పెళ్లి వద్దని.. కానిస్టేబుల్ ఆత్మహత్య..
posted on Jul 19, 2021 @ 1:53PM
పెళ్లి అంటే ఒక ఆడ మగ, పెద్దల అంగీకారం.. డబ్బు , మూడు ముళ్ళు , ఏడు అడుగులు మాత్రమే కాదు..రెండు మనసుల కలయిక, ఇద్దరు మనుషుల ప్రయాణం.. వందేళ్ల జీవితం, అన్నింటికంటే ముందు ముందు రెండు మనసులు కలవాలి ఆ తరువాత మనుషులు కలవాలి.. ఇష్టం లేని పెళ్లిళ్లు చేశారని కొంత మంది తమ ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకాడంలేదు.. తాజాగా తనకు ఇష్టం లేకున్నా పెళ్లి చూపులకు తీసుకెళ్లారన్న మనస్తాపంతో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్లో జరిగిందీ . పోలీసుల కథనం ప్రకారం.. అనంతపురం జిల్లా కదిరికి చెందిన దండగల ఆంజనేయులు (25) ఏఆర్ కానిస్టేబుల్. కొన్నేళ్ల క్రితమే నగరానికి వచ్చిన ఆంజనేయులు తల్లి లక్ష్మితో కలిసి కార్ఖానాలోని న్యూవాసవి నగర్లో ఉంటున్నాడు.
ఆంజనేయులు మరెవరితో నైనా ప్రేమలో ఉన్నదో లేదంటే నిజంగానే పెళ్లి అంటే ఇష్టం లేదో తెలియదు గాని.. అతనికి ఈ పెళ్లి వద్దని చెబుతున్నప్పటికీ పట్టించుకోని కుటుంబ సభ్యులు ఇటీవల పెద్దల సమక్షంలో పెళ్లి చూపులు జరిపించారు. అప్పటి నుంచి తీవ్ర మానసిక ఆందోళనకు గురి అయ్యాడు. మనస్తాపం చెందాడు. ఎలాగైనా ఆ పెళ్లి చేసుకోవద్దనుకున్నాడు ఆంజనేయులు అందుకు అందుకు ఒకటే మార్గం అనిపంచింది. అందుకే మరో ఆలోచన లేకుండా, వేరే ఆప్షన్ తీసుకోకుండా శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. పింఛను తీసుకునేందుకు తల్లి లక్ష్మి శుక్రవారం కదిరి వెళ్లగా ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆంజనేయులు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
హైదరాబాద్ లోని స్థానిక విక్రంపురి కాలనీలో ఉండే ఆంజనేయులు సోదరి శనివారం ఫోన్ చేసి మాట్లాడింది. తనకు నైట్ డ్యూటీ ఉందని ఆమెకు చెప్పాడు. అదే రోజు రాత్రి మళ్లీ ఆమె ఫోన్ చేయగా స్పందన లేకపోవడంతో అనుమానించిన ఆమె.. నిన్న ఉదయం తనకు సోదరుడి వరుసైన క్రాంతిని పంపించింది. ఎంతసేపు తలుపుకొట్టినా తీయకపోవడంతో అనుమానించిన క్రాంతి స్థానికుల సాయంతో తలుపు బద్దలుకొట్టి చూడగా ఆంజనేయులు లోపల ఉరి వేసుకున్న స్థితిలో కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి వాడంటే ఇంట్లో వాళ్ళకి చేప్పి వాళ్ళను ఒప్పించాలి, అర్థం ఎట్లు చెప్పాలి. కానీ ఇలా ప్రాణాలు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఏముంటుంది.