పంజాబ్ లో సంధి  కుదిరింది.. కెప్టెన్ తో కలిసి సిద్దూ గేమ్ 

పంజాబ్ లో అధికారాన్ని నిలుపుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటినుంచే గట్టి ప్రయత్నాలు చేస్తోంది. నిజానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక విద్యుత్ చార్జీల విషయం మినహా మరే విధంగానూ పెద్దగా ప్రజావ్యతిరేకత లేదు. మరో వంక, అసలే అంతంత మాత్రంగా ఉన్న ప్రతిపక్షం,  బీజేపీ, శిరోమణి అకాలీ దళ్ విడిపోవడంతో మరింత బలహీన పడింది. అలాగే, గత అసెంబ్లీ ఎన్నికల్లో 20 స్థానాలు గెలుచుకుని, ప్రధాన ప్రతిపక్ష హోదాను పొందిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధికారం దక్కించుకునేందుకు గట్టి ప్రయత్నమే చేస్తున్నా, అది అంత సులభం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆప్’ను పంజాబీలు సొంత పార్టీగా చూడడం లేదు..ఢిల్లీ పార్టీగానే భావిస్తున్నారు. అందుకే ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, అన్ని రంగాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామన్న వాగ్దానంతో పాటు, సిక్కునే సీఎం చేస్తామన్న వాగ్దానం కూడా చేశారు. అయినా,ఆప్’ అధికార పగ్గాలు చేపట్టడం కష్టమే అని పరిశీలకులు భావిస్తున్నారు. మరో వంక కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లులకు  వ్యతిరేక రైతాంగం సుదీర్ఘకాలంగా సాగిస్తున  ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇచ్చింది. రాహుల్ గాంధీ, పార్టీ ఇతర నాయకులు రైతుల ఆందోళనకు బహిరంగం మద్దతు తెలవడమే కాకుండా ప్రత్యక్షంగా ఉధయ్మలో పాల్గొన్నారు. పార్లమెంట్’లోనూ ప్రస్తావించారు. ఇది కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చే విషయంగా భావిస్తున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అదే రుజువైంది. ఆరుకు ఆరు మున్సిపాలిటీలను కాంగ్రెస్ స్వీప్ చేసింది. అయితే, అన్నీ ఉన్నా , కాంగ్రెస్ పార్టీకి అంతర్గత విబేధాలు  పెద్ద తలనొప్పిగా మారాయి. ఇంచుమించుగా గత మూడు సంవత్సరాలకు పైగా, ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్, మాజీ  మంత్రి నజ్యోతి సింగ్ సిద్దూ వర్గాల మధ్య ఓ మోస్తరు యుద్ధం సాగుతూనే వుంది. అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో యుద్దం తీవ్రరూపం దాల్చడంతో కాంగ్రెస్ గెలుపు మీద అనుమాన మేఘాలు కమ్ముకున్నాయి. ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్ అధిష్టానం జోక్యం చేసుకుంది.  ఇరు వర్గాల మధ్య సంధి కుదిరింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రా ఎవరి స్థాయిలో వారు, అటు అమరేంద్ర సింగ్’తో ఇటు సిద్దూతో చర్చలు జరిపారు. ఇద్దిరి మ‌ధ్య రాజీ కుదిర్చేలా ఓ డీల్ తెర‌పైకి వచ్చింది. దీని ప్ర‌కారం పంజాబ్ ముఖ్యమంత్రిగా అమ‌రీంద‌ర్ కొన‌సాగుతారు. పంజాబ్ పీసీసీ చీఫ్‌గా సిద్ధూని నియమిస్తారు. ఈమేరకు ఇద్దరు నేతలు అంగీకరించారని, పంజాబ్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ హ‌రీష్ రావ‌త్ తెలిపారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే రానుందని సమాచరం.  ఈ ఇద్దరికీ తోడుగా  మరో ఇద్ద‌రు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్లు కూడా ఉంటారని తెసుస్తోంది. అధిష్టానం నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉంటాన‌ని అమ‌రీంద‌ర్ చెప్పిన‌ట్లు హ‌రీస్ రావ‌త్ వెల్ల‌డించారు. సిద్ధూ ఈ రాష్ట్ర భ‌విష్య‌త్తు అని, ఆయ‌న ఏదైనా నిర్ణ‌యం తీసుకునే ముందు, మాట్లాడే ముందు కాస్త ఆలోచించాల‌ని కూడా రావ‌త్ చెప్ప‌డం గ‌మ‌నార్హం. అయితే, బుధవారం సిద్దూ, ఆప్’ కు అనుకూలంగా ట్వీట్ చేసిన నేపద్యంలో అధిష్టానం ఆలస్యం చేయకుండా నిర్ణయం తీసుకుందని పార్టీ వర్గాలు బావిస్తున్నాయి. ఇప్పటికైనా ఇద్దరు విబేధాలను పక్కన పెట్టి కలిసి పనిచేస్తే, కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు.

డైవోర్స్ త‌ప్పే..! బిల్‌గేట్స్ క‌న్నీటి క‌హానీ..!

వాల్డ్ మోస్ట్ పాపుల‌ర్‌ సెలబ్రిటీ క‌పుల్స్ విడాకుల‌కు సిద్ధ‌మైపోయారు. రేపేమాపో అఫిషియ‌ల్‌గా డైవోర్స్ తీసుకోబోతున్నారు. ఆస్థి పంప‌కాల ప్ర‌క్రియ సైతం వేగంగా జ‌రిగిపోతోంది. ఎప్ప‌టి నుంచో వారిద్దరూ దూరంగా ఉంటున్నారు. ఇక‌పై శాశ్వ‌తంగా వారి మ‌ధ్య ఎడ‌బాటు రాబోతోంది. బిల్‌గేట్స్‌కు మ‌రో మ‌హిళ‌తో ఎఫైరే.. మిలిండాతో విడాకుల‌కు దారి తీసిందంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇన్నాళ్లూ ఈ విష‌యంలో సైలెన్స్ మెయిన్‌టెన్ చేసిన గేట్స్‌.. తాజాగా ఆయ‌న‌ మౌనం వీడారు. విడాకుల‌పై స్పందించారు. కార‌ణం చెప్పాలు. క‌న్నీరు పెట్టారు. గతవారం జరిగిన ‘సమ్మర్ క్యాంప్ ఫర్ బిలియనీర్స్’ కార్యక్రమంలో పాల్గొన్న బిల్‌గేట్స్‌ భావోద్వేగంతో మాట్లాడారు. ఒక దశలో కంట తడిపెట్టినంత పని చేశారు. మెలిండాతో డైవోర్స్ వ్యవహారం, ఇక మీ ఆధ్వర్యంలోని గేట్స్ ఫౌండేషన్ భవితవ్యం ఏమిటన్న ప్రశ్నకు ఆయన డైవోర్స్ ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం తప్పేనన్నారు. అయితే మరో మహిళతో తనది ‘ఎఫైర్’ అన్నదాన్ని ఒప్పుకోనని, అసలు ఆ పదమే సరికాదని అన్నారు. 20 ఏళ్ల‌కు క్రితం తన సహోద్యోగితో బిల్‌గేట్స్‌కు శారీర‌క సంబంధం ఉండేద‌ని.. ఆ విష‌యం తెలిసే మిలిందా ఆయ‌న‌తో విడిపోయేందుకు సిద్ధ‌మ‌య్యారంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే.. త‌మ‌ది ఎఫైర్ కాదంటూ తాజాగా గేట్స్ ప్ర‌క‌టించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. మిలిండాతో విడిపోవాల‌నే నిర్ణ‌య‌మూ త‌ప్పేనంటూ ఆల‌స్యంగా గుర్తించిన‌ట్టున్నారు. కానీ, ఇప్పుడు స‌రిదిద్దుకునే స్థాయిని దాటిపోయింది ప‌రిస్థితి అంటున్నారు.  2019 నుంచే బిల్‌గేట్స్‌ను దూరం పెడుతూ వచ్చిందట మిలిండా. అప్పటి నుంచే విడాకుల విషయమై లాయర్లతో సంప్రదిస్తూనే ఉంది. ఇక గ‌త మే 4న తామిద్ద‌ర‌మూ డైవోర్స్ తీసుకోబోతున్న‌ట్టు సంయుక్తంగా ప్ర‌క‌టించారు మిలిండా-గేట్స్ దంప‌తులు. పిల్ల‌లు, ఆస్తుల పంప‌కాల‌పై చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.  

మందుబాబులతో  25 వేల కోట్ల అప్పు.. జగనన్న తోపు! 

మందు ఇప్పుడు కిక్కు ఇవ్వడమే కాదు.. మన లక్కు కూడా మార్చేస్తోంది. మేం ప్రభుత్వాన్ని పోషిస్తున్నాం అని మందుబాబులు కొట్టే డైలాగ్ లెవెల్ పెంచుకుని మరీ ఇప్పుడు కొట్టొచ్చు.  మా వల్ల 25 వేల కోట్లు అప్పు పుట్టింది రా అని. అవును మందుబాబులిచ్చే డబ్బులు చూపించి.. ఏపీ సర్కార్ 25 వేల కోట్ల అప్పు సంపాదించిందంట. మా మద్యం అమ్మకాలు ఈ రేంజ్ లో నడుస్తున్నాయ్.. 15 ఏళ్లలో ఇంత అవుతాయ్.. దాని నుంచి మీ అప్పు తీర్చేయగలం అని రాసిచ్చారంట. బహుశా అప్పు ఇచ్చినోడు కూడా మందేసి ఓకె చేసినట్లున్నాడు. లేకపోతే ఈ గవర్నమెంట్ ఎన్నాళ్లుంటుందో తెలియదు... మళ్లీ ఎన్నికలు జరిగితే.. ఎవరు గెలుస్తారో తెలియదు.. మరోవైపు బాస్ మద్య నిషేధం అన్నాడు.. ఇవన్నీ పెట్టుకుని కూడా నమ్మేశారంటే నమ్మబుద్ధి కావటం లేదు. అయినా జగనన్న మాట తప్పడు..మడమ తిప్పడు. ఎవరి మాట వాళ్లకే చెబుతాడన్నమాట. ఎన్నికల ముందు మహిళలకేమో మద్య నిషేధం విధిస్తానని చెప్పాడు. ఆ మద్య నిషేధం ఐదేళ్ల లోపు ఎప్పుడైనా చేయొచ్చంట. కాబట్టి మాట తప్పనట్లే మరి. అదే మద్యం చూపించి 15 ఏళ్లు అమ్ముతానని చెప్పి అప్పు తీసుకున్నాడు. వాళ్లకిచ్చిన మాట కూడా తప్పడు.. ఎందుకంటే అప్పటికి ఎటూ అధికారంలో ఉండడు కాబట్టి.. ఉంటాడు ఉండడనేది వారి వారి నమ్మకాన్ని బట్టి ఉంటుందనుకోండి. ఇంత అడ్డగోలుగా గేమ్స్ ఆడుతుంటే.. ఇంకా విశ్వసనీయత అంటూ కబుర్లు చెప్పడమెందుకో జనానికి అర్ధం కావడం లేదు. మద్య నిషేధం అని చెప్పారు.. మద్యం విపరీతంగా అమ్ముతున్నారు. అవి కూడా సొంత బ్రాండ్స్ పెట్టుకుని మరీ అమ్ముకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు అవే అమ్మకాలను చూపించి కొత్త అప్పులు చేస్తున్నారు.వాస్తవానికి ప్రభుత్వానికి గ్యారంటీ ఆదాయం తెచ్చిపెడుతుంది ఇప్పుడు అదొక్కటే. మరి రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు లేవు.. వాటి ద్వారా ఉపాధి లేదు.. దాని వల్ల మార్కెట్ పెరిగిందీ లేదు. పైగా ఉన్న బిజినెస్లన్నీ పడుకున్నాయి. జనం బిజినెస్ చేసుకోవడానికి హైదరాబాద్, బెంగళూరు పోతున్నారు మరి ఆదాయం ఎక్కడ నుంచి వస్తుంది? అందుకే ఇలా అప్పులు విపరీతంగా చేసేసుకుంటున్నారు.  

కూతురికి  గర్భం చేసిన తండ్రి..

చేతి పట్టుకుని ప్రపంచాన్ని చూపించాల్సిన నాన్న.. తన పిల్లలకు ఏదైనా అయితే గడ్డ తన పిల్లను కాపాడినట్లు సమాజం నుండి చుట్టూ ఉన్న జనాల నుండి తన పిల్లలను కాపాడుకోవాల్సిన నాన్న. బాధ్యతగా కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే.. తన కూతురిపై కన్నేశాడు. అంతే కాదు 15 ఏళ్ల కుమార్తెపై పలుమార్లు అత్యాచాడు.. చివరికి  గర్భవతిని చేశాడు. ఈ దారుణ సంఘటన ఎక్కడో ఉత్తర భారత దేశంలో జరగలేదు. మన  ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది.  ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా బేస్తవారపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి ఊరికి దూరంగా ఇల్లు నిర్మించుకకొని ఉంటున్నాడు. ఈ క్రమంలో జనవరి నెలలో బాలిక తల్లి సరకుల తీసుకొచ్చేందుకు పక్కనే ఉన్న సంగరపల్లి గ్రామానికి వెళ్లింది. ఎప్పడి నుండి కన్నేశాడా తెలీదు.. అదే సమయం అనుకుని మద్యం మత్తులో ఉన్న ఆ నీచపు తండ్రి.. ఆ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ బాలిక అరిచింది.. గోల చేసింది.. అయినా వినిపించుకోలేదు ఆ ప్రబుద్దుడు.. చివరికి గద్ద వచ్చిన కోడిపిల్లను తన్నినట్లు ఐయింది ఆ బాలిక..  అప్పటి ఆగలేదు.. మందు తాగి తప్పుచేసిన వాడు ఐతే ఆ మందు గిడగానే తన తప్పును తెలుసుకుని పాశ్చతప్పడుతాడు.. వాడి ఎప్పటి నుండో తన మనసులో ఆ బాలికను అనుభవించాలని అనుకున్నాడు కాబట్టి అక్కడితో ఆగక  పలు దఫాలుగా అత్యాచారం చేసినట్లు బాధితురాలు తెలిపింది. ఈ విషయం బయటికు చెబితే తల్లి, కూమార్తెను చంపేస్తానంటూ కసాయి తండ్రి బెదిరించేవాడు. తండ్రి నిజంగానే కసాయి వాడని తెలిసి ఎంతకైనా తెగిస్తాడని తెలిసి ఆ బాలిక నోరు తెరవలేదు.  ఈ క్రమంలో తండ్రి తరచూ బాలికను కొడుతుండటంతో సుమారు 20 రోజుల కిందట 100 నంబరుకు ఫోన్‌ చేసింది. పోలీసులు వెళ్లి తండ్రిని మందలించారు. ఆ తరువాత బాలిక తాత ఇంటికి వెళ్లింది. జరిగిన విషయాన్ని వాళ్లకు చెప్పడంతో బుధవారం వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటి పక్కన ఎవరూ లేకపోవడంతో.. ఇంతకాలం బాలిక తండ్రికి భయపడి ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు.

పొలిటిక‌ల్ ఫ్లైట్‌.. సంథింగ్ స్పెష‌ల్‌..

రాజ‌కీయ నాయ‌కుల‌ను జ‌నాలు తెగ తిడుతుంటారు. అవినీతి, అరాచ‌కాల‌పై మండిప‌డుతుంటారు. పెద్ద‌గా చ‌దువుకోని వారే రాజ‌కీయాల్లోకి వ‌స్తార‌నే అభిప్రాయ‌మూ ఉంది. అయితే.. అంతా అలా ఉండ‌రు. కొంద‌రు దోపిడీ దారులు, అరాచ‌క శ‌క్తులు రాజ‌కీయాల్లో, అధికారంలో ఉన్న మాట వాస్త‌వ‌మే అయినా.. అనేక మంది మంచివారు, ఉన్న‌త చ‌దువులు చ‌దివిన వారు, అనేక నైపుణ్యాలు క‌లిగిన వారూ రాజ‌కీయాల్లో రాణిస్తున్నారు. తాజాగా జ‌రిగిన ఓ ఘ‌ట‌నే అందుకు నిద‌ర్శ‌నంగా చూపిస్తున్నారు.  వారిద్దరూ వేర్వేరు పార్టీల ఎంపీలు. ఒకరు బీజేపీ ఎంపీ, మరొకరు డీఎంకే ఎంపీ. పార్లమెంటరీ ఎస్టిమేట్స్‌ కమిటీలో ఆ ఇద్దరూ సభ్యులు. కమిటీ భేటీ జరిగితే పాల్గొనడానికి ఢిల్లీ వచ్చారు. భేటీలో ఇద్దరూ ఒక అంశంపై తీవ్రంగా వాదించుకున్నారు. భేటీ ముగిసింది.. ఎవరికి వారు వెళ్లిపోయారు. అందులో ఒకరు డీఎంకే ఎంపీ దయానిధి మారన్. కమిటీ భేటీ తరువాత ఆయన ఢిల్లీ నుంచి చెన్నై బయలుదేరారు. ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కి ముందు సీట్లో కూర్చున్నారు. అంత‌లోనే.. విమానం పైలట్ ఆయన దగ్గరకు వచ్చి పలకరించారు. ‘మీరు కూడా ఇదే విమానంలో వస్తున్నారా?’ అని అడిగారు. పైలట్‌ మాస్కు ధరించి ఉండడంతో ఎంపీ దయానిధి మారన్ ఆ పైలట్‌ను స‌రిగా గుర్తించలేకపోయారు.  పైలట్‌ గొంతు ఎక్కడో విన్నట్టుగా అనిపించడంతో ఆలోచించడం మొదలుపెట్టారు. ఆ విషయం గమనించిన పైలట్‌.. ‘మీరు నన్ను గుర్తించలేకపోయారు కదా?’ అంటూ చిరునవ్వులు చిందించారు. అప్పుడర్థమైంది ఎంపీ దయానిధి మారన్‌కు.. ఆ పైలట్‌ మరెవరో కాదు.. తన సహచర ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ అని. అంతేకాదు కొద్దిగంటల ముందు పార్లమెంటరీ ఎస్టిమేట్స్‌ కమిటీలో వాదన జరిగింది కూడా ఈ ఇద్దరు ఎంపీల మధ్యే. ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీని పైలట్‌గా చూసి దయానిధి మారన్ ఆశ్చర్యపోయారు. అంతకన్నా ఎక్కువ ఆనందించారు. తనకు ఎదురైన ఈ అపూర్వ అనుభవాన్ని మారన్‌.. ‘ఎ ఫ్లైట్‌ టు రిమెంబర్‌’ శీర్షికతో ట్వీట్‌ చేశారు. పైలట్‌ దుస్తుల్లో ఉన్న రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ ఫొటోను కూడా పెట్టారు. ఆ రోజు ఆయన తమను దిల్లీ నుంచి చెన్నైకి క్షేమంగా చేర్చారంటూ.. ‘థాంక్‌ యూ కెప్టెన్‌’ అని కృతజ్ఞతలు తెలిపారు. జులై 13న ఢిల్లీ నుంచి చెన్నైకి విమానం నడిపిన రూడీ ఆ రోజు చెన్నైలో ట్రావెల్, సివిల్ ఏవియేషన్ పార్లమెంటరీ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. అది పూర్తయిన తరువాత ఆ మరుసటి రోజు గురువారం చెన్నై నుంచి కేరళలోని కోచీకి విమానం నడిపారు. కమిటీ సమావేశంలో పాల్గొన్న 20 మంది ఎంపీలు రాజీవ్ ప్రతాప్ రూడీ నడిపిన విమానంలోనే ప్రయాణించారు. వీరితో పాటు ఉత్తరాఖండ్ మాజీ సీఎం తీరత్ సింగ్ రావత్, బిహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ త‌దిత‌రులు కూడా రూడీ న‌డిపిన విమానంలో ప్ర‌యాణించారు. రాజీవ్ ప్రతాప్ రూడీ బిహార్‌లోని చాప్రా నియోజకవర్గ ఎంపీ. బీజీపీకి చెందిన ఆయన గతంలో కేంద్రంలో సివిల్ ఏవియేషన్స్, స్కిల్ డెవలప్‌మెంట్ మంత్రిగా పనిచేశారు. బీజేపీకి ప్రస్తుతం జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఆయనకు కమర్షియల్ పైలట్ లైసెన్స్ కూడా ఉంది. అయితే, ఆయన ఏ సంస్థలోనూ పైలట్‌గా పనిచేయడంలేదు, జీతం తీసుకోవడం లేదు. కానీ, గౌరవ పైలట్‌గా అప్పుడప్పుడూ కొన్ని సంస్థలకు చెందిన విమానాలను నడుపుతుంటారు. రూడీ.. అనేక విద్యాసంస్థలలో ఎకనమిక్స్ పాఠాలు కూడా చెబుతారు. 50 ఏళ్ల వయసులో కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందిన ఆయన ‘‘ఎయిర్ బస్ 320, ఎయిర్ బస్ 321 వంటి భారీ జెట్‌లు నడిపే పార్లమెంటేరియన్ ప్రపంచంలో నేను తప్ప వేరేవారు లేరేమో’’ అంటారు రూడీ. ఎంతైనా.. రూడీ రూటే సెప‌రేటు అన్న‌ట్టు ఉందిక‌దా.  

ఉద్యోగాల భర్తీ ఉత్తదేనా..? ఎన్నికల కోసమే కేసీఆర్ సర్కార్ డ్రామాలా..?

అవిగో ఉద్యోగాలు.. ఇవిగో నోటిఫికేషన్లు.. తెలంగాణలో గత నాలుగేండ్లుగా సాగుతున్న తంతు ఉంది. ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటనలు చేయడం.. అధికారులు హడావుడి చేయడం.. నిరుద్యోగులు ఆశతో ప్రిపరేషన్ మొదలు పెట్టడం  జరుగుతున్నాయి. కొన్ని రోజుల తర్వాత ఉద్యోగాల ఊసే ఎత్తకుండా సర్కార్ సైలెంట్ కావడం.. ఎప్పటిలానే నిరాశతో నిరుద్యోగులు నిట్టూర్చడం కామన్ గా సాగుతోంది. అందుకే ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తామని చెప్పినా.. నమ్మే పరిస్థితిలో లేరు ప్రస్తుతం తెలంగాణ యువత. తాజాగా మరోసారి ప్రభుత్వం నిరుద్యోగులకు మోసం చేస్తోంది. ఉద్యోగాల భర్తీ అంటూ ప్రభుత్వం కొన్ని రోజులుగా హడావుడి చేస్తోంది. ఏ క్షణమైనా నోటిఫికేషన్ వస్తుందనే రేంజ్ లో పాలకులు, అధికారులు కలరింగ్ ఇచ్చారు. కేబినెట్ సమావేశాలు నిర్వహించారు. దీంతో ఈసారి పక్కా అనుకున్నారు. కాని రోజులైనా గడుస్తున్నా నోటిఫికేషన్ల జాడ లేకపోగా.. బుధవారం మరో బాంబ్ పేల్చింది కేసీఆర్ సర్కార్. కసరత్తు అంతా పూర్తైంది, ఖాళీలను గుర్తించడం జరిగిందని వారం రోజులుగా చెబుతూ వస్తున్న ప్రభుత్వం.. ఐదు రోజుల్లో పూర్తి వివరాలను అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేసిందనే ప్రకటన వచ్చింది. దీంతో ఇన్ని రోజులుగా అధికారులు ఏం కసరత్తు చేశారు, కేబినెట్ సమావేశంలో ఏం చర్చించారు, మళ్లీ వివరాలు ఇవ్వాలని కోరడం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. సర్కార్ వాలకం చూస్తుంటే ఈసారి కూడా నోటిఫికేషన్లు వచ్చేది అనుమానమే అన్న విమర్శలు వస్తున్నాయి.  రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కలిపి మొత్తం 56,979 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆర్థిక శాఖ మంత్రిమండలికి వివరాలు కూడా సమర్పించింది. దీంతో బుధవారం నాటి కేబినెట్‌ భేటీలో ఖాళీల భర్తీపై ప్రకటన వస్తుందని నిరుద్యోగులు ఎదురుచూశారు. కానీ, ఖాళీ పోస్టుల భర్తీకి అనుమతించే అంశం మళ్లీ వాయిదా పడింది. అధికారులు అందించిన వివరాలు అసంపూర్ణంగా ఉన్నాయని, సమగ్ర వివరాలను సమర్పించాలని కేబినెట్‌ ఆదేశించింది. ఖాళీల వివరాలు అందించడానికి మరో ఐదు రోజులు గడువు ఇచ్చింది.కాలానుగుణంగా, ఆధునిక అవసరాల మేరకు పోస్టులు ఉండాలని, ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఉద్యోగులను రప్పించాల్సి ఉందని, వీటితో పాటు మిగిలిపోయిన ఖాళీలన్నీ కలిపి సమగ్ర సమాచారం ఇవ్వాలంటూ అధికారులను ఆదేశించింది. ఆ తర్వాత ఖాళీల వివరాలను ప్రజల ముందుంచుదామని తెలిపింది.  ఉద్యోగాల ఖాళీలు గుర్తించాలంటే కేడర్ పోస్టులపై ముందు స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. జోనల్ పోస్టులను ఖరారు చేయాలి. ఇవన్ని పూర్తయితేనే ఖాళీల పూర్తి వివరాలు తెలుస్తాయి. కాని తెలంగాణలో గత ఏడేండ్లుగా కేడర్ విభజనే జరగలేదు. కొత్త జిల్లాలకు సర్దుబాటు పద్దతిలోనే ఉద్యోగులను కేటాయించారు. ఆ పోస్టులను కూడా క్రమబద్దీకరించాలి. ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్. ఇవేమి చేయకుండానే సర్కార్ హడావుడి చేయడంతో.. కొన్ని వర్గాల నుంచి అనుమానాలు వచ్చాయి. ఇప్పుడు అదే జరుగుతోంది. కొత్త జోనల్‌ వ్యవస్థ, కొత్త జిల్లాల ప్రకారంగా ఉద్యోగుల విభజన జరగాలని కేబినెట్‌ స్పష్టం చేసింది. తద్వా రా జిల్లాలు, జోన్ల వారీగా అన్ని ఖాళీలను గుర్తించాలని, వాటితో పాటు ప్రమోషన్ల వల్ల ఏర్పడే ఖాళీల భర్తీకీ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. 200 నుంచి 300 మంది ఉద్యోగులను ఏపీ నుంచి తీసుకురాబోతున్నామని వివరించింది. ఇలా అన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుని, ఆంధ్ర నుంచి వచ్చే ఉద్యోగులను కలుపుకొని, ఖాళీలను సత్వరమే గుర్తించి కేబినెట్‌ సబ్‌ కమిటీకి నివేదికను ఇవ్వాలని ఆదేశించింది.  కేసీఆర్ సర్కార్ తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఉద్యోగాల పేరుతో సీఎం కేసిఆర్ మరోసారి మోసానికి తెరలేపారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. మొదట కమల్‌నాథన్ కమీషన్‌ పేరుతో కాలాయాపన చేశారని ఆయన ఆరోపించారు.  హుజూరాబాద్ ఎన్నికలు వచ్చాయి కాబట్టే ఉద్యోగాలని అంటున్నాడని..ఇక వాటిని కూడా కొత్తగా జిల్లా, జోన్లు, మల్టీజోన్లు, స్టేట్ బేసిస్ లో కొలువుల భర్తీ అంటూ తేనెతుట్టెను కదిపారని బండి సంజయ్ అన్నారు. దీంతో అవి భర్తి అయ్యోందుకు కాలయాపన చేసేందుకు కుట్ర పన్నుతున్నారని దుయ్యబట్టారు.ఇలా ఎన్నికలు వచ్చాయంటే యువతను మభ్యపెట్టడం సీఎం కేసీఆర్ కు అలవాటుగా మారిందని ఫైర్ అయ్యారు.ఇలా గత ఎన్నికల్లో ప్రకటనలు చేశారని,కాని ఇప్పటి వరకు ఆచరణకు నోచుకోలేదని అన్నారు.  సీఎం కేసిఆర్ కు నిరుద్యోగులపై కనీసం చిత్తశుద్ది లేదని బండి సంజయ్ విమర్శించారు.ఉద్యోగాలు భర్తి చేసేందుకు టైం ఫ్రేం లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు. ఇక ఉద్యోగ ఖాలీలపై కూడా ప్రభుత్వానికి స్పష్టత లేదని అన్నారు. ఉద్యోగ ఖాలీలతో జిల్లాలో అభివృద్ది కుంటుపడడంతో పాటు పాలన అస్తవ్యస్తంగా మారిందని అన్నారు.నిరుద్యోగ ఖాలీలతో అనేక చోట్ల ఇంచార్జులతో నెట్టుకువస్తున్నారని దీని వల్ల ఉద్యోగులపై పని భారం ఎక్కువైందని చెప్పారు బండి సంజయ్. 

పిచ్చోడి చేతిలో రాయిలా సెక్షన్ 124A ! చట్టం అమలుపై సుప్రీం సంచలనం..

రాజద్రోహం కింద పెడుతున్న కేసులపై దేశ వ్యాప్తంగా కొంత కాలంగా చర్చ జరుగుతోంది. సెక్షన్ 124-A అవసరమా అన్న ప్రశ్నలు కూడా కొన్ని వర్గాల నుంచి వచ్చాయి. సెక్షన్ 124-A దుర్వినియోగం అవుతుందనే ఆరోపణలు ఇటీవల ఎక్కువగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సెక్షన్ 124-A పై సీజేఐ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజద్రోహం కింద కేసు నమోదు చేసే సెక్షన్ 124-A పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిందని ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. 124-A సెక్షన్ దుర్వినియోగం అవుతోందన్నారు. ఈ సెక్షన్ కింద శిక్షలు పడ్డ కేసులు కూడా నామమాత్రమేనన్నారు. ఫ్యాక్షనిస్టులు తమ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా వాడగలుగుతారని చెప్పారు.  సెక్షన్‌ 124-ఏ చట్టాన్ని సవాలు చేస్తూ విశ్రాంత సైనికాధికారి మేజర్‌ జనరల్‌(రిటైర్డు) ఎన్‌.జి. వోంబట్కెరే పిటిషన్ దాఖలు చేశారు.సెక్షన్ 124-A చట్టబద్దత భావ ప్రకటన స్వేచ్ఛను ఉల్లంఘిస్తోందని  రిటైర్డ్ మేజర్ జనరల్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ  పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజద్రోహం చట్టం బ్రిటన్‌ నుంచి తెచ్చుకున్న వలస చట్టం.. స్వాతంత్ర్య సమరయోధులకు వ్యతిరేకంగా బ్రిటీష్‌ వారు ఈ చట్టం తీసుకొచ్చారు.. భారతీయుల అణచివేతకు తెల్లదొరలు దీన్ని ఉపయోగించారు. గాంధీ, తిలక్‌ వంటివారిని ఈ చట్టంతోనే అణచివేయాలని చూశారని చెప్పారు. ఇప్పుడు మనకు స్వాత్రంత్యం వచ్చి 75ఏళ్లు అవుతోంది.. ఇప్పుడు కూడా దేశద్రోహం చట్టం అవసరమా అని చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ కేంద్రాన్ని ప్రశ్నించారు.   రాజకీయ ప్రత్యర్థులను అణిచివేయడానికి.. ఈ సెక్షన్‌ను దుర్వినియోగం చేస్తున్న ఉదంతాలు ఉన్నాయన్నారు జస్టిస్ ఎన్వీ రమణ. ‘‘స్వాతంత్ర సమరయోధులను అణిచివేయడానికి.. బ్రిటీష్ వలస పాలకులు వాడిన ఈ చట్టం ఇంకా అవసరమా? పరిశీలించాల్సిన సమయం అసన్నమైంది. పాత కాలపు.. పనికిమాలిన చట్టాలను తొలగించిన ప్రభుత్వం.. ఈ చట్టం జోలికి ఎందుకు వెళ్ళలేదు? కొయ్యను మల్చడానికి వడ్రంగి చేతికి రంపం ఇస్తే అడవిని నాశనం చేసినట్టు ఈ చట్టం ఉంది. వ్యవస్థలకు, వ్యక్తులకు ఈ చట్టం వల్ల తీరని నష్టం జరుగుతోందని అని అన్నారు.  ‘‘రాజద్రోహం కింద పెడుతున్న కేసులెన్ని? అందులో నిలబడుతున్నవెన్ని? సెక్షన్‌ దుర్వినియోగం గురించి ఎందుకు ఆలోచించట్లేదు? పేకాట ఆడేవారిపైనా రాజద్రోహం కేసులు పెడుతున్నారు. బెయిల్‌ రాకుండా కక్ష సాధింపు, అధికారదాహంతో బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు. వ్యవస్థలు, వ్యక్తులను బెదిరించే స్థాయికి దిగజారుతున్నారు’’ అని జస్టిస్‌ రమణ వ్యాఖ్యానించారు. రాజద్రోహం సెక్షన్‌ 124-ఏ తొలగింపునకు ఆలోచించాలని ధర్మాసనం ఈ సందర్భంగా కేంద్రాన్ని సూచించింది. ఈ సెక్షన్‌ రాజ్యంగా చెల్లుబాటును సవాల్‌ చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయని, వీటన్నింటినీ ఒకేసారి విచారిస్తామని దేశ అత్యుతున్న న్యాయస్థానం వెల్లడించింది.  

అఖిల‌ప్రియ నీడ‌పై రెక్కీ!.. ఆళ్లగడ్డలో ఫ్యాక్షన్ కలకలం..!

వైసీపీ అంద‌లం ఎక్కిన‌ప్ప‌టి నుంచీ అదే ప‌ని. టీడీపీ కేడ‌ర్‌ను వేటాడ‌ట‌మే టార్గెట్‌. రెండేళ్లుగా సీమ గ్రామాల్లో మ‌ళ్లీ ఫ్యాక్ష‌న్ జాడ‌లు బుస‌లు కొడుతున్నాయి. తెలుగుదేశం నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లే ల‌క్ష్యంగా వ‌రుస దాడులు జ‌రుగుతున్నాయనే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. న్యాయంతో పోరాడ‌లేక అన్యాయానికి తెగ‌బ‌డుతున్నారు. ఆస్తుల లూటీ నుంచి.. ప్రాణాలు తీసే వ‌ర‌కూ.. అధికార పార్టీ ఆగ‌డాల‌కు అంతే లేకుండా పోతోంద‌ని టీడీపీ మండిప‌డుతోంది. తాజాగా, ఆళ్ల‌గ‌డ్డ ఏరియాలో మ‌ళ్లీ పొలిటిక‌ల్‌ ఫ్యాక్ష‌న్ క‌ల‌క‌లం రేపింది. మాజీ మంత్రి భూమా అఖిల‌ప్రియ ప్ర‌ధాన అనుచ‌రుడిని ల‌క్ష్యంగా చేసుకొని.. రెక్కీ నిర్వ‌హించ‌డం తీవ్ర ఉద్రిక్త‌త‌కు దారి తీసింది.  కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఏరియాలో జ‌రిగిందీ ఘ‌ట‌న‌. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు ఉన్న స్కార్పియో వాహనంలో కొంద‌రు గుర్తుతెలియ‌ని దుండ‌గులు రెక్కీ చేయ‌డం భ‌యాందోళ‌న‌ల‌కు గురి చేస్తోంది. కర్నూలు జిల్లా శిరివెళ్ల మండలం గోవిందపల్లెలో భూమా అనుచ‌రుడైన రవిచంద్రారెడ్డి ఇంటి ముందు కారులో అనుమానాస్ప‌దంగా క‌నిపించారు. అది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఖాకీలను చూసి కంగారుప‌డిన అగంత‌కులు.. వెంట‌నే స్కార్పియోలో ప‌రార‌య్యే ప్ర‌య‌త్నం చేశారు.  పోలీసులు వ‌ద‌ల‌కుండా ఆ కారును వెంబ‌డించారు. ఖాకీల‌ నుంచి తప్పించుకునే క్రమంలో దుండగులు కారును అతివేగంగా నడిపారు. దీంతో వెహికిల్ అదుపుత‌ప్పి.. మెట్టపల్లి ద‌గ్గ‌ర‌ ఓ మహిళను ఢీకొట్టడంతో ఆమె గాయ‌ప‌డింది. అంత‌లోనే, గోవిందపల్లె గ్రామస్థులు సైతం తమ వాహనాల్లో కారును వెంబడించడంతో దుండ‌గులు భ‌య‌ప‌డిన‌ట్టున్నారు. మెట్టపల్లి-ఆలమూరు రహదారిపై స్కార్పియోను వదిలేసిన నల్లమల అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. ఈ ఘ‌ట‌న‌తో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త‌త త‌లెత్తింది. రవిచంద్రారెడ్డి మాజీ మంత్రి అఖిలప్రియకు ప్రధాన అనుచరుడు. తెలుగుదేశం నేత ఏవీ సుబ్బారెడ్డిపై గతంలో జరిగిన హత్యాయత్నం సహా పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. అతన్ని హత్య చేయడానికే దుండగులు వచ్చినట్టు అనుమానిస్తున్నారు. వాహ‌నంను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కారు నెంబ‌ర్ ప్లేట్ ఫేక్ అని తేల్చారు. స్కార్పియో య‌జ‌మాని గురించి ఆరా తీస్తున్నారు. ఆళ్లగడ్డ పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు స‌మాచారం.   

హైదరాబాద్ కు రెడ్ అలర్ట్.. వరదలో వందలాది కాలనీలు 

తెలంగాణ రాజధాని హైదరాబాద్ మరోసారి నీట మునిగింది. బుధవారం సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు కుండపోతగా వర్షం కురవడంతో వరద పోటెత్తింది. వరద బీభత్సానికి వందలాది కాలనీలు నీట మునిగాయి. వేలాది ఇండ్లు మోకాళ్ల లోతు నీటిలో ఉన్నాయి. వరద ఉధృతంగా వస్తుండటంతో చాలా కాలనీల్లో జనాలు ఇంటి నుంచి బయటికి రాలేక నరకయాతన అనుభవిస్తున్నారు. మ్యాన్ హోల్స్ పొంగుతున్నాయి. నాలాల పై నుంచి వరద ప్రవహిస్తోంది.  హైదరాబాద్‌ పరిధిలో ఉప్పల్‌లో అత్యధికంగా 21.2 సెం.మీ వర్షపాతం నమోదైంది. అబ్దుల్లాపూర్‌మెట్‌ 20, వనస్థలిపురం 19.2 సెం.మీ, హస్తినాపురం 19, పెద్ద అంబర్‌పేట్‌లో 18 సెం.మీ, సరూర్‌నగర్‌ 17.9, హయత్‌నగర్‌లో 17.2 సెం.మీ, రామంతాపూర్‌లో 17.1, హబ్సిగూడలో 16.5 సెం.మీ వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నీటమునిగిన ఎల్బీనగర్‌, ఉప్పల్ ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. అంబర్ , రామంతాపూర్ ప్రాంతాల్లోనూ వరద బీభత్సం ఎక్కువగా ఉంది.  ఇప్పటికే వరదతో అల్లాడుతున్న హైదారాబాద్ కు వాతావరణ శాఖ తాజా హెచ్చరిక మరింత ఆందోళన కల్గిస్తోంది. గురువారం హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్‌ అలర్డ్‌ జారీ చేసింది. మేడ్చల్‌, మల్కాజ్‌గిరి, రంగారెడ్డి సంగారెడ్డి, యాదాద్రి, మెదక్‌ జిల్లాలకు రెడ్‌ అలర్ట్ ప్రకటించింది. దీంతో నగరవాసులు వణికిపోతున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు రెయిన్ టీమ్ లను అలర్ట్ చేశాయి. భారీ వర్షాలతో ఇవాళ లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతాయని ఐఎండీ హెచ్చరించింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడవచ్చని తెలిపింది. పంటలు కూడా నీట మునుగుతాయని.. జలాశయాల్లో నీటి మట్టం పెరుగుతుందని అంచనా వేసింది.  తెలంగాణలో కుండపోత వానలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో చెరువులు పొంగిపొర్లుతున్నాయి. వలిగొండ మండలం పరిధిలో  ధర్మారెడ్డి పల్లి కాల్వ కు గండి పడింది.   ఆదిలాబాద్, అసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జనగాం, సిద్దిపేట, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, కామరెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయి.

కూతురికి ప్రియురాలి పేరు..భార్య ఇంట్లో ఫైట్..

పిల్లలు పేర్లు పెట్టడం ఎప్పుడు ఉన్న రోజుల్లో మామూలు విషయం కాదనే చెప్పాలి. తల్లి దండ్రులకు పెద్ద తలనొప్పి అనే చెప్పాలి..వాళ్ళ ఇంటి తరపు వాళ్ళ పేర్లు పెట్టాలని భార్య.. లేదు మా ఇంటి తరపు వాళ్ళ పేర్లు పెట్టాలని భార్య.. ఇది ఒక్కడు.. ఇప్పుడు వ్యక్తి గత స్వేచ్ఛ ఎక్కువైడి కాబట్టి ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరికి భార్య తరపు వాళ్ళ పేరు. మరొకరికి భర్త తరపు వాళ్ళ పేరు పెట్టుకుంటున్నారు.. ఇప్పటికే ఈ రెండో అంతరించిపోయాయి.. పూర్వీకులను గుర్తుచేసుకోవడం లేదు నేటి తరం యువత..అయితే తాజాగా కుమార్తెకు పెట్టిన పేరు వల్ల రచ్చ అయింది.. అదేంటో మీరు తెలుసుకోండి..  తల్లిదండ్రులు తమ బిడ్డకు పేరు పెట్టడానికి ముందు చాలా ఆలోచిస్తారు.  పంతుల్ని అడుగుతారు. పేరు బలం చూస్తారు. కొంతమంది మంచి అర్ధాన్నిచ్చే పేర్ల కోసం ఆన్‌లైన్‌లో వెతుకుతారు. కానీ తాజాగా ఒక వ్యక్తి తన కుమార్తెకు ప్రేయసి పేరు పెట్టాడు..  పాపం భార్యకు తెలీదు.. ఒకరోజు ఏం జరిగిందంటే..? మరికొందరు తమ తాతముత్తాతల లేదా దేవుళ్ల పేర్లు వచ్చేలా పెట్టుకుంటారు. చాలా మంది తమ పిల్లలకు తమ అభిమానించే రాజకీయ నాయకుల, హీరోల, సంఘసంస్కర్తల పేర్లు పెడతారు. ఇంకొంతమంది అయితే కాస్త ముందుచూపుతో ఆలోచించి.. ఫ్యూచర్‌లో తమ పిల్లలకు పేరు వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా కాస్త ట్రెండీగా క్యాచీగా  నేమ్స్ సెలక్ట్ చేసుకుంటారు.  అయితే, తన తప్పు తెలియకుండా ఉండటానికి ఒక వ్యక్తి తన కుమార్తెకు పేరు పెట్టాడు. అవును, తన ప్రేయసి వ్యవహారం గురించి ఎవరికీ తెలియకూడదనే ఆలోచనతో అతను కూతురుకు పేరు పెట్టాడు. అమెరికాలోని కెంటుకీలో ఒక వ్యక్తి తన కుమార్తెకు తను ప్రేమించిన ప్రేయసి పేరు పెట్టాడు.. మరిచిలేక పోయాడు అనుకుంటా... లేదంటే ముందే జాగ్రత్త పడడానికి అనుకుంటా మరి. తన  అక్రమ సంబంధాన్ని గుట్టు ఇంట్లో తెలియనివ్వకూడదని అతను అనుకున్నాడు. అయినప్పటికీ, అతను ప్లాన్ చేసినట్లు జరగలేదు. బిడ్డ పుట్టిన కొద్ది నెలలకే అసలు రహస్యం బయటపడింది. ఆడవాళ్ళ కళ్ళు కప్పి మగవాళ్లు ఏమైనా చేయగలరా చెప్పండి.. అద మగవాళ్ల మూర్ఖత్వం కాకపోతే దీని తరువాత అతడి ఇంట్లో చాలా గందరగోళం చెలరేగింది. తన తండ్రి ఆమె ప్రియురాలు పేరు తనకు పెట్టారని  తాజాగా ఓ యువతి టిక్ టాక్ వేదికగా వెల్లడించింది. ఆమె పుట్టకముందే, తల్లిదండ్రులు అబ్బాయి పుడితే తల్లి.. అమ్మాయి పుడితే తండ్రి పేరు పెట్టాలని నిర్ణయించుకున్నారట. అమ్మాయి జన్మించడంతో, తండ్రి ఆమెకు క్రిస్టినా అని పేరు పెట్టారు. ఆమె తల్లి కూడా నేమ్ బానే ఉందని ఆనందపడింది. వాస్తవానికి కుమార్తెకు ఈ పేరు ఎందుకు ఎంచుకున్నారో తల్లికి తెలియదు. కొన్ని నెలల తరువాత తన తండ్రి మోసం చేస్తున్న విషయం తల్లికి తెలిసిపోయిందట. ఇంట్లో అనుకోకుండా ప్రేయసి పేరును ప్రస్తావిస్తే దొరికిపోకుండా ఉండేందుకు.. అతడు ఈ పని చేశాడట. దీంతో తమ ఇంట్లో అనేక గొడవలు జరిగాయని సదరు యువతి వివరించింది.

భ‌ర‌త్‌ అనే అత‌ను.. మ‌హా నాయ‌కుడు.. ఓయ్ నిన్నే...

బుర‌ద‌లో రాయి వేస్తే ఏమ‌వుతుంది? బుర‌ద చిల్లి మ‌న బ‌ట్ట‌లే పాడ‌వుతాయి. నోరు ఉన్నోడి జోలికొస్తే ఏమ‌వుతుంది? మ‌న బండార‌మంతా బ‌ట్ట‌బ‌య‌ల‌వుతుంది? అదే, ర‌ఘురామ లాంటి ప‌వ‌ర్‌హౌజ్‌ను ట‌చ్ చేస్తే ఏమ‌వుతుంది? ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. డౌట్ ఉంటే.. సీఎం జ‌గ‌న్‌రెడ్డిని అడ‌గండి తెలుస్తుంది.. ఎంపి ర‌ఘురామ‌తో పెట్టుకుంటే మ‌న‌శ్శాంతి లేకుండా ఎలా నిద్ర‌లేని రాత్రులు గ‌డుపుతున్నారో. వైసీపీ అధినేత జ‌గ‌నే ర‌ఘురామ‌తో పెట్టుకొని.. లాక్కోలేక‌, పీక్కోలోక తెగ ఇదైపోతున్నారు. అలాంటిది.. రాజ‌మండ్రి ఎంపీ మార్గాని భ‌ర‌త్ మ‌రే ప‌నిలేన‌ట్టు అన‌వ‌స‌రంగా ర‌ఘురామ‌ను కెలికాడు. ఇక అంతే.. ఢిల్లీలో మీడియా స‌మావేశంపెట్టి మ‌రీ భ‌ర‌త్‌ను ప‌రువంతా తీసేశారు ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.  తనపై అనర్హత వేటు వేసేలా పావులు కదుపుతున్న రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌పై రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు పడుతుంది.. నర్సాపురం నియోజకవర్గ సమస్యలు సీఎం జగన్ నన్ను చూసుకోమన్నారు’ అని భరత్‌ వ్యాఖ్యానించడంపై రఘురామ స్పందించారు. లోక్‌సభ స్పీకర్ నిర్ణయాలను కూడా తమ పార్టీ నాయకులే తీసుకుంటున్నట్లు తనకు తెలియదని ఎద్దేవా చేశారు. ‘భరత్‌ను స్వాగతిస్తున్నా. ఆయన ఓ సినిమాలో నటించారు. అయితే ప్రజలు దాన్ని చూడకపోవడంతో ప్లాప్ అయింది. అందుకే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. లేకపోతే రాష్ట్ర ప్రజలు ఓ మహా నాయకుడిని కోల్పోయేవారు. రాజమండ్రిలో ప్రజలు నివసించేందుకు ఆవ భూమిని ఎంపిక చేసి ముఖ్యమంత్రి మనసు దోచిన ఆయన అనేక నియోజకవర్గాలకు ఎదగాలని ఆశిస్తున్నా’ అంటూ సెటైర్లు వేశారు ర‌ఘురామ‌.  తనపై అనర్హత అంశంలో లోక్‌సభను స్తంభింపజేస్తామని ప్రగల్భాలు పలికే వారు ఆ విద్యను ప్రత్యేక హోదా, పోలవరం నిధులు, రైల్వే జోన్‌పై ఎందుకు వినియోగించడం లేదని రఘురామ ప్రశ్నించారు. మీ కేసుల విచారణ 11 ఏళ్లుగా జరుగుతుంటే నా కేసుల విచారణ వెంటనే జరగాలని కోరడమేంటని ప్రశ్నించారు. తన అనర్హతపై వారి ఆశలు అడియాశలుగా మిగిలిపోతాయని, తన ఆశయం నెరవేరుతుందనే నమ్మకం తనకుందని చెప్పారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి తనను ఆహ్వానించకపోవడంపై ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని రఘురామ తెలిపారు.  ఎంపీ భ‌ర‌త్‌పై ర‌ఘురామ వేసిన సెటైర్లపై రాజ‌మండ్రిలో తెగ చ‌ర్చించుకుంటున్నారు. నిండా నీటితో ఉండే ఆవ భూమిని.. ఇళ్ల నిర్మాణానికి ఎంపిక చేసిన వైనాన్ని గుర్తు చేసుకొని చీద‌రించుకుంటున్నారు. సినిమాల్లో వేసిన డ్రామాలే.. రాజ‌కీయాల్లోనూ వేస్తున్నారంటూ మండిప‌డుతున్నారు. ఇంత‌కీ, ఎంపీ భ‌ర‌త్ హీరోగా న‌టించిన సినిమా పేరు తెలుసా..? ఓయ్ నిన్నే....

ఆ కలెక్టర్  ఓ దేవుడు 

ఇది చదువుతుంటే, లేదా వింటుంటేనే కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. అవునా, ఇది నిజామా, కల కాదు కదా అన్న అనుమానం కూడా కలుగుతుంది. కానీ, ఇది నిజం. మానవత్వం, మనిషితనం ఇంకా బతికే ఉన్నాయి. బతికించే అధికారులూ ఉన్నారన్న విశ్వాసం మిగిల్చే  ఓ కలెక్టర్’ కథ.  అధికార దర్పం ఎలా ఉంటుందో, అధికారాలను సామాన్యులు కలవడం ఎంత కష్టమో అందరికీ ఎదో ఒక సందర్భంలో అనుభవంలోకి వచ్చే ఉంటుంది. అందులోనూ నిత్యం తమ విధులతో అష్టావధానం, శతావధానం చేసే కలెక్టర్ స్థాయి అధికారిని కలవడం ఎంత కష్టమో వేరే చెప్పనక్కర లేదు. అలాంటిది కల్లెక్టరే వచ్చి, ఓ పేదరాశి పెద్దమ్మ ఇంటి తలుపు తడితే ... అదే జరిగింది. నిజానికి ఇది ఊహకు కూడ అందని నిజం. అయితే, అది మన తెలుగు రాష్ట్రాలలో కాదు, మన పొరుగున ఉన్న తమిళ నాడులో,అలాగని తెలుగు రాష్ట్రలలో అలాంటి  ఉత్తములు లేరని కాదు.  ఇక విషయంలోకి వస్తే ... అది తమిళనాడులోని కరూర్ జిల్లాలోని ఒక గ్రామం.. ఆ గ్రామంలో ఓ పూరి గుడిసె... ఆ గుడిసెలో  నా అనే వారు ఎవరూ లేని ఓ 80 సంవత్సరాల వృద్దురాలు ఒంటరిగా జీవిస్తోంది. ఇరుగు పొరుగు వారికి కూడా ఆ అవ్వను పట్టించుకే స్థోమత లేదో . మనసే లేదో గానీ, ఎవరూ ఆమెను పట్టించుకోలేదు. అలా ఒంటరిగా దేవుని తోడుగా జీవిస్తోంది.  ఆ విషయం ఎలా తెలిసిందో గానీ ఆ జిల్లా కలెక్టర్’కి తెలిసింది. ఆమెకు సంబందించిన సమాచారం తెప్పించున్నారు. ప్రభుత్వ సహాయానికి ఆమెకు అన్ని అర్హతలు ఉన్నాయని గుర్తించారు. ఆయన తమ కుర్చీలోంచి కదలకుండా ఆ అవ్వకు సహయం చేయవచ్చును. కానీ, ఆయన అలా చేయలేదు, స్వయంగా ఆయనే, ఆమె గుడిసెకు వెళ్లి, ప్రేమగా పలకరించారు, ఆమెతో కలిసి భిజనం చేశారు. నీకు అండగా నేనున్నాను, అనే భరోసా ఇచ్చారు.  వివరాలోకి వెళితే ... ఒక రోజు కలెక్టర్ తమ ఇంటినుంచి భోజనం క్యారియర్ తీసుకుని నేరుగా ఆ అవ్వ ఇంటికి వెళ్లారు. తలుపు తట్టి లోపలకు రావచ్చా ... అని అడగారు ... ఆ వచ్చిన వ్యక్తి ఎవరో ఆమెకు తెలియదు. ఇంతలోనే కలెక్టర్ లోపలకు వెళ్లి ... అయ్యో కుర్చీకూడా లేదే అని అవ్వ అనేలోపలే కింద కూర్చున్నారు. తనను తాను పరిచయం చేసుకున్నారు. తనతో కలిసి భోజనం చేయమని కోరారు. ఆమె అవాక్కయ్యారు.  కలెక్టర్  తెచ్చిన క్యారియర్ విప్పి ఆమెతో కలిసి భోజనం చేశారు. వెళుతూ వెళుతూ ఆమె చేతిలో ఒక కవర్ ఉంచారు. అసలు ఏమి జరుగుతుందో, ఆ కవర్’లో ఏముందో ఆమెకు అర్థం కాలేదు. అలాగే బయట గుమిగూడిన జనాలకు కూడా .. . అందులో ఇందిరా ఆవాస్ యోజన కింద మంజూరు చేసిన ఇంటి పత్రాలు,వృద్దాప్య ఫించనుకు సంబంధించిన పత్రాలు ఉన్నాయి. వెళుతూ ఆ కలెక్టర్ ఆప్యాయంగా ఆమె చెయ్యి పట్టుకుని  ‘అవ్వా ... నువ్వు డబ్బులు తీసుకోవడానికి బ్యాంక్ కు వెళ్ళనవసరం లేదు.. డబ్బులు నీ ఇంటికే వచ్చే ఏర్పాటు చేశాను’  అన్నారు. ఆ అవ్వ కళ్ళ నిండా ఆనందభాష్పాలతో… ఆ అధికారికి చేతులెత్తి నమస్కరించింది. ఆ అవ్వ ఒక్కరే కాదు, మనం అందరం కూడా ఆ కలెక్టర్ కు ... లంటి ఎందఱో మహానుభావులకు చేతులెత్తి దండం పెట్టొచ్చు.

అమరావతిపై కేంద్రం యూ టర్న్.. చంద్రబాబు హర్షం 

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతోంది. గడియకో మాట మాట్లాడుతూ గందరగోళం స్పష్టిస్తోంది. ఇటీవల ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద ఏపీ మూడు రాజధానుల అంశంపై కేంద్రహోంశాఖకు దరఖాస్తు చేయగా.. రాజధాని అంశం రాష్ట్రం పరిధిలోనిదంటూ అమరావతి ప్రస్తానవ లేకుండా సమాధానం పంపింది. దీనిపై విమర్శలు రావడంతో మళ్లీ మరో సమాధానం పంపింది.  చైతన్యకుమార్‌రెడ్డి అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద ఏపీ మూడు రాజధానుల అంశంపై కేంద్ర హోంశాఖకు దరఖాస్తు చేశారు.దీనిపై ఆ శాఖ సీపీఐఓ డైరెక్టర్‌ రేణు సరిన్ ఈ నెల 6న సమాధానం ఇస్తూ.. అమరావతి ప్రస్తావన తీసుకురాకుండా.. ‘ఏపీ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమ్మిళిత అభివృద్ధి చట్టం-2020’ కింద వీటిని ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో మూడు పరిపాలన కేంద్రాలు ఉంటాయని, వీటిని రాజధానులు అంటారని వివరించారు. రాజధాని అంశాన్ని ఆ రాష్ట్రమే నిర్ణయించుకుంటుందని తెలిపారు. కేంద్ర హోంశాఖ ఇచ్చిన సమాధానంపై అమరావతి జేఏసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అమరావతి జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్‌ జీవీఆర్ శాస్త్రి.. కేంద్ర హోంశాఖ అప్పిలేట్‌ అథారిటీ అయిన సంయుక్త కార్యదర్శి ప్రకాష్‌కు ఈనెల 9న లేఖ రాశారు. వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు సమాచారం ఇచ్చారని అందులో పేర్కొన్నారు. రేణు సరిన్ పేర్కొన్న చట్టం ఇంకా అమల్లోకి రాలేదని గుర్తు చేశారు. రాజధాని అంశం న్యాయస్థానం పరిధిలో ఉందన్నారు. శాస్త్రీ లేఖపై స్పందించిన సరిన్.. గతంలో తానిచ్చిన సమాధానాన్ని సవరించారు. ఏపీ రాజధాని అంశం న్యాయపరిధిలో ఉందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో కేంద్ర హోంశాఖ ఇటీవల ఇచ్చిన సమాధానాన్ని సరిచేసుకోవడం హర్షణీయమని ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. కేంద్రం తప్పుగా ఇచ్చిన సమాధానాన్ని సరిచేసుకోవడం హర్షణీయమన్నారు. కేంద్ర ప్రభుత్వ అధికారిని రాష్ట్ర ప్రభుత్వం తప్పుదారి పట్టించి, వాస్తవాలను తారుమారు చేసినట్టు దీంతో స్పష్టమైందన్నారు. తప్పును సరిచేయించారంటూ జీవీఆర్ శాస్త్రిని అభినందించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతే ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. 

కేకుల్లో డ్రగ్స్.. సైకాలజిస్ట్‌ అరెస్ట్..

ఎలాగైనా అడ్డంగా సంపాదించాలనే కక్కుర్తితో.. ఈ పని ఉద్యోగం లేని వాడు, పేదరికంలో ఉన్నవాడు చేయడం ఆనవాయితి. బట్ స్మాల్ చేంజ్ ఉన్నత విద్యావంతులు, డబ్బులు దండిగా ఉన్నవాళ్లు చేయడాన్ని ఏమంటారో.. డబ్బుకోసం వీళ్ళు కూడా అడ్డదారులు తొక్కుతున్నారు. ఏ పని చేస్తున్నాం.. దాని వల్ల సమాజాని ప్రజలను పక్కద్రోవ పట్టించే విధంగా ఉంరుందా నేనే నైతిక విలువ వాళ్లకు ఉండదు.. వల్ల ఇంతేన్తియాన్ ఇన్ టెంక్షన్ అంత ఒకటే.. డబ్బు డబ్బు డబ్బు. అదే డబ్బుల కోసం ఉన్నత చదువులు చదివి.. మనుషుల మసస్తత్వంపై అధ్యయనం చేసే ఓ సైకాలజిస్టు సైకాలజిస్ట్ నయా దందా.. కేకుల్లో డ్రగ్స్‌ పెట్టి రేవ్ పార్టీలకు సరఫరా.. విచారణలో షాకింగ్ నిజాలు ఈజీ మనీ కి అలవాటు పడిపోయారు కొందరు. ఆ డబ్బు మోజులో పది  ఎలాగైనా అడ్డంగా సంపాదించాలనే కక్కుర్తితో.. ఈ మధ్య సంఘం లో గుర్తింపు ఉన్నవాళ్లు, ఉన్నత విద్యావంతులు కూడా అడ్డదారులు తొక్కుతున్నారు. తాజాగా.. మనుషుల మసస్తత్వంపై అధ్యయనం చేసే ఓ సైకాలజిస్టు కూడా డబ్బుకోసం అడ్డదారులు తొక్కి పెద్ద డ్రామా చేశాడు చివరికి పోలీసులకు చిక్కాడు. ఈ సంఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో చోటుచేసుకుంది. ముంబైలోని ఓ ఆసుపత్రిలో సైకాలజిస్ట్‌గా పనిచేస్తున్న రహమీన్‌ చరాణియా (25) ఎక్కువ మనీ ఎర్న్ చేయడానికి  ఓ బేకరీ ప్రారంభించాడు. బ్రేక్ లో ఏం లాభం వస్తది అని అనుకోకండీ.. ఆ బేకరీ పెట్టింది కేకులు అమ్మడానికి కాదు. కేకుల్లో డ్రగ్స్‌ పెట్టి సరఫరా చేయాడాయికి. అలా  చేస్తూ దొరికిపోయాడని ఎన్‌సీబీ అధికారులు బుధవారం వెల్లడించారు. ఇటీవల నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారులు సోదాలు నిర్వహించగా కేకులు, బ్రౌనీల్లో డ్రగ్స్‌ అమ్మకాలు జరుపుతున్నాడని తేలిందన్నారు. ఈ డ్రగ్స్ కేకులను రేవ్‌ పార్టీలకు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఎన్‌సీబీ ముంబయి జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ మీడియాతో మాట్లాడారు. చూడటానికి కేకుల్లా కనిపించినా.. వీటిల్లో డ్రగ్స్‌ నింపి డెలివరీ చేస్తున్నట్లు వివరించారు. తనిఖీల్లో 10 కిలోల కేకుల్లో డ్రగ్స్‌ ఉన్నట్టు గుర్తించామన్నారు. జనాలను ఆకట్టుకునేందుకు ముగ్గులో దించేందుకు ఆ కేకులకు రెయిన్‌బో కేకులని అందరిని పేరు పెట్టి అందులోని తయారు చేసే మైదాపిండిలో మాదకద్రవ్యాలను కలుపుతున్నట్లు వివరించారు. చరాణియా ఇంట్లో కూడా తనిఖీలు నిర్వహించగా.. రూ.1.7లక్షలు విలువజేసే ఓపీఎమ్‌ డ్రగ్‌ లభ్యమైందని పేర్కొన్నారు. కాగా.. ఎన్‌సీబీ విచారణలో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయని అధికారులు తెలిపారు. ఓటీటీల్లో వచ్చే అంతర్జాతీయ వెబ్‌సిరీస్‌‌లు చూసి ఇలాంటి ఈ దందా చేస్తున్నట్లు నిందితుడు ఎన్‌సీబీ అధికారులకు తెలిపాడు. కేకుల్లో డ్రగ్స్ పెట్టి సరఫరా చేయడం క్షుణ్ణంగా పరిశీలించానని.. ఆతర్వాత తాను కూడా ఇలాంటి దందా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడన్నారు. అయితే.. డ్రగ్స్‌ విక్రయాన్ని సోషల్‌ మీడియా ద్వారా నిర్వహించేవాడని, దీనికోసం సౌత్‌, వెస్ట్‌ ముంబైలో రమ్‌జాన్‌ అనే వ్యక్తిని సహాయకుడిగా నియమించుకున్నాడని అధికారులు తెలిపారు. అతడిని కూడా పోలీసులు పట్టుకున్నట్లు వెల్లడించారు. డబ్బు సంపాదించాలనే ఆశతో డ్రగ్స్‌ వ్యాపారాన్ని ఎంచుకున్నాడని జోనల్ డైరెక్టర్ సమీర్ వివరించారు. స్మగ్లర్స్ ఎన్ని సినిమాలు చూసి యెంత అప్ డేట్ ఐన మన పోలీసులకు చిక్కాల్సిందే 

ఢిల్లీలో రేవంత్ రెడ్డి దూకుడు.. రాహుల్ తో కలిసి నిరసన..

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాష్ట్రంలోనే కాదు ఢిల్లీలోనూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. కేంద్ర వ్యవహార శైలిని నిరసిస్తూ కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీతో కలిసి రక్షణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం నుంచి వాకౌట్ చేశారు .రేవంత్ రెడ్డి. పార్లమెంటరీ ఢిఫెన్స్ కమిటిలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు. రక్షణ శాఖ కమిటి బుధవారం సమావేశమైంది. ఈ భేటీకి హాజరైన  ప్రతిపక్షనేతలు ఎజెండా ప్రకారం సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై చర్చించాలని పట్టుబట్టారు. అయితే అందుకు కమిటీ చైర్మన్ జుయల్ ఓరం నిరాకరించారు. చైర్మన్ తీరుకు నిరసనగా కమిటీ సమావేశం నుంచి వాకౌట్ చేస్తున్నట్లు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ప్రకటించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అంతకు ముందుకు రాహుల్ గాంధీ బీజేపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఘాట వ్యాఖ్యలతో ట్వీట్ చేశారు. రక్షణ, విదేశాంగ విధానాలను దేశీయ రాజకీయాల కోసం వినియోగించుకుంటున్నారని రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. భారత్ రక్షణ విషయంలో ఎప్పుడూ ఇంత బలహీనంగా లేదని విమర్శించారు. దీనికి సంబంధించి ఓ పేపర్ క్లిప్పింగ్‌ను కూడా రాహుల్ ట్వీట్‌కు జత చేశారు. అయితే, ఈ ట్వీట్ పై బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర తీవ్రంగా మండిపడ్డారు. ఫేక్ న్యూస్ ఆధారంగా రాహుల్ ట్వీట్లు చేస్తున్నారని, అలా చేయడం ఏమాత్రం భావ్యం కాదని సంబిత్ పాత్రా హితవు పలికారు. మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ వ్యూహ కమిటీ భేటీ జరిగింది. ఈ భేటీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. ఈ నెల 19 న వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో మాజీ ప్రధాని మన్మోహన్, ఎంపీ రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, అధీర్ రంజన్, మల్లికార్జున ఖర్గే, ఏకే ఆంటోనీ తదితరులు పాల్గొన్నారు. 

రంగంలోకి బిగ్‌బాస్‌.. అమిత్‌షా టేబుల్‌పై హుజురాబాద్ రిపోర్ట్‌..

హుజురాబాద్ ఉప ఎన్నిక. టీఆర్ఎస్‌కు ఎంత ముఖ్య‌మో.. బీజేపీకీ అంతే కీల‌కం. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ గెలిచి తీరాల్సిన స్థానం. ఏమాత్రం కాంప్ర‌మైజ్ కాలేని ప‌రిస్థితి. గెలిస్తేనే.. నిలిచేది. ఓడితే.. ట్ర‌యాంగిల్ రేస్‌లో చాలా డ్యామేజ్ జ‌రిగిపోద్ది. అందుకే, స‌ర్వ‌శ‌క్తులూ ఒడ్డుతోంది క‌మ‌ల‌ద‌ళం. బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షులు బండి సంజ‌య్ సైతం హైద‌రాబాద్ నుంచి హుజురాబాద్‌కు పాద‌యాత్ర చేప‌ట్ట‌నున్నారు. ఇలా.. క‌మ‌ల‌నాథులంతా క‌లిసి ఒక్క‌ హుజురాబాద్ కోసం గ‌ట్టి పోరాట‌మే చేస్తున్నారు. తాజాగా, రాష్ట్ర నేత‌ల‌కు జాతీయ ద‌ళ‌ప‌తి తోడ‌య్యారు. హుజురాబాద్ కోసం తానుసైత‌మంటూ ముందుకొచ్చారు. ఒక్క‌సారి.. రెండుసార్లు కాదు.. తెలంగాణ కోసం తాను ఎన్నిసార్లైనా రాష్ట్రానికి వ‌స్తానని.. హుజురాబాద్‌లోనూ ప‌ర్య‌టిస్తానంటూ క‌మ‌లోత్సాహం నింపారు.  హుజురాబాద్‌. ఈట‌ల ఇలాఖా. ఏళ్లుగా ఆయ‌నే ఎమ్మెల్యే. ఇప్పుడు స‌మీక‌ర‌ణాలు వేగంగా మారిపోతున్నాయి. మొన్న‌టి వ‌ర‌కూ ఈట‌ల వ‌ర్సెస్ టీఆర్ఎస్‌గానే పోరు ఉంటుంద‌ని భావించారు. ఈట‌ల రాజేంద‌ర్ త‌న గెలుపు చాలా ఈజీ అనుకున్నారు. తాజాగా, పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి ఎంట్రీతో బ‌లాబ‌లాలు తారుమారు అవుతున్నాయి. ఇంకా టీఆర్ఎస్‌, కాంగ్రెస్ అభ్య‌ర్థులు ఎవ‌రో తెలీక‌పోయినా.. హుజురాబాద్‌లో ట్ర‌యాంగిల్ ట‌ఫ్ ఫైట్ త‌ప్ప‌ద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. దీంతో.. ఇప్ప‌టి వ‌ర‌కూ గెలుపుపై బిందాస్‌గా ఉన్న క‌మ‌ల‌నాథుల్లో ఒక్క‌సారిగా ఉలిక్కిపాటు మొద‌లైంది. అందుకే, రేవంత్‌రెడ్డి ఎంట్రీ త‌ర్వాతే బండి సంజ‌య్‌, ఈట‌ల రాజేంద‌ర్‌లు పాద‌యాత్ర ప్ర‌క‌టించారు. తాజాగా, ఢిల్లీ వెళ్లి జాతీయ అధ్య‌క్షులు అమిత్‌షాను క‌లిసి మ‌రింత వ్యూహ‌ర‌చ‌న చేశారు.  ఈ సంద‌ర్భంగా అమిత్‌షా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి కూడా అయిన ఆయ‌న‌.. ఇంటెలిజెన్స్ వ‌ర్గాల ద్వారా హుజురాబాద్ స‌ర్వే రిపోర్టులు తెప్పించుకున్న‌ట్టు తెలుస్తోంది. ఆ కేంద్ర స‌ర్వేల ప్ర‌కారం.. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల గెలుస్తారనే సర్వేలు వచ్చినట్టు బీజేపీ నేతలు చెప్పారు. ఎన్నిక‌ల‌కు ముందే హుజురాబాద్‌లో అమిత్‌షాతో ఓ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించేలా క‌స‌ర‌త్తు చేస్తున్నారు. త్వ‌ర‌లో ఈటల రాజేందర్ చేయ‌బోయే పాదయాత్రకూ అమిత్‌షాను ఆహ్వానించారు బీజేపీ రాష్ట్ర నాయ‌కులు. తెలంగాణలో పాగా వేసేందుకు ఎన్నిసార్లైనా వస్తానని అమిత్‌షా హామీ ఇచ్చారు.  ఢిల్లీలో అమిత్‌షా నూరిపోసిన ధైర్యం.. కేంద్ర‌ స‌ర్వేల స‌మాచారంతో క‌మ‌ల‌నాథుల్లో మ‌రింత జోష్ పెరిగింది. ఇక హుజురాబాద్‌లో గెలుపు త‌మ‌దేనంటూ మ‌రింత ఉత్సాహంగా ప‌ని చేయ‌బోతున్నారు. మ‌రి, బీజేపీ దూకుడుకు టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌లు బ్రేకులు వేస్తాయా? లేక‌, ఈట‌ల‌-కాషాయ సునామీలో కొట్టుకుపోతారా?   

కేంద్రం డీఏ పెరిగింది.. ఏపీ ఉద్యోగులకు ఎప్పుడో మరీ..?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఎ పెంచుతూకేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్ల డిఎ 17శాతం నుంచి 28 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించింది.ఏడవ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు కేబినెట్ డిఎ పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూలై 1 నుంచి పెంచిన డిఎ అమలు కానుందని కేంద్ర స్పష్టం చేసింది. కేబినెట్ నిర్ణయాలను కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. దీంతో ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు చెప్పినట్టు అయింది. ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రెస్ ఇండెక్స్ డేటా ఆధారంగా డిఎ పెంపు ఉంటుందని కేంద్రం పేర్కొంది.డీఏ పెంపు వల్ల రూ.34,401 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాపై భారం పడనుందని వివరించారు. ఈ నిర్ణయంతో 48.34 లక్షల మంది ఉద్యోగులు, 65.26 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుందని కేంద్ర మంత్రి అనురాగ్ చెప్పారు.  కేంద్ర సర్కార్ తమ ఉద్యోగులకు డీఏ పెంచడంతో ఏపీ ఉద్యోగుల పరిస్థితి ఏంటన్న చర్చ జరుగుతోంది. ఏపీ సర్కార్ ఇప్పటికే ఏడు డీఏలు పెండింగులో పెట్టింది. ఇక కొత్త డీఏ ఎప్పుడు ప్రకటిస్తుందన్నది చర్చగా మారింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులంటే ఎందుకంత చులకన? అంటూ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. కరోనా విపత్తు సమయంలో కూడా ప్రాణాలకు తెగించి పోరాడుతున్న ఉద్యోగుల విషయంలో ప్రభుత్వ సాచివేత ధోరణి సరికాదంటూ ఆయన ట్వీట్ చేశారు. కేంద్రప్రభుత్వం ఉద్యోగులకు 11శాతం డిఎ ప్రకటించింది.. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎప్పుడు లేనివిధంగా 7 డిఎలు పెండింగ్ లో పెట్టిందని చంద్రబాబు చెప్పారు. పిఆర్ సి ఊసేలేదు, అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో రద్దు చేస్తానన్న సిపిఎస్ జాడలేదని అన్నారు. కరోనా విపత్తు సమయంలో కూడా ప్రాణాలకు తెగించి పోరాడుతున్న ఉద్యోగుల విషయంలో ప్రభుత్వ సాచివేత ధోరణి సరికాదన్నారు చంద్రబాబు.

కౌన్సిల‌ర్లా? గోపీలా? సిగ్గు.. సిగ్గు..

మొన్న టీఆర్ఎస్ కౌన్సిల‌ర్లు. నిన్న బీజేపీ నాయ‌కులు. ఇవాళ మ‌ళ్లీ గులాబీ ప్ర‌జాప్ర‌తినిధులు. గోడ మీద పిల్లుల్లా ఎటు ప‌డితే అటు దూకేశారు వాళ్లు. రాజ‌కీయ విలువ‌ల‌కు తూట్లు పొడిచారు. ఓట్లు వేసి ఎన్నుకున్న జ‌నాల‌తో చివాట్లు తింటున్నారు. దుబ్బాక కేంద్రంగా న‌డిచిన పొలిటిక‌ల్ డ్రామా.. తెలంగాణ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా నిలిచింది. కౌన్సిల‌ర్ల ఎపిసోడే అయినా.. రాష్ట్ర స్థాయి నేత‌ల ఎంట్రీతో రంజుగా మారింది. ప‌త‌న‌మ‌వుతున్న రాజ‌కీయ విలువ‌ల‌కు నిద‌ర్శ‌నంగా మిగిలింది. బీజేపీ, టీఆర్ఎస్‌ల రాజ‌కీయ క్రీడ‌లో ప్ర‌జాస్వామ్యం అబాసుపాలైంది. హుజురాబాద్ ఉప ఎన్నిక‌కు ముందు జ‌రిగిన ఈ ఎపిసోడ్‌తో పొలిటిక‌ల్ హీట్ అమాంతం పెరిగిపోయింది.  దుబ్బాక మున్సిపాలిటీకి చెందిన ముగ్గురు టీఆర్ఎస్ కౌన్సిలర్లు మంగళవారం బీజేపీలో చేరారు. కౌన్సిలర్లు మట్ట మల్లారెడ్డి, డివిటి కనకయ్య, దుబ్బాక బాలకృష్ణ గౌడ్‌లు కాషాయ కండువా క‌ప్పుకున్నారు. ప‌క్క‌పార్టీ ప్ర‌జాప్ర‌తినిధుల‌ను పార్టీలో చేర్చుకొని.. తామూ ఆ తానుముక్కుల‌మేన‌ని నిరూపించుకున్నారు క‌మ‌ల‌నాథులు. పేరుకు కౌన్సిల‌ర్లే అయినా.. వారి కోసం ఏకంగా బీజేపీ బ‌డాబ‌డా నేత‌లే త‌ర‌లివ‌చ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌, దుబ్బాక ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్‌రావు, మాజీ ఎంపీలు వివేక్‌, జితేంద‌ర్‌రెడ్డి, విజ‌య‌శాంతిల‌తో పాటు మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ స‌మ‌క్షంలో ఆ ముగ్గురు.. మొన‌గాళ్ల‌లో ఫోజు కొడుతూ కాషాయ శిబిరంలో చేరిపోయారు. పోతూపోతూ రొటీన్‌గా టీఆర్ఎస్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇక దుబ్బాక‌లో బీజేపీదే హ‌వా అన్న‌ట్టు అంతా క‌లిసి ఫోటోల‌కు ఫోజులిచ్చి.. ఎవ‌రింటికి వాళ్లు వెళ్లిపోయారు.  క‌ట్ చేస్తే.. తెల్లారేస‌రికి సీన్ మారిపోయింది. టీఆర్ఎస్ ట్ర‌బుల్ షూట‌ర్ హ‌రీశ్‌రావు చ‌క్రం తిప్పారు. ఆ ముగ్గురు కౌన్సిల‌ర్లలో ఇద్ద‌రు మ‌ళ్లీ గులాబీ గూటికి చేరిపోయారు. హ‌రీశ్‌రావు వారికి గులాబీ కండువ‌లు క‌ప్పి.. మ‌ళ్లీ పార్టీలోకి చేర్చుకున్నారు. బీజేపీది ఒక్క‌రోజు మురిపంగా మిగిలిపోయింది. తెర‌ముందు క‌థ ముగిసిపోయింది. తెర‌వెనుక అస‌లు క‌థ న‌డిచిందంటున్నారు. టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి మారేట‌ప్పుడు.. మ‌ళ్లీ బీజేపీ నుంచి టీఆర్ఎస్‌లోకి చేరేట‌ప్పుడు.. ఆ ఇద్ద‌రు కౌన్సిల‌ర్ల‌కు బాగానే గిట్టుబాటు అయిందంటున్నారు. ఒక్క‌రోజు గ్యాప్‌లోనే వారి ద‌శ తిరిగిపోయింద‌ని చెబుతున్నారు.   అస‌లు వాళ్లెందుకు అధికార పార్టీని వీడి బీజేపీలోకి వెళ్లిన‌ట్టు? ఒక్క‌రోజులోనే వారికి ఏం జ్ఞానోద‌యం అయింద‌ని మ‌ళ్లీ వెన‌క్కి వ‌చ్చేసిన‌ట్టు? ఎవ‌రైనా ఈజీగానే గెస్ చేయొచ్చు. ఆ ముగ్గురు కేవ‌లం పాత్ర‌లు మాత్ర‌మేన‌ని.. నాట‌క‌మంతా పార్టీల‌దేన‌ని. హుజురాబాద్ ఎన్నిక‌ల ముందు అధికార‌పార్టీని మాన‌సికంగా దెబ్బ‌కొట్టేందుకు.. ముగ్గురు కౌన్సిల‌ర్ల‌ను బీజేపీలోకి లాగారు ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్‌రావు. మావాళ్ల‌నే గుంజుకుంటారా అని టీఆర్ఎస్ నేత‌లు కౌంట‌ర్ యాక్ష‌న్‌కు దిగారు. ముగ్గురిలో ఇద్ద‌రిని స‌క్సెస్‌ఫుల్‌గా వెన‌క్కి లాగేసుకుని చ‌ప్ప‌ట్లు కొట్టించుకున్నారు. ఇలా కౌన్సిల‌ర్ల కోసం.. రెండు పార్టీలు, రాష్ట్ర స్థాయి నేత‌లు ఎత్తుకు పైఎత్తులు వేసుకోవ‌డం.. కౌన్సిల‌ర్ల‌ను గోపీలుగా మార్చ‌డం.. రాజ‌కీయంగా విమ‌ర్శ‌ల పాల‌వుతోంది. పార్టీలు, నేత‌ల తీరును ప్ర‌జ‌లు అస‌హ్యించుకుంటున్నారు. ఇదేమి రాజ‌కీయాలు.. సిగ్గు.. సిగ్గు.. అంటూ చీద‌రించుకుంటున్నారు. పార్టీలు మాత్రం అన్నీ తుడిచేసుకొని.. కొత్త ఎత్తుగ‌డ‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి.

పీకే డైరెక్షన్ లో రాహుల్ చిత్రం.. ‘లోక్ సభలో లీడర్’ 

ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీల రాజకీయం ఒకే ఒక్క వ్యక్తి చుట్టూ తిరుగుతోంది. ఆ వ్యక్తి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. ప్రశాంత్ కిశోర్ ఎవరు ఏమిటి, అనే పరిచయాలు అక్కరలేదు. ఆయన మంగళవారం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రాతో సమావేశ మయ్యారు.అంతకు ముందే విడిగా సోనియా గాంధీతోనూ  సమావేస మయ్యారు. ఇక అక్కడ నుంచి ఉహాగానాలు వరద ప్రవాహం మొదలలైంది. అనేక ఊహాగానాలు  కొట్టుకొస్తున్నాయి.  ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే పుకారు మొదలు, కిశోర్ డైరెక్షన్’ లో  లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ నేతగా యాక్ట్ చేసేందుకు  రాహుల్ గాంధీ ఒప్పుకున్నారనే వరకు అనేక వ్యూహాగానాలు ఢిల్లీ వీధుల్లో షికారు చేస్తున్నాయి.ఈ రెండు వ్యూహాగానాలు కూడా నిజమే అయినా అవ్వవచ్చుని, అయితే, ఏది ముందు ఏది వెనక అనే విషయంలో కొంత అస్పష్టత ఉందని వేగంగా మారుతున్న రాజకీయ  పరిణామాలను దగ్గరగా గమనిస్తున్నరాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.  ప్రస్తుతానికి అయితే, రాహుల్ గాంధీ లోక్‌సభలో కాంగ్రెస్ నేతగా బాధ్యతలు చేపట్టడం ఖరరైనట్లేనని అంటున్నారు. ఇప్పటికే ఆ పదవిలో ఉన్న అధీర్ రంజన్ చౌదరి స్థానంలో రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టనున్నట్లు కాంగ్రెస్ సన్నిహిత వర్గాల సమాచారం. రాహుల్ గాంధీని 2024 ఎన్నికలలో విపక్షాల ప్రధాని అభ్యర్ధిగా  మోడికి ఎదురు నిలపాలనే వ్యూహంతో పావులు కదుపుతూ వస్తున్న ప్రశాంత్ కిశోర్, ఆ వ్యూహంలో భాగంగానే లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేతగా రాహుల్ గాంధీ బాధ్యతలు తీసుకోవాలని సూచించారని అందుకు రాహుల్ అంగీకరించారని సమచారం. జులై నెల 19 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం మోడీ ప్రభుత్వం కొవిడ్ విషవలయంలో చిక్కుకుని బలహీనంగా మారింది. ఇలాంటి సమయంలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేతగా నిలబడితే, ఆయన ఇమేజి పెరుగుతుందని ప్రశాంత్ కిశోర్’ పక్క ప్రణాళికతో రాహుల్ గాంధీని ఒప్పించినట్లు తెలుస్తోంది.  ఇక ప్రశాంత్ కిశోర్, కాంగ్రెస్ పార్టీలో చేరటం విషయానికి వస్తే, అందుకు ఇంకా కొంత సమయం పడుతుందని అంటున్నారు. అలాగే, ఎన్నికలకు ముందా తర్వాత అనే విషయంలోనూ ఇంకా స్పష్టత రాలేదని అంటున్నారు. అదీ కాక, గతంలో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యూనైటెడ్ (జేడీయూ) పార్టీలో జాతీయ ఉపాధ్యక్షుడిగా పని చేసిన పీకే.. కొంత కాలానికే ఆ పార్టీ నుంచి వైదొలగారు. అలాగే, బెంగాల్ గెలుపు తర్వాత ఎన్నికల వ్యూహకర్తగా తప్పుకుంటున్నానని, ఇక వేరే ఫీల్డ్ లో పనిచేస్తానని చెప్పిన సందర్భంలోనే, రాజకీయాలు తన వంటికి పడవని ఒకసారి చేసిన తప్పు మళ్ళీ చేయనని కూడా ప్రకటించారు. అఫ్కోర్స్, రాజకీయ నాయకులే మాట మీద నిలబదనప్పుడు, ఆ రాజకీయ నాయకులను తోలుబొమ్మల్లా ఆడిస్తున్న వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మాటమీద నిలబడవలసిన అవసరం ఉంటుందా ..ఉండదు కదా