ఒకే ఇంట్లో ఎన్నో జెండాలు.. కొత్తేమీ కాదు..
నేను ఏ పార్టీలో ఉన్నానో నాకే తెలియడం లేదు’ ఈమాట అన్నది ఎవరో చిన్నాచితక నాయకుడు కాదు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో రెండు సార్లు పీసీసీ అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీని విజయపధంలో నడిపిన ధర్మపురి శ్రీనివాస్. ధర్మపురి శ్రీనివాస్ అంటే, అందరికీ వెంటనే స్పురణకు రాక పోవచ్చును, కానీ, డీఎస్ అంటే అందరికీ గుర్తుకొస్తారు. అడుగులో అడుగేస్తూ నెమ్మదిగా కదిలే భారీ రూపం కళ్ళ ముందు కదులుతుంది. అలాగే, ఎంత పెద్ద వివాదం అయినా కోపతాపాలకు పోకుండా, మెల్లగా, మౌనంగా మాట్లాడే ఆయన నైజం గుర్తుకు వస్తుంది. ప్రస్తుతం అయన తెరాస రాజ్య సభ సభ్యునిగా ఉన్నారు. అయినా, పార్టీ ఆయన్ని పట్టించుకోవడంలేదు. “టీఆర్ఎస్ నుంచి నాకు ఆహ్వానాలు రావడం లేదు. నేను టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీనేనా? అన్న విషయాన్ని సీఎం కేసీఆర్నే అడగాలి” అని అన్నారంటే ఆయన ఎలాంటి మానసిక క్షోభకు గురవుతున్నారో అర్థం చేకోవచ్చును.
ఇంత వరకు తండ్రితో పాటుగా అవమానాలు భరిస్తూ కూడా తెరాసలో కొనసాగిన డీఎస్ పెద్ద కుమారుడు, నిజామాబాద్ మున్సిపల్ మాజీ చైర్మన్ ధర్మపురి సంజయ్, ఇటీవల తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. మరోవంక ఇప్పటికే ఆయన మరో కుమారుడు ధర్మపురి అరవింద్ బీజేపీ ఎంపీగా ఉన్నారు.అంటే తండ్రి ఒక ప్రాంతీయ పార్టీలో, కుమారులు ఇద్దరూ చెరో జాతీయ పార్టీలో ఉన్నారు. ఇలా ఒకే ఫ్యామిలీలో మూడు పార్టీలు, మూడు జెండాలు ఏమిటని అనడిగినప్పుడు, ఆయన మరో అడుగు ఎనక్కి వేశారు, మీకు తెలియక పోవచ్చును కానీ,మా నాయన జనసంఘ్ (బీజేపీ పూర్వ రూపం )లో ఉన్నారని గుర్తుచేశారు. అంతేకాదు, తండ్రీ కొదుకులే కాదు, బార్యాభర్తలు కూడా వేర్వేరు పార్టీల్లో ఉన్న ఉదంతాలు ఎన్నో ఉన్నాయని అన్నారు.
నిజమే చరిత్రలోనే కాదు,నడుస్తున్న చరిత్రలో కూడా అనేక ఉదంతాలు కనిపిస్థాయి, చెన్నమనేని రాజేశ్వర రావు,చెన్నమనేని విద్యాసాగర రావు. ఇద్దరు సొంత అన్నదమ్ములే. కానీ అందులో రాజేశ్వర రావు, ఒకప్పుడు కరుడుగట్టిన కమ్యూనిస్ట్ (చివర్లో టీడీపీలో చేరారు) సోదరుడు విద్యాసాగరరావు చిన్నతనం నుంచే కాషాయధారి,బీజేపీలో కెలక నేతగా ఎదుగారు. కాషాయ జెండా నీడలోనే కేంద్ర మంత్రిగా మహారాష్ట్ర గవర్నర్’గా పనిచేశారు. ఇప్పుడు రాజేశ్వర రావు కుమారుడు చెన్నమనేని రమేష్ తెరాస ఎమ్మెల్యే.
ఎవరి దాకానో ఎందుకు కేసీఆర్ ఫ్యామిలీలోనే ఆయన ఇద్దరు మేనల్లుడలళ్ళలో హరీష్ రావు మమవెంట నమ్మినబంటుగా తెరాసలో ఉన్నారు. ఆయన మరో మేనల్లుదు ఉమేష్ రావు కొంత కాలం కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. ఇప్పటికీ అదే పార్టీలో ఉన్నాఋ కావచ్చు. ఇంకా కేసీఆర్ అన్నదమ్ముల బిడ్ద రమ్యా రావు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అలాగే, దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఫ్యామిలీలో ఆయన, ఆయన కుమారుడు వైసీపీలో ఉన్నారు. అయన భార్య దగ్గుబాటి పురందేశ్వరి, బీజేపీలో క్రియాశీలంగా పనిచేస్తున్నారు.
జగన్ కాంగ్రెస్ను వీడి సొంత పార్టీ పెట్టుకున్నాక తన తల్లిని పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించిన సందర్భంలో ఆమెకు వ్యతిరేకంగా పోటీకి దిగింది మరెవరో కాదు.. స్వయానా వైఎస్ తమ్ముడే వివేకనంద రెడ్డి. వైఎస్ కుమారుడు జగన్ రెడ్డి సొంత పార్టీ పెట్టుకున్నా, పెద్దాయన ఆత్మ మాత్రం ఇప్పటికీ కాంగ్రెస్’లోనే వుంది. అలాగే, జగన్ సోదరీ షర్మిల ఏకంగా సరహద్దు దాటి తెలంగాణలో సొంత పార్టీనే పెట్టు కున్నారు. అన్నా చెల్లి నడుమ రక్త బందం మాటేమో గానీ జలవివాదం రాజుకుంటోంది.ఇలా చెప్పుకుంటూ పొతే రెండు, మూడు జెండాలున్న కుటుంబాలు ఇంకా అనేకం ఉన్నాయి, కర్నూల్ శిల్పా సోదరులు, పోట్టిశ్రీ రాములు జిల్ల్లాలో బీద మస్తాన్, బీద రవిచంద్ర సోదరులు వేర్వేర్రు పార్టీలలో ఉన్నారు. సో ... ఒకే ఇంట్లో మూడు కాదు ... ఇంకా ఎక్కువ జెండాలున్నా అశ్చర్య పోనవసరం లేదు. దేశంలో ఫస్ట్ పొలిటికల్ ఫ్యామిలీగా ముద్రవేసుకున్ననెహ్రూ గాంధీ ఫామిలీలో ఇందిరమ్మ పెద్ద కోడలు సోనియా కాంగ్రెస్ సారధి, చిన్నకోడలు మేనకా గాంధీ బీజేపీలో మాజీ మంత్రి. ఇద్దరూ ఎంపీలే పార్టీలే వేరే ..అలాగే .. రాహుల్ ... వరుణ్ గాంధీ..