కేసీఆర్ కు మరో సవాల్.. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో బీజేపీ? 

తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో ఖాళీగా ఉన్న 12 స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. నామినేన్లు మొదలయ్యాయి. ఎన్నిక అవసరమైతే డిసెంబర్  మొదటి వారంలో  పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఓటస్తారు. అయితే ప్రస్తుతం అన్ని జిల్లాల్లోనూ స్థానిక సంస్థల ప్రతినిధుల్లో దాదాపు 80 శాతానికి పైగా అధికార పార్టీ వారే ఉన్నారు. దీంతో అన్ని స్థానాలు కారు పార్టీ గెలుచుకుంటదనే అంచనాలు ఉన్నాయి. అంతేకాదు బలం లేనందున విపక్షాలు పోటీ చేయకపోవచ్చని, ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం అవుతాయనే చర్చ కూడా ఉంది. అయితే అందరి అంచనాలకు తలకిందులు చేస్తూ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలవాలని బీజేపీ భావిస్తోందని తెలుస్తోంది. బలం లేనప్పుడు కమలం పార్టీ ఎందుకు బరిలో దిగుతోంది? కమలనాథుల వ్యూహం ఏంటి? అన్నదే ఇప్పుడు చర్చగా మారింది. తమ పార్టీకి చెప్పుకోదగ్గ ఓట్లు ఉన్నచోట పోటీ చేయాలని బీజేపీ నేతలు అనుకుంటున్నారట. రంగారెడ్డి, నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో పోటీ చేయాలని దాదాపుగా నిర్ణయించారని సమాచారం. రంగారెడ్డి, కరీంనగర్‌ జిల్లాల్లో రెండేసి ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ పోటీ చేయడం ద్వారా అధికారపార్టీకి చెమటలు పట్టించవచ్చని బీజేపీ నేతల స్కెచ్ అని అంటున్నారు.   గతంలో కూడా బీజేపీకి సంఖ్యాబలం లేకపోయినా నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసింది. ఇప్పుడు కూడా బరిలో దిగడం వల్ల తమ ఓట్లు తమకే పడతాయని.. చెదిరిపోవని భావిస్తున్నారట. నిధుల విడుదల, విధుల కల్పనలో ప్రభుత్వంపై MPTCలు గుర్రుగా ఉన్నారని బీజేపీ వాదన. అలాంటి వారంతా MLC ఎన్నికల్లో బీజేపీకి కలిసి వస్తారని అనుకుంటున్నారట. రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పరిధిలో బీజేపీకి.. గ్రేటర్‌ కార్పొరేటర్లను కలుపుకొంటే 150కిపైగా ఓట్లు ఉన్నాయట. కరీంనగర్‌, నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనూ బీజేపీకి కార్పొరేటర్లు ఉన్నారు.  మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం అవుతాయేమోనని బాధపడ్డ ప్రజాప్రతినిధులకు బీజేపీ నిర్ణయం హుషారు తీసుకొచ్చిందట. టీఆర్‌ఎస్‌తోపాటు మిగతా పార్టీలు బరిలో ఉంటేనే..తమ పంట పండుతుందని అనుకుంటున్నారట. వారి ఆశలు ఎలా ఉన్నా.. బీజేపీ వేస్తున్న ఈ ఎత్తుగడ ఎంత వరకు వర్కవుట్‌ అవుతుందో చూడాలి మరీ..

మావోయిస్టులకు ఎదురుదెబ్బ.. ఎన్ కౌంటర్ లో 26 మంది మావోయిస్టులు హతం.. 

మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర లోని గడ్చిరోలి జిల్లా గ్యారపట్టి అటవీప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 26 మంది మావోయిస్టులు చనిపోయారు. ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు జవాన్లకు తీవ్రగాయాలయ్యాయి.  ఈ విషయాన్ని గడ్చిరోలి ఎస్పీ అంకిత్ గోయల్ ధృవీకరించారు.ఓవైపు అగ్రనేతల మరణం.. మరోవైపు వరుస ఎన్‌కౌంటర్లతో కోలుకోలేకుండా ఉన్న మావోయిస్టులకు ఎన్ కౌంటర్ తో పెద్ద షాక్ తగిలినట్లైంది. గత నెలలోనే మావోయిస్టు అగ్రనేత ఆర్కే అలియాస్ రామకృష్ణ చనిపోయారు. గడ్చిరోలి జిల్లాకు ఈశాన్య ప్రాంతంలో ఛత్తీస్‌గఢ్ సరిహద్దు సమీపంలో శనివారం ఉదయం నుండి పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది.పోలీసులు ఈ ఆపరేషన్ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభించారు. ఇది కొన్ని గంటల పాటు కొనసాగింది. ఈ భారీ ఆపరేషన్‌లో 26 మంది నక్సలైట్లను హతమార్చడమే కాకుండా ముగ్గురు పోలీసులు కూడా గాయపడ్డారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం హెలికాప్టర్‌లో నాగ్‌పూర్‌కు తరలించారు.  ఈ ఎన్‌కౌంటర్‌లో పోలీసులు అనేక మావోయిస్ట్ శిబిరాలను ధ్వంసం చేశారు.  గడ్చిరోలి జిల్లా కోర్చి తాలూకాలోని కోట్‌గుల్ ప్రాంతంలోని ఎలెవెన్‌బట్టి అడవుల్లో మావోయిస్టులు శిబిరం ఏర్పాటు చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీని తర్వాత, సి-60 అనే పోలీసు బృందం మావోయిస్టులపై ఆపరేషన్‌ను ముమ్మరం చేయాలని నిర్ణయించింది. ఆ తర్వాత బృందం సెర్చ్ ఆపరేషన్‌కు బయలుదేరింది. వెంటనే పోలీసు బృందం మావోయిస్టు స్థావరాలకు చేరుకుంది. మావోయిస్టులు పోలీసుల రాకపై సమాచారం అందుకున్నారు. మావోయిస్టులు పోలీసులపైకి కాల్పులు ప్రారంభించారు. దీంతో పోలీసులు కూడా వారిపై దాడికి దిగారు. ఈ దాడిలో మొత్తం 26 మంది నక్సలైట్లు హతమైనట్లు సమాచారం.

జగన్ పై పవన్ పంచ్.. వైసీపీ నేత రాసలీలలు.. కిషన్ రెడ్డి కౌంటర్.. టాప్ న్యూస్@7PM

ఏపీ మినీ పల్లె పోరు సిద్ధమైంది.  ఆదివారం మిగిలిపోయిన గ్రామ పంచాయితీలకు ఎన్నికల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఎన్నికల సన్నాహకాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్‌ఈసీ నీలం సాహ్ని సమీక్ష నిర్వహించారు. మొత్తం 69 స్ధానాల్లో సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇప్పటికే 30 స్ధానాలు ఏకగ్రీవం అయ్యాయి. 36 పంచాయితీల్లో ఆదివారం సర్పంచ్‌ స్ధానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ---------- ఎయిడెడ్ సంస్థల విలీనం, ఉద్యోగుల అప్పగింతపై ఏపీ ప్రభుత్వం తాజాగా నాలుగో ఆప్షన్ ఇచ్చిన నేపథ్యంలో విమర్శలు వస్తున్నాయి. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ అంశంపై తీవ్రస్థాయిలో స్పందించారు. ఎయిడెడ్ విద్యాసంస్థలపై ఇచ్చిన జీవోలను వెంటనే రద్దు చేయాలని, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కొనసాగించాలని డిమాండ్ చేశారు. -------- మున్సిపల్ ఎన్నికల్లో వాలంటీర్లు హల్ చల్ చేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లకు ఓట్ల సిప్పులతో పాటు వైసీపీ కర పత్రాలు పంపిణీ చేస్తున్నారు. వైసీపీకి ఓటు వేయకుంటే పథకాలు తీసేస్తామంటూ తీవ్ర స్థాయిలో బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇలాగే ఓ వాలంటీర్.. ఓటర్లను బెదిరిస్తున్న సమయంలో టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజేతారెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నించారు.  ----------- ఎయిడెడ్ సంస్థల విలీనం, ఉద్యోగుల అప్పగింతపై ఏపీ ప్రభుత్వం తాజాగా నాలుగో ఆప్షన్ ఇచ్చిన నేపథ్యంలో విమర్శలు వస్తున్నాయి. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ అంశంపై తీవ్రస్థాయిలో స్పందించారు. ఎయిడెడ్ విద్యాసంస్థలపై ఇచ్చిన జీవోలను వెంటనే రద్దు చేయాలని, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కొనసాగించాలని డిమాండ్ చేశారు. -------- కుప్పం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రాసలీలల వీడియో వైరల్‌గా మారింది. ఎన్నికల వేళ ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే వీడియోలో ఉంది తాను కాదని, టీడీపీ శ్రేణులే దానిని వైరల్ చేశారంటూ సుధీర్ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను టీడీపీ నేతలు ఖండించారు. వీడియోను ఫోరెన్సిక్‌కు పంపితే అన్ని నిజాలు బయట పడతాయని టీడీపీ నేత రాజు అన్నారు.   ---------- ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్ ఢిల్లీ వచ్చి కేంద్రంతో ఎందుకు మాట్లాడటం లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల‌ తర్వాత దళితబంధు పథకం అమలు చేస్తామన్న సీఎం మాటలు ఎటుపోయాయన్నారు. గిరిజన, బీసీ, మైనారిటీ బంధు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం మేరకే కేంద్రం ధాన్యాన్ని కొనుగోలు చేస్తోందని ఆయన తెలిపారు. తెలంగాణ ధాన్యాన్ని కొనుగోలు చేయబోమని కేంద్రం ఎప్పుడూ చెప్పలేదన్నారు ------------ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆరోగ్య రంగ నిధులను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో వైద్య సదుపాయాల అభివృద్ధికి.. 19 రాష్ట్రాలకు కేంద్రం రూ.8453.92 కోట్లు విడుదల చేసింది. ఇందులో భాగంగా ఏపీకి రూ. 488.16 కోట్ల ఆరోగ్య నిధులను కేంద్రం విడుదల చేసింది. అయితే తెలంగాణకు నిధులను నిలిపివేసింది. నిధుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపకపోవడం వల్లే ఇలా జరిగిందని కేంద్రం చెబుతోంది ------------- రైతుల కోసం తాను దీక్షచేస్తే సీఎం కేసీఆర్‌కు ఎందుకంత భయం? అని షర్మిల ప్రశ్నించారు. వైఎస్‌ఆర్‌టీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు వేదన దీక్షను ముగించారు. షర్మిల మాట్లాడుతూ లోటస్‌పాండ్‌లో దీక్షకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. స్టేజ్ వేయనివ్వడం లేదు, వేసినా తీసేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో పోలీసు జులుం నడుస్తోందన్నారు షర్మిల.  -------- కర్ణాటకను కుదిపివేస్తున్న బిట్‌కాయిన్ స్కామ్‌పై తాజాగా కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత రాహుల్ గాంధీ స్పందించారు. బిట్‌కాయిన్ స్కామ్ చాలా పెద్దదని, అతిపెద్ద గూడుపుటానీని బిట్‌కాయిన్ చాలా వరకు కప్పి ఉంచిందని అన్నారు. తన ట్విట్టర్ ద్వారా స్పందించిన రాహుల్ గాంధీ.. పార్టీ పేరు, వ్యక్తుల పేర్లు ప్రస్తావించకుండానే కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మై, బీజేపీలను టార్గెట్ చేస్తూ ఈ ట్వీట్ చేశారని నెటిజెన్లు అంటున్నారు. ---- మణిపూర్‌లో మిలిటెంట్లు మరోసారి రెచ్చిపోయారుచురాచాంద్‌పూర్ జిల్లా సింఘాట్ సబ్ డివిజన్ పరిధిలో దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో అసోం రైఫిల్స్ యూనిట్‌కు చెందిన కమాండింగ్ అధికారి విప్లవ్ త్రిపాఠి, ఆయన భార్య అనూజ, కుమారుడు అబీర్, మరో నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. కమాండింగ్ అధికారి కల్నల్ విప్లవ్ త్రిపాఠి తన కుటుంబ సభ్యులు, క్విక్ రియాక్షన్ టీమ్‌తో కలిసి కాన్వాయ్‌లో వస్తుండగా ఈ దాడి జరిగింది. 

కేసీఆర్ కు మరో సవాల్.. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో బీజేపీ? 

తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో ఖాళీగా ఉన్న 12 స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. నామినేన్లు మొదలయ్యాయి. ఎన్నిక అవసరమైతే డిసెంబర్  మొదటి వారంలో  పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఓటస్తారు. అయితే ప్రస్తుతం అన్ని జిల్లాల్లోనూ స్థానిక సంస్థల ప్రతినిధుల్లో దాదాపు 80 శాతానికి పైగా అధికార పార్టీ వారే ఉన్నారు. దీంతో అన్ని స్థానాలు కారు పార్టీ గెలుచుకుంటదనే అంచనాలు ఉన్నాయి. అంతేకాదు బలం లేనందున విపక్షాలు పోటీ చేయకపోవచ్చని, ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం అవుతాయనే చర్చ కూడా ఉంది. అయితే అందరి అంచనాలకు తలకిందులు చేస్తూ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలవాలని బీజేపీ భావిస్తోందని తెలుస్తోంది. బలం లేనప్పుడు కమలం పార్టీ ఎందుకు బరిలో దిగుతోంది? కమలనాథుల వ్యూహం ఏంటి? అన్నదే ఇప్పుడు చర్చగా మారింది. తమ పార్టీకి చెప్పుకోదగ్గ ఓట్లు ఉన్నచోట పోటీ చేయాలని బీజేపీ నేతలు అనుకుంటున్నారట. రంగారెడ్డి, నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో పోటీ చేయాలని దాదాపుగా నిర్ణయించారని సమాచారం. రంగారెడ్డి, కరీంనగర్‌ జిల్లాల్లో రెండేసి ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ పోటీ చేయడం ద్వారా అధికారపార్టీకి చెమటలు పట్టించవచ్చని బీజేపీ నేతల స్కెచ్ అని అంటున్నారు.   గతంలో కూడా బీజేపీకి సంఖ్యాబలం లేకపోయినా నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసింది. ఇప్పుడు కూడా బరిలో దిగడం వల్ల తమ ఓట్లు తమకే పడతాయని.. చెదిరిపోవని భావిస్తున్నారట. నిధుల విడుదల, విధుల కల్పనలో ప్రభుత్వంపై MPTCలు గుర్రుగా ఉన్నారని బీజేపీ వాదన. అలాంటి వారంతా MLC ఎన్నికల్లో బీజేపీకి కలిసి వస్తారని అనుకుంటున్నారట. రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పరిధిలో బీజేపీకి.. గ్రేటర్‌ కార్పొరేటర్లను కలుపుకొంటే 150కిపైగా ఓట్లు ఉన్నాయట. కరీంనగర్‌, నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనూ బీజేపీకి కార్పొరేటర్లు ఉన్నారు.  మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం అవుతాయేమోనని బాధపడ్డ ప్రజాప్రతినిధులకు బీజేపీ నిర్ణయం హుషారు తీసుకొచ్చిందట. టీఆర్‌ఎస్‌తోపాటు మిగతా పార్టీలు బరిలో ఉంటేనే..తమ పంట పండుతుందని అనుకుంటున్నారట. వారి ఆశలు ఎలా ఉన్నా.. బీజేపీ వేస్తున్న ఈ ఎత్తుగడ ఎంత వరకు వర్కవుట్‌ అవుతుందో చూడాలి మరీ..

ప్రజలకు పవర్ ఫుల్ షాక్.. ఇకపై నెలనెలా కరెంట్ ఛార్జీల హైక్? 

జనం నెత్తి మీద మరో పిడుగు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోతోంది. పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. పెట్రో ధరల పెంపునకు కొనసాగింపుగా నిత్యావసర వస్తువుల ధరలూ జనాన్ని బాదేస్తున్నాయి. సందట్లో సడేమియా అన్న చందంగా ఇప్పుడు మళ్లీ కరెంట్ ఛార్జీలు నెల నెలా పెంచాలని కేంద్రం ప్రణాళిక రూపొందించింది. ప్రస్తుతం ఏడాదికి ఒకసారి మాత్రమే విద్యుత్ ఛార్జీలు సవరించుకునే విధానం అమల్లో ఉంది. అయితే.. ఇంధన సర్దుబాటు ఛార్జీల ఫార్ములా ఆధారంగా టారిఫ్ లను సంవత్సరంలో ఒకసారికి మించి సవరించుకోవచ్చని విద్యుత్ చట్టంలోని సెక్షన్ 62(4) అవకాశం కల్పిస్తోంది.ఇంధన సర్దుబాటు ఛార్జీల రూపంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల్ని తరచూ మార్పు చేస్తున్న తీరులోనే ఇకపై కరెంట్ బిల్లులు కూడా మార్చాలని కేంద్రం నిర్ణయించింది. ఈ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్రాలు, ఈఆర్సీలను కేంద్రం ఆదేశించింది.  ఈ క్రమంలోనే అక్టోబర్ 22న కేంద్ర విద్యుత్ మంత్రత్వశాఖ విద్యుత్ నిబంధనలు-2021ను ప్రకటించింది. రాష్ట్రాల ఈఆర్సీలు సొంత ఫార్ములా రూపొందించే వరకు కేంద్రం ఫార్ములానే అనుసరించాలని చెప్పింది. పెరుగుతున్న బొగ్గు, గ్యాస్ ధరల ఖర్చును డిస్కంల నుంచి విద్యుదుత్పత్తి సంస్థలు, డిస్కంలు వినియోగదారుల నుంచి వసూలు చేసుకునేందుకు వీలు కల్పిస్తూ కేంద్రం ఈ కొత్త రూల్ తీసుకొచ్చింది. నిజానికి ఆరేళ్ల క్రితమే నెలనెలా విద్యుత్ ఛార్జిల పెంపు విధానం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ ప్రతిపాదనపై ప్రజలు గగ్గోలు పెట్టడంతో కోర్టు జోక్యం చేసుకుంది. దీంతో ఛార్జీల పెంపునకు బ్రేక్ పడింది. మళ్లీ ఇన్నేళ్లకు నెలనెలా విద్యుత్ ఛార్జీల పెంపును కేంద్రం తెరపైకి తీసుకొచ్చింది. కేంద్రం తాజా నిర్ణయంతో వినియోగదారుల నెత్తిన పెనుబాంబు పడక తప్పని పరిస్థితి ఏర్పడనున్నది. పెట్రోల్, డీజిల్ పై సుంకం తగ్గించిన కేంద్ర ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు రెడీ అవడాన్ని ఒక చేత్తో ఇచ్చి.. మరో చేత్తో లాగేసుకోవడం అంటే ఇదే అన్నమాట.

మణిపూర్ లో మిలిటెంట్ల దాడి.. ఆర్మీ కల్నల్ సహా ఏడుగురు మృతి

మణిపూర్‌లో మిలిటెంట్లు మరోసారి రెచ్చిపోయారుచురాచాంద్‌పూర్ జిల్లా సింఘాట్ సబ్ డివిజన్ పరిధిలో దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో అసోం రైఫిల్స్ యూనిట్‌కు చెందిన కమాండింగ్ అధికారి విప్లవ్ త్రిపాఠి, ఆయన భార్య అనూజ, కుమారుడు అబీర్, మరో నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. కమాండింగ్ అధికారి కల్నల్ విప్లవ్ త్రిపాఠి తన కుటుంబ సభ్యులు, క్విక్ రియాక్షన్ టీమ్‌తో కలిసి కాన్వాయ్‌లో వస్తుండగా ఈ దాడి జరిగింది.  అయితే ఈ దాడికి తామే బాధ్యులమని ఇంతవరకూ ఏ మిలిటెంట్ సంస్థా ప్రకటించలేదు. కాగా, మిలిటెంట్ల దాడి ఘటనను ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ తీవ్రంగా ఖండించారు. మిలిటెంట్లను మట్టుబెట్టేందుకు రాష్ట్ర పోలీసులు, పారామిలటరీ సిబ్బంది అవిశ్రాంతంగా పని చేస్తున్నారని, మిలిటెంట్ దాడులకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టేది లేదని అన్నారు. అసోం రైఫిల్స్ కాన్వాయ్‌పై మిలిటెంట్ల దాడిని కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఒక ప్రకటనలో ఖండించారు. ఇది పిరికిపందల చర్యగా పేర్కొన్నారు. దాడి బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. దేశం ఐదు మంది వీరసైనికులను కోల్పోయిందని అన్నారు. వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు.

అక్కడ అలా... ఇక్కడ ఇలా.. ఎందుకిలా?

అధికారం అందుకోనంత వరకు అన్నాచెల్లెళ్లు ఒక్కటే. పైసలు సంపాదించనంత వరకు అన్నాచెల్లెళ్లు ఒక్కటే.. అధికారం అందుకోన్న తర్వాత ? పైసలు సంపాదించిన తర్వాత? అన్న చెల్లెళ్ల మధ్య ఉన్న బంధం బంద్ అవుతుందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందుకు తెలుగు రాష్ట్రాల్లోని సీఎంల ఫ్యామిలీ వ్యవహారాన్నే వారు సోదాహరణగా చెబుతున్నారు.   ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నంత వరకు ఆయన తన సోదరి వైయస్ షర్మిలతో మంచి అనుబంధమే ఉంది. వైయస్ జగన్ .. 16 మాసాలు జైలులో ఉండగా.. జగనన్న వదిలిన బాణం అంటూ వైయస్ షర్మిల .. పాదయాత్ర చేపట్టి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను చుట్టేశారు. అంతేకాదు... 2019 ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోపాటు ఆమె సోదరుడు వైయస్ జగన్‌ను గెలిపించుకునేందుకు షర్మిల ఎంతగానో ప్రచారం చేయాలో అంతగా ప్రచారం చేశారు.  చంద్రబాబుకు బై బై.. అంటూ జగనన్న గెలుపు కోసం షర్మిల చేసిన ప్రచారం అంతా ఇంతా కాదన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత.. జగనన్న, వైయస్ షర్మిల మధ్య గాప్ బాగా పెరిగింది. దీంతో షర్మిల పక్క రాష్ట్రం తెలంగాణ వచ్చి వైయస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించి.. దీక్షలు, పాదయాత్రలు చేస్తున్నారు. అయితే ఫ్యాన్ పార్టీ అధికారంలోకి వస్తే.. సోదరి షర్మిలకు పదవి ఇస్తానని చెప్పిన జగనన్న ఆ తర్వాత మాట తప్పి మడం తిప్పారని..  దీంతో షర్మిల అలక బూనారని..  ఆ తర్వాత ఆమె మెట్టినింట వైయస్ఆర్ టీపీ పేరిట పార్టీ పెట్టారనే ప్రచారం తాడేపల్లిలో అయితే జోరుగా సాగుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.  మరో పక్క తెలంగాణలో సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్, కుమార్తె కవితమ్మ మధ్య కూడా చాలా గ్యాప్ ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన ఉద్యమంలో ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్‌తోపాటు ఆయన కుమారుడు కేటీఆర్, కుమార్తె కవితమ్మ కూడా చాలా పోరాటం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత కూడా ఈ అన్నా చెల్లెలు మధ్య అనుబంధం బతుకమ్మ పండగలా కళకళలాడింది.  అయితే ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ అన్నా చెల్లెల మధ్య గ్యాప్ చాలా బాగా పెరిగిందని రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. తెలంగాణ సీఎంగా ప్రస్తుతం కేసీఆర్ ఉన్నారు. ఆ తర్వాత పార్టీ పగ్గాలతోపాటు  ముఖ్యమంత్రి పీఠాన్ని తన కుమారుడు కేటీఆర్‌కు కట్టబెట్టాలని సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారని చెబుతున్నారు. ఆ క్రమంలోనే దాదాపు రెండు దశాబ్దాలు అనుబంధం ఉన్న ఈటలను సైతం తన కారులో నుంచి సీఎం కేసీఆర్ దింపేశారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే ఇదే అంశంలో తన కుమార్తె కవితను సైతం కేసీఆర్ పక్కన పెట్టారనే టాక్ కారు పార్టీలో వినబడుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఏడాది కేటీఆర్‌తో కవిత ఎంతో అట్టహాసంగా జరుపుకునే రాఖీ పండగను ఈ ఏడాది కవితమ్మ చెక్ పెట్టిందనే వార్తలు గుప్పుమన్నాయి.   2019 ఎన్నికల్లో నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి కవిత ఓటమి పాలైయ్యారు. ఆ తర్వాత ఆమెకు పదవి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో కేసీఆర్.. ఇంటి ఆడబడుచు అయిన కవితమ్మకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. ఈ పదవి కూడా వచ్చే జనవరి 4వ తేదీతో ముగియనుంది. దాంతో ఆమెకు మళ్లీ ఏ పదవి లేకుండా పోతుంది. తనకు మళ్లీ పదవి కట్టబెట్టాలని సీఎం కేసీఆర్‌ వద్ద కవితమ్మ తెగ పోరు పెడుతున్నట్లు సమాచారం.  టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన రెండు దశాబ్దాలు అయిన సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీని ఘనంగా నిర్వహించింది. అయితే ఈ సభలో ఎక్కడ కవిత ఫోటో లేకపోవడం గమనార్హం. అంతేకాదు.. కవితమ్మ హైదరాబాద్‌లో ఉండి మరీ ఈ ప్లీనరీకి డుమ్మా కొట్టిడంతో కేసీఆర్ ఫ్యామీలీలో గ్యాప్ వార్తలకు బలం చేకూర్చే విధంగా ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.  అంతేకాదు దీనిపై సోషల్ మీడియా సాక్షిగా కల్వకుంట్ల తారకరాముడు, కవితమ్మ మధ్య గ్యాప్ మాములుగా లేదంటూ కారు పార్టీలో కూతలు మొదలైనాయి. ఏదీ ఏమైనా.. ఇటు ఆంధ్రలో అటు తెలంగాణలో గద్దెనెక్కిన పార్టీ అధినేత ఫ్యామిలీలలోని అన్నా చెల్లెళ్ల మధ్య గ్యాప్‌లు బాగా పెరిగాయని దీనిని బట్టే అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

భ‌ట్టి.. కేసీఆర్ కోవర్టా? ఈట‌ల కాంగ్రెస్‌లోకి రాకుండా అడ్డుకున్నారా?

ఈట‌ల రాజేంద‌ర్‌. తెలంగాణ‌లో కేసీఆర్ అంత‌టి స్థాయి ఉన్న ఉద్య‌మ నేత‌. టీఆర్ఎస్‌లో, ప్ర‌భుత్వంలో ఓ వెలుగువెలిగి.. కేసీఆర్ కుట్ర‌ల‌తో గెంటివేయ‌ప‌డిన లీడ‌ర్‌. అలాంటి ఈట‌ల.. పొలిటికల్ జంక్ష‌న్‌లో నిల‌బ‌డితే.. ఏ పార్టీ అయినా ఇట్టే లాగేసుకుంటుంది. మ‌రి, కేసీఆర్‌ను ప‌డ‌గొట్టాలని కాపు కాసి కూర్చున్న‌ కాంగ్రెస్ ఏం చేసింది? ఈట‌ల రాజేంద‌ర్‌ను ఎందుకు అక్కున చేర్చుకోపోయింది? అంటే తెర‌వెనుక చాలా ప‌రిణామాలే జ‌రిగాయ‌ని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ఈట‌ల కాంగ్రెస్‌లోకి తీసుకోకుండా బ‌ల‌మైన శ‌క్తులు అడ్డుప‌డ్డాయ‌ని బ‌య‌ట‌ప‌డింది. కొంద‌రు కీల‌క నేత‌లు కేసీఆర్‌కు కోవ‌ర్టులుగా ప‌ని చేసి.. ఈట‌ల రాజేంద‌ర్‌కు కాంగ్రెస్ కండువా క‌ప్ప‌కుండా అడ్డుకున్న‌ట్టు తెలుస్తోంది. ఢిల్లీ, 10 జ‌న్‌ప‌థ్‌లో జ‌రిగిన వార్ రూమ్ మీటింగ్‌లో ఈ విష‌యం బ‌య‌ట‌ప‌డింది. అస‌లేం జ‌రిగిందంటే.... శ‌నివారం హ‌స్తిన‌లో కాంగ్రెస్ వార్‌రూమ్ మీటింగ్ హాట్‌హాట్‌గా జ‌రిగింది. అందులో, హుజురాబాద్ ఓట‌మిపై ఏఐసీసీ పోస్ట్‌మార్టం జ‌రిపింది. హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట‌మికి మీరంటే మీరు కార‌ణ‌మంటూ నేత‌లు ప‌ర‌స్ప‌రం ఆరోపణ‌లు చేసుకున్నారు. కాంగ్రెస్‌లో ఇలాంటి కుమ్ములాట‌లు కామ‌నే అనుకోండి. ఈ సంద‌ర్భంగా ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ స‌మ‌క్షంలో ఈట‌ల‌పై ఓ కాంగ్రెస్ నాయ‌కుడు చేసిన కుట్ర‌ బ‌ట్ట‌బ‌య‌లైంది. "ఈట‌ల‌ను పార్టీలో చేర్చుకుని ఉంటే బాగుండేది. కాంగ్రెస్‌లోకి ఈట‌ల‌ను రానివ్వ‌కుండా కొంద‌రు అడ్డుకున్నారు" అని సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క ఆరోపించారు. అయితే, ప‌క్క‌నే ఉన్న కేసీ వేణుగోపాల్.. భ‌ట్టి వ్యాఖ్య‌ల‌పై మండిప‌డ్డారు. అదేంటి.. ఈట‌ల‌ను పార్టీలోకి తీసుకోవ‌ద్ద‌ని మీరే క‌దా చెప్పింది.. మ‌ళ్లీ ఇప్పుడు మీరే ఇలాంటి ఆరోప‌ణ‌లు చేస్తున్నారేంటంటూ భ‌ట్టిని నిల‌దీశార‌ట వేణుగోపాల్‌. కంగుతిన్న భ‌ట్టి.. దెబ్బ‌కు నోరు మూశార‌ని అంటున్నారు.  భ‌ట్టి విక్ర‌మార్క‌.. మొదటి నుంచీ సీఎం కేసీఆర్‌తో కాస్త స‌ఖ్య‌త‌గానే మొదులుతున్నారు. సీఎల్పీ లీడ‌ర్‌గా ఉన్నా.. కేసీఆర్ స‌ర్కారును ఇరుకున‌పెట్టేలా వ్య‌వ‌హ‌రించింది ఏమీ లేదంటారు. ఓవైపు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కేసీఆర్‌పై దూకుడుగా దాడి చేస్తున్నా.. ద‌ళిత‌బంధుపై గ‌ట్టిగా నిల‌దీస్తున్నా.. భ‌ట్టి మాత్రం ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించేలా ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు వెళ్లి మ‌రీ స‌మావేశాల్లో పాల్గొన్నారు. అంత‌గా స‌హ‌క‌రిస్తున్నారు కాబ‌ట్టే.. భ‌ట్టి నియోజ‌క‌వ‌ర్గంలోనూ ద‌ళిత‌బంధు పైలెట్ ప్రాజెక్ట్ అమ‌లు చేస్తోంది స‌ర్కారు. ఇక, ఇటీవ‌ల భువ‌న‌గిరి జిల్లాలో ద‌ళిత మ‌హిళ మ‌రియ‌మ్మ లాక‌ప్‌డెత్ విష‌యంలోనూ ప్ర‌భుత్వాన్ని నిల‌దీయ‌కుండా.. కేసీఆర్ పెట్టిన స‌మావేశానికి హాజ‌రై హ్యాండ్స‌ప్ అనేశారు. ఇలా, అనేక విష‌యాల్లో భ‌ట్టి.. టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై సాఫ్ట్ కార్న‌ర్‌తోనే వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అంటారు.  ఇక ఈట‌ల విష‌యంలోనూ భ‌ట్టి విక్ర‌మార్క‌ కావాల‌నే అడ్డుపుల్ల‌ చేశార‌ని చెబుతున్నారు. కేసీఆర్ డైరెక్ష‌న్‌లోనే.. బ‌ల‌మైన నేత‌ ఈట‌ల రాజేంద‌ర్‌, బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్‌లో చేర‌కుండా.. భ‌ట్టి అడ్డుకున్నార‌ని అనుమానిస్తున్నారు. అందుకే, ఏఐసీసీతో ఈట‌ల‌ను పార్టీలో చేర్చుకోవ‌ద్ద‌ని భ‌ట్టి చెప్పార‌ని అంటున్నారు.  అప్పుడు అలా చెప్పి.. ఇప్పుడు ఏఐసీసీ మీటింగ్‌లో ఈట‌ల కాంగ్రెస్‌లో చేర‌కుండా కొంద‌రు అడ్డుకున్నారంటూ అప‌వాదు మ‌రొక‌రిపై తోసేసే ప్ర‌య‌త్నం చేసి అబాసు పాల‌య్యారు. అంద‌రి ముందు భ‌ట్టి దోషిగా నిల‌బ‌డ్డారు.

గ్యాంగ్ రేప్ కేసులో టీమిండియా ప్లేయర్స్?.. సోషల్ మీడియాలో కలకలం..

టీట్వంటీ వరల్డ్ కప్ లో లీగ్ దశలోనే నిష్క్రమించి ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైన టీమిండియాకు మరో షాకింగ్ న్యూస్.  టీమిండియా ఆటగాళ్లపై అత్యాచార ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. టీమిండియా ముగ్గురు క్రికెటర్లు తనపై లైంగిక దాడి చేశారని ముంబై పోలీసులకు ఓ మహిళ ఫిర్యాదు చేసిందన్న వార్త  సంచలనంగా మారింది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు రియాజ్ భాటీ భార్య ఈ ఆరోపణలు చేసింది. డాన్ కు అనుచుడైన రియాజ్ కు మహారాష్ట్రలోని వీఐపీలంతా సుపరిచితులే. రియాజ్ పై అతడి భార్య ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెద్ద పెద్ద వ్యక్తులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని.. తన భర్త రియాజే బలవంతంగా తనను వీఐపీల దగ్గరకు పంపించాడని ఫిర్యాదులో పేర్కొంది. ఆ మహిళ ఫిర్యాదు కాపీ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాను రెండు నెలలుగా కేసు పెట్టాలని వేడుకుంటూ ముంబై పోలీసులు పట్టించుకోవడం లేదని మహిళ ఆరోపించింది. రెహ్నుమా ఫిర్యాదులో క్రికెట్ స్టార్స్ హార్ధిక్ పాండ్యా మునాఫ్ పటేళ్ల పేర్లతో పాటు బీసీసీఐ మాజీ చీఫ్ రాజీవ్ శుక్లా పేరు కూడా ఉండడం సంచలనమైంది. ఈ ముగ్గురి దగ్గరకు తన భర్త రియాజ్ బలవంతంగా పంపించాడన్నది రెహ్నుమా ఆరోపణ. ముంబై ట్రైడెంట్ హోటల్ లో హార్ధిక్ పాండ్యా అతడి స్నేహింతులు, కాంటినెంటెల్ హోటల్ లో మునాఫ్ పటేల్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆ మహిళ చేసిన ఫిర్యాదు కాపీలో ఉంది. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు రాజీవ్ శుక్లా అతడి స్నేహితులు లైంగిక దాడి చేయడంతోపాటు చిత్రవధకు గురిచేశారని ఆ మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఇప్పుడు ఫిర్యాదు దేశంలో సంచలనమైంది. దీనిపై నిజనిజాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ విషయంపై ఇంతవరకూ స్పందించలేదు. 

కర్ణాటక సీఎంను మళ్లీ మారుస్తున్నారా? బిట్ కాయిన్ స్కాం బొమ్మె కొంప ముంచుతుందా?

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పీఠం కదులుతోందా? కోట్ల రూపాయల ‘బిట్ కాయిన్’ కుంభకోణం, ముఖ్యమంత్రి మెడకు చుట్టు కుంటోందా? బీజేపీ అధిష్టానం మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టార్  ను ఢిల్లీకి పిలిచింది అందుకేనా? అంటే కర్ణాటక రాజకీయాలను దగ్గరగా చూస్తున్న రాజకీయ విశ్లేషకులు అవుననే అంటున్నారు.   అయితే ఇటు ముఖ్యమంత్రి బొమ్మై, అటు మాజీ ముఖ్యమంత్రి శెట్టార్ ఇద్దరూ కూడా  ముఖ్యమంత్రి మార్పు, ఉహాగానాలలో నిజం లేదని తేల్చేశారు. మరో వంక, బిట్ కాయిన్’ కుంభకోణం విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ, స్పందించిన తీరు పట్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య తీవ్ర అభ్యంతరం వ్యక్త పరిచారు. ప్రధాని నరేంద్ర మోడీ బిట్ కాయిన్ వ్యవహారంలో విపక్షాల విమర్శలను పట్టించుకోవద్దని ముఖ్యమంత్రికి సూచించారని, ఇది సమంజసమా? అంటూ సిద్ద రామయ్య మండి పడుతున్నారు. అదేమైనా చిన్న చితకా  కుంభకోణమా, వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగినా పట్టించుకోరా అంటూ సిద్దరామయ్య భగ్గుమన్నారు.  “ఈ కుంభ కోణంలో ముఖ్యమంత్రి పాత్ర ప్రమేయం ఉందోలేదో నాకు తెలియదు. కేంద్ర, రాష్ట్ర విచారణ సంస్థలు ఈ కేసును విచారిస్తున్నాయి.. అలాంటి కేసు విషయంలో ముఖ్యమంత్రి కాకపోతే ఎవరు సమాధానం చెపుతారు” అంటూ సిద్హరామయ్య వరస ట్వీట్లు వదులు తున్నారు. ప్రధాని, ముఖ్యమంత్రిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాన్నికూడా సిద్దరామయ్య  వ్యక్త పరిచారు.  అదలా ఉంటే ముఖ్యమంత్రి బొమ్మై, తమ మంత్రి వర్గంలో ఎవరికీ ఈ కుంభకోణంతో సంబంధం లేదని,ఎవరినో కాపాడవలసిన అవసరం తమకు లేదని అన్నారు. అలాగే, తన కుర్చీకి వచ్చిన ముప్పు కూడా లేదని బొమ్మై ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్ నాయకులు ఇది చాలా భారీ కుంభకోణమని, రూ. 2,600 కోట్ల నుంచి రూ.8,000 వరకు చేతులు మారాయని ఆరోపిస్తున్నారు. అయితే, అసలు కుంభకోణం ఏమిటి, అందులో ఎవరి పాత్ర ఏమిటో మాత్రం ఎవరూ చెప్పడం లేదని, ముఖ్యమంత్రి బంతిని కాంగ్రెస్ కోర్టులోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు.   కాంగ్రెస్ నాయకులు, నిరాధారంగా ఆరోపణలు చేయడం కాకుండా  తమ వద్ద ఏదైనా సమాచారం ఉంటే ఇవ్వాలని ఎదురు దాడి చేస్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబందించినంత వరకు ఎనిమిది తొమ్మిది నెలల క్రిందటే, కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీకి అప్పగించడం జరిగింది. సిబిఐకి కూడా రిఫర్ చేయడం జరిగింది. కాబట్టి, ఆరోపణలు చేస్తున్నవారు ఆధారాలను విచారణ సంస్థలకు ఇవ్వాలని, బొమ్మె అన్నారు.   ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి  శెట్టార్, వ్యక్తిగత పని మీద ఢిల్లీవచ్చానే కానీ, కేంద్ర నాయకత్వం పిలుపు మేరకు రాలేదని స్పష్టం చేశారు. అయితే ఇటు రాష్ట్రంలో అటు ఢిల్లీలో మీడియా,రాజకీయ వర్గాల్లో ముఖ్యమంత్రి బొమ్మై మెడకు బిట్ కాయిన్ ఉచ్చు బిగుస్తోందని, ఆయనకు ఉద్వాసన ఖాయమని అంటున్నాయి. అయితే అంతిమంగా ఏమి జరుగుతుందో ఏమో కానీ, ప్రస్తుతానికి అయితే అదొక చిక్క ప్రశ్నగానే ఉందని రాజకీయ్ విశ్లేషకులు అంటున్నారు. నిజంగానే, నాలుగు నెలలు అయినా కాకుండానే, బీజేపీ ముఖ్యమంత్రిని మారుస్తుందా లేదా బిట్ కాయిన్ కుంభకోణం టీ కప్పులో తుపానులా కనుమరుగై  పోతుందా ? చూడవలసి వుందని అంటున్నారు.

చంద్ర‌బాబు బాట‌లోనే కేసీఆర్‌.. ఢిల్లీతో పోరులో ఏం జ‌రుగునో?

సినిమా వాళ్లు హిట్ మూవీని మాత్ర‌మే రీమేక్ చేస్తారు. ఫ్లాప్ షో జోలికి వెళ్లాలంటేనే భ‌య‌ప‌డిపోతారు. రాజ‌కీయాలకు సైతం ఈ సూత్రం వ‌ర్తిస్తుంది. కానీ, సెంటిమెంట్ల‌ను బాగా ఫాలా అయ్యే తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం గ‌తంలో ఫ్లాప్ అయిన స్ట్రాట‌జీనే ఫాలో అవుతుండ‌టం ఆస‌క్తిక‌రం. తాను మోనార్క్‌న‌నే ఫీలింగో.. లేక‌, తాను త‌లుచుకుంటే ఏదైనా సాధ్య‌మ‌నే కాన్ఫిడెన్సో.. కార‌ణం ఏదోగానీ.. ఢిల్లీలో అగ్గి పెడ‌తానంటూ.. గ‌తంలో చంద్ర‌బాబు త‌ర‌హాలోనే కేంద్రంపై పోరాటానికి దిగ‌డం రాజ‌కీయంగా క‌ల‌క‌లం రేపుతోంది. గ‌తంలో చంద్ర‌బాబు ఇదే త‌ర‌హాలో కేంద్రంపై ధ‌ర్మ‌పోరాటం చేసి.. ఫ్లాప్ అయ్యారు. మ‌రి, ఈసారి కేసీఆర్ అయినా ఢిల్లీతో యుద్ధంలో గెలుస్తారా? బీజేపీతో రాజ‌కీయ కురుక్షేత్రంలో పోరాడి నిలుస్తారా?  యాసంగిలో వ‌రి కొనాలంటూ, పెట్రోల్‌, డీజిల్‌పై సెస్‌లు విత్‌డ్రా చేసుకోవాలంటూ.. ఇప్ప‌టికే తెలంగాణ వ్యాప్తంగా ధ‌ర్నాలు చేశారు టీఆర్ఎస్ శ్రేణులు. కేసీఆర్ మిన‌హా.. మిగ‌తా వారంతా ధ‌ర్నాల‌తో అద‌ర‌గొట్టారు. కానీ, కేంద్రం ఏమాత్రం బెద‌రలేదు. త్వ‌ర‌లోనే ఢిల్లీలో ధ‌ర్నాకు రెడీ అవుతున్నారు కేసీఆర్‌. రాష్ట్రం నుంచి మందీమార్బ‌లాన్ని వెంటేసుకొని.. హ‌స్తిన‌లో అల‌జ‌డి సృష్టించాల‌ని చూస్తున్నారు. అచ్చం.. గ‌తంలో చంద్ర‌బాబు చేసిన ధ‌ర్మ పోరాట దీక్ష‌ల మాదిరే.. ప్ర‌స్తుతం కేసీఆర్ సైతం ఢిల్లీలో ధ‌ర్నాల‌కు సిద్ధ‌మ‌వడం ఆస‌క్తిక‌రం.  ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌లేదు కాబ‌ట్టి.. విభ‌జ‌న హామీలు నెర‌వేర్చ‌లేదు కాబ‌ట్టి.. అప్పుడు చంద్ర‌బాబు కేంద్రంపై ధ‌ర్మ పోరాట దీక్ష‌లు చేశారంటే ఓ అర్థం ఉంది. కాక‌పోతే.. దాదాపు నాలుగేళ్లు కేంద్రంలో భాగ‌స్వామిగా ఉండి.. ప‌ద‌వులు అనుభ‌వించి.. చివ‌రి ఏడాది కేంద్రాన్ని దోషిగా చూపించ‌డాన్ని ప్ర‌జ‌లు ఆమోదించ‌న‌ట్టున్నారు. అయితే, చంద్ర‌బాబు దీక్ష‌ల‌కు బ‌ల‌మైన కార‌ణ‌మైతే ఉంది. కేసీఆర్ విష‌యంలో అది కూడా లేదు.  గ‌డిచిన ఏడేళ్లుగా కేంద్రానికి అన్ని విధాలుగా, అన్ని అంశాల్లో మ‌ద్దతు ఇస్తూనే ఉంది టీఆర్ఎస్‌. పార్ల‌మెంట్‌లో అనేక బిల్లుల‌కు స‌పోర్ట్ చేసింది. పెద్ద నోట్ల ర‌ద్దును అంద‌రికంటే ముందు స్వాగ‌తించింది కేసీఆరే. కొవిడ్ టైమ్‌లోనూ మోదీని కీర్తిస్తూ.. చ‌ప్ప‌ట్లు కొట్టారు. కారు-క‌మ‌లం దొందుదొందేన‌ని అంతా అనుకుంటున్నారు. అలాంటిది.. ఇప్పుడు హుజురాబాద్‌లో బీజేపీ గెల‌వ‌గానే కేసీఆర్‌లో భ‌యం జొచ్చిన‌ట్టుంది. అటు, రేవంత్‌రెడ్డితోనూ క‌ల‌వ‌రం పెరిగిపోయింది. దీంతో.. పబ్లిక్ అటెన్ష‌న్ డైవ‌ర్ట్ చేయ‌డానికో.. లేక వ‌రి వివాదాన్ని కేంద్రం మీద‌కు నెట్టివేయ‌డానికో గానీ.. ఢిల్లీలో ధ‌ర్నా చేస్తానంటూ కేసీఆర్ ద‌బాయించి చెబుతున్నా.. జ‌నాలు న‌మ్మే ప‌రిస్థితిలో లేరంటున్నారు. అందుకే బీజేపీ సైతం కేసీఆర్‌ను మ‌రింత రెచ్చ‌గొడుతున్న‌ట్టుంది.  ఇక ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌, ఫోర్త్ ఫ్రంట్ అంటూ గ‌తంలో అనేక క‌బుర్లు చెప్పారు కేసీఆర్‌. అది ఏమాత్రం ముంద‌డుగు ప‌డ‌లేదు. కేసీఆర్‌ను మిగ‌తా పార్టీలు న‌మ్మే ప‌రిస్థితి కూడా లేదు. చంద్ర‌బాబు అంత‌టి నాయ‌కుడే.. మోదీపై ధ‌ర్మ పోరాటం ప్ర‌క‌టించి స‌క్సెస్ కాలేక‌పోయారు. మ‌రి, కేసీఆర్ వ‌ల్ల అవుతుందా?  ఢిల్లీలో ధ‌ర్నాతో హిస్ట‌రీ రిపీట్ అవుతుందా? లేక‌, హిస్ట‌రీ క్రియేట్ చేస్తారా? చూడాలి..

లవర్ కోసం తండ్రిని చంపించిన కూతురు.. హైదరాబాద్ లో కిరాతకం..

హైదరాబాద్ లో దారుణం జరిగింది. తన  లవర్ కోసం కన్న తండ్రిని కిరాతకంగా చంపేసింది కూతురు. ఇందుకు ఆమె లవర్ ఫ్రెండ్స్ సాయం చేశారు. మర్డర్ విషయం తల్లికి తెలిసినా..  ఒక్కతే కూతురు కావడంతో ఆమె  పోలీసులకు ఫిర్యాదు చేయకుండా మౌనంగా ఉండిపోయింది. అయితే పోస్ట్ మార్టమ్ రిపోర్టులో మర్డర్ కేసు బయటపడింది. నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు కుషాయిగూడ పోలీసులు.  కుషాయిగూడ  ఇన్స్పెక్టర్ మన్మోహన్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. కాప్రాలో నివసించె పల్సమ్ రామకృష్ణ అనే తన భార్య, కూతురితో కలిసి నివసిస్తూ గ్యాస్ ఏజెన్సీలో వర్కర్గా పనిచేస్తుండే వాడు. అయితే వీళ్లు ఇంతముందు నారాయణకూడలో నివసిస్తుండేవారు. నారాయణగూడలో నివసించె సమయంలో వాచ్మెన్ కొడుకుతో తన కూతురు సన్నిహితంగా ఉండడం గమనించాడు రామకృష్ణ. రామకృష్ణ కూతురు వాచ్మెన్ కొడుకు భూపాల్కి తన ఇంటి అల్మారాలో ఉన్న డబ్బును ఇచ్చింది. ఆ డబ్బుతో అతను బైక్, కెమేరా, డ్రస్లు కొనుకున్నాడు. విషయం తెలుసుకున్న రామకృష్ణ.. భూపాల్ కు వార్నింగ్ ఇచ్చాడు. అయినా భూపాల్ మారకుండా ఉండడంతో మైనర్ అయిన తన కూతురిపట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని నారాయణగూడ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. దానితో పోక్సో ఆక్ట్ కింద నిందితుడు భూపాల్ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.  ఈ ఏడాది జులైలో జైలు నుండి విడుదలైన భూపాల్ బుద్దిమార్చుకోకుండా ఆమెను మళ్లీ కలవడం మొదలు పెట్టాడు. తన ఫ్రెండ్స్తో కలిసి ఓ ప్లాన్ వేశాడు.   జూలై 19న సాయంత్రం రామకృష్ణ ఇంటి సమీపానికి వెళ్లి స్లీపింగ్ పౌడర్ రామకృష్ణ కూతురికి ఇచ్చాడు. దానిని ఆమె వారు తింటున్న చికెన్ కర్రీలో కలిపింది. అది రామకృష్ణ, తల్లి, అన్న తిని నిద్రలోకి జారుకున్నారు. అర్థరాత్రి 1 గంటల సమయంలో భూపాల్తో పాటు అతని ముగ్గురు ఫ్రెండ్స్ ఇంటిలోకి వచ్చారు. భూపాల్ అతని ఫ్రెండ్ గణేష్లు నిద్రపోతున్న రామకృష్ణ బ్లాంకెట్తో నోరు మూసి, గొంతుపై కత్తితో దాడి చేశారు. అలజడి కావడంతో రామకృష్ణ భార్య, కొడుకు లేచి చూశారు. అప్పటికే అపస్మారక స్థతిలో ఉన్న రామకృష్ణను హాస్పిటల్ తరలించారు. పరిశీలించిన డాక్టర్లు అప్పటికే చనిపోయాడని చెప్పారు. బాధితురాలి ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించి పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్కి తరలించారు. అయితే పోస్ట్మార్టం రిపోర్ట్లో రామకృష్ణ ప్రమాదవశాత్తు చనిపోలేదని, ఎవరో కావాలనే హత్య చేసి చంపారని రిపోర్ట్ వచ్చింది. దీంతో బాధితురాలిని పిలిచి పోలీసులు విచారించగా అసలు నిజం బయటపడింది, తనకున్న ఒక్కగాను ఒక్క కూతురిని కాపాడుకోడానికి అలా చెప్పిందని జరిగిన ఘటన పూర్తి వివరాలు పోలీసులకు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదుమేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు రామకృష్ణ కూతురుతో  ప్రధాన నిందితుడు భూపాల్, అతని నలుగురు స్నేహితులను అరెస్ట్ చేశారు. 

తెలంగాణ కాంగ్రెస్ లో రచ్చరచ్చ.. ఢిల్లీ వార్ రూమ్ లో సీనియర్ల  ఫైటింగ్

హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితంతో తెలంగాణ కాంగ్రెస్ లో మొదలైన రచ్చ మరింత ముదురుతోంది. కొంత కాలంగా సీనియర్ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి వల్లే హుజురాబాద్ లో పార్టీకి డిపాజిట్ రాలేదని కొందరు సీనియర్లు ఆరోపించారు. ఈటల రాజేందర్ కు రేవంత్ రెడ్డి అమ్ముడుపోయారని మరికొందరు వ్యాఖ్యానించారు. తమపై వస్తున్న ఆరోపణలపై రేవంత్ రెడ్డి టీమ్ మాత్రం సైలెంట్ గానే ఉండిపోయింది.   తాజాగా ఢిల్లీలో టీకాంగ్రెస్ నేతల వర్గపోరు బయటపడింది. హుజురాబాద్ ఫలితంపై పోస్ట్ మార్టమ్ నిర్వహించేందుకు కాంగ్రెస్ హైకమాండ్.. తెలంగాణ పీసీసీ నేతలను ఢిల్లీకి పిలిపించింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పార్టీ ముఖ్య నేతలంతా హస్తిన వెళ్లారు. ఈ సందర్భంగా ఏఐసీసీ వార్ రూమ్ లో జరిగిన భేటీ రచ్చరచ్చగా మారిందని తెలుస్తోంది. రాహుల్ గాంధీ సన్నిహితుడు కేకే వేణుగోపాల్ సమక్షంలో జరిగిన సమావేశంలో  పీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై.. కరీంనగర్ మాజీ  ఎంపీ పొన్నం ప్రభాకర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. సమన్వయ లోపమే పార్టీ ఘోర ఓటమికి కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పనిచేసిన ఇద్దరు పీసీసీ అధ్యక్షులు కే కేశవరావు, డీ శ్రీనివాస్‌లు రాజ్యసభ సభ్యులయ్యేందుకు కాంగ్రెస్‌ పార్టీని మోసం చేశారని ధ్వజమెత్తారు.  ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన  సోదరుడు కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ ఇప్పించుకున్నారంటూ పొన్నం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే కొనసాగితే, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొందరు నాయకులు అడ్డుతగలడంతో దమ్ముంటే పార్టీ నుంచి తనను సస్పెండ్‌చేయాలంటూ పొన్నం సవాల్‌ విసిరారు. ఉపఎన్నిక ఇన్‌చార్జ్‌గా తనను బాధ్యుడిని చేసే విమర్శలు అర్థరహితం అంటూ పొన్నం ప్రభాకర్‌ మండిపడ్డారు.

జయహో భారత్ బయోటిక్.. కొవాగ్జిన్‌ కు లాన్సెట్‌ జర్నల్‌ కితాబు ..

“భారత్‌ బయోటెక్‌ సంస్థ తయారుచేసిన కోవాగ్జిన్‌ కోవిడ్‌ టీకా అత్యంత సమర్థంగా పని చేస్తుంది. పూర్తిగా సురక్షితమైనది” ఇది లాన్సెట్‌ జర్నల్‌ తాజా నివేదిక సారాంశం ఇది. లాన్సెట్‌ జర్నల్‌’ సైన్సు పేరు చెప్పుకుని అశాస్త్రీయ సమాచారాన్ని అందించి సొమ్ములు చేసుకునే మరో మామూలు చెత్త పత్రిక కాదు. వైద్య ప్రపంచం, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైద్యులు, వైద్య శాస్త్ర వేత్తలు సంపూర్ణంగా విశ్వసించే విశేష వైద్య పత్రిక (మెడికల్ జర్నల్) లాన్సెట్‌ జర్నల్‌.   ఇంగ్లాండ్ లో 1823 లో మొదలైన లాన్సెట్‌ జర్నల్‌’ ఇంచుమించుగా 200 సంవత్సరాలుగా ప్రపంచ  వైద్య శాస్త్ర రంగంలో జరిగిన పరిశోధనలు, అవిష్కరణలకు వేదికగా నిలిచిన జర్నల్, లాన్సెట్‌ జర్నల్‌. శాస్త్ర పరిశోధనలకు,శాస్త్ర వేత్తలకు తలమానికంగా నిలిచిన పత్రిక  లాన్సెట్‌ జర్నల్‌. ఈ పత్రికలో వచ్చిన ప్రతి పరిశోధనా వ్యాసం, ప్రతి వ్యాసంలోని ప్రతి అక్షరం నూటికి రెండువందల పాళ్ళు విశ్వశించ వచ్చనే విశ్వాసాన్ని పత్రిక సొంతం చేసుకుంది. అంతే కాదు, ఈ నివేదికపై ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) డైరెక్టర్‌ బలరాం భార్గవ్‌ హర్షం వ్యక్తం చేశారు.  లాన్సెట్‌ జర్నల్‌’ కోవాగ్జిన్‌ కోవిడ్‌ టీకాకు సంబందించి ఇంకా అనేక విషయాలను, విశేషాలను కూడా ఇచ్చింది. కోవాగ్జిన్‌ కోవిడ్‌ టీకా రెండు డోసులు తీసుకున్న వారిలో ఈ వ్యాక్సిన్‌ 77.8 శాతం సామర్థ్యంతో పని చేస్తోందని తెలిపింది. వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్న 2 వారాల్లో యాంటీబాడీలు సమృద్ధిగా వచ్చాయని, దుష్ప్రభావాలు కనబడలేదంది. కోవాగ్జిన్‌ తీసుకుంటే కరోనా తీవ్రంగా సోకకుండా 93.4%, సాధారణంగా సోకకుండా 77.8%తో పని చేస్తోందని తెలిపింది. డెల్టా వేరియెంట్‌ నుంచి 65.2% సామర్థ్యంతో రక్షణ కల్పిస్తోందని పేర్కొంది. టీకా ఇచ్చిన వారంలో తలనొప్పి, అలసట, జ్వరం, ఇంజెక్షన్‌ ఇచ్చిన చోట నొప్పి తప్ప ఎలాంటి రియాక్షన్లు లేవని స్పష్టం చేసింది. గత ఏడాది నవంబర్‌ 16 నుంచి ఈ ఏడాది మే 17 వరకు మూడోదశ ప్రయోగాలు జరిగాయి. భారత్‌లోని 25 ఆస్పత్రుల్లో 18–97 ఏళ్ల 16,973 మందికి టీకాను ప్రయోగాత్మకంగా ఇచ్చారు. టీకా తీసుకున్న తర్వాత కరోనా సోకిన వారు ఆస్పత్రి పాలవడం, మరణించడం జరగలేదని లాన్సెట్‌ జర్నల్‌ తెలిపింది. ఈ నివేదికపై ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) డైరెక్టర్‌ బలరాం భార్గవ్‌ హర్షం వ్యక్తం చేశారు. అయితే  ఇక్కడ అసలు విషయం ఏమంటే, కోవాగ్జిన్‌ గురించి మనదేశంలో చాలా చాలా దుష్ప్రచారం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ వ్యతిరేక రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు, అదే కోవకు చెందిన జాతీయ స్థాయి పత్రికలు, మీడియా సంస్థలు కోవాగ్జిన్‌ అభివృద్ధి చేసిన భారత్‌ బయోటెక్‌ సంస్థకు రాజకీయాలను అంట గట్టాయి. తెలుగు రాష్ట్రాలకు  గర్వకారణంగా నిలిచిన భారత్‌ బయోటెక్‌ సంస్థకు స్థానిక పత్రికలు కులం రంగు పులిమి అబాసుపాలు చేసే ప్రయత్నం చేశాయి. పద్మభూషణ్ శేఖర్ గుప్తా (ది ప్రింట్ సంపాదకులు)  అంతటి ప్రముఖ జర్నలిస్ట్ సహా ఇతర జర్నలిస్టులు కోవాక్సిన్ టీకా, అశాస్త్రీయం అనే అసత్య ప్రచారం చేసిన సంగతి తెలిసిందే..దేనిపై జాతీయ స్థాయిలో తీవ్ర చర్చ, దుమారం చెలరేగింది.  భారత్‌ బయోటెక్‌ చైర్మన్‌ కృష్ణ ఎల్లా అన్నట్లుగా, ప్రధాని మోడీ టీకా తీసుకోగానే, కొందరు రాజకీయ నాయకులు, కోవాగ్జిన్‌ కు కొత్త పేరు పెట్టారు. మోడీ వాక్సిన్, బీజేపీ వాక్సిన్ అంటూ దుష్ర్సచారం చేశారు. ఇంకో ఇంకో విషయంలో మీడియా అమ్ముడు పోయినా, రాజకీయ విశ్వాసాల ప్రాతిపదికిన మోడీ వ్యతిరేకతతో అసత్యాలను,అర్థ సత్యాలను ప్రసారం, ప్రచారం చేసినా అదో రకం, కానీ, కోవిడ్’తో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న సమయంలో కూడా మీడియా ‘కోవాగ్జిన్‌’ వినియోగ అనుమతికి ఆటంకాలు కలిగించే విధంగా అడ్డు పుల్లలు వేసిన తీరు పట్ల వైద్య ప్రపంచం విస్మయం వ్యక్తప్రుస్తోంది. ఇది అత్యంత దుర్మార్గం, జర్నలిజం విలువలకు తిలోదాకలు ఇవ్వడమే అవుతుందని అంటున్నారు.  పత్రికలు, మీడియా పోషించిన పాత్ర కారణంగా కోవాగ్జిన్‌’కు అనుమతి ఆలస్యం అయింది. ఫలితంగా  సకాలంలో వాక్సిన్ అందక, అనేక మంది ప్రాణాలు కోల్పోయారు, అనే ఆవేదన శాస్త్ర వేత్తలు వ్యక్త పరుస్తున్నారు.  ఈ నేపద్యంలో,  భారత్‌ బయోటెక్‌ చైర్మన్‌ కృష్ణ ఎల్లా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మెడికల్‌ జర్నల్‌లో కోవాగ్జిన్‌ ఫలితాలు వచ్చాయంటే అదెంత సమర్థంగా పని చేస్తోందో అర్థమవుతుందన్నారు. కోవాగ్జిన్‌పై లాన్సెట్‌ నిపుణుల పరిశోధనల్లో తేలిన అంశాలు టీకా అభివృద్ధిలో తమ చిత్తశుద్ధిని, డేటా ఇవ్వడంలో పారదర్శకతను వెల్లడిస్తోందని అన్నారు. కాగా లాన్సెట్‌ జర్నల్‌ ఈ నివేదిక ప్రాథమికమైనదని, మరింత డేటా వచ్చాక పూర్తి నివేదిక ప్రచురిస్తామని వివరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవాగ్జిన్‌ అత్యవసర వినియోగానికి ఇటీవల అనుమతులిచ్చిన విషయం తెలిసిందే.

కేంద్రంతో పోరాటం ఉత్తదేనా.. జగన్ తో వైరమా? కేసీఆర్ తిరుపతికి ఎందుకెళ్లరు?  

ఈనెల 14న తిరుపతి దక్షిణాది రాష్ట్రాల సదరన్ కౌన్సిల్ సమావేశం జరగబోతోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరగనున్న సమావేశంలో  ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ రాష్ట్రాల అధికార ప్రతినిధులు పాల్గొననున్నారు. సదరన్ కౌన్సిల్ సమావేశం రాష్ట్రాలకు అత్యంత కీలకం. తమ రాష్ట్ర సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లే వేదిక. అందుకే సదరన్ కౌన్సిల్ సమావేశాలకు అయా రాష్ట్రాల తరపున ముఖ్యమంత్రులే హాజరవుతుంటారు. కాని తిరుపతిలో జరగనున్న సమావేశానికి తెలంగాణ సీఎం కేసీఆర్ డుమ్మా కొడుతున్నారు. పక్క రాష్ట్రంలోనే జరుగుతున్న కీలక భేటీకి కేసీఆర్ ఎందుకు హాజరుకావడం లేదన్నది ఇప్పుడు చర్చగా మారింది.  తెలంగాణ రాజకీయాలన్ని ప్రస్తుతం వరి ధాన్యం కొనుగోళ్ల చుట్టే తిరుగుతున్నాయి. ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ, టీఆర్ఎస్ మధ్య యుద్ధమే సాగుతోంది. రైతులకు కేసీఆర్ సర్కార్ రోడ్డున పడేసిందని, ధాన్యం కొనకుండా మోసం చేస్తుందని కమలం నేతలు ఆరోపిస్తున్నారు. సీఎం కేసీఆర్ మాత్రం కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్నారు. ధాన్యం కొనలేమని కేంద్రం చెప్పిందని చెబుతున్నా గులాబీ బాస్.. పంజాబ్ ధాన్యం కొంటూ తెలంగాణపై వివక్ష చూపిస్తోందని మండిపడుతున్నారు. అంతేకాదు కేంద్రంపై యుద్ధం ప్రకటించారు. రాష్ట్రంలో నిరసనలకు పిలుపిచ్చారు. అధికార పార్టీగా ఉండిగా కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు రోడ్డెక్కి నిరసన తెలిపారు.  కేంద్ర సర్కార్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కేసీఆర్ కు పోరాటం చేసేందుకు తిరుపతి సమావేశం మంచి వేదిక. అమిత్ షా సమావేశంలో రాష్ట్ర సమస్యలను ప్రస్తావించవచ్చు. రాష్ట్ర రైతుల సమస్యలను తెలుపవచ్చు. కాని కేసీఆర్ మాత్రం కీలక సమావేశానికి డుమ్మా కొడుతున్నారు. ఇదే ఇప్పుడు చర్చగా మారింది. ప్రెస్ మీట్లలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన కేసీఆర్... అమిత్ షా సమావేశానికి వెళ్లి ఎందుకు నిలదీయడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంపై పోరాడుతున్నామని కేసీఆర్ చెప్పేదంతా ఉత్తదేనని, బీజేరీ-టీఆర్ఎస్ పార్టీలు పరస్పర సహకారంతోనే ముందుకు పోతున్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై అన్నదాతలకు అన్యాయం చేస్తున్నామని మండిపడుతున్నారు. మరోవైపు కొన్ని రోజులుగా ఏపీ, తెలంగాణ మంత్రుల మధ్య మాటల యుద్దం సాగుతోంది. తెలంగాణ మంత్రులు జగన్ ను టార్గెట్ చేస్తుండగా... ఏపీ మంత్రులు కేసీఆర్ కేంద్రంగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీంతో ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య విభేదాలు వచ్చాయనే చర్చ జరుగుతోంది. అందుకే కేసీఆర్ తిరుపతి వెళ్లడం లేదని కూడా కొందరు చెబుతున్నారు. మొత్తంగా అమిత్ షా అధ్యక్షతన జరిగే సదరన్ కౌన్సిల్ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లకపోవడం రాజకీయ వర్గాల్లో పలు రకాల చర్చలకు కారణమైంది. 

లోకేశ్‌ టార్గెట్‌గా ఎమ్మెల్సీ స్కెచ్‌.. మంగ‌ళ‌గిరిపై జ‌గ‌న్ స్పెష‌ల్ ఫోక‌స్‌..

నిన్న‌కాక మొన్న వైసీపీలో చేరారు. అంత‌లోనే అడ‌క్క‌ముందే ఎమ్మెల్సీ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టేస్తున్నారు. మంగ‌ళ‌గిరిలో బ‌ల‌మైన నేత‌గా గుర్తింపు పొందిన మురుగుడు హ‌నుమంత‌రావుతో నారా లోకేశ్‌ను టార్గెట్ చేసేలా స్కెచ్ వేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ ఓట్ల‌ను చీల్చాల‌నేది జ‌గ‌న్ ప్లాన్‌ అంటున్నారు. ఆ మేర‌కు మురుగుడును ఎమ్మెల్సీగా మంగ‌ళ‌గిరి ప్ర‌జ‌లు ముందుంచుతున్నారు. ఇంత‌కీ జ‌గ‌న్‌రెడ్డికి మంగ‌ళ‌గిరి అంటే ఎందుకంత భ‌యం ప‌ట్టుకుంది?  నారా వారి అబ్బాయి గెలుపును అడ్డుకోవ‌డం వైసీపీ వ‌ల్ల అవుతుందా? ఓడిన చోటే గెలిచి చూపిస్తానంటూ ఇటీవ‌ల స‌వాల్ చేశారు నారా లోకేశ్‌. మంగ‌ళ‌గిరి టీడీపీ కార్యాల‌యంపై వైసీపీ మూక‌ల విధ్వంస‌కాండ‌కు నిర‌స‌న‌గా చంద్ర‌బాబు చేప‌ట్టిన‌ 72 గంట‌ల దీక్ష‌లో నారా లోకేశ్ మాట్లాడుతూ.. తాను మ‌రోసారి మంగ‌ళ‌గిరి నుంచే పోటీ చేస్తానంటూ ప్ర‌క‌టించారు. తొలి విజయం ఇక్కడ నుంచే గెలిచి తన తండ్రికి కానుక ఇస్తానన్నారు.  ఈ స్టేట్‌మెంట్ వైసీపీ శ్రేణుల్లో ప్ర‌కంప‌ణ‌లు సృష్టిస్తోంది. రాజ‌ధానిని మూడు ముక్క‌లు చేసి.. అమ‌రావ‌తిని అట‌కెక్కించేసిన జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వంపై ఇక్క‌డి ప్ర‌జ‌లు క‌డుపుమంట‌తో ర‌గిలిపోతున్నారు. అమ‌రావ‌తి కోసం దీక్ష‌లు, ధ‌ర్నాలు, పాద‌యాత్ర చేస్తున్నా స‌ర్కారు తీరు మార‌డం లేద‌ని మండిప‌డుతున్నారు. ఈ కోప‌మంతా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓట్ల రూపంలో చూపించనున్నారు. మంగ‌ళ‌గిరిలో ఈసారి నారా లోకేశ్ విజ‌యాన్ని ఏ శ‌క్తి ఆప‌లేదంటున్నారు. అందుకే, లోకేశ్ తాను మంగ‌ళ‌గిరి నుంచి పోటీ చేస్తాన‌ని చెప్ప‌గానే.. అధికార పార్టీలో అల‌జ‌డి చెల‌రేగింది. లోకేశ్‌ను అడ్డుకునేందుకు ఇప్ప‌టి నుంచే అస్త్ర‌శ‌స్త్రాలు సంధిస్తోంది. ఎమ్మెల్సీ రూపంలో లోకేశ్‌పైకి మాజీమంత్రి మురుగుడు హనుమంతరావును ప్ర‌యోగిస్తోంది వైసీపీ.  హ‌నుమంత‌రావు బ‌ల‌మైన నాయ‌కుడే. 1987నుంచి 1992 వరకు మంగళగిరి మునిసిపల్‌ చైర్మన్‌గా పనిచేశారు. ఆ తరువాత 2000వ సంవత్సరం నుంచి 2009 వరకు వరుసగా రెండు సార్లు మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. కేబినెట్‌ మంత్రిగా కూడా చేశారు. 2013 నుంచి 2015 వరకు ఆప్కో చైర్మన్‌గా కొనసాగారు. ఆరేళ్ల విరామం తరువాత మ‌ళ్లీ ఇప్పుడు హ‌నుమంత‌రావుకు ఎమ్మెల్సీ పదవి ద‌క్క‌డం అనూహ్య‌మ‌నే చెప్పాలి. ఇదంతా మంగ‌ళ‌గిరిలో నారా లోకేశ్‌ను అడ్డుకునే వ్యూహ‌నే అని చెబుతున్నారు.  ప్ర‌స్తుత మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల‌ రామకృష్ణారెడ్డిపై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఉంది. ఈసారి ఆయ‌న గెలుపు క‌ష్ట‌మేన‌ని అంటున్నారు. అందుకే, పార్టీ పెద్ద‌లు రంగంలోకి దిగి.. మంగ‌ళ‌గిరిపై స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టారు. నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ద్మ‌శాలి సామాజిక వ‌ర్గానికి చెందిన ఓట్లు అధికంగా ఉంటాయి. అందుకే, ఆ వ‌ర్గానికి చెందిన మ‌నుమంత‌రావును హ‌డావుడిగా పార్టీలో చేర్చేసుకొని.. ఆయ‌న అడ‌గ‌క‌ముందే ఎమ్మెల్సీ అభ్య‌ర్థిని చేసేశారు. మురుగుడుకు ఎమ్మెల్సీ ఇవ్వ‌టం ద్వారా ప‌ద్మ‌శాలీల ఓట్లు తమ వైపునకు తిప్పుకునేలా స్కెచ్ వేశారు.  కానీ, అమ‌రావ‌తిని జ‌గ‌న్ చేసిన ద్రోహం ముందు... ఈ కులాలు, వ‌ర్గాల ఎత్తుగ‌డ‌లు ఏ మేర‌కు ప్ర‌భావం చూపిస్తాయి? మంగ‌ళ‌గిరిలో ఈసారి నారా లోకేశ్ గెలుపును ఆప‌త‌ర‌మా?

దిగొచ్చిన జగన్.. ఒక్క డీఏ రాలే.. కేసీఆర్ కు రైతులు ఉసురు.. టాప్ న్యూస్@ 1PM

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. ఎయిడెడ్ విద్యాసంస్థలపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 35, 42, 51 జీవోలనుఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల ఆందోళనతో వెనక్కి తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం 4 ఆప్షన్లతో మెమో ఇచ్చిందన్నారు. ఈ మెమో వల్ల విద్యార్థులకు, యాజమాన్యాలకు మధ్య వివాదం తలెత్తే పరిస్థితి ఉందని తెలిపారు. ఎడిట్ విద్యాసంస్థల విలీన ప్రక్రియ వల్ల పేద, మధ్య తరగతి వర్గాల విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్నారు.  -------- వైసీపీ ప్రభుత్వం వచ్చాకా ఒక్క డీఏ కూడా రాలేదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. పీఆర్సీ నివేదిక కూడా తమకు ఇవ్వలేదన్నారు. తాము అధికారంలోకి వస్తే వారంలోనే సీపీఎస్ రద్దు అన్నారని... ఇప్పటికీ రద్దు కాలేదన్నారు. కమిటీలు కాలయపనకే గానీ.. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కోసం కాదన్నారు. పీఆర్సీ నివేదికపై అధికారుల కమిటీ పరిశీలనపై తమకు నమ్మకం లేదన్నారు బోప్పరాజు.  -------- తెలంగాణ సీఎం కేసీఆర్, వారి మంత్రి వర్గం ఏపీపై అవాకులు, చవాకులు మాట్లాడటం మంచి పద్ధతి కాదని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. చంద్రబాబుకు ముణి శాపం ఉంది నిజం మాట్లాడితే తల వేయి ముక్కలవుతుందని  గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి చెప్పారని తెలిపారు. చంద్రబాబు అధికారంలో ఉంటే ఒకలా మాట్లాడుతారని, అధికారంలో లేకపోతే ఇంకోలా మాట్లాడుతారని విమర్శించారు. కుప్పం నియోజకవర్గంలో వైఎస్ఆర్ జగన్ మోహన్ రెడ్డి విజయం సాధిస్తారని స్పష్టం చేశారు.  --------- కర్నూలు జిల్లా  చాగలమర్రి మండలంలో దారుణం జరిగింది. ఇద్దరు బాలికలపై చర్చి పాస్టర్ ప్రసన్న కుమార్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విషయం తెలిసిన తల్లిదండ్రులు పాస్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయం బయటకు రాకుండా మధ్యవర్తుల ద్వారా పాస్టర్ పంచాయతీ నిర్వహించాడు. కాగా విషయం తెలిసిన పోలీసులు పాస్టర్‌ను అరెస్ట్ చేశారు.  లైంగిక వేధింపులకు పాల్పడిన పాస్టర్ ప్రసన్న కుమార్‌పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.  -------- కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి శ్రీ భువనేశ్వరీ పీఠం నూతన పీఠాధిపతిగా శ్రీ శ్రీశ్రీ కామలానంద భారతీ స్వామి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఉంగుటూరు మండలం ఆత్కూరులో స్వర్ణ భారత్ ట్రస్ట్‌లో స్వామి కమలానంద భారతీ స్వామికి పట్టాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుర్తాళం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సిద్దేశ్వరానందభారతీ స్వామి  ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  వివిధ పీఠాధిపతులు, బ్రాహ్మణ సంఘ నేతలు, భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు.  --------- ఆరోగ్యశాఖను బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. శనివారం నీలోఫర్‌ ఆస్పత్రిలో 100 పడకల ఐసీయూ వార్డును మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ కరోనా సెకండ్‌ వేవ్‌ తర్వాత ఆస్పత్రులను బలోపేతం చేశామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు రూ.18 కోట్లు అందించామని చెప్పారు. రూ.10 వేల కోట్లు కేటాయించి ఆరోగ్యశాఖను అభివృద్ధి చేశామని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు మరింత విశ్వాసం పెంచాలన్నారు. ------ మూడు నల్ల చట్టాలకు కారణమే కాంగ్రెస్ అని.... దాన్ని ఇప్పుడు మోడీ అమలు చేస్తున్నారని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఖర్మ కాలి అది ఇప్పుడు మోడీ మెడకు చుట్టుకుందని తెలిపారు. చట్టాలకు  కాంగ్రెస్ పార్టీనే ఆద్యులని బీజేపీ ఎదురు దాడి చేయొచ్చన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిందని గుర్తుచేశారు. బీజేపీ నేతలకు అధ్యయనం చేసే తెలివి లేదని విమర్శించారు.  ------- హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాలపై శనివారం ఏఐసీసీ సమీక్ష సమావేశం నిర్వహించింది. ఢిల్లీ వార్ రూమ్‌లో టీకాంగ్రెస్ నేతలతో కేసీ వేణుగోపాల్ సమీక్ష చేపట్టారు. టీ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాసన్, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌తో రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, మధుయాష్కీ, షబ్బీర్‌ అలీ, శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, వి.హనుమంతరావు, సీతక్క సమావేశానికి హాజరయ్యారు.  -------- మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రవి మృతి చెందారు. బాణం బాంబులను పరిశీలిస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. మావోయిస్టు కేంద్ర కమిటీలో టెక్ టీంకు రవి సభ్యులుగా ఉన్నారు. రవి చనిపోయిన సంవత్సరన్నర తర్వాత విషయాన్ని మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటించింది. జార్ఖండ్‌లోని మారుమూల ప్రాంతంలో రవి మృతి చెందినట్లు మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటించింది. టెక్నికల్ టీమ్‌లో కీలక సభ్యుడిగా రవి కొనసాగారు. ---- ప్రపంచంలోని టాప్ టెన్ వాయు కాలుష్య నగరాల జాబితాలో భారతదేశంలోని మూడు నగరాలు చేరాయి. శనివారం దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వాయు కాలుష్యం గణనీయంగా పెరిగింది.శనివారం ఢిల్లీలో గాలి నాణ్యత 556 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వద్ద (ఏక్యూఐ) నమోదైంది. నోయిడాలో 405 ఏక్యూఐ, ఘజియాబాద్ లో 427ఏక్యూఐ వద్ద ఉంది. 

జగనన్న స్పెషల్..  అసెంబ్లీ మళ్లీ ఒకరోజే!

ఆంధ్రప్రదేశ్ లో అన్ని ప్రత్యేకతలే. జగన్ రెడ్డి పాలనలో ఏపీలో జరుగుతున్న పరిణామాలన్ని స్పెషల్ గానే ఉంటున్నాయి. రివర్స్ టెండరింగ్ మొదలు అప్పులు, విలీనాలు.. ఇలా అన్నిఏపీలో మాత్రమే కనిపిస్తున్నాయి. పాలనే కాదు అసెంబ్లీ సమావేశాల నిర్వహణలోనూ జగన్ సర్కార్ స్పెషల్ గా నిలుస్తోంది. కేవలం ఒక్కటంటే ఒక్క రోజే అసెంబ్లీ నిర్వహిస్తూ తన స్పెషల్ మార్క్ గా నిరూపించుకుంటోంది. ఈనెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేస్తోంది. వారం రోజుల వరకూ నిర్వహిస్తామన్న సంకేతాలను పంపింది. అయితే అది ఉత్తుత్తినే అనే తేలిపోయింది. అసెంబ్లీ ఒక్క రోజు మాత్రమే. ఈ నెల పద్దెనిమిదో తేదీన అసెంబ్లీ సమావేశం ఉంటుంది. ఒక్క రోజు మాత్రమే నిర్వహించి వాయిదా వేస్తారు. మళ్లీ వచ్చే నెలలో వారం, పది రోజుల పాటు నిర్వహిస్తామన్న లీక్‌ను మాత్రం మీడియాకు ఇస్తోంది. 17వ తేదీన కేబినెట్ భేటీ ఉంది. ఆ రోజున ఒక్క రోజులో ఏం చేయాలో ఖరారు చేస్తారు.  ఒక్క రోజు సమావేశం పెట్టడానికి బలమైన కారణం ఉంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆరు నెలల్లో ఒక సారి అసెంబ్లీ తప్పనిసరిగా సమావేశం కావాల్సి ఉంటుంది. లేకపోతే రాజ్యాంగ సంక్షోభం వస్తుంది. చివరి సారిగా మే 20వ తేదీన ఒక్కటంటే ఒక్క రోజు మాత్రమే సభను నిర్వహించి బడ్జెట్ పెట్టుకుని ఆమోదించుకుని వాయిదా వేశారు. ఆ ఒక్క రోజు సమావేశానికి టీడీపీ హాజరు కాలేదు. నవంబర్ 20వ తేదీకి ఆరు నెలలు పూర్తయిపోతుంది. అంటే ఖచ్చితంగా 20వ తేదీ కంటే ముందే అసెంబ్లీని సమావేశపర్చాలి. అందుకే ఈ ఒక్కరోజు సమావేశం అన్నమాట.  ఏపీ ప్రభుత్వం ఇంత వరకూ వర్షా కాల సమావేశాలను నిర్వహించలేదు. తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల్లోనూ నిర్వహించేశారు. ఈ ఏడాది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను కూడా ఒక్కటంటే ఒక్క రోజు నిర్వహించిన ఘనత ప్రభుత్వానిది. గత మార్చిలో బడ్జెట్ పెట్టాల్సి ఉన్నప్పటికీ వాయిదా వేసుకున్నారు. మొత్తానికి పాలనలో దేశంలో అన్ని రాష్ట్రాలకు భిన్నంగా వెళుతున్న జగన్ సర్కార్.. ఒక్క రోజు అసెంబ్లీ నిర్వహణతోనూ తన స్పెషాలిటీ చూపిస్తుందనే సెటైర్లు వస్తున్నాయి. 

మా డ‌బ్బులు మాకివ్వ‌రా?.. ఉద్యోగుల తిరుగుబాటు.. సీఎం జ‌గ‌న్‌కు డెడ్‌లైన్‌

జ‌గ‌న్ స‌ర్కారును ఏపీ ఉద్యోగ సంఘాలు కుమ్మేశాయి. ఇన్నాళ్లూ ప్ర‌భుత్వంపై సాఫ్ట్‌ వైఖ‌రితో ఉన్నా.. ఎంతగా వేడుకున్నా.. పీఆర్సీ ఇవ్వ‌క‌పోవ‌డంతో ఉద్యోగులు ఒక్క‌సారిగా గుర్రుమ‌న్నారు. స‌చివాల‌యం ముందు బైఠాయింపు.. క‌మిటీ మీటింగ్ బైకాట్‌తో హీట్ పెంచేశారు. తాజాగా మీడియా సమావేశం పెట్టి.. జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వంపై ఓ రేంజ్‌లో మండిప‌డ్డారు. ఏపీలో మూడేళ్లలో ఉద్యోగుల సమస్యలు ఏ ఒక్కటీ పరిష్కారం కాలేదని ఏపీ ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ మాత్రం నెరవేరలేదన్నారు.  ‘‘మా డబ్బులు మాకు ఇచ్చేందుకు కూడా డబ్బుల్లేవా. మాటలతో కాలయాపనే తప్ప ఒరిగిందేమీ లేదు. పెండింగ్‌ బిల్లులు కచ్చితంగా ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పలేదు. పీఆర్సీపై ఆశలు పెట్టుకున్న వారికి నిరాశ మిగింది. ఈ నెలాఖరు వరకు ప్రభుత్వానికి సమయం ఇస్తున్నాం. ఆ త‌ర్వాత ఉద్య‌మ కార్య‌చ‌ర‌ణ ప్ర‌క‌టిస్తాం’’ అని ఉద్యోగ సంఘ నాయకులు తేల్చి చెప్పారు.    ‘‘సీపీఎస్‌ రద్దు చేస్తామని హామీ ఇచ్చి మరిచారు. మంత్రుల కమిటీ.. అధికారుల కమిటీ అన్నారు. కమిటీలతోనే సరిపెట్టారు. నివేదికలు రాలేదు. కమిటీ నివేదికనూ ఆలస్యం చేస్తూ వచ్చారు. ఒక్క రోజు ఆలస్యం లేకుండా పీఆర్సీ ఇస్తామని చెప్పారు. 6 నెలల తర్వాత అధికారుల కమిటీ నియమించారు. కమిటీలన్నీ కాలయాపనకే తప్ప చిత్తశుద్ధి లేదు. ఏడు నెలల నుంచి ఏం అధ్యయనం చేశారు? సీఎంవో అధికారులు, సజ్జల ఇచ్చిన హామీలు తక్షణమే తేల్చాలి. హెల్త్‌ కార్డు అనారోగ్య కార్డుగా మారింది. డబ్బు పెట్టుకుని వైద్యం చేయించుకున్నాక రీయింబర్స్‌మెంట్‌ వచ్చే పరిస్థితి లేదు. రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.23కోట్లు ఉన్నాయి’’ అని ఏపీ రెవెన్యూ సేవల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిప‌డ్డారు.