విలీనం రాజ్యాంగ విరుద్ధం..గురువులకు జగన్ సార్ పంగనామం?
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఏది చేసినా, అది వివాదమే అవుతుంది. నిజానికి వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే వివాదాలకు పురుడు పోస్తుందన్న అనుమానాలు కూడా లేక పోలేదు. ఇంతవరకు జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఏ ఒక్కటీ కూడా కోర్టు గడప తొక్కకుండా బయటపడిన దాఖలాలు లేవేమో ...
ఇక ప్రస్తుత విషయానికే వస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలోని ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వంలో విలీనం చేస్తూ, ఏక పక్షంగా నిర్ణయం తీసుకుంది జీవో 46 విడుదల చేసింది. ఇదులో భాగంగా ఎయిడెడ్ విద్యాసంస్థలలో పనిచేస్తున్న సిబ్బంది మొత్తనికి మొత్తాన్ని,నేరుగా ప్రభుత్వంలోకి తీసుకుంది. అయితే, ఇలా, గంపగుత్త నియామకాలు కాలు జరపడం రాజ్యాంగ విరుద్ధం. ఆర్టికల్ 16(1) ప్రకారం ఈ నియామకాలు చెల్లవు. సుప్రీం కోర్టు ఆదేశాలకు కూడా ఈ నిర్ణయం విరుద్ధమని రాజ్యాంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(1) ప్రకారం అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే ప్రభుత్వంలో రెగ్యులర్, కాంట్రాక్టు, గౌరవ వేతనం... తదితర పోస్టులు భర్తీ చేయవలసి ఉంటుంది. అంతే కాని, రాత్రి దేవుడు కలలో కనుపించి చెప్పారని, తెల్లారి ఒకే ఒక్క కలం పోటుతో అనుకున్నది చేస్తామంటే, చట్టం ఒప్పుకోదు.ఈ విధంగా భర్తీ చేసిన పోస్టులకు, ఉద్యోగులకు అవసరమైన నియమ నిబంధనలు, సర్వీసు కండీషన్లను ఆర్టికల్ 309 ప్రకారం రూపొందిస్తారు. ఆర్టికల్ 309 అనేది ఆర్టికల్ 16 క్లాజ్(1)కి లోబడి ఉంటుంది. కానీ ఈ ఒక్క ఆర్టికల్ను మాత్రమే ఉపయోగించుకొని ఉద్యోగులను ఇష్టానుసారం ప్రభుత్వంలోకి తీసుకోవడం చెల్లదని రాజ్యాంగ నిపుణులు స్పష్తం చేస్తున్నారు. అయితే, జగన్ రెడ్డి ప్రభుత్వం అలవాటులో పొరపాటుగా అదే తప్పు చేసింది.
అయితే ప్రభుత్వం తెలియక తప్పు చేసిందని అనుకుంటే, అది మనం తప్పు చేసినట్లు అవుతుంది. ఉద్దేశ పూర్వకంగానే ప్రభుత్వం, జీవోలో కొన్ని కీలక అంశాలను దాచేసింది. అలా దాచేసిన అంశాలను అందుకు సంబంధించిన నోట్ఫైల్లో ప్రస్తావించారు. ఆర్టికల్ 309ను ఉపయోగించి ఎయిడెడ్ సిబ్బందిని ప్రభుత్వానికి సరెండర్ చేయడానికి అసవరమైన నియమ నిబంధనలు రూపొందించాలని ఏపీపీఎస్సీని ఆదేశించినట్టుగా నోట్ ఫైల్లో ఉందని తెలుస్తోంది. (ఇక్కడ ఇంకో విశేషం ఏమంటే, పారదర్శక పాలన అందిస్తున్నాదే పనిగా చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం కీలక జీవోలను, దేచేస్తోందని అంటున్నారు) అయితే ఆర్టికల్ 16 క్లాజ్(1) ప్రకారం ప్రభుత్వ సర్వీసుల్లోకి రిక్రూట్ కాని ప్రైవేట్ ఉద్యోగులకు ఆర్టికల్ 309 ప్రకారం సర్వీసు కండీషన్లు, ఇతర నియమ నిబంధనలు రూపొందించడం రాజ్యాంగ విరుద్ధం.
ఇలా దొడ్డిదారిన గంప గుత్తగా ఎయిడెడ్ ఉపాధ్యాయులను ప్రభుత్వంలోకి తీసుకోవడం అంటే, ప్రభుత్వ ఉపాధ్యాయులు, లెక్చరర్ల పోస్టుల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రాజ్యాంగం కల్పించిన హక్కును కాలరాయడమే అవుతుందని, రాజ్యాంగ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, జగన్ రెడ్డి ప్రభుత్వం అన్నీ తెలిసే ఆడుతున్న ఈ నాటకంలో, చివరకు నష్టపోయేది మాత్రం ఉపాధ్యులే అని రాజ్యంగ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఈ విషయంపై, నిరుద్యోగులు ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే ఉపాధ్యాయులు వీదిన పడడం ఖాయమంటున్నారు.
ప్రభుత్వంలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను నేరుగా రెగ్యులరైజ్ చేయడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 16 క్లాజ్ (1)కి కేవలం కొన్ని మినహాయింపులు ఇచ్చింది. అందులో మొదటిది, లోకల్/ నాన్లోకల్ అర్హత, వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్, మతపరమైన వ్యవస్థలకు చెందిన కార్యాలయాల్లో ఆ మతానికి చెందిన ఉద్యోగులే పని చేయాలన్న రిజర్వేషన్. ఇప్పుడు ఎయిడెడ్ సిబ్బందిని ప్రభుత్వంలోకి తీసుకోవడం ఈ మూడు మినహాయింపుల పరిధిలోకి రాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
మరోవంక ఇందుకు సంబంధించి సుప్రీం కోర్టు కూడా చాలా స్పష్టమైన మార్గదర్శకాలతో కూడిన తీర్పును ఇచ్చింది. సుప్రీం మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వంలో ఏ స్థాయిలో నియామకం చేపట్టాలన్నా, ఆర్టికల్ 19 క్లాజ్ (1) ప్రకారం నోటిఫికేషన్ ఇవ్వాలి. అర్హులందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. ఇందుకోసం పరీక్షలు, ఇంటర్వ్యూల్లో ఏదో ఒకటి నిర్వహించాలా? రెండూ అవసరమా అనే విషయాన్ని ఆర్టికల్ 309 ద్వారానే నిర్ణయించాలని ధర్మాసనం స్పష్టంగా చెప్పింది. ప్రత్యేకించి కొంతమంది ఉద్యోగులనే ప్రభుత్వంలోకి తీసుకోవాలనుకున్నా... నోటిఫికేషన్ ద్వారా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని, అవసరమనుకుంటే సరైన కారణం చూపి ఆ కొందరికి గరిష్ఠంగా 5శాతం వరకూ వెయిటేజీ కల్పింవచ్చని, వయోపరిమితి సడలింపులూ ఇవ్వొచ్చని పేర్కొంది. కాబట్టి, ఈ నేపధ్యంలో జగన్ రెడ్డి ప్రభుత్వం దురాలోచనతో తీసుకున్న ఉపాధ్యాయుల విలీన నిర్ణయం, బూమ్రాంగ్ అవడం ఖాయం.
ఎవరైనా నిరుద్యోగులలో ఇంకొకరో కోర్టును ఆశ్రయిస్తేనే, అప్పుడు మాత్రమే చట్టం, సత్యం బయటకు వస్తాయి, లేదంటే ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో ఏమి జరుగిందో అదే జరుగుతుంది. అదలా ఉంటే, ఇలాంటి రాజ్యాంగ ఉల్లంఘనల విషయంలో న్యాయస్థానాలు సుమోటోగా చర్యలు తీసుకోవడం అవసరమని రాజ్యాంగ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ముఖ్యంగా నిరుద్యోగుల పాలిట ఇలాంటి నిర్ణయాలు తీరని అన్యాయం చేస్తాయని అంటున్నారు.