గ్రూప్1 మినహా మిగితా ఉద్యోగాలకు నో ప్రిలిమ్స్..  ఏపీపీఎస్సీ సంచలనం.. 

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 1 మినహాయించి మిగిలిన ఏ నోటిఫికేషన్‌కూ ఇకపై ప్రిలిమ్స్ ఉండదని ప్రకటించింది. ఇకపై ఏపీపీఎస్సీ నియామకాలకు ఒకే పరీక్ష నిర్వహించి ఉద్యోగాలు భర్తీ చేస్తామని  ఏపీపీఎస్సీ సభ్యుడు షేక్‌ సలాం బాబు తెలిపారు.  ప్రిలిమ్స్, మెయిన్స్ పూర్తికి ఏడాది, ఆ పైన సమయం పడుతోందని,  త్వరగా పోస్టులు భర్తీ కోసం ప్రిలిమ్స్ రద్దు చేయాలని నిర్ణయించామన్నారు. ఇకపై వచ్చే నోటిఫికేషన్లకు ఈడబ్ల్యూఎస్  రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. ఏడాదిన్నర కాలంలో 32 నోటిఫికేషన్లకు సంబంధించి నియామక ప్రక్రియను దాదాపు పూర్తి చేశామని చెప్పారు. కోర్టు పరిధిలో ఉన్నందున పాలిటెక్నిక్ లెక్చరర్లు, గ్రూప్ 1 నియామకాలు పూర్తి చేయలేకపోయామన్నారు షేక్‌ సలాంబాబు .  గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఇప్పటి వరకు 1180 ఖాళీ పోస్టులను గుర్తించామన్నారు. వీటిలో గ్రూప్ 1,2 సహా పలు విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. పోస్టులు పెంచి ఆగస్టులో  గ్రూప్స్ సహా పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తాం. ఆగస్టులో నోటిఫికేషన్ ప్రకటించే నాటికి ఎన్ని ఖాళీలు వస్తే అన్ని పోస్టులు పెంచి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ సభ్యుడు  వెల్లడించారు. అభ్యర్థుల వయోపరిమితిని 47ఏళ్లకు పెంచాలని ప్రభుత్వాన్ని నిరుద్యోగులు కోరుతున్నారని... ఇప్పటి వరకు వచ్చిన వినతులను పరిశీలించాలని ప్రభుత్వానికి పంపామని సలాం బాబు చెప్పారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే వయో పరిమితి పెంపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇకపై 3-4 నెలల్లో ఉద్యోగాల నియామక ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. ఉద్యోగాల సాధన కోసం విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి యత్నించిన వారిపై కేసులు ఎత్తివేయాలని నిర్ణయించామన్నారు. నిరుద్యోగులపై నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలని ప్రభుత్వానికి లేఖ రాస్తామన్నారు. నిరుద్యోగుల భవిష్యత్తుకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకే  కేసుల ఎత్తివేతకు చర్యలు తీసుకుంటున్నామని  ఏపీపీఎస్సీ సభ్యుడు షేక్‌ సలాం బాబు తెలిపారు. 

తాలిబాన్ల తూటాలకు భారతీయ జర్నలిస్టు బలి

తాలిబాన్ టెర్రరిస్టుల తూటాలకు ఓ భారతీయ జర్నలిస్టు ప్రాణాలు విడిచాడు. బువ్వ పెట్టే వృత్తి కోసం బతుకునే తృణప్రాయంగా సమర్పించుకున్నాడు. భారత్ లో రాయిటర్స్ వార్తా సంస్థకు చీఫ్ ఫొటోగ్రాఫర్ గా పనిచేస్తున్న డానిష్ సిద్దిఖీని ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్న యుద్ధాన్ని కవర్ చేసేందుకు వెళ్లాలని రాయిటర్స్  సంస్థ ఆదేశించింది. దీంతో ఆయన రెండు వారాల క్రితమే ఆఫ్ఘన్ బయల్దేరి వెెళ్లాడు. వారం రోజులుగా యుద్ధాన్ని కవర్ చేస్తున్నాడు. పాత్రికేయ వృత్తిని ప్రాణప్రదంగా ప్రేమించే సిద్దిఖీ బంగ్లాదేశ్ లో రోహింగ్యాల కష్టాల కవరేజీపై ఇప్పటికే ప్రఖ్యాత పులిట్జర్ అవార్డు కూడా అందుకోవడం విశేషం.  సొంత గూడు లేని రోహింగ్యాలు ఎదుర్కొంటున్న కష్టాలను తన ఫొటోల ద్వారా ప్రపంచం దృష్టికి తీసుకొచ్చి సిద్దిఖీ మంచి ఫొటోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్నాడు. సాధారణంగా యుద్ధ వార్తల్ని కవర్ చేసే పాత్రికేయులు అధికార భద్రతా దళాల రక్షణలోనే పనిచేస్తారు. వారి సూచనలు పాటిస్తూ, వారిలాగే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించి యుద్ధరంగంలో సంచరిస్తూంటారు. ఈ క్రమంలోనే సిద్దిఖీ కూడా ఆఫ్ఘన్ దళాల రక్షణలో తాలిబాన్లతో జరుగుతున్న యుద్ధాన్ని కవర్ చేస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు.  ఆఫ్ఘనిస్థాన్ ను క్రమంగా ఆక్రమించుకునేందుకు తాలిబాన్లు కొద్దిరోజులుగా పాక్ వైపు నుంచి ముందుకు కదుల్తున్నారు. ఈ క్రమంలోనే ఇండియా కూడా కాందహార్ లోని భారతీయ రాయబార కార్యాలయాన్ని రద్దు చేసుకుంది. 50 మంది సిబ్బంది, ఇతర అధికారులను ప్రత్యేక విమానం ద్వారా జులై 10న ఇండియా రప్పించుకుంది. ఈ క్రమంలోనే తాలిబాన్లు క్రమంగా పలు జిల్లాల సరిహద్దులను, ముఖ్యమైన పట్టణాలను ఆక్రమించుకుంటూ కాందహార్ ను కూడా గుప్పిట పెట్టుకునే దిశగా ముందుకొస్తున్నారు. తాలిబాన్లను నిలువరించేందుకు ఆఫ్ఘన్ కమెండోలు రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో స్పిన్ బోల్డక్ అనే పాక్ సరిహద్దు జిల్లాలో ఆఫ్ఘన్ కమెండోలపై జరిగిన దాడిలో సిద్దిఖీ చనిపోయాడు. ఈ దాడిలో ఆఫ్ఘన్ దళాల వైపు నుంచి సేదిక్ కర్జాయ్ అనే స్పెషల్ ఫోర్సెస్ కమాండర్ కూడా ప్రాణాలు కోల్పోయినట్టు అంబాసిడర్ ఫరీద్ మాముండ్జే ధ్రువీకరించారు.  తాలిబాన్లతో జరుగుతున్న యుద్ధంలో గత మంగళవారం ఆఫ్ఘన్ కమెండోల వైపు నుంచి ఓ సైనికుడు  గాయాలపాలై కనిపించకుండా తప్పిపోయాడు. ఆయన్ని వెదికి ప్రాణాలతో తీసుకొచ్చేందుకు ఆఫ్ఘన్ కమెండోలు ఓ జట్టుగా ఏర్పడి ఆపరేషన్ చేపట్టారు. వారి వెహికల్ లోనే ఉంటూ సిద్ధిఖీ ఈ ఘటనను కవర్ చేస్తుండగా తాలిబాన్లు వదిలిన బుల్లెట్లు వీరి వెహికల్ అద్దాలను ఛిద్రం చేసుకుంటూ లోపలికి దూసుకొచ్చాయి. అక్కడే తన పని అయిపోయిందనుకున్న సిద్దిఖీ తన పక్కనుంచే బుల్లెట్లు దూసుకుపోతున్న ఘటనను కూడా కెమెరాలో బంధించి.. ఆ వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్టు చేయడం విశేషం. తాలిబాన్లు పాక్ సరిహద్దు నుంచి ఆఫ్ఘన్లో చొరబడి కాందహార్ ను కైవసం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ఈట‌ల‌తో పాటు జ‌మున నామినేష‌న్‌!.. హుజురాబాద్ బ‌రిలో ఆ ఇద్ద‌రు?

ఆరుసార్లు ఎమ్మెల్యే. ఏడోసారి కూడా గెలిచి తీరాల‌నే ప‌ట్టుద‌ల‌. త‌న‌ను అవ‌మాన‌క‌రంగా మెడ‌బ‌ట్టి గెంటేసిన కేసీఆర్‌కు.. తాను గెలిచి గ‌ట్టి గుణ‌పాఠం చెప్పాల‌నే రివేంజ్‌. త‌న సొంత బ‌లం స‌రిపోద‌నుకున్నారో ఏమో.. బీజేపీలో చేరి క‌మ‌ల‌నాథుల‌ను సైతం తోడేసుకొని కేసీఆర్‌పై యుద్ధానికి సిద్ధ‌మ‌య్యారు. ఇక త‌న గెలుపు ఈజీ అనుకుంటున్నంత‌లోనే.. అనుకోని ఉప‌ద్ర‌వం రేవంత్‌రెడ్డి రూపంలో వ‌చ్చిప‌డింది. పీసీసీ చీఫ్‌గా రేవంత్ నియామ‌కంతో స‌మీక‌ర‌ణాలు మ‌ళ్లీ తారుమార‌య్యే అవ‌కాశం క‌నిపిస్తోంది. అయినా, గెలుపుపై ధీమా వ‌ద‌ల‌కుండా.. మ‌రింత ప‌ట్టుద‌ల‌తో పోరాడుతున్నారు ఈట‌ల రాజేంద‌ర్‌. నియోజ‌క వ‌ర్గంలో పాద‌యాత్ర‌తో మ‌రింత ప‌ట్టుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈట‌ల ఇంతగా చెమ‌టోడుస్తుండ‌గా.. ఆయ‌న‌తో పాటు స‌మానంగా ఆయ‌న స‌తీమ‌ణి జ‌మునారెడ్డి సైతం హుజురాబాద్ గెలుపు కోసం గ‌ట్టిగా కృషి చేస్తుండ‌టం ఆస‌క్తిక‌రం. ఇన్నాళ్లూ ఈట‌ల‌కు తోడుగా ఇంటింటి ప్ర‌చారంతో పాటు రాజ‌కీయ మంత్రాంగాలు సైతం నెర‌పిన ఈట‌ల జ‌మున‌.. తాజాగా, హుజురాబాద్‌లో నామినేష‌న్‌కు సైతం రెడీ అవుతుండ‌టం ఆస‌క్తిక‌ర ప‌రిణామం.  అదేంటి.. బీజేపీ అభ్య‌ర్థిగా ఈట‌ల రాజేంద‌ర్ హుజురాబాద్ బ‌రిలో దిగుతున్నారు క‌దా.. మ‌రి, జ‌మునారెడ్డి నామినేష‌న్ వేయ‌డం ఏంటి?  నామినేష‌న్‌పై డౌట్ ఉంటే ఆయ‌నే రెండు సెట్లు వేస్తారు కానీ ఇంకొక‌రితో ఎందుకు వేయిస్తారు? ఒకే కుటుంబం నుంచి రెండు నామినేష‌న్లు వేయ‌డం ఎందుకు? జ‌మున కూడా నామినేష‌న్ వేస్తే ఈట‌ల ఊరుకుంటారా? ఇలా అనేక ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. అయితే, జ‌మునారెడ్డి నామినేష‌న్ వేయ‌డం ఇదే తొలిసారి కాద‌ట‌. గ‌తంలో కూడా నామినేష‌న్ వేశార‌ట‌. ఇప్ప‌టి వ‌ర‌కూ ఈట‌ల ఎన్నిసార్లు నామినేష‌న్లు వేశారో.. అన్నిసార్లు ఆయ‌న‌తో పాటు ఆమె కూడా నామినేష‌న్ వేయ‌డం అల‌వాటు, సెంటిమెంటుగా వ‌స్తోంద‌ట‌. ఆమేర‌కు ఈసారి కూడా బీజేపీ నుంచి రాజేంద‌ర్‌.. ఇండిపెండెంట్‌గా జ‌మునారెడ్డి నామినేష‌న్లు వేయ‌నున్నార‌ని తెలుస్తోంది. ఇలా ఏళ్లుగా భార్యాభ‌ర్త‌లు నామినేష‌న్లు వేస్తున్న వ్య‌వ‌హారం హుజురాబాద్‌లో ఆస‌క్తిగా మారింది.  ఆరుసార్లు వరస విజయాలు సాధించిన ఈట‌ల రాజేంద‌ర్‌.. ఏడోసారి పోటీకి కూడా త‌న‌తో ఏడడుగులు నడిచిన అర్థాంగిచే.. ఏడోసారి కూడా నామినేష‌న్ వేయించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆరుసార్లు బరిలో నిలిచిన రాజేందర్‌తో పాటు ఆయన భార్య జమున కూడా ఆరుసార్లు నామినేషన్లు వేసి.. ఆ త‌ర్వాత‌ విత్ డ్రా చేసుకున్నారు. ఒక్కసారి టీఆర్ఎస్ పార్టీ తరుపున రెండు సెట్లు వేయగా.. మిగతా ఐదుసార్లు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేసి.. ఉపసంహరించుకున్నారు. ప్రతీసారీ ఈటలతో పాటు ఆయన భార్య నామినేషన్ వేయడం సెంటిమెంట్‌గా కొనసాగుతోందని అంటుంటే, ఈటల రాజేందర్ నామినేషన్ తిరస్కరణకు గురైతే జమునను పోటిలో ఉంచే అవకాశం ఉంటుందనే ఇలా చేస్తున్నార‌ని కూడా అంటున్నారు. అయితే, 2014లో జ‌మునారెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినట్టుగానే.. ఈ సారి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తారా? లేక.. మిగ‌తా ఐదుసార్లు వేసిన‌ట్టు ఇండిపెండెంట్‌గా నామినేష‌న్‌ వేస్తారా? అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.   

అక్కడ రెండే పార్టీలు.. ఇక్కడ పుట్టగొడుగులు! 

ఆంధ్రప్రదేశ్ లో రెండే పార్టీలు, వైసీపీ, తెలుగు దేశం. మూడో పార్టీకి అక్కడ చోటు లేదు. అలాగని, కాంగ్రెస్, బీజేపీ, జన సేన, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు లేవని కాదు. ఉన్నాయి, కానీ, ప్రస్తుతానికి ఆ పార్టీలు ఏవీ కూడా ప్రధాన పార్టీలకు పోటీగా నిలిచే స్థాయిలో లేవు. బీజేపీ, జనసేన కూటమి తృతీయ ప్రత్యాన్మాయంగా ఎదిగే ప్రయత్నం చేసినా  ఇంతవరకు చెప్పుకోదగ్గ ముందగు పడలేదు. తిరుపతి లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆ విషయం మరోమారు రుజువై పోయింది. సో.. ఏపీలో ఇప్పటికైతే, ఇప్పటికే కాదు మరి కొంత కాలం వరకు, ఎదో జరగరానిది జరిగే తప్పించి ద్విపార్టీ (రెండు పార్టీల) వ్యవస్థ కొనసాగుతుందని అనుకోవచ్చును.  ఇక  తెలంగాణలోకి వస్తే కొత్త రాష్ట్రం బహుళ పార్టీ వ్యవస్థ వైపుగా అడుగులు వేస్తోందా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. రాష్ట్ర అవతరణ తర్వాత, సహజంగానే ఉద్యమ పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితి, (తెరాస) ప్రధాన రాజకీయ శక్తిగా అధికార పీఠం ఎక్కి కూర్చుంది. అలాగే, రాజకీయ పునరేకీకరణ పేరున తెరాస అధినేత  కేసీఆర్ కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలను మెల్లమెల్లగా నేల మట్టం చేశారు. తాజాగా, తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ కూడా తెరాసలో చేరారు. అలాగని ఆ పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకు పోయిందని  కాదు, అయిపోయింది అనుకున్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి రాకతో లేచి కూర్చుంది. అధికార పార్టీకి సవాలు  విసురుతోంది. మరోవంక బీజేపీ కూడా కాంగ్రెస్’కు పోటీగా తెరాసకు ప్రధాన ప్రత్యర్ధిగా ఎదిగే ప్రయత్నం చేస్తోంది.  పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లుగా ఉమ్మడి రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కుమార్తె వైఎస్ షర్మిల, తెలంగాణలో వైఎస్సార్ జెండా ఎగరేసారు. రాజన్న రాజ్యం తెస్తామంటూ, వైఎస్సార్ టీపే పార్టీని స్థాపించారు. ఆమె ధీమా ధైర్యం చూస్తుంటే, ఆమె ముందూ  వెనక ఎవరున్నప్పటికీ, ఎవరు లేకున్నా ఆమె కూడా సీరియస్’గానే రాజకీయ పావులు కదుపుతున్నారు. అంటే, అక్కడికే చతుర్ముఘ పోటీ ఖాయంగా కనిపిస్తోంది.  ఇవి కాక , తెలంగాణ ఉద్యమం నుంచి, తెరాస దురాగతాలకు వ్యతిరేకంగా పుట్టు కొచ్చిన కోదండ రామ్ పెట్టిన తెలంగాణ జన సమితి  (టీజేఎస్), రాణి దుర్గమ పెట్టిన యువ తెలంగాణ పార్టీ, తెలంగాణ ఇంటి పార్టీ లాంటి పార్టీలు మరికొన్ని ఉన్నాయి. మరో వంక తీన్మార్ మల్లన, మరి కొందరు కొత్త పార్టీలు పెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. సో.. తెలంగాణలో బహుళ పార్టీ వ్యవస్థ స్థిర పడడం ఖాయంగా కనిపిస్తోంది.  విభజనకు ముందు ఉభయ తెలుగు రాష్టాలు అరవై ఏళ్లకు పైగా కలిసున్నాయి. ప్రాంతీయ విబేధాలున్నా, రాజకీయ నడక నడత ఇంచుమించుగా ఒకలానే, సాగింది. ఒకప్పుడు కాంగ్రెస్, కమూనిస్ట్ పార్టీలు ప్రధాన ప్రత్యర్ధులుగా ఉన్నా, ఆ తర్వాత తెలుగు దేశం పార్టీ అవిర్భావంతో  కాంగ్రెస్, టీడీపీ ప్రధాన ప్రత్యర్దులుగా కొనసాగినా ఉమ్మడి రాష్ట్రంలో ప్రధానంగా రెండు పార్టీల వ్యవస్థ కొనసాగింది. కానీ, ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ స్థానంలో వైసీపీ వచ్చినా  రెండు పార్టీల వ్యవస్థే కొనసాగుతోంది. వైసీపీ, తెలుగు దేశం పార్టీలే ప్రాధాన ప్రత్యర్ధులుగా ఉన్నాయి.  తెలంగాణలో రూపు దిద్దుకుంటున్న బహుళ పార్టీవ్యవస్థ వలన ఏమి జరుగుతుంది? ఎవరికి లాభం చేకూరుతుంది, అంటే, దీర్ఘకాలంలో ఎలా ఉన్నా, తక్షణ ప్రయోజనం మాత్రం అధికార పార్టీకే ఉంటుదని విశ్లేషకులు అంటున్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో, కేవలం 20 శాతం ఓట్లతోనే అధికార పార్టీ రెండు సీట్లు ఎగరేసుకు పోయింది. మంది ఎక్కువైతే మజ్జిగ పలచ బడుతుంది, అన్నట్లుగా విపక్షాల ఓట్లు ఎంతగా చీలితే అధికార పార్టీకి అంత అడ్వాంటేజ్ అవుతుంది ... అలాగని అన్ని సందర్భాలలో అలాగే జరగాలని లేదు, కానీ, ఒక విధంగా చూస్తే బహుళ పార్టీ వ్యవస్థ మంచిది ..మరో కోణంలో రెండు పార్టీల వ్యవస్థ  మంచిది. అయితే తెలంగాణ కాంటెస్ట్’లో చూస్తే బహుళ పార్టీ వ్యవస్థ అంత మంచికాదు. సంప్రదాయ జాతీయ పార్టీలు ఎలా ఉన్నా .. ఉద్యమ పార్టీలు ఏకమై ఉద్యమ ద్రోహులకు గుణ పాఠం చెప్పవలసిన అవసరం ఉందని, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  ఆ దిశగా కొన్ని ప్రయత్నాలు కూడా సాగుతునట్లు తెలుస్తోంది ‘’ అయితే డి ఎంత వరకు సక్సెస్ అవుతుందన్నది ఇప్పుడే చెప్పలేము..

కుక్కను నిలబెట్టినా.. కేసీఆర్ పై షర్మిల బాణాలు..

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల ప్రెస్ మీట్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓవర్ కాన్ఫిడెన్స్ ను ఉతికారేసినంత పనిచేసింది. రానున్న హుజూరాబాద్ ఉపఎన్నికలో మీరు పోటీ చేస్తారా అని ఓ పాత్రికేయుడు అడిగిన ప్రశ్నకు టీఆర్ఎస్ వర్గాలు దిమ్మతిరిగేలా తెలంగాణవాదులు సైతం శెభాష్ అనుకునేలా రియాక్టయ్యారు.  అసలు హుజూరాబాద్ ఎన్నిక ఎందుకు వచ్చిందో కాస్త చెప్పండని తన పక్కనున్న ఇందిరా శోభన్, కొండా రాఘవరెడ్డి, ఏపూరి సోమన్న తదితరులను షర్మిల అడిగారు. ఇందిర, ఏపూరి నవ్వి ఊరుకుంటే.. అన్నామీరు చెప్పగలరా అంటూ రాఘవరెడ్డిని అడిగారు. తనను ప్రశ్నించే సాహసం ఎవరూ చేయొద్దని అందరికీ హెచ్చరికగా ఉండాలన్నఉద్దేశంతో ఈటలను బహిష్కరిస్తే... ఈటల రాజీనామా చేసినందువల్ల ఎన్నికలు వస్తున్నాయని రాఘవరెడ్డి చెప్పారు.  ఓ... అదా సంగతి.. పగలు, ప్రతీకారాల కోసమే హుజూరాబాద్ ఎన్నికలు తప్ప ప్రజల అభివృద్ధి కోసం కాదన్నమాట అంటూ షర్మిల చాలా తెలివిగా, సెటైరిగ్గా స్పందించింది. హుజూరాబాద్ ఎన్నికల్లో గెలిస్తే యువకులకు ఉద్యోగాలు వస్తాయా... నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందా... నిరుద్యోగుల, రైతుల ఆత్మహత్యలు ఆగుతాయా.. అంటూ కేసీఆర్ ను సెంటర్ పాయింట్ చేస్తూ షర్మిల తనదైన శైలిలో రియాక్టయ్యారు. ప్రజలకు ఏమాత్రం మేలు జరగని, ప్రజలకు అవసరం లేని ఈ ఎన్నికల్లో ఇంకా మేం పోటీ చేయాలా అంటూ పాత్రికేయులను ఎదురు ప్రశ్నించారు షర్మిల.  దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పమనండి.. 54 వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గెలవమనండి చూద్దాం. అధికార పార్టీ వీటి మీద హామీలు ఇస్తే మేం కూడా పోటీ చేస్తాం.. పోటీ చేసి గెలుస్తాం.. అంటూ టీఆర్ఎస్ ను దిగ్విజయంగా ఇరుకున  పెట్టారు షర్మిల. కుక్కను నిలబెట్టినా గెలుస్తామనే అహంకారంతో ఉన్నవాళ్లవల్ల వచ్చిన ఎన్నికల్లో, పగలు, ప్రతీకారాల కోసం వచ్చిన ఎన్నికల్లో మేం నిలబడాలా.. ప్రజాస్వామ్యం అంటే ఇదేనా...ఈ ఎన్నికలతో ఎవరికి మేలు జరుగుతుందో చెప్పాలని ఇండైరెక్టుగా అధికార పార్టీకి భారీ సవాల్ విసిరారు షర్మిల.

అవశేషాలతో ఆభరణాలు.. ఎక్కడో తెలుసా.. 

అందరూ ఆభారణాలు అనగానే బంగారం అనుకుంటారు లేదంటే.. ఈ మధ్య కాలంలో అలంకరణకు సముద్రంలో దొరికిన వస్తువులను వాడుతారు.. లేదంటే రోల్డ్ గిల్డ్ వాడుతారు... కానీ ఆ దేశంలో శనిపోయిన శవాల పార్ట్స్ ని వాళ్ళ గుర్తుగా ఆభరణాలుగా ధరిస్తారు.. ఈ ప్రపంచంలో మనిషి జీవితం చాలా ఉన్నతమైనది.. అలాగే పవిత్రమైనది కూడా.. మనిషి ప్రాణాలతో ఉన్నప్పుడు కుటుంబసభ్యులు, స్నేహితులు, సన్నిహితులు అందరితో బంధాలు, భాందవ్యాలు బలంగా ఉంటాయి. ప్రాణం పోతే.. ఆ ప్రాణం పోయిని శవాన్ని మట్టిలో కప్పికెత్తడంతోనే వారితో ఉన్న సంబంధాలన్ని తెగిపోతుంటాయి. కానీ ఆ మనిషి తెలుగు జ్ఞాపకాలు కొంత కాలం ఉంటాయి ఆ తర్వాత కాలంతో పాటు కరిగిపోతాయి. చివరికి వారి తాలూకా తీపి గుర్తులు మనస్సులో ఉంచుకోవటం తప్ప చేయగలిగింది ఏమి ఉండదు. మహా అయితే వారు వినియోగించిన వస్తువులను మాత్రం పదిలపరుచుకోగలం. అయితే, పోయిన వారి అవశేషాలను శాశ్వితంగా , గుర్తుగా ఉంచుకునే వీలు కల్పిస్తుంది ఆస్ట్రేలియాకు చెందిన ఓ జ్యుయలరీ దుకాణం… ఇంతకీ ఆ వివరాలు ఏంటో తెలుసుకోవాలనుందా ఐతే మరి ఇంకెందుకు ఆలస్యం..  ఆస్ట్రేలియా  చెందిన చెందిన ఒక మహిళ. ఆమె పేరు  జాక్వి విలియమ్స్. ఆమె  గ్రేవ్ మెటాలమ్ పేరుతో జ్యువెలరీ షాపు నడుపుతుంది. ఈ ఆభరణాల దుకాణాని అక్కడ ఉన్న ప్రత్యేకత అంతా ఇంత కాదు చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే అక్కడ తయారయ్యే ఆభరణాలన్నీ చనిపోయిన వారి అవశేషాలను నిక్షిప్తం చేస్తూ ప్రత్యేమైన డిజైన్లలో ఆభరణాలను తయారు చేస్తారు. ఒక మాటలో చెప్పాలంటే మరణించిన వాళ్ళు మనతోనే ఉన్నారు అనే ఫీలింగ్ కోసం ఈ ఆభరణాలు తయారు చేస్తారు. చనిపోయిన తమవారిని మర్చిపోలేని వారు, తమతోపాటు వారి గుర్తులను పదికాలాలపాటు పదిలంగా ఉంచుకోవాలనుకునే వారు, ఇంతకీ ఆ ఆభరణాలు చేయడానికి కావాల్సిన మణిలోని పార్ట్స్ ఏంటో తెలుసా దంతాలు , కాలిపోయిన బూడిద, ఇతర ఎముకుల వంటి అవశేషాలను సేకరించి గ్రేవ్ మెటాలమ్ జ్యువెలరీ దుకాణంలో అందిస్తారు. ఇంకంతే వాటిని ఆభరణాల మధ్యలో నిక్షిప్తం చేసి కళాత్మకమైన ఆభరణాలుగా  తీర్చిదిద్ది తిరిగి అందిస్తారు. ఇక్కడ తయారవుతున్న అవశేషాల ఆభరణాల్లో ముఖ్యమైనవి, చాలా ప్రాధాన్యతను పొందినవి  మెడకు ధరించే భరణాలు, ఉంగరాలు, కంకణాలు ఉన్నాయి. వీటిలో దంతాలు, చితాభస్మం వంటి వాటిని పదిలంగా నిక్షిప్తం చేస్తారు. ఉంగరాలు, చైన్ లాకెట్లు, బ్రాస్ లైట్లు ఇలా వివిధ రూపాల ఆభరణాలను తమకు నచ్చినట్లు తయారు చేయించుకుంటారని మెల్బోర్నో లో ఉన్న గ్రేవ్ మెటాలమ్ ఆభరణాల దుకాణ యజమాని 29 సంవత్సరాల విలియమ్స్ చెబుతోంది. ఇలాంటి ఆభరణాలు తీపిగుర్తులుగా మిగిలిపోవటమేకాకుండా, దుఖా:న్ని దిగమింగుకునేందుకు దోహదపడతాయని విలియమ్స్ అంటుంది.

రేవంత్‌రెడ్డి ఫోన్ ట్యాప్‌?.. కేసీఆర్ స‌ర్కారు కుట్రేంటి?

సామ‌, దాన‌. భేద, దండోపాయాల్లో.. అన్ని ఉపాయాలూ ప్ర‌యోగిస్తుంటారు పాల‌కులు. అధికారాన్ని సుస్థిరం చేసుకోడానికి, క‌ల‌కాలం తమ గుప్పిట్లోనే అధికారం ఉంచుకునేందుకు.. అన్నిర‌కాల ఎత్తుగ‌డ‌లు అవ‌లంభిస్తుంటారు. ప్ర‌జా వ్య‌తిరేక‌త వెల్లువెత్తుతున్న‌ప్పుడు వారిలో అభ‌ద్ర‌తా భావం మ‌రింత పెరుగుతుంటుంది. త‌మ సింహాస‌నం ఎక్క‌డ కూలిపోతుందోన‌నే టెన్ష‌న్ వారిని తీవ్రంగా వేధిస్తుంటుంది. అందుకే, నిత్యం ప‌ద‌విని కాపాడుకోడానికి ఏదోఒక కుతంత్రం చేస్తూనే ఉంటారు. సింహాస‌నంపై ఉన్న‌ది కేసీఆర్‌లాంటి మాయ‌ల‌మ‌రాఠీ అయితే.. ఇక చెప్పేదేముంటుంది? ఇక‌, త‌న‌కంటే బ‌ల‌మైన రేవంత్‌రెడ్డి ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఉంటే ఇక కునుకేముంటుంది? అందుకే, నిత్యం రేవంత్‌రెడ్డిపై ఓ క‌న్నేసి ఉంచుతున్నార‌ట సీఎం కేసీఆర్‌. ఏమాత్రం ఏమ‌ర‌పాటుగా ఉన్నా.. త‌నను ప్ర‌గ‌తిభ‌వ‌న్ నుంచి బ‌య‌ట‌కు గుంజేయ‌డం త‌ప్ప‌ద‌నుకుంటున్నారో ఏమో.. రేవంత్ అడుగుజాడ‌ల‌పై నిఘా పెట్టార‌ని అంటున్నారు. పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి ఎవ‌రెవ‌రిని క‌లుస్తున్న‌దీ.. రేవంత్‌ను ఎవ‌రెవ‌రు క‌లుస్తున్న‌దీ.. అంతా ఎప్ప‌టిక‌ప్పుడు ఇంటెలిజెన్స్ వ‌ర్గాల ద్వారా కేసీఆర్‌కు స‌మాచారం చేరుతోంద‌ని అంటున్నారు. ఇంత‌వ‌ర‌కూ ఓకే, అధికారంలో ఎవ‌రున్నా అదే చేస్తారులే అనుకున్నా.. కేసీఆర్ మాత్రం ఇంకో అడుగు ముందుకేసి మ‌రీ, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నార‌నే ఆరోప‌ణ ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌ను షేక్ చేస్తున్నాయి.  ఫోన్ ట్యాపింగ్‌. దేశంలోకే అతిపెద్ద నేరం. వ్య‌క్తి స్వేచ్ఛ‌కే గొడ్డ‌లిపెట్టి. ఫోన్ ట్యాపింగ్‌పై దేశంలో అత్యంత క‌ఠిన చ‌ట్టాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు ఈ విష‌యంలో ప‌లుమార్లు చాలా తీవ్రంగా హెచ్చ‌రించింది. ఫోన్ ట్యాపింగ్ ఎంత‌టి ప్ర‌మాద‌క‌ర వ్య‌వ‌హార‌మో.. అంద‌రికంటే సీఎం కేసీఆర్‌కే బాగా తెలుసు. గ‌తంలో ఆయ‌న‌కు ఈ విష‌యంలో బాగా చేదు అనుభ‌వ‌మే ఉంది. అలాంటిది, చాన్నాళ్ల త‌ర్వాత మ‌ళ్లీ కేసీఆర్‌పై ఫోన్ ట్యాపింగ్ ఆరోప‌ణ‌లు వినిపిస్తుండ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. అందులోనూ, త‌నతో పాటు త‌న‌వారి ఫోన్లను సైతం ట్యాప్ చేస్తున్నారంటూ.. స్వ‌యంగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి బ‌హిరంగంగా ఆరోపించ‌డం మ‌రింత సంచ‌ల‌నంగా మారింది. రేవంత్‌రెడ్డి దూకుడు త‌ట్టుకోలేక‌.. ప్ర‌భుత్వ వ‌ర్గాలు ఆయ‌న ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నాయ‌ని ప్ర‌జ‌లు సైతం న‌మ్మే ప‌రిస్థితి ఉంది. అందుకే, తాజాగా రేవంత్ చేసిన ఈ ఆరోప‌ణ కేసీఆర్‌కు షాకింగ్ న్యూసే అంటున్నారు.   సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు.. పోలీస్ అధికారులు ఫోన్ ట్యాపింగ్‌ను తెగ‌బ‌డుతున్నార‌ని రేవంత్‌రెడ్డి మండిప‌డ్డారు. కేసీఆర్ ప్రభుత్వానికి తొత్తులుగా మారిన అధికారులు మూల్యం చెల్లిస్తారన్నారు. ఇంటెలిజ‌న్స్‌ ఐజీ ప్రభాకర్‌రావు.. ర‌జాకార్ల కాలంనాటి ఖాసిం రజ్వీ మాదిరిగా వ్యవహరిస్తున్నారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఇంటెలిజెన్స్ ఐజీ ప్రభాకర్‌రావుకు పోస్టింగ్ ఇచ్చారని.. ఆయ‌న త‌న‌కు వ్య‌తిరేకంగా కుట్ర‌లు చేస్తున్నార‌ని.. ఆయ‌న‌ డైరెక్ష‌న్‌లోనే ఫోన్ ట్యాపింగ్ జ‌రుగుతోంద‌ని ఆరోపించారు. ఐజీ ప్రభాకర్‌రావుపై కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేస్తానన్నారు రేవంత్‌రెడ్డి. పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్‌రెడ్డి చేసిన ఈ ఆరోప‌ణ‌లు తెలంగాణ‌లో క‌ల‌క‌లంగా మారాయి. ఫోన్ ట్యాపింగ్ ఆరోప‌ణ నిజ‌మే అయితే.. ఇక స‌ర్కారుకు చుక్క‌లే.

జగన్, కేసీఆర్ బండారం బయటపెడతా! 

గోదావరి, కృష్ణా ప్రాజెక్టుల్లో తరుచూ తలెత్తుతున్న నీటి వివాదాలకు చెక్ పెట్టేలా  కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ  గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్‌ విడుదలతో కృష్ణా, గోదావరి బేసిన్‌లోని ఉమ్మడి ప్రాజెక్టులు, వాటి నిర్వహణ, విద్యుదుత్పత్తి కేంద్రాలు, సిబ్బంది అంతా బోర్డుల పరిధిలోకి వచ్చాయి.ప్రాజెక్టుల నీటి నిర్వహణతో పాటు భద్రతను కేంద్ర బలగాలు పర్యవేక్షించనున్నాయి. ఈ నోటిఫికేషన్‌ జారీ చేసే నాటికి కేంద్రం ఆమోదించని ప్రాజెక్టుల పనులన్నింటిని ఇరు రాష్టాలు నిలిపివేయాలని పేర్కొంది. రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలో నిర్ణయించిన మేరకు అనుమతులు లేని ప్రాజెక్టులను అపెక్స్‌ కౌన్సిల్‌కు పంపి 6 నెలల్లోగా అనుమతులు తీసుకోవాలని సూచించింది.  కృష్ణా, గోదావరి బోర్డులను ఖరారు చేస్తూ కేంద్ర విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్  ను ఏపీ సర్కార్ స్వాగతించగా.. తెలంగాణ సర్కార్ మాత్రం వ్యతిరేకిస్తోంది. రాష్ట్రాల హక్కులను హరించేలా కేంద్రం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని తెలంగాణ మంత్రులు ఆరోపిస్తున్నారు. సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తామని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి నష్టం కలిగేనా కేంద్రం నిర్ణయం ఉందని టీఆర్ఎస్ నేతలు చెబుతుండగా.. తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం స్వాగతిస్తున్నారు. బోర్డును పరిధిని ఖరారు చేయడాన్ని సమర్ధించిన రాష్ట్ర బీజేపీ చీఫ్ సంజయ్..  కృష్ణ జలాల పై సీఎం కేసీఆర్ వైఖరి స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు.  ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులపై హాట్ కామెంట్స్ చేశారు బండి సంజయ్. రెండు రాష్ట్రాల సీఎంలు కమిషన్ ల కోసం పని చేస్తున్నారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో ఇద్దరు సీఎం ల బండారం బయట పడుతుందన్నారు. తెలంగాణ కి రావాల్సిన నీటి వాటా విషయంలో కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. 2015 జూన్ 18, 19న అప్పటి మంత్రులు, అధికారులు నేతృత్వంలో తెలంగాణ  299 టీంఎంసిలు, ఆంధ్రాకి512 టీఎంసీలు కేటాయిస్తూ  ఒప్పందం కుదిరందన్నారు సంజయ్. కృష్ణ పరివాహక ప్రాంతం 68 శాతం ఉంటే.. తెలంగా కి  575 టీఎంసీ నీరు రావాలని కాని 299 టిఎంసీలకే ఎలా ఒప్పుకున్నారని కేసీఆర్ ను ప్రశ్నించారు. పునర్విభజన హామీలు ఉల్లఘించి రెండు రాష్ట్రాల సీఎం లు మోసం చేస్తున్నారని  బండి సంజయ్ మండిపడ్డారు. హుజురాబాద్ ఎన్నికల కోసమే ఇద్దరు ముఖ్యమంత్రుల హైడ్రామా ఆడిస్తున్నారని బండి సంజయ్ అన్నారు.  సీఎం ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి కేసీఆర్ లేఖ రాయడాన్ని సంజయ్ తప్పుపట్టారు. సుప్రీంలో కేసు వేస్తే ఎలా ట్రిబ్యునల్  ఏర్పాటు చేస్తారని అన్నారు.  8 నెలల తరువాత కేసు వాపస్ తీసుకున్నారని చెప్పారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని కోరినప్పటికీ సీఎం కేసీఆర్ .. సమయం లేదంటూ వాయిదా వేయించారని సంజయ్ మండిపడ్డారు. అడ్డగోలుగా అంచనాలు పెంచి కమిషన్లు తీసుకున్నారని, అవన్ని బయటపడుతాయనే ఇప్పుడు భయపడుతున్నారని విమర్శించారు.  రెండు రాష్ట్రాల మధ్య గొడవలు సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ అన్యాయం జరిగితే తప్పకుండా బీజేపీ అండగా ఉంటుందన్నారు బండి సంజయ్.

ఎవరైనా మోసపోయారా.. ప్రభుత్వానికి నష్టమేంటీ? అమరావతి భూములపై సుప్రీం...

అమరావతి రాజధాని భూముల కొనుగోలుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రాజధాని భూముల ఇన్ సైడర్ ట్రేడింగ్ పై గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది ఏపీ ప్రభుత్వం. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. వినీత్‌ శరణ్‌, దినేశ్ మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.  ఏపీ ప్రభుత్వం తరపున దుష్యంత్‌ దవే వాదనలు వినిపించారు. రాజధాని ఎక్కడ వస్తుందో ముందే సొంత మనుషులకు చెప్పి.. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది దుష్యంత్ దవే అన్నారు. ప్రాథమిక దర్యాప్తును నిలిపివేసే అధికారం హైకోర్టుకు లేదని కోర్టుకు విన్నవించారు. ఆస్తుల కొనుగోలులో అధికారులు, నేతలు ప్రైవేట్‌ వ్యక్తులతో కుమ్మక్కయ్యారన్నారు. హైకోర్టు అన్ని పరిశీలించకుండానే ఉత్తర్వులు ఇచ్చిందన్నారు ప్రభుత్వ న్యాయవాది. అమరావతికి చెందిన మిగిలిన కేసులతో కలిపి విచారించాలని కోరారు దుష్యంత్‌ దవే.  ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలపై సుప్రీంకోర్టు ధర్మాసనం పలు ప్రశ్నలు సంధించింది. ఇన్‌సైడర్ ట్రేడింగ్ వర్తించదని హైకోర్టు ఇచ్చిన ఆర్డర్‌లో తప్పేముందని ప్రశ్నించింది. హైకోర్టు అన్ని కోణాలను పరిశీలించి తీర్పు ఇచ్చిందని పేర్కొంది. రాజధాని అంశం బహిరంగ రహస్యమని హైకోర్టు చెప్పడంలో తప్పేముందని, భూములు అమ్మినవాళ్లు మోసపోయామని ఎక్కడైనా ఫిర్యాదు చేశారా? అని అడిగింది. నష్టం వచ్చిన వాళ్లే కోర్టును ఆశ్రయించాలి కానీ ప్రభుత్వానికి వచ్చిన నష్టమేంటని ధర్మాసనం ప్రశ్నించింది. అనంతరం తమ వాదనలు వినిపించేందుకు ఏపీ ప్రభుత్వ న్యాయవాది దుష్యంత్‌ దవే సమయం కోరారు. ఈ కేసును సిట్‌ కేసుతో జతపర్చాలన్న దవే అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. తదుపరి విచారణ ఈ నెల 19కి వాయిదా వేసింది. 

మోడీ రాష్ట్రంలో.. మహిళను వివస్త్రగా ఊరేగించిన భర్త.. గ్రామ పెద్దలు..

అది ప్రస్తుత దేశ ప్రధాని మోడీ. ఒకప్పుడు ముఖ్యమంతి బాధ్యతలు నిర్వహించిన రాష్ట్రము. దేశంలోనే ఆదర్శం గా చెప్పుకుంటున్న రాష్ట్రము. అక్కడ రామరాజ్యం అమలు అవుతుందని. అక్కడ ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారని  అని గొప్పలు చెప్పుకుంటారు. ఆ రాష్ట్రము అభివృద్ధిలో ఆకాశాన్ని తాకిందని.. దేశంలో ఉన్న పారిశ్రామిక వేత్తలకు పుట్టినిల్లు అని చెప్పుకుంటున్నాం.. అదే రాష్టంలో మహిళలు రక్షణ లేదు.. ఒక మహిళ తప్పు చేసిందని.. ఆ మహిళను వివస్త్ర చేసి ఊర్లో గణేష్ ని ప్రచారం చేసినట్లు ప్రచారం చేశారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం..  మనుషులు తప్పులు చేస్తుంటారు.. అది ఆడవాళ్లు అయినా, మగవాళ్ళు అయినా..  అందుకు వాళ్ళు శిక్షలు అనుభవిస్తుంటారు.  గుజరాత్ లో జరిగిన ఈ దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పరాయి పురుషుడితో పారిపోయిన భార్యను వెతికి పట్టుకున్న భర్త.. అమానుషానికి పాల్పడ్డాడు. గ్రామ పెద్దలతో కలిసి ఆమెను నగ్నంగా గ్రామంలో ఊరేగించాడు. అంతేకాకుండా ఆమె భుజాలపై ఎక్కి ఊరేగాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. వివరాలలోకి వెళితే.. దహోడ్‌ జిల్లాలో ఓ గిరిజన ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి(26), భార్య (23)తో కలిసి నివాసముంటున్నాడు. ఈ క్రమంలో గతనెల అతని భార్య, వేరొక వ్యక్తి మోజులో పడి అతడితో పారిపోయింది. అతనితో కలిసి జీవిస్తుంది. దీంతో ఆమె భర్త కోపం వచ్చింది.. తన భార్య పై ఎలాగైనా ప్రతీకారం తెరుచుకోవాలనుకున్నాడు. ఆమె భర్త, గ్రామస్థులు కలిసి వారి ఆచూకీని గుర్తించి, ఆమెను గ్రామానికి తీసుకొచ్చారు. ఈ విషయమై జూలై 6న పంచాయితీ పెట్టారు. వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా అతడితో పారిపోయిందని ఆమెను భర్త, కుటుంబ సభ్యులు, గ్రామా పెద్దలు అంత కలిసి ఇష్టంవచ్చినట్లు కొట్టారు. అంతటితో ఆగకుండా  ఆమెను వివస్త్రను చేసి ఊరేగించారు. నగ్నంగా పరిగెట్టాలని హింసించారు. ఆ తర్వాత చేసిన తప్పుకు గాను తన భర్తను భుజాన ఎత్తుకొని నడవాలని గ్రామ పెద్దలు ఆదేశించారు. ఇందుకు సంబంధించిన వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో  ఈ ఘటన పై కేసు నమోదు చేశారు. బాధితురాలి భర్తతో పాటు మరో 18 మందిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఒక దేశ ప్రధాని.. అంతక మందు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వచించిన రాష్ట్రము లో ఇలాంటి సంఘటలను జరగడం చాలా దురదృష్టకరం అని చెప్పుకోవాలి.. భార్య ఒకడిని ప్రేమించిందని భర్త భార్య ప్రేమించినవాళ్లకు ఇచ్చి పెళ్లి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు.. కానీ భార్య తప్పు చేసిందని ఇలా ఆమెను వివస్త్రగా చేసిగ్రామంలో ఊరేగించిన ఏకైక రాష్ట్రము గుజరాత్ అని.. ఇలాంటి సంఘటనలు ఎక్కువగా  బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జారుతాయని చెప్పవచ్చు..  

ఢిల్లీ గద్దెపై మమత చూపు? అంతా పీకే డైరెక్షన్ లోనే.. 

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు మమతా బెనర్జీ జూలై చివరి వారంలో ఢిల్లీ వెళుతున్నారు. రాజకీయ నాయకులు, అందునా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ రాజధాని ఢిల్లీ వెళ్ళడం సహజం. మాములుగా అయితే అది వార్త కాదు. ఆ వార్తకు ప్రాధన్యత అసలే ఉండదు. కానీ, ఇప్పుడు అదే పెద్ద సంచలన వార్తగా రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అందుకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవలసింది, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మమతా బెనర్జీ  అప్పటినుంచే జాతీయ రాజకీయాలపై కన్నేశారన్న ప్రచారం జోరుగాసాగుతున్నది. నిజానికి ఎన్నికల ప్రచార సమయంలోనే ఆమె, మోడీని ఓడించేందుకు అందరూ కలిసిరావాలని అన్ని పార్టీల నాయకులకు మూడేసి పేజీల సుదీర్ఘ  లేఖలు రాశారు. అప్పట్లో ఒకరిద్దరు తప్పించి ఎవరూ పెద్దగా స్పందించలేదు. అయితే, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ  అనూహ్య విజయం సాధించిన తర్వాత అందరి చూపు ఆమె వైపుకు మరలింది.  ఇప్పుడ మరో సారి, జులై 19 నుంచి ప్రారంభం కానున్నపార్లమెంట్ సమావేశాలు నేపధ్యంగా విపక్షాల ఐక్యత చర్చలు జోరందుకున్నాయి.ఈ నేపధ్యంలో, మమతా బెనర్జీ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే  ఢిల్లీలో  రాజకీయాలు వేడెక్కి ఉన్నాయి. మమతా బెనర్జీ విజయానికి మూల కారణంగా భావిస్తున్నఎన్నికల  వ్యూహకర్త ప్రశాంత కిశోర్ కేంద్రంగా ఢిల్లీ రాజకీయాలు ఊహల ప్రపంచంలో తెలిపోతున్నాయి. విపక్షాలన్నీ 2022లో జరిగే  ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, రాష్ట్రపతి ఎన్నిక మీదుగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో మోడీని గద్దెదించే వ్యూహరచనలో మునిగి తేలుతున్నాయి. విపక్షాల  ఐక్యత దిశగా పొలిటికల్  నెరేషన్ చకచకా మారిపోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది, మరోవంక జులై 19 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఇలాంటి సమయంలో మమత బెనర్జీ జులై 25 నుంచి నాలుగైదు రోజులు ఢిల్లీలో మకాం వేయడమ నిస్సందేహంగా సంచలనమే అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.   ఈ పర్యటనలో భాగంగా, మమతా బెనర్జీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ సహా ఇతర నాయకులతోనూ చర్చలు జరుపుతారని తెలుస్తోంది.  ప్రతిపక్షాల ఐక్యత కోసం ఇంతవరకు ప్రశాంత్ కిశోర్ సోనియా, పవార్ సహా అనేక మంది నాయకులతో సాగిస్తున్న మంతనాలు ఒకెత్తు అయితే, మమతా బెనర్జీ జరపబోయే చర్చలు ప్రతిపక్షాల ఐక్యత ప్రయత్నాలను మరో మెట్టు పైకి తీసుకు పోతాయని, మరింత స్పష్టత వస్తుందని రాజకీయ పరిశీలకులు ఆశిస్తున్నారు.అలాగే,పార్లమెంట్ సమావేశాలో ప్రభుత్వంపై విపక్షాల ఉమ్మడి దాడికి మమతా ఎంట్రీ కొత్త ఊపునిస్తుందని కొందరు ఆశిస్తున్నారు.  విపక్షాల సందడి చూస్తే జమిలి ఎన్నికలు వస్తాయా, అణా సందేహం కూడా కలుగుతోందని, విశ్లేషకులు కొందరు కొత్త ఆలోచనలకు తెర తీశారు.    లోక్ సభ ఎన్నికలకు ఇంకా మూడు సంవత్సరాల సమయం వుంది. అయితే, ఢిల్లీలో విపక్షాలు చేస్తున్న సందడి చూస్తుంటే, రేపో మాపో ఎన్నికలు జరుగుతాయన్న అనుమానాలకు తావిచ్చేలా ఉందని అంటున్నారు. అయితే,  ఇప్పుడు ఎవరెంత సందడి చేసినా, 2022లో జరిగే ఉత్తర ప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైనే, భవిష్యత్ రాజకీయాలు ఆధారపడి ఉంటాయని పరిశీలకులు భావిస్తున్నారు.

రేవంత్‌రెడ్డి అరెస్ట్‌.. కాంగ్రెస్ కేడ‌ర్ ఫైర్‌.. స‌మ‌ర‌మే..

ఇక స‌మ‌ర‌మే అంటూ పీసీసీ ప‌గ్గాలు చేప‌ట్టిన రేవంత్‌రెడ్డి.. అన్న‌ట్టుగానే కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో యుద్ధానికి దిగారు. పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌కు నిర‌స‌న‌గా ‘చలో రాజ్‌భవన్‌’కు పిలుపిచ్చారు. మొద‌ట‌ ఇందిరాపార్కు ద‌గ్గ‌ర భారీ ధ‌ర్నా చేప‌ట్టారు. అనంత‌రం ర్యాలీగా రాజ్‌భ‌వ‌న్‌కు బ‌య‌లు దేరారు రేవంత్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలోని కాంగ్రెస్ శ్రేణులు. ఈ క్ర‌మంలో చ‌లో రాజ్‌భ‌వ‌న్ తీవ్ర ఉద్రిక్త‌త‌ల‌కు దారి తీసింది.  ఇందిరాపార్కు ద‌గ్గ‌ర మూడంచెల బారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు. వాటిని బ్రేక్ చేసుకుంటూ ముందుకు క‌దిలారు రేవంత్‌రెడ్డి. ఆయ‌న వెన‌కాలే అనుచ‌రులు. జై కాంగ్రెస్ నినాదాల‌తో ఇందిరాపార్కు ప్రాంతం మారుమోగిపోయింది.  రేవంత్‌రెడ్డిని అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహ‌రించారు. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌కు, పోలీసులకు మ‌ధ్య తీవ్ర తోపులాట జ‌రిగింది. గవర్నర్‌ అందుబాటులో లేనందున ఆన్‌లైన్‌లో వినతిపత్రం అందజేయాలని పోలీసులు సూచించారు. అయితే అంబేడ్కర్‌ విగ్రహం వరకు తమ ర్యాలీని అనుమంతించాలని రేవంత్‌రెడ్డి కోరారు. అందుకు పోలీసులు అంగీకరించలేదు. ఆ స‌మ‌యంలో ఇరు వ‌ర్గాల మ‌ధ్య యుద్ధ వాతావ‌రణం ఏర్ప‌డింది. ప‌రిస్థితి చేజారిపోతుండ‌టంతో.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీత‌క్క‌ల‌తో పాటు మ‌ధుయాష్కీగౌడ్‌, అనిల్‌కుమార్ యాద‌వ్ త‌దిత‌రుల‌ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు.  అంత‌కుముందు.. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అబద్ధాలతో ప్రజల్ని మభ్యపెట్టి కేసీఆర్‌ రెండుసార్లు సీఎం అయ్యారని ఆరోపించారు. ఆయన పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదన్నారు. పెట్రో పన్నులతో ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం పెట్రోల్‌ ధర రూ.105 ఉండ‌గా.. అందుకే కేసీఆర్‌, మోదీలు రూ.60 పన్నుల రూపంలో దోచేస్తున్నారని ఆరోపించారు. పెట్రో పన్నులపై అన్ని చోట్లా ప్రజలు చర్చించాలని పిలుపునిచ్చారు.  

కేటీఆర్ పెద్ద మ‌గాడైతే.. ష‌ర్మిల షాకింగ్ కామెంట్స్‌..

తానేమీ అల్లాట‌ప్పా లీడ‌ర్‌ను కాద‌ని.. మ‌హిళే క‌దాని అండ‌ర్‌ఎస్టిమేట్ అస్స‌లు వేయొద్దని.. తాను నోరు తెరిస్తే మ‌గ లీడ‌ర్ల‌కు మించి మాట్లాడ‌తాన‌న్న‌ట్టు.. ఖ‌త‌ర్నాక్ డైలాగులు వ‌దిలారు వైఎస్ ష‌ర్మిల‌. ష‌ర్మిల నోటి నుంచి వ‌చ్చిన ఒక్కో డైలాగ్‌.. మంత్రి కేటీఆర్ గుండెల్లో ఈటెల్లా గుచ్చుకునేలా ఉన్నాయి. కేటీఆర్ పెద్ద మ‌గోడైతే... అనే వ‌ర‌కూ వెళ్లింది ష‌ర్మిల డైలాగ్ రేంజ్‌. ఇక కాస్కో సాంబా అన్న రేంజ్‌లో.. తెలంగాణ‌లో ప్ర‌భంజ‌నం సృష్టిస్తా.. సింహం సింగిల్‌గా ఉంద‌ని భ‌య‌ప‌డ‌దు.. మీరు రాస్కోండి అంటూ మీడియా ముందు గ‌ర్జించారు వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల‌. తానూ ఎవ‌రికీ తీసిపోని స్థాయి నాయ‌కురాలినే అనిపించేలా.. మీడియా ప్ర‌శ్న‌ల‌కు చాలా చాక‌చ‌క్కంగా, సూటిగా, ఎలాంటి బెరుకు, త‌డ‌బాటూ లేకుండా ప‌దునైన స‌మాధానాల‌తో పాటు ప్ర‌భుత్వంపై, మిగ‌తా ప్ర‌తిప‌క్షంపై ఘాటైన విమ‌ర్శ‌లు చేశారు ష‌ర్మిల‌. ఆ సంద‌ర్భంలో కేటీఆర్‌ను ఉద్దేశించి ష‌ర్మిల వ‌దిలిన డైలాగ్ కాక రేపుతోంది. మ‌హిళ‌లు రోజుకో వ్ర‌తం చేస్తార‌న్న‌ట్టుగా ష‌ర్మిల సైతం రోజుకో స‌మ‌స్య‌పై దీక్ష చేస్తున్నారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ష‌ర్మిల కామెంట్ ఏంట‌ని ప్ర‌శ్నించారు మీడియా ప్ర‌తినిధులు. దీనికి, ష‌ర్మిల కేటీఆర్‌కు దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ ఇచ్చారు. ఇంత‌కీ, కేటీఆర్ అంటే ఎవరు..? అంటూ సెటైరిక‌ల్‌గా ఆన్స‌ర్ స్టార్ట్ చేశారు. ఆయన ఎవరో తనకు తెలియదన్నట్లుగా షర్మిల మాట్లాడారు. కేటీఆరా.. అంటే ఆయనెవరు..? అని ప్ర‌శ్నించారు. పక్కనున్న ఓ నేత‌.. ఆయనే మేడమ్.. కల్వకుంట్ల తారకరామారావు అని చెప్పగా.. ఓహ్.. కేసీఆర్ గారి కొడుకా అంటూ నవ్వారు. ఆ ఒక్క డైలాగ్‌తో టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, తెలంగాణ‌ మంత్రి అయిన‌ కేటీఆర్ స్థాయిని.. కేసీఆర్ కొడుకు స్థాయికి దిగ‌జార్చి.. ష‌ర్మిల త‌న మాట‌కారిత‌నంతో ఔరా అనిపించారు.  కేసీఆర్‌కు మహిళలంటే గౌర‌వంలేదు. ఇక ఆయన కుమారుడు కేటీఆర్ గౌరవిస్తారా..? అసలు టీఆర్ఎస్ పార్టీలో ఎంతమంది మహిళలున్నారు..? ఎంత మందిని పోటీలో నిలబెట్టారు..? ఎంతమందిని గెలిపించుకున్నారు..?. ఎంతమందిని మంత్రులను చేశారు..?. ఒక్క మహిళైనా మంత్రిగా ఉన్నారా..? అని ప్ర‌శ్నించారు. ప‌క్క‌నున్న వారు మంత్రి స‌బిత ఉన్నార‌ని గుర్తు చేయ‌గా.. ఒకరున్నారు సరే.. ఆమె టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచారా..? లేకుంటే పక్క పార్టీ నుంచి తెచ్చుకున్నారా..? అంటూ చాలా చాక‌చ‌క్యంగా మాట్లాడారు ష‌ర్మిల‌. వీళ్లా మహిళల గురించి మాట్లాడేది. కేటీఆర్ గారి దృష్టిలో మహిళలు అంటే వంటింట్లో ఉండాలి.. వ్రతాలు చేసుకోవాలనేగా అర్థం.. అంతేనా..?. అధికార పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడైనా మహిళలు కనిపిస్తారా..? ఓ మీటింగ్‌కు మహిళా సర్పంచ్ వస్తే ఆమెకు కుర్చీ అయినా వేశారా..?. అసలు మనం ఏ శతాబ్ధంలో బతుకుతున్నాం? అంటూ కేసీఆర్, కేటీఆర్‌ల‌ను మాట‌ల‌తో కుళ్ల‌బొడిచారు వైఎస్ ష‌ర్మిల‌.  తెలంగాణకు ముఖ్యమంత్రి ఎవరు..? కేసీఆరా.. లేకుంటే ఆయన కొడుకా..?. కేసీఆర్‌కు మహిళలంటే గౌరవం లేదు. తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతోందని.. కేటీఆర్ పెద్ద మ‌గాడైతే.. తెలంగాణ‌లో వెంట‌నే నిరుద్యోగ స‌మ‌స్య తీర్చాల‌ని.. ఉద్యోగ నోటిఫికేష‌న్లు వ‌చ్చేలా చూడాల‌ని.. మ‌హిళ‌ల ప్రాతినిథ్యం పెంచాల‌ని.. ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ రిలీజ్‌చేయాల‌ని.. డిమాండ్ చేశారు వైఎస్ ష‌ర్మిల‌. ఇలాంటి స‌మ‌స్య‌ల‌పై పోరాడేందుకు.. తెలంగాణ ప్రజలకు న్యాయం చేసేందుకే పార్టీని స్థాపించామ‌న్నారు వైఎస్సార్‌టీపీ అధినేత్రి ష‌ర్మిల‌.   

జ‌గ‌న్‌కు ప్ర‌జ‌లే బుద్ధి చెబుతారు.. ష‌ర్మిల సంచ‌ల‌న కామెంట్స్‌..

వైఎస్సార్ తెలంగాణ పార్టీ. వైఎస్సార్‌టీపీ. ష‌ర్మిల పెట్టిన కొత్త పార్టీ. అన్న మీద అలిగేసి వ‌చ్చార‌ని ఒక‌రు.. అన్న వ‌దిలిన బాణ‌మేన‌ని ఇంకొక‌రు.. లేదు, లేదు.. మోదీ సంధించిన అస్త్ర‌మంటూ మ‌రికొంద‌రు. ఇలా ఎవ‌రి వాద‌న వారు వినిపిస్తుండ‌గానే.. అట్ట‌హాసంగా పార్టీని ప్రారంభించేశారు. పాద‌యాత్ర‌కూ సిద్ధ‌మైపోతున్నారు. నిరుద్యోగ స‌మ‌స్య‌ల‌పై దీక్ష‌లు చేస్తున్నారు. అయినా, ఇంకా ఏదో అనుమానం. ష‌ర్మిల క‌మిట్‌మెంట్‌పై సందేశం. తెలంగాణపై చిత్త‌శుద్ధి ఉందా? అని గుచ్చిగుచ్చి చూస్తున్నారు జ‌నాలు.  అయితే, తాను అల్లాట‌ప్పాగా పార్టీ పెట్ట‌లేద‌ని.. అన్న‌పై అలిగి పెట్టిన పార్టీ కాదంటూ మ‌రోసారి ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ క్లారిటీ ఇచ్చారు ష‌ర్మిల‌. తాను పార్టీ పెట్టాల్సి వ‌చ్చిన రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను, త‌న‌ రాజ‌కీయ చిత్త‌శుద్ధిని మైకు ముందు ఏక‌రువు పెట్టారు. వైఎస్సార్ నామ‌జ‌పాన్ని ఎక్క‌డా ఆప‌కుండా.. తెలంగాణ స‌మ‌స్య‌ల‌పై ఏక‌రువు పెడుతూ.. త‌న‌ పోరాట ప‌థాన్ని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు.  అయితే, తెలంగాణ సంగ‌తి త‌ర్వాత‌.. మ‌రి, ఏపీలో రాజ‌న్న‌రాజ్యం అమ‌లు అవుతుందా? అక్క‌డ పార్టీ పెట్టాల్సిన అవ‌స‌రం లేదా? ఇక్క‌డే ఎందుకు పెట్టారంటూ ష‌ర్మిల‌పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం గుప్పించారు జ‌ర్న‌లిస్టులు. ఆ ప్ర‌శ్న‌ల‌కు ష‌ర్మిల ఆస‌క్తిక‌ర స‌మాధానాలు చెప్పారు. తాను జ‌గ‌న్‌పై అలిగితే.. పుట్టింటికి పోతాను కానీ, పార్టీ ఎందుకు పెడ‌తానంటూ కౌంట‌ర్ వేశారు ష‌ర్మిల‌. ఇక జ‌గ‌న్ స‌ర్కారుపైనా కాక రేపే కామెంట్లు చేశారు.  ఏపీలో మంచి ప్ర‌భుత్వం వ‌స్తుంద‌నే ఆశ‌తోనే అక్క‌డి ప్ర‌జ‌లు జ‌గ‌న్‌ను ఎన్నుకున్నార‌ని.. ఇప్ప‌టికి రెండేళ్లు గ‌డిచాయ‌ని.. ఆ ప్ర‌భుత్వ ప‌నితీరు న‌చ్చ‌క‌పోతే.. ప్ర‌జ‌లే వ‌చ్చే ఎన్నిక‌ల్లో బుద్ధి చెబుతారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు వైఎస్ ష‌ర్మిల‌. ఆమె చేసిన ఈ వ్యాఖ్య‌లు ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతున్నాయి. ష‌ర్మిల మాట‌ల ప్ర‌కారం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌కు ప్ర‌జ‌లు గుణ‌పాఠం చెబుతార‌నే విధంగా ఉన్నాయంటున్నారు. అన్న పాల‌న‌పై చెల్లి చేసిన కామెంట్లపై ఏపీలో తెగ చ‌ర్చ జ‌రుగుతోంది.    

ఈ డాక్టరు మామూలోడు కాదు.. ఆపరేషన్ చేయడంలో అలీబాబా లాంటివాడు.. 

తేలు మంత్రం రానివాడు.  పాము నోట్లో వేలు పెట్టినట్లు.  కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న సామెతలకు చాలా దగ్గర పోలిక ఉంది ఈ ఇన్సిడెంట్. డాక్టర్స్ అంటే దేవుడితో సమానం.. వాళ్ళుకూడా తప్పులు చేస్తున్నారు. వైద్య వృత్తిని పక్కద్రోవ పట్టిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం వరంగల్ లో యూట్యూబ్ లో చూసి ఆపరేషన్ చేశాడు ఒక వైద్యుడు.. అధికారులు అతని పై వేటు వేశారు.. తాజాగా మరో వైద్యుడు మరో తప్పు చేశాడు.. ఇలా ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులే పేషేంట్స్ ల ప్రాణాలతో చెలగాటం ఆగుతున్నారు. వివరాల్లోకి వెళితే..   రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి గాయపడటంతో  స్థానికులు అతణ్ని ఆస్పత్రికి తరలించారు. కాలు విరిగిందని చెప్పిన వైద్యులు, ఆపరేఫన్ చేశారు. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ  సర్జరీ అనంతరం కళ్లు తెరిచి చూసిన బాధితుడు ఒక్కసారిగా టైడ్ యాడ్ లా  కంగుతిన్నాడు. అసలు ఏమైందంటే,  సిద్దిపేట జిల్లా ఉద్దేమర్రి గ్రామానికి చెందిన సురేశ్ పని నిమిత్తం వేరే ఊరు వెళ్లాడు. తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో దేవుడి అనుగ్రహమే వాడి పోరపాటో తెలియదు గానీ యాక్సిడెంట్ జరిగింది. ఈ ఘటనలో సురేశ్ కాలుకి దెబ్బతగిలింది. గమనించిన స్థానికులు అతణ్ని మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ ఈసీఐఎల్​లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కి తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన  ఆస్పత్రికి వచ్చారు. ప్రమాదంలో సురేశ్ కాలు విరగడంతో అతడికి శస్త్ర చికిత్స చేశామని చెప్పారు డాక్టర్లు. సెర్టిఫికెట్స్ డాక్టర్స్ సర్జరీకి రెడీ చేశారు. సర్జరీ  తర్వాత కళ్లు తెరిచిన పేషేంట్ సురేశ్.. తన కాలిని చూసి షాక్‌కు గురయ్యాడు. విరిగిన కాలికి కాకుండా.. మరో కాలికి శస్త్రచికిత్స చేయడం గమనించి ఖంగుతిన్నాడు. సురేశ్ బంధువులు, కుటుంబ సభ్యులు.. వైద్యులను నిలదీయగా.. పొరపాటు జరిగిందని చేసిన తప్పును ఒప్పుకున్నాడు. మళ్లీ విరిగిన కాలికి శస్త్రచికిత్స చేస్తామని వెల్లడించారు. ఈ క్రమంలో ఆస్పత్రి యాజమాన్యంతో సురేశ్ కుటుంబ సభ్యులు గొడవకు దిగారు. బాధితుని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. అసలు విరగని కాలికి సర్జరీ ఎలా చేశారన్నది మిస్టరీగా మారింది. కాలు కాబట్టి సరిపోయింది. అదే ఏ కడుపొ కన్నో ఐతే వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి.. 

కాంగ్రెస్’ కు   కమల్ సారధ్యం ?

కాంగ్రెస్ పార్టీలో కదలిక వచ్చింది. పూర్వ వైభవ స్థితి దిశగా అడుగులు పడుతున్నాయి.  వచ్చే సంవత్సరం జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా, 2024 లోక్ సభ ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసేందుకు ప్రశాంత్ కిశోర్ రచించిన కొత్త వ్యూహంతో హస్తం పార్టీ అడుగులు వేస్తోంది. వరస ఓటములు, నాయకత్వ సంక్షోభం  నుంచి బయట పడేందుకు  కొత్త ఎత్తులతో ముందుకు సాగుతోంది.  గత లోక్ సభ ఎన్నిక ఓటమి తర్వాత, రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇక అప్పటినుంచి ఇప్పటి వరకు, అధ్యక్ష పీఠం ఖాళీగా వుంది. సోనియా గాంధీనే తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.అయితే, వయసు,ఆరోగ్యం సహకరించక పోవడంతో ఆమె  పార్టీ అధ్యక్ష బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వర్తించలేక పోతున్నారు. ఈ సంవత్సరం (2021) ఆరంభంలో జరిగిన జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఏ ఒక్క రాష్ట్రంలోనూ ప్రచారంలో పాల్గొనలేదు.రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా ఇద్దరే ప్రచార బాధ్యలు స్వీకరించారు.  మరో వంక, సంవత్సరాల తరబడి పార్టీకి పూర్తి స్థాయి అధ్యక్షుడు లేక పోవడంతో పార్టీ ఇంటా బయట కూడా విమర్శలు, అవమానాలు ఎదుర్కుంటోంది. ఓ వంక పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించి,పూర్తి స్థాయి అధ్యక్షుని ఎన్నుకోవాలని, పార్టీ సీనియర్ నాయకులు (జీ 23) సంవత్సరం పైగా డిమాండ్ చేస్తున్నారు. మరో వంక ప్రత్యర్ధి పార్టీలు, అధ్యక్షుడు లేని పార్టీ అంటూ అవహేళన చేస్తున్నాయి. అలాగే, నాయకత్వ లేమితో, పార్టీ నాయకులు, కార్యకర్తలలో నైతిక స్థైర్యం కొంత క్షీణించింది. మరో వంక వరస ఓటములతో పార్టీ కుదేలై పోయింది. ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ సహా ఐదు రాష్ట్రల శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆశించిన ఫలితాలను సాధించలేక పోయింది. అందివచ్చిన అవకాశాలను సైతం జారవిడుచుకుంది.  ఈ నేపద్యంలో, కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు, సోనియా గాంధీ పార్టీలో సంస్థాగత మార్పులు అవసరమని గుర్తించారు. పార్టీ అధ్యక్ష ఎన్నికలు సహా సంస్థాగతంగా తీసుకోవలసిన చర్యలపై దృష్టిని కేంద్రీకరించారు.అయితే కరోనా కారణంగా అందుకు పరిస్థితులు అనుకూలించక పోవడంతో, పార్టీ పక్షాళన ప్రక్రియ వాయిదా పడుతూ వస్తోంది. అధ్యక్ష ఎన్నిక ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడింది.   ఈ పరిస్థితిలో మరో ఆరేడు నెలలలో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, సోనియా గాంధీ పార్టీ నాయకత్వంలో మార్పులకు శ్రీకారం చుడుతున్నారు.పార్టీ సీనియర్ నాయకుడు, మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్’కు పార్టీ పగ్గాలు అప్పగించాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే, ఆయనకు అధ్యక్ష పదివిని ఇస్తారా లేక వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించి, సోనియా గాంధీ అధ్యక్ష పదవిలో కొనసాగుతారా, అనే విషయంలో ఇంకా కొంత క్లారిటీ రావలసి ఉందని అంటున్నారు.  ఇదిలా ఉండగా, కమల్‌నాథ్‌ గురువారం (జులై`15) సోనియా గాంధీతో సమావేసమయ్యారు.దీంతో తొమ్మిది సార్లు పార్లమెంట్ సభ్యునిగా, పలు మార్లు కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవమున్న కమల్ నాథ్ రాగల రోజుల్లో జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించడం ఖామని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.  కాగా, కాంగ్రెస్ పార్టీ పునర్జీవనానికి కమల్‌నాథ్‌ సరైన ఎంపిక అవుతారని రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. ఏకంగా తొమ్మిది సార్లు పార్లమెంట్ సభ్యునిగా, అనేక సంవత్సరాలపాటు కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయనకు ఢిల్లీ (జాతీయ)రాజకీయలు కొట్టిన పిండి. అంతే కాకుండా ఆయనకు, అన్నిరాష్ట్రాల కాంగ్రెస్ నాయకులతో పార్టీ పరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ మంచి పరిచయాలున్నాయి. అదే విధంగా, జతీయ స్థాయిలో చక్రం తిప్పగల ఇతర జాతీయ, ప్రాంతీయ పార్టీల  నాయకుల అందరితోనూ కమల్‌నాథ్‌ కు సన్నిహిత సంబంధాలు, పరిచయాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో పీకే పళన ప్రకారం  పార్లమెంట్ లోపల వెలుపలా బీజేపే వ్యతిరేక పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే సామర్ధ్యం ఆయనకు మాత్రమే ఉందని సోనియా గాంధీ భావిస్తునట్లు సమాచారం. ఇదలా ఉంటే, కొద్దిరోజుల క్రితం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్తో  సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రాతో  జరిపిన చర్చల్లో రానున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటుగా  పంజాబ్’ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలు, పార్టీ పునర్జీవన దీర్ఘకాల ప్రణాళిక గురించి కూడా చర్చించారని పార్టీ వర్గాల సమాచారం. ఈ దీర్ఘ కాలిక ప్రణాళికలో భాగంగానే కమల్‌నాథ్‌’ కు కాంగ్రెస్ బాధ్యలు అప్పగించాలనే నిర్ణయం జరిగిందని తెలుస్తోంది. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే కాంగ్రెస్’ కొత్త అధ్యక్షుని నియామకం ఉంటుందని అంటున్నారు. నిజానికి కమల్‌నాథ్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించాలన్న నిర్ణయాన్ని కొన్ని రోజుల క్రితమే తీసుకున్నట్టు సమాచారం. అయితే, కొండ నాలుకకు మందేస్తే, ఉన్న నాలుక ఊడింది’ అన్నట్లు కొత్త సమస్యలు తలెత్తకుండా సోనియా గాంధీ, ప్రశాంత్ కిశోర్ సూచనల మేరకు ఆచితూచి అడుగులు వేస్తున్నారని అంటున్నారు.

పోలీస్ గ్రూపులో డాన్ కూతురు.. డ్రామా మామూలుగా లేదుగా...

అత‌నో డాన్‌. డాన్ అంటే అల్లాట‌ప్పా డాన్ కాదు. మ‌హా ఖ‌త‌ర్నాక్‌. చిక్క‌డు దొర‌క‌డు టైప్‌. పోలీసులు అత‌ని కోసం ఎప్ప‌టి నుంచో వెతుకుతున్నారు. అత‌ను అస‌లే దొర‌క‌డం లేదు. అత‌ని దందాను కూడా ఆప‌లేక‌పోతున్నారు. డాన్‌ను ప‌ట్టుకోవ‌డం కోసం ప‌లుమార్లు ప‌క్కాగా స్కెచ్ వేశారు. ఈసారి ప‌ట్టేసుకుంటాం అనుకునేలోపు ప‌రారీ అయిపోతున్నాడు. ఇలా ఒక‌టి, రెండు సార్లు కాదు.. అనేక మార్లు. అదేంటి.. అంత ప‌క్కాగా స్కెచ్ వేసినా ఆ డాన్ ఎలా త‌ప్పించుకుంటున్నాడు? పోలీసుల‌కు ఎలా మ‌స్కా కొడుతున్నాడు? అనే విష‌యం ఖాకీల‌కు ఏమాత్రం అంతుచిక్క‌డం లేదు. పోలీసుల్లో ఎవ‌రైనా ఆ డాన్‌కు హెల్ప్ చేస్తున్నారా? అనే అనుమానం. లేక‌, పోలీసుల్లోనే ఆ డాన్ మ‌నుషులు ఉన్నారా అనే డౌట్‌? ఎంత క్రాస్ చెక్ చేసుకున్నా.. ఒక్క క్లూ కూడా దొర‌క‌లేదు. ఆ డానూ దొర‌క‌లేదు. ఇదంతా నెల్లూరు జిల్లాలో పేరుమోసిన‌ మ‌ట్కా డాన్ గురించి.  చివ‌రాఖ‌రికి ఆ డాన్ ఎలా త‌ప్పించుకుంటున్నాడ‌నే విష‌యం మాత్రం తెలుసుకున్నారు. ఆ మేట‌ర్ తెలిసి ఖాకీలు అవాక్క‌య్యారు. అయ్య బాబోయ్‌.. ఇంత ఘోరం జ‌రిగిపోయిందా అని ఇప్పుడు తెగ ఇదై పోతున్నారు. ఆ సీక్రెట్ ఉన్న‌తాధికారుల దృష్టికి వెళ్ల‌డంతో డిపార్ట్‌మెంట్‌లో ద‌డ మొద‌లైంది. ఇప్పుడిక‌ ఇంటి దొంగ‌లు, బ‌య‌టి దొంగ‌ల కోసం గ‌ట్టిగా అన్వేషిస్తున్నారు. ఇంత‌కీ మ‌ట్కా డాన్ ఎలా త‌ప్పించుకుంటున్నాడు? పోలీసులు క‌నుక్కొన్న ఆ సీక్రెట్ ఏంటి? ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయా డిటైల్స్‌.... కర్నూలు జిల్లా పోలీసులకు ప్ర‌త్యేక వాట్సాప్ గ్రూప్ ఉంది. అందులో ఎప్ప‌టిక‌ప్పుడు పోలీసుల యాక్టివిటీస్‌, ఆప‌రేష‌న్స్ అప్‌డేట్ చేస్తుంటారు. ఆ డిటైల్స్ చూసి.. జిల్లా పోలీసులంతా వారి వారి ప‌రిధిలో అల‌ర్ట్ అవుతుంటారు. అయితే, ఎలా వ‌చ్చిందో తెలీదు గానీ, క‌ర్నూలు పోలీసు వాట్సాప్ గ్రూప్‌లో నంద్యాల మట్కా డాన్ కూతురు సెల్ నెంబర్ కూడా యాడ్ అయి ఉంద‌ట‌. ఆ విష‌యం తెలిసి ఖాకీలు కంగుతిన్నారని అంటున్నారు. పోలీస్ వాట్సాప్‌ గ్రూప్‌లో పెడుతున్న మెసేజ్‌ల‌ను చూసే.. ఆ మ‌ట్కా డాన్ ఎప్ప‌టిక‌ప్పుడు ఎస్కేప్ అవుతున్నాడ‌ని నిర్థార‌ణ‌కు వ‌చ్చారు. వెంట‌నే ఆ డాన్ కూతురు ఫోన్ నెంబ‌ర్ డిలీట్ చేసేశార‌నుకోండి అది వేరే విష‌యం.. ఇంత‌కీ, పోలీస్ గ్రూపుల్లోకి ఆమె నెంబ‌ర్ ఎలా వ‌చ్చింది? ఎవ‌రు యాడ్ చేశారు? గ్రూప్ అడ్మిన్స్ కూడా పోలీసులే క‌దా? వారి ప్ర‌మేయం లేకుండా ఎలా వ‌స్తుంది? లేక‌, పోలీసుల నెంబ‌రే ఆ డాన్ సంపాదించి తన కూతురికి ఇచ్చాడా? ఇలా పోలీస్ స్టైల్‌లో అనేక ప్ర‌శ్న‌లు.. అంత‌కుమించి అనుమానాలు... మ‌ట్కా శిబిరాల‌పై పోలీసులు ఆకస్మిక తనిఖీల కోసం వెళ్తుంటే ముందేగానే ఆ ఇన్ఫ‌ర్మేష‌న్ కేటుగాళ్ల‌కు తెలియడానికి పోలీస్ వాట్సాప్ గ్రూపులో వాళ్ల నెంబ‌ర్ ఉండ‌ట‌మే కారణమని ఆలస్యంగా గుర్తించారు. మట్కా స్థావరంపై దాడులతో వెలుగులోకి ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మట్కా డాన్ కుటుంబంతో కొందరు పోలీసులు సన్నిహితంగా ఉంటున్నారని కూడా తెలుస్తోంది. అయితే వారు ఎవరు అన్నదానిపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఈ విష‌యాలేవీ పోలీసులు అధికారికంగా బ‌య‌ట‌కు చెప్ప‌డం లేదు గానీ, ఈ ఉదంతంపై డిపార్ట్‌మెంట్‌లో జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంద‌ని అంటున్నారు. ఇటీవల మాట్కా డాన్ అసదుల్లాను కర్నూలు జిల్లా నంద్యాల త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మాట్కా డాన్ కు ఆరుగురు పోలీసులు సహాకారం అందించినట్లుగా తెలుస్తోంది. పోలీసులే అసాంఘీక కార్యకపాలకు పాల్పడుతున్నారని..మట్కా నిర్వాహకులకు సహకారం అందిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు వాట్సాప్ గ్రూపులో డాన్ కూతురు ఫోన్ నెంబర్ వ్య‌వ‌హారాన్ని ఇక్క‌డితో వ‌దిలేస్తారా? లేక‌, తీగ లాగి డొంకంతా క‌దిలిస్తారా? చూడాలి..   

హరీష్ రావు అడ్డాలో.. లంచాల పరవం..

అది ప్రస్తుతం ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు నియోజకవర్గం. లంచాలు అడ్డాగా మారింది. ఏఓ  లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. భారత దేశం అంటే సంస్కృతి, సాంప్రదాయాలు మాత్రమే కాదు.. నిరుద్యోగం..లంచం అనే దారిద్రమైన విధానాలు కూడా ఉన్నాయి. మన దేశాన్ని పీడిస్తున్న కులం మతం తర్వాత  లంచం విషయం కూడా  ఎప్పటి నుండో మన దేశాన్ని పట్టి పీడిస్తున్న అంశం.. తాజాగా లంచం తీసుకుంటూ నెక్కొండ అగ్రికల్చర్ ఆఫీసర్ (AO) సంపత్ రెడ్డి ఏసీబీకి పట్టుబడ్డాడు. డబ్బుల కోసం ఆయన అప్పాల్రావుపేట గ్రామానికి చెందిన వడ్డే ఏకాంబరాన్ని బెదిరిస్తున్న ఫోన్ కాల్ సంభాషణ లీకైంది. ప్రస్తుతం ఈ ఆడియో టేప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏకాంబ‌రానికి చెందిన ఫెర్టిలైజర్ షాపులో త‌నిఖీలు చేప‌ట్టకుండా ఉండేందుకు ఏవో సంపత్ రెడ్డి రూ.10 వేలు లంచం డిమాండ్ చేశాడు. అడిగినంత ఇవ్వకపోతే నీ ఇజ్జత్ తీస్తానని.. త‌న‌కు పై అధికారుల నుంచి ప్రెజ‌ర్ ఉంద‌ని వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. ఈ వ్యవహారంలో ఏడీ శ్రీనివాసరావు ఇన్వాల్వ్‌మెంట్ ఉన్నట్లుగా స్పష్టమ‌వుతుండ‌గా ఏసీబీ అధికారులు ఆయ‌న్ను విచారించేందుకు ప్రయ‌త్నిస్తున్నారు. అయితే, రెండు రోజులుగా స‌ద‌రు అధికారి అజ్ఞాతంలో ఉండ‌టం చ‌ర్చనీయాంశంగా మారింది.  

రాజ్ భవన్ కు కాంగ్రెస్ జెండా.. ఇందిరాపార్క్ దగ్గర హై టెన్షన్

పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన చలో రాజ్ భవన్ నిరసన కార్యక్రమం ఉద్రిక్తతలు స్పష్టిస్తోంది. ఇందిరా పార్క్ దగ్గర సభకు మాత్రమే అనుమతి ఇచ్చిన పోలీసులు.. ర్యాలీకి పర్మిషన్ ఇవ్వలేదు. రాజ్ భవన్ దగ్గర ఆంక్షలు విధించారు. రాజ్ భవన్ కు వెళ్లే అన్ని మార్గాల్లోనూ భారీగా బలగాలను మోహరించారు. పోలీసులు అనుమతి ఇవ్వనప్పటితి  ‘చలో రాజ్ భవన్’ ర్యాలీ తీస్తామని, ఎట్టిపరిస్థితుల్లోనూ తగ్గేది లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపిచ్చారు. దాంతో కాంగ్రెస్ కార్యకర్తలు నగరానికి భారీగా తరలివస్తున్నారు.  రాజ్ భవన్ గేటుకి అడ్డంగా బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. అయినా పోలీసులకు షాకిచ్చారు ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలు. ఉదయాన్నే రాజ్ భవన్ కు వెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలు రాజ్ భవన్ గేట్లకు కాంగ్రెస్ జెండాలు కట్టారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసులు లేని సమయంలో రాజ్ భవన్ గేట్లకు కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ జెండాలు కట్టినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ కార్యకర్తలు రాజ్ భవన్ గేటుకు కాంగ్రెస్ జెండాలు కట్టిన వీడియో వైరల్ గా మారింది. అన్నట్లుగానే ఛలో రాజ్ భవన్ నిర్వహించామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.  పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఉదయం గం.10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 200 మందితో ఇందిరాపార్క్ దగ్గర సమావేశం నిర్వహించుకునేందుకు పోలీసులు అనుమతినిచ్చారు. అయితే, ఇందిరాపార్క్ నుంచి రాజ్​భవన్ వరకు ప్రదర్శనగా వచ్చి గవర్నర్​ను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు టీ కాంగ్రెస్ నేతలకు అనుమతి ఇవ్వలేదు. అయితే చలో రాజ్‌భవన్ కార్యక్రమాన్ని అడ్డుకుంటే పోలీస్ స్టేషన్లనే ముట్టడిస్తామని ప్రకటించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. మరోవైపు చలో రాజ్ భవన్ కు వెళ్లకుండా జిల్లాల్లోనే కాంగ్రెస్ నేతలు, ముఖ్య కార్తకర్తలను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేస్తున్నారు. దీంతో ఎక్కడికక్కడ ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి.