిందటిది.  సంవత్సరం కిందట ఇలాంటి ప్రచారం జరిగినపుడు  పదవి విరమణ వయసు తగ్గించే ఆలోచన లేదని ముఖ్యంత్రి కార్యాలయం స్పష్టం చేసిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  ఇలాంటి వదంతులు పుట్టిస్తున్న వారిని కనిపెట్టి శిక్షించాలని CIDకి గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్  పిర్యాదు కూడా చేసింది.  అయినా ఆ వార్తలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఉద్యోగుల పదవి విరమణ వయసు తగ్గిస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు స్పందించారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని సీఎం జగన్ కు లేఖ రాశారు. అలాగే ఉద్యోగుల సమస్యలను ప్రస్తావించారు. వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలను ప్రస్తావిస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎంపీ రఘురామ రాజు రాసిన లేఖ ఇది...  జులై 14, 2021 శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. విషయం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ వయసు-వదంతులు పై వివరణ ఆవశ్యకత సూచిక: నవ సూచనలు (విధేయతతో) లేఖ 7 ముఖ్యమంత్రి గారూ, పదవీ విరమణ … అంటే పని చేసే ప్రదేశం నుంచి విరామం తీసుకుని తన కోసం నూతన జీవితాన్ని మళ్లీ మొదలు పెట్టడం. పని వత్తిడి వదిలేసి తమ వ్యక్తిగత జీవితాన్ని కొనసాగించే సమయం కావడంతో పదవీ విరమణ వయసుపై ప్రతి సారీ చర్చోపచర్చలు జరుగుతూనే ఉంటాయి. ఏ వయసులో పదవీవిమరణ చేయాలి అనేది చర్చనీయాంశమైన పెద్ద ప్రశ్న. కష్టపడి కొండ ఎక్కి శిఖరానికి చేరుకున్న తర్వాత అక్కడ నుంచి ప్రపంచాన్ని చూస్తూ జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తేదీ ఉంటుంది. పదవి విరమణ చేసిన తర్వాత వచ్చే ఆదాయం ఎంతో గుణించుకుని వారు తమ శేష జీవితాన్ని ఆనందంగా గడిపే ఉత్తమ క్షణాలు అవి. ఇలాంటి ఉద్విగ్నభరితమైన అంశంలో మీరు నిర్ణయం తీసుకోబోతున్నారని వదంతుల రూపంలో వార్తలు వస్తున్న నేపధ్యంలో ఆపరిస్ధితిని తలచుకుని నా మనసు వికలం అయింది. మీరు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించబోతున్నారని విన్న తర్వాత నా మనసు అల్లకల్లోలం అయింది. అయితే అది వదంతి మాత్రమేనని తెలిసి కొంత ఊపిరి పీల్చుకున్నాను. అయినా ఎందుకైనా మంచిదని కొన్ని విషయాలు మీ దృష్టికి తెస్తున్నాను. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం భారతీయుడి ఆయు:ప్రమాణం 65 సంవత్సరాలు. ఈ లెక్కతోనే 1998లో కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగుల పదవీవిరమణ వయసును 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు పెంచింది. పదవీ విరమణ వయోపరిమితి నిర్ణయించిన నాటి కాలం తో పోలిస్తే ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో భారతీయుడి ఆయు:ప్రమాణం మరింత మెరుగైంది. ఏపి పబ్లిక్ ఎంప్లాయిమెంట్ (పదవీ విమరణ వయసు సడలింపు) చట్టం 1984 ను 2017లో చివరి సారిగా మార్చారు. అప్పటి వరకూ ఉన్న 58 ఏళ్ల పదవీ విరమణ వయసును 60 సంవత్సరాలకు పెంచుతూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మీరు మీ మనసులో ఇప్పుడు అనుకుంటున్నట్లుగా కాకుండా, గత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం హర్షించదగినదే. మన పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రంలో పదవీ విరమణ వయసును 61 సంవత్సరాలకు పెంచారు. 35 సంవత్సరాల పాటు సవరించకుండా ఉన్న ఈ నిబంధనను రాష్ట్రం ఏర్పడిన ఏడు సంవత్సరాలలో సవరించుకున్నారు. ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రమే దేశంలో కెల్లా అతి ఎక్కువ పదవీ విరమణ వయసు ఉన్న రాష్ట్రంగా చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంతో పోలిస్తే భౌగోళిక, సామాజిక, రాజకీయ పరిస్థితులతో బాటు జన జీవన విధానంలో కూడా అన్ని సారూప్యతలూ ఉన్న మన రాష్ట్రంలో పదవీ విరమణ వయసు పరిమాణాన్ని ఎందుకు తగ్గిస్తున్నారో ఎవరికి బోధపడటం లేదు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో, 1956 నుంచి కూడా చూస్తే పదవీ విరమణ వయసు 58 సంవత్సరాలు ఉండేది. అన్ని రాష్ట్రాలలో కూడా పదవీ విరమణ వయసు 60 సంవత్సరాలు లేదా 58 సంవత్సరాలు ఉన్నది. అయితే మీరు 57 సంవత్సరాలకే పదవీ విరమణ వయసును కుదించాలని అనుకోవడం అత్యంత దారుణం, తీవ్ర నిరాశ కలిగించే నిర్ణయం. మీకు ఈ సందర్భంగా చరిత్రలో జరిగిన కొన్ని విషయాలను తెలియచేస్తాను. 1985లో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారు పదవీ విరమణ వయసును 56 సంవత్సరాలకు కుదించారు. ఆయన అలా చేసినందుకు అన్ని ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. న్యాయస్థానాలు కూడా ఉద్యోగ సంఘాల వాదనలనే బలపరిచాయి. ఇప్పుడు మీరు అలాంటి నిర్ణయమే తీసుకుంటే అలాంటి ప్రతిఘటనలే సాధారణ ప్రజల నుంచి, న్యాయస్థానాల నుంచి కూడా మీరు ఎదుర్కునే అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును తగ్గించాలని మీరు తలపోస్తున్న ఈ కొత్త ఆలోచనకు విరుద్ధంగా మీరు ఇటీవల ఒక నిర్ణయం తీసుకోవడం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. మీకు అత్యంత విధేయుడుగా ఉండి పలు అంశాలలో, నాకు సంబంధించిన అంశాలతో సహా, మీ మనోవాంఛను తీర్చిన సిఐడి అదనపు ఎస్ పి అయిన విజయ పాల్ కు మాత్రం ఆయన తన 60 సంవత్సరాల వరకూ పని చేసి, పదవీ విరమణ చేసినా, మళ్లీ తిరిగి ఆయనను కాంట్రాక్టు ప్రాతిపదికన మరింత సర్వీసును బహుమతిగా ఇచ్చారు. అదే విధంగా పదవీ విరమణ చేసిన జస్టిస్ కనగరాజ్ కు 80 సంవత్సరాలకు పైబడి ఉన్న వయసులో కూడా పదవి ఇచ్చి సత్కరించారు. పాపం… ఆయనకు అంత ముదిమి వయసులో కూడా అత్యంత ఎక్కువ పని భారం ఉండే పోలీసు ఫిర్యాదుల అథారిటీ చైర్మన్ బాధ్యతలను అప్పగించారు. ఈ రెండు సంఘటనల్లో కూడా వయసు వచ్చి పదవీ విమరణ చేసిన వారినే మళ్లీ పిలిచి మరీ బాధ్యతలు అప్పగించారు. గ్రామ సర్పంచ్ ల నుంచి కొన్ని బాధ్యతలను ఊడబెరికి వాటిని విఆర్ఓ కు కట్టబెడుతూ మన ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.2ను రాష్ట్ర హైకోర్టు సస్పెండ్ చేసిన ఘటనను కూడా ఇక్కడ ప్రస్తావిస్తూ మరో ఉదాహరణ చెబుతున్నాను. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులైన సర్పంచ్ ల నుంచి అధికారాలలో కోత విధించి ప్రభుత్వ ఉద్యోగులైన వారికి (విఆర్ఓ లకు) ఎక్కువ అధికారాలు ఇవ్వాలని మీరు ప్రయత్నించారు. దీనికి విరుద్ధంగా మీరు మరో విచిత్రమైన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపిఎస్ అధికారుల వార్షిక పనితీరు నివేదికను తయారు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగి అయిన ఆయన నుంచి ఆ అధికారాన్ని ప్రజాప్రతినిధి అయిన మీరు లాక్కుంటున్నారు. మీరు చేస్తున్న ఈ పరస్పర విరుద్ధమైన పనులను, ఈ అసంబద్ధమైన నిర్ణయాలను ఎవరైనా సరే సాధారణ నిర్ణయాలుగా పరిగణనించగలరా? ఇలాంటి మీ చర్యల ద్వారా మీ ద్వైదీభావనలను వెల్లడించడమే కాకుండా ప్రతి చోటా ఒక రకమైన సందిగ్ధతను, సంశయాన్నీ కావాలని రుద్దుతున్నట్లుగా అనిపిస్తున్నది. ఇలాంటి చర్యలన్నీ మీ పక్షపాత వైఖరిని వెల్లడిస్తున్నాయి. అంతే కాదు మిమ్మల్ని ఆశ్రయించిన వారికి సాధారణ ప్రజలకు మీరు వ్యత్యాసం చూపుతున్నారని మరింత స్పష్టంగా కనిపిస్తున్నది. దీన్నే తెలుగు సామెతలో చెప్పాంటే ‘‘ అయినోళ్లకి ఆకుల్లో, కానోళ్లకు కంచంలో’’.పైన పేర్కొన్న అన్ని విషయాలలోనూ ఎలాంటి చర్చలు జరపకుండా, ఎవరి అభిప్రాయం తీసుకోకుండా మీ అంతట మీరు స్వయంగా నిర్ణయాలు తీసుకున్నారు. మీరు ఈ సందర్భంగా ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. మీరు ఆదరాబాదరాగా తీసుకుంటున్న పరస్పర విరుద్ధ నిర్ణయాలు, అస్పష్టతను మరింతగా పెంచే నిర్ణయాలన్నీ ఎలాంటి సత్ఫలితాన్నిచ్చే అవకాశమే ఉండదు. మీరు ఎంత ఆరాటపడి ఇలాంటి అవాంఛనీయ నిర్ణయాలు తీసుకుంటే అంతలా మీరు పశ్చాత్తాపం చెందాల్సి వస్తుంది. మనం మన ఉద్యోగులకు సరైన సమయంలో జీతాలు చెల్లించలేకపోతున్నాం. అదే విధంగా పదవీ విరమణ చేసిన మన మాజీ ఉద్యోగులకు పెన్షన్లు కూడా ఇవ్వలేకపోతున్నాం. ఇంతటి దారుణమైన ఆర్ధిక పరిస్థితిలో ఉన్న మనం వయసు తగ్గించడం వల్ల పదవీ విరమణ చేసే 15,000 నుంచి 16,000 మంది ఉద్యోగులకు పదవీ విరమణ లాభాలను కూడా కలిపి ఎలా ఇవ్వగలుగుతాం? అదీ కూడా బడ్జెట్ లో ఎలాంటి వెసులుబాటు పెట్టుకోకుండా అర్ధంతరంగా తీసుకునే నిర్ణయంతో పడే ఆర్ధిక భారాన్ని ఎలా పూడ్చుకోగలుగుతాం? మీరు గుర్తించాల్సింది ఏమిటంటే వయసు అనేది కేవలం మన భావనే, సత్తాకు సూచిక కాదు. సమర్ధత ముందు వయసు పెద్ద విషయమే కాదు. అందువల్ల మీరు తక్షణమే మీ ఆలోచన మార్చుకోండి. కనీసం జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో ఉన్న మీరు ప్రభుత్వ ఉద్యోగుల వెంట ఎందుకు పడుతున్నారు? మీ ఆలోచనలను రాష్ట్రంలోకి వచ్చే పారిశ్రామికవేత్తలను ఎలా ప్రోత్సహించాలా అనే అంశంపైకి మళ్లించండి. రాష్ట్రంలో వారితో పెద్ద పెద్ద కర్మాగారాలు, ప్రాజెక్టులు పెటించే దిశగా ప్రోత్సహించండి. అలా కాకుండా వారితో తెరవెనుక కార్యక్రమాలు నిర్వహించి ప్రస్తుతం ఉన్న పరిశ్రమలు కూడా మూతపడేలా చేయకండి. నోటీసులు ఇవ్వడం ద్వారా లేదా ఎవరూ గమనించకుండా పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా మాటకలిపి వారు కూడా మీ కక్షపూరిత వైఖరికి అయిష్టంగానైనా మద్దతు ఇచ్చేలా వత్తిడి తీసుకురాకండి. మీరు ఇలా చేస్తున్న ఒక ప్రయత్నం ప్రస్తుతానికి మన మధ్యే ఉండనివ్వండి. వయసు పెరగడం అనేది మన చేతుల్లో లేనిది. అయితే పురోగమించడం అనేది మాత్రం కచ్చితంగా మన చేతుల్లోనే ఉంటుంది. ఈ తేడా తెలసుకోవడానికి కొంచెం సమయం తీసుకుని అయినా సరే మీరు ఆలోచించండి. పురోభివృద్ధి సాధించడం అనేది మన ప్రవర్తన పై ఆధారపడి ఉంటుంది. అందువల్ల నేను, ఈ సందర్భంగా మిమ్మల్ని కోరేది ఏమిటంటే ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును తగ్గించే ఆలోచనను మానుకోండి. ఎంతో మంది యువకులకు మేలు కలిగించే విధంగా ప్రయివేటు సెక్టార్ లో ఉద్యోగాల కల్పనపై శ్రద్ధ పెట్టండి. మీ దృష్టి విధ్వంసం పై నుంచి నిర్మాణాత్మక విధానాలపైకి సారించండి. తగ్గించడం పై కాకుండా పెంచడం పైకి మరల్చండి. అలా చేయడం ద్వారా వ్యవహారాలు చక్కబడతాయి. ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య స్నేహపూర్వక వాతావరణం కొనసాగుతుంది. ఎంతో అనుభవంతో కూడిన ప్రభుత్వ ఉద్యోగులను అక్కున చేర్చుకోవడం ద్వారా వారి మొహంలో చిరునవ్వు నింపండి. ఇప్పటి వరకూ వ్యాపించిన వదంతులు సీనియర్ ఉద్యోగుల మనస్సులో కొంత అభద్రతా భావం కలిగిస్తున్నాయి. అందువల్ల మీరు లేదా సంబంధిత మంత్రులు లేదా అధికారులు తగిన వివరణ ఇవ్వడం సముచితం..అంతేకాని ఉద్యోగ సంఘాల నాయకులు ఇచ్చే వివరణకు విశ్వసనీయత ప్రశ్నార్థకంగా ఉంటుంది. ఉద్యోగుల ఆశీర్వాదం తీసుకోండి. అంతేకానీ శాపం కాదు. భవదీయుడు కె.రఘురామకృష్ణంరాజు

సీబీఐ కోర్టులో జగన్ బెయిల్ కేసు విచారణ.. వైసీపీలో టెన్షన్ టెన్షన్... 

అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ పై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో బుధవారం మరోసారి విచారణ జరగనుంది. ఈనెల 8న జగన్, రఘురామ కృష్ణరాజు తమ వాదనలను లిఖితపూర్వకంగా సమర్పించారు.  సీబీఐ మాత్రం వాదించేది ఏదీ లేదని పిటిషన్ లోని అంశాలను చట్టపరిధిలో, విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవాలని కోర్టును కోరింది. జగన్ వాదనలపై సమాధానాలు ఇచ్చేందుకు రఘురామ కృష్ణ రాజు తరఫు న్యాయవాది సమయం కోరడంతో ఇవాళ్టీకి వాయిదా పడింది. పిటిషన్ పై ఇవాళ వాదనలు ముగిసే అవకాశం ఉంది. దీంతో జగన్ బెయిల్ పై సీబీఐ కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది.  మరోవైపు  ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బెయిలు ఈ నెల 14న రద్దవుతుందంటూ సోషల్ మీడియాలో ఓ కథనం వైరల్ అవుతోందని, దీనిని ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఆ పార్టీ న్యాయవిభాగం అధ్యక్షుడు మనోహర్ మరికొందరు కలిసి సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్‌కు నిన్న ఫిర్యాదు చేశారు. ప్రజల్లో భయాందోళనలు కలిగించేలా, ఓ వర్గం ప్రజలను రెచ్చగొట్టేలా ఈ కథనం ఉందని, ఈ కథనం ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు.  

పార్లమెంట్ లో మోడీకి ఉక్కపోత తప్పదా ?

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 19 నుంచి ఆగష్టు 13 వరకు జరుగుతాయి. కరోనా కారణంగా గత మూడు నాలుగు సెషన్స్’గా పార్లమెంట్ ఉభయ సభలు ఉదయం, సాయంతం వేర్వేరు సమయాల్లో సమావేశమయ్యాయి. అయితే, ఈ సారి ఉభయ సభలు  పాత పద్దతిలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటలవరకు జరుగుతాయని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సోమవారం తెలిపారు. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేశామని స్పీకర్ వివరించారు.  వర్షాకాల సమవేశాలలో మోడీ ప్రభుత్వం పై ఉరుములు, మెరుపులే కాదు పిడుగులు దాడి కూడా తప్పదని విపక్షాల నుంచి స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి. కరోనా కారణంగా దేశంలో గత కొంత కాలంగా రాజకీయ కార్యకలాపాలు కొంత స్థబ్దుగా ఉన్నా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో ప్రభుత్వం పై విరుచుకు పడేందుకు విపక్షాలు ఉమ్మడి వ్యూహరచనకు సిద్డమవుతున్నాయి. గత నెలలో ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ ఎన్సీపీ అధినేత శరద్ పవార్’తో వరస సమావేశాలు జరిపినప్పటి నుంచి, విపక్షాల మద్య ఐక్యత సాధించేందుకు ప్రశాంత్ కిశోర్ డైరెక్షన్’లో ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. తాజాగా ప్రశాంత్ కిశోర్ క్రితం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీనీ కలిశారు.సుమారు గంట సేపు దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఆమెతో చర్చించారు. అలాగే, ఈ మంగళవారం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీనిమ ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రాను కలిశారు. ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ నేతలతో భేటీ అయింది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల వ్యూహం, రాష్ట్ర కాంగ్రెస్’లో ఏర్పడిన సంక్షోభ పరిష్కారంపై చర్చించేందుకే అయినా, మూడు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పార్లమెంట్’లో అనుసరించవలసిన వ్యూహం పై చర్చ జరిగి ఉంటుందని ఉహించడంలో తప్పులేదు.  బెంగాల్ విజయం తర్వాత, వ్యూహకర్త రోల్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన ప్రశాంత్  కిశోర్ 2024 ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రతిపక్షాల ప్రదాని అభ్యర్ధిగా ప్రొజెక్ట్  చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అలా అని ఆయన బహిరంగంగా ప్రకటించకపోయినప్పటికీ అయన వేస్తున్న అడుగులు, చేస్తున్న ప్రకటనలు అయన ముందున్న మిషన్ అదే అని స్పష్టం చేస్తున్నాయి.ఈ మేరకు ఆయన ఎవరితో డీల్ కుదుర్చుకున్నారో ఏమో కానీ, రాహుల్ గాంధీ ఇమేజ్’ని పెంచేందుకు మిషన్ మూడ్’లో ప్రశాంత్ కిశోర్ పని చేస్తున్నారు. రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్ధిగా అంగీకరించాలని విపక్షాలకు బహిరంగంగానే విజ్ఞప్తి చేయడంతో పాటుగా యశ్వంత్ సిన్హా థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలను ప్రశాంత్ కిశోర్ మొగ్గలోనే తుంచేశారు. కాంగ్రెస్ లేని ఫ్రంట్ మోడీని ఎదుర్కోలేదని స్పష్టం చేయడం ద్వారా రాహుల్ నాయకత్వంలో మోడీ వ్యతిరేక శక్తులు అన్నిటినీ ఏకంచేసే పనిలో ప్రశాంత్ కిషోర్ ఉన్నారనేది సుస్పష్టం.సో,పార్లమెంట్ సమావేశాలను ఇందుకోసంగా ప్రశాంత్ కిశోర్ సద్వినియోగం చేసుకుంటారు అనడంలో సందేహం లేదు.  రాహుల్ గాంధీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోడీని ఎండగట్టడంలో ముందు వరసలో ఉన్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ కట్టడిలో కేంద్ర ప్రభుత్వం. ప్రధాని నరేంద్ర మోడీ వైఫల్యాలు మొదలు పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల వరకు ప్రతి అంశం మీద రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలను సంధిస్తూనే ఉన్నారు. ఒక దశలో, “ప్రధాని తప్పిపోయారు..(మిస్సింగ్) వాక్సిన్, మందులు పట్టుకుని ఎక్కడికో వెళ్లిపోయారు’” అనే అర్ధం వచ్చేల ట్వీట్ చేసి సంచలనం సృష్టించారు. తాజాగా పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను ఎండగడుతూ, “మీ కారు పెట్రోల్, డీజిల్’తో నడుస్తుందేమో కానీ, మోడీ ప్రభుత్వం దోపిడీ ఇంధనంతో నడుస్తోంది” అంటూ మోడీ ప్రభుత్వానికి చురకలు అంటించారు. అలాగే, మంత్రి మండలి విస్తరణను వాక్సినేషన్’తో ముడివేసి, “మోడీ మంత్రి మండలి సభ్యుల సంఖ్య పెరిగింది, కానీ, కొవిడ్ వాక్సిన్ నెంబర్ మాత్రం పెరగలేదు” అంటూ వ్యంగ బాణాలు విసిరారు. రాహుల్ గాంధీ,పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఇదే దూకుడు ప్రదర్శిస్తారని, అందుకు అవసరమైన మందుగుండు సామగ్రిని ప్రశాంత్ కిశోర్ బృందం సిద్దం చేసిందని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీలను కలుపుకుపోయే ప్రయత్నాలు ప్రారంభించింది. ముఖ్యంగా బీజేపీ దూకుడుకు కళ్ళెం వేసిన పశ్చిం బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీతో సయోధ్య కోసం కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఒకడుగు ముందు కేశారు. ఉభయ కాంగ్రెస్ పార్టీల మధ్య బంధానికి ప్రతిబంధకంగా నిలిచిన, లోక్ సభలో ప్రతి నాయుకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీరంజన్’పై వేటు వేసేందుకు కూడా సిద్దమయ్యారు.లోక్ సభ నాయకత్వ బాధ్యతల నుంచి ఆయన్ని తప్పించి శశిథరూర్ లేదా మనీష్ తివారీకి అప్పగించేందుకు సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీతో పాటుగా ఇతర ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా బెంగాల్లో బీజేపీని మట్టి కరిపించిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సారధ్యంలోని  తృణమూల్ కాంగ్రెస్ కేంద్రంపై కత్తులు దూస్తున్న విషయం తెలిసిందే. సో .. పార్లమెంట్ ఉభయసభల్లో తృణమూల్ దూకుడు ప్రదర్శించడం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నికల అనంతర హింస, గవర్నర్ తో విబేధాలు, చీఫ్ సెక్రటరీ పదేవీకాలం పొడిగింపు, ఇలా అనేక విషయాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విబేధాలు అగ్ని కీలల్లా ఎగిసి పడుతున్నాయి.  మరోవైపు కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటం చేస్తున్న భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) నేత రాకేశ్ టికాయత్‌ జులై 22న పార్లమెంట్‌ ఎదుట ఆందోళన చేపడతామని  ప్రకటించారు.అలాగే, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతి రేకంగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నాకు కార్మిక సంఘాలు సిద్దమవుతున్నాయి.  వచ్చే సంవత్సరం (2022) ఆరంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన జనాభా నియంతణ  బిల్లు, రోజు రోజుకు జారి పోతున్న దేశ ఆర్థిక వ్యవస్థ, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, మంటలు పుట్టిస్తున్న వంటనూనెలు ఇతర నిత్యావసర వస్తువుల ధరలు,పై పైకి పరుగులు తీస్తున్న నిరుద్యోగ సమస్య, మూత పడుతున్న పరిశ్రమలు, ఇలా ఒకటని కాదు, ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేందుకు, విపక్షాల అంబుల పొదిలో అస్త్ర్ర, శస్త్రాలు పుష్కలంగా ఉన్నాయి. సో.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో  మోడీ ప్రభుత్వానికి ఉక్కపోత తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

థర్డ్ వేవ్ వార్నింగ్ బెల్స్.. 

దాదాపు రెండు సంవత్సరాలు పాటు ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ మొదటి వేవ్, రెండవ  వేవ్ కొన్ని లక్షల మంది ప్రాణాలను కబళించి వేసింది.. ఇక మన దేశానికి వస్తే.. మొదటి  వేవ్ అంతంగా మాత్రమే ఉన్న సెకండ్ వేవ్ మాత్రం విలయం సృష్టించిందని చెప్పవచ్చు.. ఇది ఇలాగ ఉంటే కరోనా కొద్దీ రోజులుగా కొంత ఉపశమనం ఇస్తుంది. ఇక రానున్న రోజులో థర్డ్ వేవ్ వస్తుందని. దానివల్ల అతిపెద్ద ముప్పు ఉందని చెపుతున్నారు. ఇక వాళ్ళు చెపుతున్న  డెల్టా కరోనా అమెరికాలో  పంజా విసురుతోంది. వ్యాక్సినేషన్​ నెమ్మదించడంతో కరోనా కొత్త కేసులు మళ్లీ వేగంగా పెరిగిపోతున్నాయి. మూడు వారాల్లోనే రెట్టింపు కేసులు నమోదయ్యాయి. కరోనా కేసుల పెరుగుదలకు డెల్టా వేరియంట్ కారణమని నిపుణలు హెచ్చరిస్తున్నారు. అమెరికాలో జూన్ 23నాటికి 11,300గా కరోనా కేసులు నమోదు కాగా.. సోమవారం రోజున రోజువారీ కరోనా కేసులు సగటున 23,600 కేసులు నమోదయ్యాయని Johns Hopkins University డేటా వెల్లడించింది. గత రెండు వారాల్లో మెయినే, సౌత్ డకొటా అనే రెండు రాష్ట్రాల్లో మాత్రం కరోనా కేసులు భారీగా పెరిగినట్టు పేర్కొంది. ఒకరకంగా చెప్పాలంటే డెల్టా వేరియంట్ అమెరికాని మని ఇప్పటికే వణికిస్తుంది. మరోవైపు దేశంలోని పలు ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. కానీ, వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదించడంతో డెల్టా వేరియంట్ కేసులు భారీగా నమోదవుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా 55.6 శాతం మంది అమెరికన్లకు కనీసం ఒక మోతాదు కరోనా వ్యాక్సిన్ అందించినట్టు డేటా తెలిపింది. ఐదు రాష్ట్రాల్లో రెండు వారాల్లో తక్కువ వ్యాక్సినేషన్ రేటు నమోదైంది. అందులో మిస్సౌరీ, 45.9శాతం, అర్కాన్సాస్, 43శాతం, నెవాడా, 50.9శాతం, లూసియానా 39.2శాతం, ఉటా 49.5శాతంగా ఉన్నాయి. డెల్టా వైరస్ తో పోరాడడానికి మళ్ళీ రెడీగా ఉండండి.. జాగ్రత్తగా ఉండండి. ఇప్పటికే విశాఖ పట్టణానికి చెందిన కెమికల్ ఇంజినీయర్ పరుచూరి మల్లిక్, డాక్టర్ ముఖర్జీ లాంటి వాళ్ళు థర్డ్ వేవ్ గురించి దాని ప్రభావం గురించి ఇప్పటికే చెప్పుకొచ్చారు.. కానీ ఇప్పటికే మన ప్రభుత్వాలు ప్రజా ఆరోగ్యాన్ని మరిచిపోయి దేశమంతటా లాక్ డౌన్ ఎత్తివేశారు.. ప్రజలు తమ పనుల రీత్యా ఉద్యోగం రీత్యా.. ఆర్థిక ఇబ్బందుల రీత్యా రోడ్డున ఎక్కారు.. మనల్ని మనమే కాపాడుకోవాలి.. అందుకే మీరు అందరు రెడీ గా ఉండండి..     

కేసీఆర్ మెడ‌లు వంచిన విప‌క్షం.. జాబ్ క్యాలెండ‌ర్‌కు స‌ర్కారు స‌మాయ‌త్తం..

నీళ్లు, నిధులు. నియామ‌కాలు. ఈ మూడింటి కోస‌మే తెలంగాణ ఉద్య‌మం ఎగిసింది. స్వ‌రాష్ట్ర స్వ‌ప్నం సాకార‌మైంది. కేసీఆర్ అంద‌ల‌మెక్కారు. ఇక అంతే. నీళ్లు, నిధులు, నియామ‌కాలు.. ఈ మూడింటిలో ఏ ఒక్క క‌ల కూడా నెర‌వేర‌లేదు. ఒక్క ఎక‌రాకు కూడా అద‌నంగా సాగునీరు రాలేదు. నిధులు క‌ల్వ‌కుంట్ల కుటుంబానికే చేరాయ‌నే విమ‌ర్శ‌. ఇక‌, నియామ‌కాల గురించి ఎంత త‌క్కువ చెప్పుకుంటే అంత మంచిది. కేవ‌లం కేసీఆర్ ఫ్యామిలీ మెంబ‌ర్స్‌కే రాజ‌కీయ నియామ‌కాలు జ‌రిగాయి గానీ.. ఏడేళ్లుగా స‌రైన నియామ‌కాలు లేక‌ నిరుద్యోగుల గోస అంతాఇంతా కాదు. ఎన్ని పోరాటాలు.. ఎన్ని దీక్ష‌లు చేసినా.. స‌ర్కారులో క‌ద‌లిక క‌న‌బ‌డ‌లేదు. నిరుద్యోగుల ఆత్మ‌హ‌త్య‌లూ ఆగ‌లేదు.  తిడితే ప‌డుతున్నారు.. నిల‌దీస్తే నోరుమూసుకుంటున్నారు.. అంతేకానీ, ప్ర‌భుత్వ‌ ఉద్యోగాల నియామ‌కాలైతే చేప‌ట్ట‌డం లేద‌నేది కేసీఆర్ ప్ర‌భుత్వంపై ప్ర‌ధాన విమ‌ర్శ‌. నిరుద్యోగులు ఎంత‌గా వేడుకుంటున్నా.. నోటిఫికేష‌న్ల ఊసే వినిపించ‌డం లేదు. అలాంటిది, స‌డెన్‌గా కేసీఆర్ స‌ర్కారులో క‌ద‌లిక వ‌చ్చింది. హ‌డావుడిగా కేబినెట్ మీటింగ్ పెట్టి మ‌రీ ఇక‌పై ఏటేటా జాబ్ నోటిఫికేష‌న్ ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది. సీఎం కేసీఆర్‌లో ఆక‌స్మికంగా ఇంతటి మార్పు రావ‌డానికి కార‌ణ‌మేంటి? కేసీఆర్‌కు ఇంత‌లా క‌నువిప్పు ఎందుకు క‌లిగింది?  ఇప్పుడే నిరుద్యోగులు గుర్తుకొచ్చారా? వారిపై స‌డెన్‌గా కేసీఆర్‌కు ప్రేమ ఎందుకు పొంగింది? అంటే.. ప్ర‌తిప‌క్షాల దూకుడే జాబ్ కేలండ‌ర్ భ‌ర్తీకి కార‌ణ‌మంటున్నారు... సీఎం కేసీఆర్‌పై పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి దూకుడు మామూలుగా లేదు. ప్ర‌భుత్వంపై త‌న మొద‌టి దండ‌యాత్ర నిరుద్యోగ స‌మ‌స్య‌పైనే చేయ‌బోతున్నారు. నిరుద్యోగ దీక్ష‌కు దిగ‌బోతున్నారు. వ‌న్స్ రేవంత్ స్టెప్ ఇన్‌.. ఇక స‌ర్కారు సంగ‌తి గోవిందా. ఈ విష‌యం తెలిసే కేసీఆర్ అల‌ర్ట్ అయ్యార‌ని అంటున్నారు.  అటు, ఇటీవ‌ల టీఆర్ఎస్‌ను వీడిన ఈట‌ల సైతం నిరుద్యోగ స‌మ‌స్య‌పై కేసీఆర్‌ను గ‌ట్టిగా నిల‌దీశారు. తెలంగాణ‌లో ల‌క్ష‌ల్లో ఉద్యోగ ఖాళీలు ఉన్నా.. భ‌ర్తీ చేయ‌డం లేదంటూ ఆరోప‌ణ‌లు చేశారు. ఇక బీజేపీ సైతం జాబ్‌ నోటిఫికేష‌న్స్‌ కోసం నిత్యం పోరాడుతూనే ఉంది. మ‌రోవైపు, ఇటీవ‌లే కొత్త పార్టీతో రాజ‌కీయ దుకాణం తెరిచిన ష‌ర్మిల అయితే.. నిరుద్యోగ స‌మ‌స్య‌పైనే త‌న పార్టీ పునాదులు నిర్మించుకుంటున్నారు. ఇప్ప‌టికే ఇందిరాపార్క్ ద‌గ్గ‌ర నిరుద్యోగ స‌మ‌స్య‌ల‌పై దీక్ష చేసి.. జాకెట్ చినిగి.. అరెస్ట్ అయి.. బాగానే మైలేజ్ పొందారు ష‌ర్మిల‌. ఇక ఉద్యోగాలు లేవంటూ ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్న నిరుద్యోగుల ఇంటికెళ్లి మ‌రీ ప‌రామ‌ర్శిస్తున్నారు. వ‌రుస దీక్ష‌లు, ప‌రామ‌ర్శ‌ల‌తో నిరుద్యోగ స‌మ‌స్య‌ల‌పై ష‌ర్మిల మ‌డ‌మ తిప్ప‌ని పోరాటం చేస్తున్నారు.  ఇలా, రేవంత్‌రెడ్డి, ఈట‌ల రాజేంద‌ర్‌, ష‌ర్మిల‌.. కాంగ్రెస్‌, బీజేపీ, వైఎస్సార్‌టీపీ పార్టీలు సీఎం కేసీఆర్‌ను మూడువైపుల నుంచి ముట్ట‌డించ‌డం.. తెలంగాణ‌లో ల‌క్ష‌ల సంఖ్య‌లో ఉన్న‌ నిరుద్యోగులు ప్ర‌భుత్వ ఉద్యోగాల భ‌ర్తీ లేక క‌డుపుమంట‌తో ర‌గిలిపోతుండ‌టం.. ఆ ఆగ్ర‌హ జ్వాల‌లో కేసీఆర్ స‌ర్కారు కాలి బూడిద‌య్యే ప్ర‌మాదం పొంచి ఉండ‌టంతో సీఎం కేసీఆర్ అప్ర‌మ‌త్త‌మైన‌ట్టు తెలుస్తోంది. అందుకే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాట‌య్యాక ఏడేళ్లుగా ఎప్పుడూ లేని విధంగా.. ఉద్యోగ ఖాళీల భ‌ర్తీ కోస‌మే ప్ర‌త్యేకంగా మంత్రిమండ‌లి స‌మావేశం నిర్వ‌హించడం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇదంతా ప్ర‌తిప‌క్షాలు, ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన వ్య‌తిరేక‌త ఫ‌లిత‌మేన‌ని.. కేసీఆర్ మెడ‌లు వంచిన ఘ‌న‌త వారిదేన‌ని అంటున్నారు. అయితే, జాబ్ క్యాలెండ‌ర్‌కైతే రెడీ అవుతున్నారు.. మ‌రి, ప‌బ్బం గ‌డిచాక మ‌రోసారి నిరుద్యోగుల‌ను మోసం చేయ‌రుగా? అని అనుమానిస్తున్నారు కేసీఆర్ నైజం బాగా తెలిసిన తెలంగాణ ప్ర‌జానికం.