లవ్ పోయిందని.. శానిటైజర్ తాగి అమ్మాయి మృతి..
posted on Jul 14, 2021 @ 4:24PM
ప్రేమ అనేది ఒకప్పుడు అందమైన ప్రపంచం. అదే ప్రేమ ఇప్పుడు అందమైన అబద్దం అని చెప్పవచ్చు.. ఎందుకంటేప్రేమ పేరుతో పెళ్లి తర్వాత చేయాల్సిన పనులన్నీ ముందే చేస్తున్నారు నేటి యువతీ.. అన్ని అనుభవించి ఆ తర్వాత ఆ అమ్మాయి నన్ను మోసం చేసిందని.. ఆ అబ్బాయి నన్ను వాడుకొని మోసం చేశారని చెప్పి చివరికి ప్రాణాలు వీడుతున్నారు.. మరి ఇలాంటి మరణాలకు కారణం ఎవరు పిల్లల దల్లిదండ్రుల.. లేక కామం మత్తులో ఉంది.. తప్పులు చేసే ప్రేమికులదా..? సరే తప్పు ఎవరికేదైనా అమాయకుల ప్రాణాలు పోతున్నాయి.. ఒక్కసారి ఆలోచించండి..ఇక వివరాల్లోకి వెళితే..
ప్రేమించిన యువకుడు పెళ్లికి నో చెప్పడంతో మనస్థాపం చెందిన ఓ యువతి ఆత్యహత్యయత్నం...ప్రేమ పేరుతో శారీరకంగా వాడుకుని ఆపై మోసం..! శానిటైజర్ తాగిన యువతి
ఖమ్మం జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్రేమించిన యువకుడు పెళ్లికి నో చెప్పడంతో మనస్థాపం చెందిన ఓ యువతి ఆత్యహత్యయత్నం చేసింది. సెల్ఫీ వీడియో తీసుకుంటూ బాటిల్ శానిటైజర్ తాగేసింది. తన చావుకు కారణమైన ఎవరిని వదిలిపెట్టవద్దని యువతి సుసైడ్ నోట్ కూడా రాసింది. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం చిరునోముల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సింధు.. రావినూతల గ్రామానికి చెందిన వేణు గత నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ప్రేమించేటప్పుడు కులాలు, మతాలూ అడ్డురాని వీరి ప్రేమకి పెళ్లి చేసుకో ప్రియురాలు అడగానే కులం అడ్డువచ్చింది. కులాలు వేరు కావడంతో వేణు పేరెంట్స్ వీరి ప్రేమను ఒప్పుకోలేదు. ఇక వేణు కూడా ప్రేమించి, మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి సింధును శారీరికంగా వాడుకున్నాడు. కానీ పెళ్లి విషయంలో మాత్రం పేరెంట్స్ అంగీకరించడం లేదంటూ మొహం చాటేశాడు. దీంతో సింధు పోలీసులకు కంప్లైంట్ చేసింది. పోలీసులు లైట్ తీసుకున్నారు. అక్కడ కూడా తనకు న్యాయం జరగలేదని సూసైడ్ నోట్లో రాసుకొచ్చింది. గతంలో రెండు సార్లు సింధు, వేణు ఇంటి ముందు ఆందోళనకు దిగింది.. అయినా కూడా ఆమెకు న్యాయం జరగలేదు. తనకు జరిగిన అన్యాయాన్ని అడగడానికి ఎవరు ముందుకు రాలేదు. వేణు తల్లిదండ్రులు కూడా తనను పిచ్చిపిచ్చిగా బూతులు తిట్టారని సింధు పేర్కొంది. తనలా ఏ అమ్మాయికి అన్యాయం జరగకూడదని చెబుతూ సింధూ సెల్పీ వీడియో తీసుకుంటూ తీసుకొని శానిటైజర్ తాగింది. ప్రస్తుతం ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సింధు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.