వెంకట్రామిరెడ్డి.. కేసీఆర్ బినామీనా? రేవంత్ రెడ్డి ఆరోపణలు నిజమేనా?

ఐఏఎస్ కు వాలంటరీ రిటైర్మెట్ తీసుకున్న సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఇటీవల కాలంలో వివాదాస్పదమయ్యారు. విపక్షాలకు టార్గెట్ అయ్యారు. జిల్లాల విభజన తర్వాత సిద్దిపేట  జిల్లా కలెక్టర్ గా నియమించబడ్డారు  వెంకట్రామ్ రెడ్డి. తర్వాత అక్కడే ఎక్కువ కాలం పని చేశారు. మిగితా జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసిన ప్రభుత్వం వెంకట్రామిరెడ్డిని మాత్రం కదల్చలేదు. దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో ఈసీ  కారణంగా సంగారెడ్డికి బదిలీ చేశారు. ఎన్నిక ముగియగానే తిరిగి మళ్లీ సిద్ధిపేటకు ట్రాన్స్ ఫర్ చేశారు. విపక్షాలకు ఇదే అస్త్రంగా మారింది.  అంతేకాదు గత లోక్ సభ ఎన్నికల్లో వెంకట్రామిరెడ్డిని ఏదో ఒక స్థానం నుంచి టీఆర్ఎస్ తరపున పోటీ చేయిస్తారనే ప్రచారం జరిగింది. దుబ్బాక ఉప ఎన్నిక సమయంలోనూ వెంకట్రామి రెడ్డి పేరు వినిపించింది. దీంతో వెంకట్రామిరెడ్డి సీఎం కేసీఆర్ కు తొత్తు అని విపక్షాలు ఆరోపించాయి. అందువల్లే ఆయనను సిద్ధిపేట జిల్లా కలెక్టర్ గా సుదీర్ఘకాలం కొనసాగించారని పలు పార్టీలు నేతలు ఆరోపించారు. ఆయన వ్యవహారశైలి కూడా అలానే ఉండేది. విపక్ష పార్టీలను అసలు ఆయన పట్టించుకునే వారు కాదని చెబుతారు. మల్లన్నసాగర్ భూసేకరణ విషయంలోనూ ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం రైతుల పట్ల దారుణంగా వ్యవహరించారనే ఆరోపణలు వెంకట్రామిరెడ్డిపై ఉన్నాయి. ఇక సిద్ధిపేట కొత్త కలెక్టరేట్ ప్రారంభోత్సం సందర్భంగా వెంకట్రాం రెడ్డి వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. జిల్లా కలెక్టర్ చైర్ లో కూర్చున్న ఆయన.. సీఎం కేసీఆర్ పాదాలు మొక్కడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తర్వాత ఆయనను విపక్షాలు మరింతగా టార్గెట్ చేశాయి. సిద్దిపేట కలెక్టర్  ముఖ్యమంత్రి కేసీఆర్ బినామీగా వ్యవహరిస్తున్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. ల్యాండ్ మాఫియాకి హెడ్ అంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. భూముల అమ్మకంలో రూ.1000 కోట్లు నష్టం జరిగిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు.  కోకాపేట భూముల వేలం విషయంలోనూ వెంకట్రామిరెడ్డిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. కేసీఆర్ తన బంధువులు, బినామీలు,తనతో సంబంధాలు ఉన్నవారికే భూములను విక్రయించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. గతంలో ఎకరా రూ.60 కోట్లకు అమ్ముడు పోయిన చోట కేవలం రూ.40 కోట్లకు ఎకరా చొప్పున విక్రయించారని ఆరోపించారు.దేశ,విదేశీ కంపెనీలు టెండర్లలో పాల్గొంటాయని ప్రభుత్వం చెప్పిందని... కానీ వాస్తవం మరోలా ఉందని అన్నారు. సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి అన్ని ప్రధాన కంపెనీలకు ఫోన్లు చేసి టెండర్లు వేయవద్దని బెదిరించాడని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఒకవేళ అక్కడ భూములు కొనుగోలు చేస్తే భవిష్యత్తులో నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వదని చెప్పి భయపెట్టారని చెప్పారు. గండిపేటకు సమీపంలో ఉన్నందునా జీవో.111 ప్రకారం అనుమతులు సాధ్యం కావని చెప్పి.. ఎవరూ టెండర్ వేయకుండా వెంకట్రామి రెడ్డి కుట్రలు చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కోకాపేటలో భూములు కొనుగోలు చేసిన కంపెనీల్లో మై హోం రామేశ్వరరావు,సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి,మహబూబ్ నగర్ ఎంపీ సోదరుడు మన్నె సత్యనారాయణ రెడ్డిలకు చెందిన కంపెనీలు ఉన్నట్లు రేవంత్ తెలిపారు. రామేశ్వరరావుకు చెందిన కంపెనీలు 17.30 ఎకరాలు కొనుగోలు చేయగా.. రూ.1060 కోట్లకు గాను రూ.663కోట్లు మాత్రమే ప్రభుత్వానికి చెల్లించారని అన్నారు. కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి చెందిన కంపెనీలు తొమ్మిదన్నర ఎకరాలు కొనుగోలు చేయగా... రూ.500 కోట్లకు గాను రూ.400 కోట్ల పైచిలుకు మాత్రమే చెల్లించారని ఆరోపించారు. భూముల వేలంపై వెంకట్రామిరెడ్డిని టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి.  రైతులకు వరి విత్తనాలు విక్రయిస్తే షాపులు సీజ్ చేయిస్తానంటూ సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. చెండాడుతా.. వేటాడుతానంటూ ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర విమర్శలకు దారితీశాయి. హైకోర్టు కూడా ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే కేసీఆర్ మెప్పు కోసమే వరి ధాన్యం విషయంలో వెంకట్రామ్ రెడ్డి అలా రియాక్ట్ అయ్యారనే టాక్ ఉంది.  

ఇద్దరు జడ్జీలను మార్చండి.. అమరావతి కేసుల్లో జగన్ సర్కార్ కిరికిరి 

అమరావతి రాజధానిపై దాఖలైన పిిటిషన్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ మొదలైంది. అయితే  జగన్ ప్రభుత్వానికి అమరావతి పిటిషన్లపై విచారణ సాగడం ఇష్టం లేనట్లుగా ఉంది. చాలా రోజుల తర్వాత విచారణ ప్రారంభమైతే వెంటనే.. ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులపై ప్రభుత్వ లాయర్లు వ్యతిరేకత వ్యక్తం చేశారు. చీఫ్ జస్టిస్ కాకుండా ఉన్న ఇద్దరు న్యాయమూర్తుల్ని ధర్మాసనం నుంచి తప్పించాలని వాదనలు వినిపించారు. అయితే చీఫ్ జస్టిస్ మాత్రం రాజధాని పిటిషన్లకు ప్రాధాన్యం ఉందని.. ఆలస్యం కానీయబోమని స్పష్టం చేసి.. వారి విజ్ఞప్తిని తోసి పుచ్చారు.  ప్రభుత్వ లాయర్ల వాదనను చీఫ్ జస్టిస్ తిరస్కరించడంతో విచారణ ప్రారంభమయింది. రాజధాని పిటిషన్లు పరిష్కారం కాకపోవడంతో అభివృద్ధి ఆగిపోయినట్లుగా కనిపిస్తోందని చీఫ్ జస్టిస్ అభిప్రాయపడ్డారు. వేగంగా ఈ పిటిషన్లను పరిష్కరిస్తామన్నారు. హైబ్రిడ్ పద్దతిలో విచారణ జరిగింది. రైతుల తరపున శ్యాందివాన్ వాదనలు వినిపించారు.   ఇద్దరు న్యాయమూర్తులను తప్పించాలంటూ  ప్రభుత్వ లాయర్లు వాదించడంపై తీవ్ర అభ్యంతరాలు వస్తున్నాయి. జగన్ ప్రభుత్వ లాయర్లు న్యాయవ్యవస్థను కించ పరుస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.  బెంచ్ మార్చాల్సి వస్తే విచారణ వాయిదా వేస్తారని ఆ వ్యూహంతోనే ప్రభుత్వం ఇలా చేస్తోందని.. ఇదంతా న్యాయప్రక్రియపై ప్రజల్లో అనుమానాలను కల్పించే వ్యూహామని రాజధాని రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

ప‌ప్పు కాదు నిప్పు.. ఒప్పుకున్న ఏ2.. లోకేశ్ అదుర్స్-వైసీపీ బెదుర్స్‌..

బాడీ, బాడీ లాంగ్వేజ్‌తో పాటు భాష‌నూ మార్చేశారు నారా లోకేశ్‌. ఇన్నాళ్లూ ప‌ప్పు-ప‌ప్పు అని సెటైర్లు వేసిన వైసీపీ నేత‌లు.. ఇప్పుడు లోకేశ్ డైలాగ్స్‌కి గిల‌గిల కొట్టుకుంటున్నారు. వాళ్లూ వీళ్లూ అని కాదు.. ఏకంగా నెంబ‌ర్ 2 విజ‌య‌సాయిరెడ్డినే ప్రెస్‌మీట్ పెట్టి మ‌రీ.. నారా లోకేశ్ బాష‌పై విమ‌ర్శ‌లు చేశారంటే.. చిన‌బాబు వాడివేడి ఏ రేంజ్‌లో పెరిగిందో తెలుస్తోంది. ఇటీవ‌ల వైసీపీ ప్ర‌భుత్వంపై, సీఎం జ‌గ‌న్‌రెడ్డిపై లోకేశ్ చేస్తున్న విమ‌ర్శ‌లు, ట్వీట్లు.. అధికార పార్టీని తూట్లు పొడుస్తున్నాయి. ఈ తిట్లు, తూటాల్లాంటి మాట‌లు భ‌రించ‌లేక‌.. తిక్క‌రేగిన విజ‌య‌సాయి మీడియా ముందు లోకేశ్ మీద ఏడుపందుకున్నారు. బాబ్బాబు ప్లీజ్‌.. మ‌రీ అంతగా తిట్ట‌మాకు అని ఎలాగూ బ‌తిమిలాడలేరు కాబ‌ట్టి.. లోకేశ్ వాడుతున్న భాష బాగాలేదంటూ విమ‌ర్శించారు విజ‌య‌సాయి.  అబ్బా..చా.. వైసీపీ వాళ్లా.. భాష గురించి మాట్లాడేదంటూ తెగ న‌వ్వుకుంటున్నారు జ‌నాలు. ఇన్నాళ్లూ ప‌ప్పూ అన్నారుగా.. ఇప్పుడేంటి నిప్పూ అంటున్నారంటి రివ‌ర్స్ అటాక్ చేస్తున్నారు. లోకేశ్ డైలాగ్స్‌కు వైసీపీ బ్యాచ్‌కు ఎక్క‌డో కాలుతున్న‌ట్టుంది.. అది త‌ట్టుకోలేకే ఇలా గింజుకుంటూ.. బూతులు మాట్లాడే పార్టీ నేత‌లు నీతులు చెబుతున్నారంటూ తెలుగు త‌మ్ముళ్లు సెటైర్లు వేస్తున్నారు. విజ‌య‌సాయిరెడ్డిలాంటి లీడ‌రే.. లోకేశ్ మాట‌లు భ‌రించ‌లేకుండా ఉంటున్నాయ‌ని.. ఆయ‌న‌స‌లు విదేశాల్లో చ‌దువుకున్నారా? అన్నారంటే.. నారా వారి అబ్బాయి.. అదుర్స్ అన్న‌ట్టేగా. అంతేగా.. అంతేగా. లోకేశ్ లోకేశ్ కాదు. అప్పుడు వేరు ఇప్పుడు వేరు. ఇన్నాళ్లూ ఓ లెక్క‌.. ఇప్ప‌టినుంచీ ఇంకో లెక్క‌. అధికారంలో ఉన్న‌ప్పుడు మంత్రిగా హుందాగా ఉన్నారు. జెంటిల్‌మెన్‌గా మాట్లాడారు. ప్ర‌తిప‌క్షం అయ్యాక‌.. అధికార‌ప‌క్షం రెచ్చిపోతుంటే.. లోకేశ్ రూటు మార్చారు. బాడీ, బాడీ లాంగ్వేజ్‌తో పాటు భాష‌నూ మార్చేశారు. బ‌స్తీమే స‌వాల్ అంటూ బ‌రిలో దిగారు. మామ‌లా తొడ‌గొట్ట‌కున్నా.. సింహంలా గ‌ర్జిస్తున్నారు. ఎక్క‌డ ప్రాబ్ల‌మ్ ఉంటే అక్క‌డ ప్ర‌త్య‌క్ష‌మ‌వుతున్నారు. లోకేశ్ ఫ‌ల‌నా చోటికి వ‌స్తున్నారంటే.. ప్ర‌భుత్వం ఉలిక్కిప‌డుతోంది. ముంద‌స్తుగా పోలీసులు మోహ‌రిస్తున్నారు. అడుగ‌డుగునా అడ్డుకుంటున్నారు. కేసులూ పెడుతున్నారు. లోకేశ్‌కు పాల‌కులు ఇంత‌లా భ‌య‌ప‌డుతున్నారంటే.. లోకేశ్ ప‌ప్పు కాదు ఫైర్‌బ్రాండ్ అని తేలిపోతోందిగా.  వ‌రుస‌ ట్వీట్లతో లోకేశ్.. జ‌గ‌న్‌రెడ్డికి, ఆయ‌న ప్ర‌భుత్వానికి క‌ర్రు కాల్చి వాత‌లు పెడుతున్నారు. ప‌దాల‌ను ప‌దునైన ఆయుధాల్లా వాడుతున్నారు. జ‌గ‌న్‌రెడ్డికి అనేక పేర్లు పెట్టారు. సైకోరెడ్డి, తుగ్ల‌క్ రెడ్డి, వ‌సూల్ రెడ్డి, కంస‌మామ లాంటి బిరుదుల‌తో జ‌గ‌న్‌ను ప్ర‌జాబోనులో దోషిగా నిల‌బెడుతున్నారు. తాలిబ‌న్ల పాల‌న‌, న‌ర‌కాసుర పాల‌న‌, జ‌గ‌న‌న్న కాదు.. జ‌గ‌న్ దున్న‌.. ఏం పీక‌లేడు.. లాంటి మాట‌ల‌తో మంట‌పుట్టిస్తున్నారు. బూతులే మాట్లాడే పార్టీకి వారి భాష‌లోనే గ‌ట్టిగా బ‌దులిస్తున్నారు. ప‌ప్పులాంటి వాడనుకుంటే.. పోటుగాడిలా మారి పోట్ల‌గిత్తెలా కుమ్మేస్తుంటే.. వైసీపీ నేత‌ల‌కు దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాంక్ అవుతోంది. అందుకే, విజ‌యసాయిరెడ్డి అంత‌టి నాయ‌కుడే మీడియా ముందుకొచ్చి.. ఆ భాష ఏంటి బాబూ.. మేం విన‌లేక‌పోతున్నామంటూ దండం పెట్టిపోయారు. ఇలా లోకేశ్ దెబ్బ‌కు.. విజ‌య‌సాయి అబ్బ‌ అన‌డం చూసి.. అస‌లు సినిమా ముందుంది అంటున్నారు తెలుగు త‌మ్ముళ్లు. అయితే, లోకేశ్ ట్రాన్స్ఫ‌ర్మేష‌న్ అయిన‌ట్టుగానే.. మిగ‌తా టీడీపీ యువ‌నేత‌లూ దూకుడు పెంచితే.. అప్పుడిక వైసీపీకి ద‌బిడి దిబిడే.

ఎమ్మెల్సీగా సిద్దిపేట కలెక్టర్.. వెంకట్రామిరెడ్డి రాజీనామా? 

తెలంగాణలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. వరి ధాన్యం పండించే విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి తన పదవికి రాజీనామా చేయబోతున్నారని తెలుస్తోంది. సీఎస్ ను కలిసి ఆయన తన ఐఏఎస్ కు రాజీనామా సమర్పిస్తారని చెబుతున్నారు.  వెంకట్రామిరెడ్డి రాజీనామాకు రాజకీయ కారణాలు ఉన్నాయంటున్నారు. ఆయనను ఎమ్మెల్సీగా సీఎం కేసీఆర్ నియమించే అవకాశం ఉందంటున్నారు. గవర్నర్ కోటాలో వెంకట్రామిరెడ్డిని నామినేట్ చేస్తారని టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా పాడి కౌశిక్ రెడ్డిని ప్రతిపాదిస్తూ గతంలోనేే కేసీఆర్ కేబినెట్ తీర్మానం చేసింది. అయితే కౌశిక్ రెడ్డి ఫైలును గవర్నర్ తమిళి సై పెండింగులో పెట్టారు. దీంతో ఆ పోస్టును వెంకట్రామిరెడ్డికి ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని అంటున్నారు. 

జ‌గ‌న్ భ‌క్తుడిగా ఏపీ బీజేపీ ఇంఛార్జ్‌!.. అమ‌రావ‌తిపై డ‌బుల్ గేమ్!

అధికార వైసీపీ మిన‌హా అన్నిపార్టీలూ అమ‌రావ‌తి రైతుల మహాపాద‌యాత్ర‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాయి. టీడీపీ శ్రేణులు మాత్ర‌మే బ‌హిరంగంగా మ‌హాపాద‌యాత్ర‌కు సంఘీభావం తెలుపుతున్నారు. ఇక‌, బీజేపీ ఎప్ప‌టిలానే డ‌బుల్ గేమ్ ఆడుతోంది. అవున‌న‌కా.. కాద‌న‌కా.. అమ‌రావ‌తినే ఏపీకి ఏకైక రాజ‌ధాని అని పోరాడ‌కుండా.. కాలం గ‌డిపేస్తోంది. ఇక‌, రైతుల మ‌హా పాద‌యాత్ర విష‌యంలోనూ డివైడ్ పాలిటిక్స్ చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు సోము వీర్రాజు మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తారు.. కానీ, ఆ పార్టీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంచార్జ్ సునీల్ ధియోద‌ర్ మాత్రం మ‌హాపాద‌యాత్ర‌లో పాల్గొన‌వ‌ద్దంటూ నేత‌ల‌కు వార్నింగ్ ఇస్తున్నారు. ఆదివారం నాడు పాదయాత్రలో బీజేపీ నేతలు పాల్గొనాల్సి ఉంది.. కానీ ఆ పార్టీ వాళ్లెవ‌రూ రాలేదు. సునీల్ ధియోధ‌ర్ ఆదేశాల మేర‌కే క‌మ‌ల‌నాథులు సైడ్ అయిపోయార‌ని తెలుస్తోంది. ఎప్ప‌టిలానే అమ‌రావ‌తి విష‌యంలో బీజేపీ మ‌రోసారి మేక వ‌న్నె న‌క్క‌లా బిహేవ్ చేస్తోంద‌ని అంటున్నారు.  అమ‌రావ‌తి రైతుల మ‌హాపాద‌యాత్ర‌కు త‌మ పార్టీ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు సోము వీర్రాజు చెప్పారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెల కిశోర్‌ బాబుతో పాటు మరికొందరు నేతలు.. పాద‌యాత్ర ప్రారంభం రోజున స్వయంగా వెళ్లి సంఘీభావం ప్రకటించారు. విష‌యం తెలిసి.. బీజేపీ ఇన్‌చార్జ్ సునీల్ ధియోధ‌ర్ ఓవ‌రాక్ష‌న్ చేశార‌ట‌. పాద‌యాత్ర‌లో పాల్గొన్న బీజేపీ నాయ‌కుల‌కు ఫోన్ చేసి.. మీరెందుకు వెళ్లార‌ని ప్ర‌శ్నించార‌ట‌. అమ‌రావ‌తికి బీజేపీ స‌పోర్ట్ కాబ‌ట్టి.. స్థానికంగా ప్ర‌జ‌లంతా అటువైపే ఉన్నారు కాబ‌ట్టి.. ప్ర‌జానాడి ప్ర‌కారం తాముసైతం పాద‌యాత్ర‌లో పాల్గొన్నామ‌ని వారు వివ‌ర‌ణ ఇచ్చుకున్నార‌ని తెలుస్తోంది. బీజేపీ వాళ్లు ఎవ‌రూ పాద‌యాత్ర‌లో పాల్గొన‌వ‌ద్దంటూ సునీల్ ధియోధ‌ర్ పార్టీ వ‌ర్గాల‌కు హుకూం జారీ చేశార‌ని చెబుతున్నారు. అధికార పక్షానికి అనుకూలంగా ఉండే విష్ణువ‌ర్థ‌న్‌రెడ్డిలాంటి నేత‌లే.. వెనకుండి సునీల్‌ దేవధర్‌తో ఇలా చెప్పిస్తున్నారని పార్టీ వ‌ర్గాలే మండిప‌డుతున్నాయి.  అధ్యక్షుడి మాట ప్ర‌కారం పాదయాత్రలో పాల్గొనాలా.? ఇన్‌చార్జ్‌ చెప్పినట్టు ఆగిపోవాలా.? అనే గందరగోళం నాయ‌కులు, కార్యకర్తల్లో నెలకొంది. ‘మా వాళ్లు ఏపీలో పార్టీని ఎదగనివ్వరు.. ఎవరి అజెండాలో వాళ్లున్నారు.. వైసీపీతో అంట‌కాగుతున్నారు’ అంటూ సొంత‌పార్టీ వారే ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. విష్ణు, సునీల్‌లు క‌లిసి బీజేపీని ఆగం చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.  రాజ‌ధానిని జ‌గ‌న్ ప్ర‌భుత్వం మూడుముక్క‌లు చేస్తోంది. అడ్డుకోవాల్సిన కేంద్రం చేతులెత్తేసింది. పోరాడ‌వ‌ల‌సిని బీజేపీ.. అధికార‌పార్టీతో కుమ్మ‌క్కు అవుతోంది. ఆ పార్టీ నేత విష్ణువ‌ర్థ‌న్‌రెడ్డి చాలా నీచంగా మాట్లాడుతున్నారు. ఓ టీవీ డిబేట్‌లో జేఏసీ నేత‌తో చెప్పు దెబ్బలు కూడా తిన్నారు. అయినా, ప్ర‌జావ్య‌తిరేక‌త‌ను క‌మ‌ల‌నాథులు గుర్తించ‌లేక‌పోతున్నారు. డ‌బుల్ గేమ్ పాలిటిక్స్‌ను ఆప‌డం లేదంటూ ఆ పార్టీ నేత‌లే విమర్శిస్తున్నారు. అటు విష్ణు.. ఇటు సునీల్.. ఇద్ద‌రూ క‌లిసి.. బీజేపీని భ్ర‌ష్టుప‌ట్టిస్తున్నారంటూ కేడ‌ర్ మండిప‌డుతోంది. 

ప్రభుత్వ దీవెనలతో అక్రమ చర్చిల క్రమబద్ధీకరణ!..ఇందులో ఏ కుంభకోణం దాగుందో ?

ఓవంక  ఏకంగా వెంకన్న దేవుని భూములను రక్షించలేమన్న నెపంతో అమ్మేసేందుకు ఏపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడోనే ఒక ప్రయత్నం చేశారు. వర్కవుట్’ కాలేదు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ‘బాబాయ్’ ఓకే అన్నా, శిలువ దేవుని దయలేక  అది కాస్తా బ్యాక్ఫైర్’ అయింది. వెంకన్న స్వామి భక్తులు, హిందూ ధార్మిక సంస్థలు వీధుల్లోకొచ్చి ఆగ్రహం వ్యక్తం చేయడంతో జగన్ రెడ్డి ప్రభుత్వం అప్పటికి తాత్కాలికంగా దేవుని భూముల విక్రయం నుంచి వెనకడుగు వేసింది.కానీ, గుట్టు చప్పుడు కాకుండా, సెక్యూరిటీ బాండ్స్ రూపంలో ఇతర అక్రమ మార్గాలలో టీటీడీ నిధులను జగన్ రెడ్డి ప్రభుత్వం ఖజానాలో కలిపేసుకుంటోందనే ఆరోపణ లున్నాయి. అలాగే, సింహాచలం భూములు ఇతర దేవాలయాల ఆస్తులు, ఆదాయాలను దారి మళ్ళించేందుకు, అధికార అనధికార మార్గాలలో ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు అనేకం ఉన్నాయి.  ఇక దేవాలయాల పై దాడులు.విగ్రహాల ద్వంస రచన గురించి అయితే వేరే చెప్పనక్కరలేదు.  ఇలా ఓవంక  హిందువుల విశ్వాసాలు, మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నాలు సాగిస్తూ మరో వంక రాష్ట్రంలో  క్రైస్తవ మత ప్రచారానికి, జగన్ రెడ్డి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందనే ఆరోపణలు అనేకం ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వ  చర్యలుంటున్నాయని, అనేక సందర్భాలలో రుజువైంది. పాస్టర్ల జీతాలు, చర్చిల నిర్మాణానికి నిధులు, ఇలా, జగన్ రెడ్డి ప్రభుత్వం అనేక విధాలుగా క్రైస్తవ మత ప్రచారానికి ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు సమకూరుస్తోందనే  ఆరోపణలున్నాయి.   ఇపుడు జగన్ రెడ్డి ప్రభుత్వం, అదే దిశలో మరో తప్పటడుగు వేసింది. పేద మధ్య తరగతి ప్రజలు తెలిసో తెలియకో, ఎవరో చేసిన మోసాల ఫలితంగానో ప్రభుత్వ భూములలో కట్టుకున్న ఇళ్ళ స్థలాల క్రమబద్ధీకరణకు వెనకాముందు అవుతున్న జగన్ రెడ్డి ప్రభుత్వం, చర్చిల కోసం ఆక్రమించుకున్న భూములను మాత్రం ఆగమేఘాలపై రెగ్యులరైజ్‌ చేయడానికి సిద్ధమైంది. అందుకు సంబంధించిన ఉత్తర్వులు, ఆదేశాలను చాలా గుట్టుగా ఉంచేసింది. రిపోర్టులు, రికార్డులు, ఉత్తర్వులు బయటకు రాకుండా పనులు జరిగిపోవాలని అధికార యంత్రాంగాన్ని ‘ప్రభువా ముఖ్య నేతలు  మౌఖికంగా ఆదేశించారు. ప్రస్తుతం రెవెన్యూ శాఖ ఇదే పనిలో తలమునకలైందని విశ్వసనీయ వర్గాల సమాచారం.  జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో క్రైస్తవ జనాభా ఉన్న లేక పోయిన, ఊరూరా చర్చిలు వెలిశాయి. ఒకే ఊర్లో రెండు మూడు చర్చిల నిర్మాణం కూడా జరిగింది.ఆ చర్చిలు ఎవరు కట్టారో, ఎదుకు కట్టారో, చర్చిలు నిర్మించిన భూములు ఎవరివో..ఏమిటో ఏ అధికారీ  పట్టించుకోలేదు.నిజానికి ఎలాంటి నిర్మాణం చేపట్టాలన్న సంబందిత అధికారుల అనుమతి  అవసరం. ఆలాగే  చర్చి లేదా మరే ఇతర ప్రార్ధనా మందిరం నిర్మాణానానికి అయినా కూడా అనుమతులు అవసరం. ఇందుకు సంబంధించి ఖచ్చితమైన నిబంధనలున్నాయి. ముఖ్యంగా స్థానిక ప్రజల అభ్యర్ధన, అనుమతి ఉండాలని సంబందిత చట్టాలు స్పష్టం చేస్తున్నాయి.  అయినా ముఖ్యమంత్రి అండ చూసుకుని రాష్ట్రంలో అక్రమంగా చర్చిల నిర్మాణాలు జరుగుతున్నాయని, అనేక ఆరోపణలున్నాయి. అయినా అవేవీ పట్టించుకోకుండా, చాలా గ్రామాలలో చర్చిల నిర్మాణం జరిగింది. చర్చిల నిర్మాణం జరిగిన గ్రామాల్లో మత మార్పిడులు జోరుగా సాగాయి, సాగుతున్నాయి. గ్రామాలకు గ్రామాలే క్రైస్తవ గ్రామాలుగా మారి పోతున్నాయని, హిందూ సమాజం, హిందూ ధార్మిక సంస్థలు ఆరోపిస్తున్నాయి.    ఈఆరోపణలను నిజం చేస్తూ అక్రమ చర్చిల క్రమబద్ధీకరణకు జగన్ రెడ్డి ప్రభుత్వం రహస్యంగా అనుమతులు ఇచ్చి పచ్చ జెండా ఊపడం పలు అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. అధికార వర్గాల సమాచారం ప్రకారం, రాష్ట్రంలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని అనేకచోట్ల చర్చిలు నిర్మించారు. వాటిలో నిత్యం ప్రార్థనలు జరుగుతున్నాయి. అభ్యంతరం లేని భూముల్లో ఉన్న చర్చిలను క్రమబద్ధీకరించాలి. ఆయా ప్రాంతాల ధరలకు అనుగుణంగా రెగ్యులరైజ్‌ చేయాలని ప్రభుత్వ పెద్దలు మౌఖికంగా ఆదేశించారు.  అయితే క్రమబద్ధీకరణ ఏ ప్రాతిపదికన చేపట్టాలి? ఏ చట్టపరిధిలో క్రమబద్ధీకరణ చేయాలి? ఫీజుల వసూలుకు ప్రామాణికం ఏమిటన్న దానిపై స్పష్టత ఇవ్వకుండానే తాము చెప్పింది చేసి తీరాలని స్పష్టం చేశారు. దీంతో ప్రస్తుతం రెవెన్యూశాఖ ఆ దిశగా తీవ్ర కసరత్తు చేస్తోంది. భూముల క్రమబద్ధీకరణ పేరిట ఈ ఏడాది ఆగస్టు 23న సర్కారు జీవో 225 జారీ చేసింది. అయితే ఈ జీవోను ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేదు. గజిట్‌లోనూ పొందుపర్చలేదు. ఇలా జీవోను రహస్యంగా ఉంచి, చర్చిల వరకు క్రమబద్ధీకరణ క్రతువును రహస్యంగా కానిచ్చేయడం పలు  అనుమానాలకు తావిస్తోంది. జీవో అమలుతో పాటు హౌసింగ్‌ తదితర అంశాలపై సెప్టెంబరు, అక్టోబరుల్లో కీలక సమీక్షలు జరిగాయి. ఈ సందర్భంగానే చర్చిలకు భూ సంతర్పణ అంశం చర్చకు వచ్చింది. నిరభ్యంతరమైన ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని చర్చిలు నిర్మిస్తే వాటిని జిల్లా కలెక్టర్‌ నిర్దేశించిన ధర ఆధారంగా క్రమబద్ధీకరించాలని విధివిధానాలు రూపొందించారు. ఈ మేరకు జీవో.225కి అనుబంధంగా మరో ఉత్తర్వు జారీ చేశారు. అయితే ఇళ్లకు, చర్చిలకు ఒకే కటాఫ్‌ తేదీని నిర్ణయించడంపై రెవెన్యూ వర్గాల్లోనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  జగన్‌ పాలనలో విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని చర్చిలు నిర్మిస్తే వాటిని క్రమబద్ధీకరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారా అనే సందేహాలు తలెత్తుతున్నాయని ఓ సీనియర్‌ రెవెన్యూ అధికారి పేర్కొన్నారు. మరి, ఇక ఈ వివాదం ఏ మలుపుతిరుగుతుందో చూడవలసి ఉందని అంటున్నారు. అంతే కాదు, ఇద్నులో ఏముందో, ఏకుంభకోణం దాగుందో అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి,

కుప్పంలో మందలు మందలుగా దొంగ ఓటర్లు.. మంత్రి పెద్దిరెడ్డి పాలేర్లుగా పోలీసులు!

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ దౌర్జన్యాలకు పాల్పడుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. కుప్పంలో మరీ దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వైసీపీ భారీగా దొంగ ఓట్లు వేయిస్తోంది. మీడియా, పోలీసు వాహనాల్లో దొంగ ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకువస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నాయి. మందలు మందలుగా వస్తున్న దొంగ ఓటర్లను పోలీసులే దగ్గరుండి పోలింగ్ కేంద్రాలకు చేరుస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. పలు కేంద్రాల దగ్గర దొంగ ఓటర్లను అడ్డుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించగా.. పోలీసులు వాళ్లను అడ్డుకోవడంతో గొడవలు జరిగాయి. పోలీసులు టీడీపీ నేతలపై నిఘా పెట్టి.. వైసీపీ లీడర్లను వదిలేస్తున్నారని అంటున్నారు. అధికారులు, పోలీసుల తీరుపై టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది బాబాయ్‌ని గొడ్డ‌లి పోటుతో బ‌లిచేసిన‌ట్టే.. ప్ర‌జాస్వామ్యాన్ని దొంగ ఓట్ల వేటుతో జ‌గ‌న్‌రెడ్డి ఖూనీ చేస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు. కుప్పంలో దొంగ ఓట్లు, మాఫియా డ‌బ్బుతో అత్యంత ప‌విత్ర‌మైన ఎన్నిక‌ల వ్య‌వ‌స్థ‌ని జ‌గ‌న్‌రెడ్డి న‌డిబ‌జారులో అంగ‌డి స‌రుకు చేశారని విమర్శించారు. టీడీపీ నేత‌లను నిర్బంధించి, ఏజెంట్ల‌ను పోలీసులు అరెస్టు చేశారన్నారు. ఇత‌ర‌ ప్రాంతాల నుంచి దొంగ ఓట్లు వేసేందుకు వైసీపీ తీసుకొచ్చినవారిని కుప్పం ఎలా రానిచ్చారని ప్రశ్నించారు.  ఎన్నికల నిర్వహణలో ఎస్ఈసీ, పోలీసులు విఫలమయ్యారని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య పేర్కొన్నారు. ఎస్‌ఈసీ, డీజీపీ.. పదవులు కట్టబెట్టిన సీఎం జగన్ రుణం తీర్చుకుంటున్నారన్నారు. పోలీసులు.. మంత్రి పెద్దిరెడ్డి పాలేర్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. మంత్రి పెద్దిరెడ్డి మారువేషంలో ఇంకా కుప్పంలోనే ఉండి ఉంటారని వర్ల రామయ్య ఆరోపించారు. దొంగ ఓటర్లకు రక్షణ కల్పించే దౌర్భాగ్యం పోలీసులకు ఎందుకని ప్రశ్నించారు. పోలీసుల దౌర్జన్యాలపై అసోషియేషన్‌ ఏం సమాధానం చెబుతుందని నిలదీశారు. ఇలా గెలిచేది గెలుపు కాదని.. దాని కంటే చెక్క భజన చేసుకోవాలంటూ వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అసలు ఎన్నికల కమిషన్ ఉందా అని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ప్రశ్నించారు. ఎన్నికలు ఈసీ కాకుండా వైసీపీ నాయకులు నిర్వహిస్తున్నారని అన్నారు. బయటి నుంచి వచ్చి ఓటు వేసేవాళ్లను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బయటి వ్యక్తుల వీడియోలను ఎన్నికల కమిషన్‌కు అందిస్తామని... లైవ్ వెబ్ కాస్టింగ్ ద్వారా ఆ వీడియోలు సరిచూసుకోవాలని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. 

వివేకా కేసుపై వైసీపీ మౌనం.. కుప్పంలో దొంగలు.. మంత్రి పాలేర్లుగా పోలీసులు.. టాప్ న్యూస్@1PM 

వైఎస్‌ వివేకా హత్య కేసులో తాము సానుభూతి వ్యక్తం చేస్తే.. వైసీపీ రాజకీయం చేస్తోందని టీడీపీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి అన్నారు. దస్తగిరి కన్ఫెషన్‌ స్టేట్‌మెంట్ చదువుతుంటే.. మానవత్వమున్న ప్రతి ఒక్కరికీ కన్నీళ్లు వస్తాయన్నారు. వివేకా హత్యపై వైసీపీ నేతల్లో ఎలాంటి చలనమూ లేదన్నారు. ఏదైనా ఆరోపణ చేస్తే టీడీపీ నేతలకు నోటీసులు ఇస్తున్నారన్నారు. దస్తగిరి కన్ఫెషన్‌ స్టేట్‌మెంట్‌లోని పెద్దలను ఎందుకు ప్రశ్నించరని జీవీ రెడ్డి ప్రశ్నించారు.  ---------- కుప్పంలో అధికార పార్టీ వైసీపీ బరితెగిస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. కుప్పంలోకి వైసీపీ దొంగ ఓటర్లు చొరబడుతున్నారు. టీడీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేస్తుండటంతో ఉద్రిక్తతలు తలెత్తున్నాయి. ఐడీ కార్డు అడిగితే దొంగ ఓటర్లు సమాధానం చెప్పడం లేదు. టీడీపీ శ్రేణులపై ఎదురు దాడులకు దిగుతున్నారు. యథేచ్ఛగా దొంగ ఓట్లు పోల్ అవుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని చెబుతున్నారు.  వైసీపీ శ్రేణులకు పోలీస్ యంత్రాంగం పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని అంటున్నారు. ----  కుప్పం మున్సిపల్ పోలింగ్‌లో వైసీపీ దొంగ ఓట్లతో దౌర్జన్యానికి పాల్పడుతోంది. ఆరో వార్డులో మదనపల్లికి చెందిన వైసీపీ నాయకుడు దండు శేఖర్ రెడ్డి మీడియా అవతారంలో పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించాడు. వాహనానికి మీడియా బోర్డు వేసుకుని దొంగ ఓటర్లను అందులో ఎక్కించుకుని వెళ్లి ఓట్లు వేసేందుకు శేఖర్‌రెడ్డి  ప్రయత్నించాడు. కాగా దొంగఓటర్లను గుర్తించిన టీడీపీ శ్రేణులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.  ----  బాబాయ్‌ని గొడ్డ‌లి పోటుతో బ‌లిచేసిన‌ట్టే.. ప్ర‌జాస్వామ్యాన్ని దొంగ ఓట్ల వేటుతో జ‌గ‌న్‌రెడ్డి ఖూనీ చేస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు. కుప్పంలో దొంగ ఓట్లు, మాఫియా డ‌బ్బుతో అత్యంత ప‌విత్ర‌మైన ఎన్నిక‌ల వ్య‌వ‌స్థ‌ని జ‌గ‌న్‌రెడ్డి న‌డిబ‌జారులో అంగ‌డి స‌రుకు చేశారని విమర్శించారు. టీడీపీ నేత‌లను నిర్బంధించి, ఏజెంట్ల‌ను పోలీసులు అరెస్టు చేశారన్నారు. ఇత‌ర‌ ప్రాంతాల నుంచి దొంగ ఓట్లు వేసేందుకు వైసీపీ తీసుకొచ్చినవారిని కుప్పం ఎలా రానిచ్చారని ప్రశ్నించారు.  ---------- ఎన్నికల నిర్వహణలో ఎస్ఈసీ, పోలీసులు విఫలమయ్యారని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య పేర్కొన్నారు. ఎస్‌ఈసీ, డీజీపీ.. పదవులు కట్టబెట్టిన సీఎం జగన్ రుణం తీర్చుకుంటున్నారన్నారు. పోలీసులు.. మంత్రి పెద్దిరెడ్డి పాలేర్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. మంత్రి పెద్దిరెడ్డి మారువేషంలో ఇంకా కుప్పంలోనే ఉండి ఉంటారని వర్ల రామయ్య ఆరోపించారు. దొంగ ఓటర్లకు రక్షణ కల్పించే దౌర్భాగ్యం పోలీసులకు ఎందుకని ప్రశ్నించారు. --------- రాష్ట్ర ఎన్నికల కమిషన్‌పై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఉందా అని ప్రశ్నించారు. ఇవాళ ఎన్నికలు ఈసీ కాకుండా వైసీపీ నాయకులు నిర్వహిస్తున్నారని అన్నారు. బయటి నుంచి వచ్చి ఓటు వేసేవాళ్లను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బయటి వ్యక్తుల వీడియోలను ఎన్నికల కమిషన్‌కు అందిస్తామని... లైవ్ వెబ్ కాస్టింగ్ ద్వారా ఆ వీడియోలు సరిచూసుకోవాలని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు.  --- టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ జాబితాపై సస్పెన్షన్ కొనసాగుతోంది. గులాబీ బాస్ ఇప్పటికే  అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి చేశారని, నామినేషన్ పత్రాలు కూడా సిద్ధం చేసినట్లు తెలియవచ్చింది. ఇంకా అభ్యర్థులకు ఈ సమాచారం అందలేదు. దీంతో అటు సిట్టింగ్స్.. ఇటు ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. మధుసూదనాచారి, పాడి కౌశిక్ రెడ్డి, ఎంసి కోటిరెడ్డి, తక్కళ్ళపల్లి రవీందర్ రావు, ఎల్.రమణ, కడియం లేదా ఎర్రోళ్ల శ్రీనివాస్ పేర్లు ఫైనల్ జాబితాలో ఉండే అవకామున్నట్లు సమాచారం.  -------- రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేశారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.  అనారోగ్యంతో బాధపడుతున్న శిశువిహార్ పిల్లల కోసం ప్రత్యేకంగా  నిలోఫర్ ఆసుపత్రిలో వార్డ్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి నగరం నలువైపులా సీఎం కేసీఆర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించనున్నారని చెప్పారు. పెద్ద ఎత్తున్న మెడికల్ కాలేజ్‌లు ఏర్పాటు చేస్తున్నారన్నారు. --- కేబీఆర్ పార్క్ వద్ద నటి చౌరాసియాపై గుర్తు తెలియని దుండగులు హత్యాయత్నం చేశారు. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో చౌరాసియాపై దాడి చేయగా.. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. వాకింగ్‌కు వెళ్లగా గుర్తు తెలియని ఆకతాయిలు ఆమెపై దాడికి తెగబడినట్లు తెలుస్తోంది. ఈ పెనుగులాటలో నటి తలకు, కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. ఓ ఆకతాయి ఆమె ముఖంపై పిడిగుద్దులు, బండరాయితో దాడి చేశాడు. అనంతరం ఆమె వద్ద ఉన్న 8 ప్లస్ ఫోన్, నగలు, నగదు తీసుకుని వారు పరారయ్యారు. --------- దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న జవహార్‌లాల్ యూనివర్సిటీలో రెండు విద్యార్థి సంఘాల మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆర్ఎస్ఎస్ విద్యార్థి సంఘం అఖిల భారతీయ విద్యార్థి సంఘానికి ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్‌కి మధ్య ఆదివారం రాత్రి జరిగిన గొడవలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. గాయపడ్డ విద్యార్థుల్ని ఢిల్లీ ఎయిమ్స్‌కి తరలించి చికిత్స అందిస్తున్నట్లు యూనివర్సిటీ యాజమాన్యం తెలిపింది. ఆదివారం రాత్రి 9:45 గంటలకు ఇరు విద్యార్థి నేతల మధ్య గొడవ జరిగిందని పోలీసులు తెలిపారు.

మ‌ల్ల‌న్న‌ బీజేపీలో చేర‌డం లేదా?.. 4 ఆప్ష‌న్ల‌పై ఫోక‌స్‌.. మ‌ర్డ‌ర్ స్కెచ్‌ రివీల్‌..

తీన్మార్ మ‌ల్ల‌న్న‌పై కేసుల మీద కేసులు పెట్టారు. జైల్లోనే బంధించాల‌ని చూశారు. బెయిల్ రాకుండా చేసేందుకు మాగ్జిమ‌మ్ ట్రై చేశారు. అయినా.. మ‌ల్ల‌న్న ముందు ప్ర‌భుత్వ కుట్ర‌లు వ‌ర్క‌వుట్ కాలేదు. బ‌లంగా పోరాడి.. అతిక‌ష్టం మీద జైలు నుంచి బ‌య‌టికొచ్చారు. జైల్లోనే త‌న‌ను చంపేందుకు కుట్ర చేశారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. తాజాగా, ఆ వివ‌రాలు బ‌య‌ట‌పెట్టారు తీన్మార్ మ‌ల్ల‌న్న‌.  తనను హత్య చేయడానికి అధికార పార్టీ భారీ కుట్ర చేసింద‌ని తీన్మార్‌ మల్లన్న ఆరోపించారు. అక్టోబరు 2, గాంధీ జయంతి రోజున జైలులో పాత నేరస్థులతో త‌నను చంపాలని కుట్ర చేశార‌ని.. అయితే తాను చాకచక్యంగా తప్పించుకున్నట్టు తెలిపారు. మరుసటి రోజు చీకటి గదిలో బంధించి ఎర్రగడ్డలోని మానసిక రోగులకు ఇచ్చే మత్తుమందు మాత్రలు ఇచ్చి పిచ్చివాడిని చేయాలని ప్ర‌యత్నించినట్టు మ‌ల్ల‌న్న చెప్పారు. అధికార పార్టీ తనను అనేక ఇబ్బందులకు గురిచేసిందని, ఎక్కడా లేని విధంగా కేసులు పెట్టి 74 రోజులు జైలుకు పంపిందన్నారు. జైలు నుంచి తనను బయటకు తీసుకురావడానికి బలమైన, బయటి వ్యక్తులతో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాన‌ని చెప్పారు.  జైలు నుంచి వ‌చ్చాక తీర్మార్ మ‌ల్ల‌న్న మ‌రింత దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. స‌ర్కారుతో తాడోపేడో తేల్చుకుంటానంటున్నారు. తీన్మార్‌ మల్లన్న టీం త‌ర‌ఫున‌ భవిష్యత్‌ కార్యాచరణ సిద్ధం చేసే ప‌నిలో బిజీగా ఉన్నారు. ప్ర‌ధానంగా నాలుగు ఆప్ష‌న్లపై అనుచ‌రుల‌తో క‌స‌ర‌త్తు చేస్తున్నారు.  1. కొత్త‌ పార్టీ పెట్టడం 2. ఇతర పార్టీలకు బయట నుంచి మద్దతు ఇవ్వడం 3. పాత పద్ధతిలోనే కొనసాగడం 4. వేరే పార్టీలో చేరడం ఇలా, ఈ నాలుగు ఆప్ష‌న్ల‌లో ఏది బెట‌ర‌నే దానిపై తీర్మార్ మ‌ల్ల‌న్న టీం జిల్లా కన్వీనర్లు, కో-కన్వీనర్లతో అభిప్రాయ సేకరణ చేపడుతున్నారు. జిల్లాల వారీగా అభిప్రాయ సేకరణ చేప‌ట్టి.. రాష్ట్ర కమిటీలో అందరి అభిప్రాయాలు తీసుకొని.. త్వ‌ర‌లోనే ఓ స్ప‌ష్ట‌మైన‌ రాజకీయ నిర్ణయాన్ని తీసుకుంటాన‌ని తీర్మార్ మ‌ల్ల‌న్న తెలిపారు.  అయితే, మ‌ల్ల‌న్న జైల్లో ఉన్న‌ప్పుడు.. త‌న భ‌ర్త బీజేపీలో చేరేందుకు సిద్ధ‌మంటూ ఆయ‌న భార్య క‌మ‌లం పార్టీ పెద్ద‌ల‌కు లేఖ రాశారు. దీంతో మ‌ల్ల‌న్న బీజేపీలో చేరుతున్నారంటూ ప్ర‌చారం జ‌రిగింది. కానీ, ఇప్పుడు మ‌ళ్లీ భ‌విష్య‌త్ కార్య‌చ‌ర‌ణ పేరుతో స‌మావేశాలు పెడుతుండ‌టం క‌న్ఫూజ‌న్‌కు కార‌ణ‌మ‌వుతోంది. మ‌ల్ల‌న్న బీజేపీలో చేర‌డం లేదా? అనే అనుమానం త‌లెత్తుతోంది. లేదంటే, తాను బీజేపీలో చేరాల‌ని ఇప్ప‌టికే డిసైడ్ కాగా, త‌న టీం స‌భ్యుల నుంచి వ్య‌తిరేక‌త రాకుండా.. ఇలా అభిప్రాయ సేక‌ర‌ణ చేప‌డుతున్నారా? అని కూడా అంటున్నారు. ఏదిఏమైనా.. ఇన్నాళ్లూ కేవ‌లం క్యూ న్యూస్ ద్వారా మాత్ర‌మే కేసీఆర్‌పై ఒంట‌రి పోరాటం చేస్తూ వ‌చ్చిన తీన్మార్ మ‌ల్ల‌న్న.. ఇక‌పై బ‌ల‌మైన‌ రాజ‌కీయ వేదిక‌గా స‌ర్కారుతో స‌మ‌రం చేసేందుకు సమాయ‌త్తం అవుతున్నార‌ని స్ప‌ష్టం అవుతోంది.   

కుప్పంలో దొంగలు పడ్డారు.. పోలింగ్ లో వైసీపీ అరాచకాలు! 

టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గం కుప్పం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఉద్రిక్తంగా సాగుతోంది. విజయం కోసం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పోలింగ్ కేంద్రాల్లో వైసీపీ నేతలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఒకవైపు దొంగ ఓట్లు మరోవైపు దౌర్జన్యకాండకు దిగుతున్నారు.  కుప్పంలో అధికార పార్టీ వైసీపీ బరితెగిస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. కుప్పంలోకి వైసీపీ దొంగ ఓటర్లు చొరబడుతున్నారు. టీడీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేస్తుండటంతో ఉద్రిక్తతలు తలెత్తున్నాయి. ఐడీ కార్డు అడిగితే దొంగ ఓటర్లు సమాధానం చెప్పడం లేదు. టీడీపీ శ్రేణులపై ఎదురు దాడులకు దిగుతున్నారు. యథేచ్ఛగా దొంగ ఓట్లు పోల్ అవుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని చెబుతున్నారు.  వైసీపీ శ్రేణులకు పోలీస్ యంత్రాంగం పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని అంటున్నారు. బస్సుల్లో సోదాల పేరుతో పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర వైసీపీ బిర్యానీ ప్యాకెట్లు పంచుతోంది. అయినా పోలీసులు పట్టించుకోవడం లేదు. 16, 19 వార్డుల్లో టీడీపీ శ్రేణులు దొంగ ఓటర్లను పట్టుకున్నారు. 

వివేకా కేసుపై జగన్ పార్టీ మౌనం ఎందుకు? అసలు పెద్దలు ఇరికినట్టేనా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్  వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో.. కారు డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన కన్ఫెషన్‌ స్టేట్ మెంట్  ఏపీ రాజకీయవర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. తెలుగుదేశం పార్టీ నేతలు వరుసగా ప్రెస్‌మీట్లు పెట్టి ఇప్పుడేం మాట్లాడతారని వైసీపీ నేతలను ప్రశ్నిస్తున్నారు. హత్య ఘటన మొత్తం జగన్మోహన్ రెడ్డికి తెలుసని అందుకే గుండెపోటుగా నమ్మించే ప్రయత్నం చేశారని అంటున్నారు. అసలు సూత్రధారుల్ని.. గుండెపోటుగా నమ్మించే ప్రయత్నం చేసిన వారిని విచారిస్తే మొత్తం బయట పడుతుందని టీడీపీ నేతలు అంటున్నారు. టీడీపీ నేతలు ఇంతగా ఆరోపణలు చేస్తున్నా జగన్ పార్టీ నేతలు మాత్రం స్పందించడం లేదు. దస్తగిరి కన్ఫెషన్ స్టేట్ మెంట్ పైనా మట్లాడటం లేదు. టీడీపీ నేతల ఆరోపణలకు కౌంటర్ ఇవ్వడం లేదు. దస్తగిరి కన్ఫెషన్‌ స్టేట్ మెంట్ పై వైసీపీ నేతలు మౌనంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. వివేకా హత్య జరిగిన తీరును వివరిస్తూ కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు డ్రైవర్ దస్తగిరి. అందులో బడా నేతల పేర్లు ప్రస్తావించారు. కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో సీఎం జగన్ సన్నిహితుడు, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి పేరును కూడా ప్రస్తావించారు.  ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, గుజ్జుల ఉమాశంకర్‌రెడ్డితో కలిసి వివేకాను హత్య చేసినట్టు దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. వివేకా హత్యకు ఎర్ర గంగిరెడ్డి ప్లాన్ చేసినట్టు కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. ఇందులో పెద్దల పాత్ర ఉందని కూడా చెప్పారు. దీంతో దస్తగిరి చెబుతున్న ఆ పెద్దలు ఎవరన్నది చర్చగా మారింది. 2019 మార్చిలో ఆయన నివాసంలో వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. వివేకా హత్య జరిగినప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నా.. అప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ కేసుపై దర్యాప్తు జరగకుండా అధికారులను బదిలీచేయడంలో.. మీడియాలో ప్రచారం జరగకుండా హైకోర్టు నుంచి గ్యాగ్ ఆర్డర్స్ తెచ్చుకోవడంలో వైసీపీ సక్సెస్ అయింది. అదే సమయంలో చంద్రబాబే.. టీడీపీ నేతలతో కలిసి హత్యలు చేయించారన్న ప్రచారాన్ని మాత్రం ఉద్ధృతంగా చేశారు. నారాసుర రక్త చరిత్ర అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అయితే వివేకా హత్య కేసులో తాజాగా వెలుగు చూస్తున్న పరిణామాలతో టీడీపీ నేతలు వైసీపీని టార్గెట్ చేస్తున్నారు.  వైఎస్ వివేకాను సొంత కుటుంబసభ్యులే చంపినప్పటికీ సానుభూతి కోసం .. చంద్రబాబుపై బురద చల్లారని ఇప్పుడు నిజాలు బయటకు వచ్చాయని అంటున్నారు. దీనిపై వైసీపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. వైఎస్ వివేకా హత్యకేసు అంశంలో ప్రస్తుతానికి దస్తగిరి కన్ఫెషన్ మాత్రమే బయటకు వచ్చింది. ఇంకా బయటకురావాల్సినవి చాలా ఉన్నాయంటున్నారు. సాక్ష్యాలు తుడిచేసిన వారిని.. మర్డర్ కేసును గుండెపోటుగా నమ్మించే ప్రయత్నం చేసిన వారిని సీబీఐ ప్రశ్నిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయంటున్నారు. ఆ రోజున గుండెపోటు అని .. వైఎస్ వివేకా మరణవార్తను అధికారికంగా మీడియాకు చెప్పింది విజయసాయిరెడ్డినే. అందుకే సీబీఐ సీరియస్‌గా విచారణ జరిపితే సంచలనాలు బయటకు వస్తాయని అంచనా వేస్తున్నారు టీడీపీ నేతలు. మొత్తంగా వివేకా హత్య కేసులో కారు డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాంగూల్మంపై వైసీపీ నేతలు స్పందించకపోవడంపై జనాల్లోనూ చర్చ సాగుతోంది. హత్య వెనుక ఉన్న అసలు పెద్దలెవరో తేలాల్సిన అవసరం ఉందనే వాదన వస్తోంది. 

అదే జోరు.. అదే హోరు.. 15వ రోజు ‘మహాపాదయాత్ర’

అమరావతే ఏపీకి ఏకైక రాజధాని. మూడు రాజ‌ధానుల నిర్ణ‌యం వెన‌క్కి తీసుకోవాలి. సీఆర్డీఏ ర‌ద్దు చేయాలి. ప్ర‌భుత్వం దిగొచ్చేదాకా ఉద్య‌మం ఆపేది లేదంటూ రాజ‌ధాని రైతులు అలుపెర‌గ‌ని పోరాటం చేస్తున్నారు. రెండేళ్లుగా త‌గ్గేదే లేదంటున్నారు. ధ‌ర్నాలు, దీక్షాలతో అమ‌రావ‌తి నినాదం వినిపించారు. లాఠీ దెబ్బ‌లను ఓర్చుకుంటూ జై అమ‌రావ‌తి అంటున్నారు. అయినా, జ‌గ‌న్ స‌ర్కారు మ‌న‌సు మార‌క‌పోవ‌డంతో.. త‌మ గోడును ఆ దేవ‌దేవుడికే చెప్పుకునేందుకు.. జ‌గ‌న్‌రెడ్డి బుద్ధి మార్చాల‌ని వేడుకునేందుకు.. దండు క‌ట్టారు అమ‌రావ‌తి రైతులు. న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం వ‌ర‌కూ.. అంటూ మ‌హా పాద‌యాత్ర చేస్తున్నారు. ఆ యాత్ర తొమ్మిదో రోజు ప్ర‌కాశం జిల్లాలో జోరుగా కొన‌సాగుతోంది.   ఇవాళ జరుగుమల్లి మండలంలో మొదలైన యాత్ర సుమారు 14కి.మీ మేర సాగి కందుకూరు మండలం విక్కిరాలపేటలో ముగియనుంది. అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాత్రకు స్థానిక ప్రజల నుంచి అపూర్వ మద్దతు లభిస్తోంది. పోలీస్ నిర్బంధ‌న‌లు ఎదుర్కొంటూ పాద‌యాత్ర‌కి సంఘీభావం చెబుతున్నారు స్థానికులు.    అమరావతి పరిరక్షణ, ఇతర ప్రాంతాలకు ఉద్యమాన్ని విస్తరించడమే లక్ష్యంగా ప్రారంభించిన మహాపాదయాత్ర.. 45 రోజుల పాటు కొనసాగనుంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా జరిగే ఈ యాత్ర డిసెంబరు 15న తిరుపతిలో ముగియనుంది.    

ఛీ ఛీ.. బూటులో బీరా ?.. ఆసీస్ ఆటగాళ్ల ఓవరాక్షన్..

దుబాయ్ వేదికగా జరిగిన టీట్వంటీ వరల్డ్ కప్ ను ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. ఫైనల్‌లో 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించి తొలిసారి టైటిల్ సాధించింది. 18.5 ఓవర్లలోనే న్యూజిలాండ్ నిర్దేశించిన 173 పరుగుల విజయ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా సాధించింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్,  మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్ పరుగుల వరద పారిస్తూ ఆసీస్ జట్టును విజేతగా నిలిపారు. తొలిసారి టీ20 ప్రపంచకప్‌ గెలితిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు దుబాయ్‌ మైదానంలో గెలుపు సంబరాలు చేసుకున్నారు. సౌథీ బౌలింగ్‌లో మాక్స్‌వెల్‌  బౌండరీ బాదగానే మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చిన ఆటగాళ్లు ఒకరినొకరు ఆలింగనాలు చేసుకొని సంబరపడ్డారు. తర్వాత డ్రెస్సింగ్‌ రూమ్‌లో గోల గోల చేశారు. ఈ క్రమంలోనే ఆసీస్‌ కీపర్‌ మాథ్యూవేడ్‌, ఆల్‌రౌండర్‌ స్టోయినిస్‌ ఒక బూటులో కూల్ డ్రింక్ పోసుకొని తాగారు.  దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది.  ఈ వీడియో వైరల్ గా మారింది. గెలుపు సంబరాల్లో భాగంగా  ఆసీస్ ఆటగాళ్ల ప్రవర్తనపై సోషల్ మీడియాతో జోరుగా చర్చ సాగుతోంది. విజయోత్సవాల్లో ఇలాంటివి కామన్ అని కొందరు కామెంట్లు చేస్తుండగా... ఆసీస్ ఆటగాళ్లు అతి చేశారని మరి కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. 

దొంగ ఓట్లు.. ఓటర్లకు బెదిరింపులు! పెనుగొండలో ఎంపీ మాధవ్ హల్చల్.. 

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ లో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీతో పాటు అనంతపురం జిల్లా పెనుగొండ నగర పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ నేతలు దొంగ ఓట్లు వేయిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. వైసీపీ నేతలు పోలింగ్ కేంద్రాలకు వెళుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు,  పెనుకొండ నగర పంచాయతీ ఎన్నికల్లో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ హల్‌చల్ చేశారు. అనుచరులను వెంటబెట్టుకొని పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లి ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు. పెనుకొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి అక్కడికి చేరుకున్నారు. పార్థసారథి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఎంపీ లెక్క చేయకుండా వెళ్తున్నారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే  పార్థసారథిని అడ్డుకున్న పోలీసులు.. గోరంట్ల మాధవ్‌కు మాత్రం రెడ్ కార్పెట్ వేస్తున్నారు. పోలీసుల తీరుపై పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

టీట్వంటీ వరల్డ్ కప్ విజేత ఆసీస్.. ఫైనల్లో వార్నర్, మార్ష్ సూపర్ షో 

టీట్వంటీ విశ్వ విజేతగా ఆసీస్ నిలిచింది. కివీస్ తో జరిగిన ఫైనల్ పోరులో విజయం సాధించి మరోసారి వరల్డ్ కప్ ను కైవసం చేసుకుంది కంగారుల జట్టు. న్యూజిలాండ్ నిర్దేశించిన 173 పరుగుల విజయ లక్ష్యాన్ని ఆసీస్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. లక్ష్య చేధనలో ఆస్ట్రేలియా తొలి ఓవర్ నుంచే ధాటిగా అడింది. అయితే ఆరోన్ ఫించ్ 7 బంతుల్లో 5 పరుగులు చేసి బౌలర్ ట్రెంట్ బౌల్ట్ చేతిలో ఔటయ్యాడు. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ మాత్రం  రెచ్చిపోయాడు. కేవలం 37 బంతుల్లో 53 పరుగులు చేశాడు. వార్నర్ కు మార్ష్ తోడయ్యాడు. 29 బంతుల్లో మిచెల్ మార్ష్ 46 పరుగులు చేశాడు. ఇద్దరు ధాటిగా ఆడటంతో ఆసిస్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. 13 ఓవర్ లో వార్నర్ అవుటయ్యాడు.  వార్నర్ అవుటైనా మార్ష్ జోరు మాత్రం ఆపలేదు. మరింత ధాటిగా షాట్లు కొట్టాడు. దీంతో ఆసీస్ ఈజీగానే లక్ష్యంగా దిశగా పయనించింది. 14 ఓవర్ లో హాప్ సెంచరీ పూర్తి చేశాడు మార్ష్. మూడో వికెట్ కు మ్యాక్స్ వెల్ తో కలిసి కేవలం 23 బంతుల్లోనే 50 పరుగుల భాగస్వామ్యం అందించారు. 17, 18 ఓవర్లలో పరుగులు తక్కువగా వచ్చినా.. 19 ఓవర్ లో బౌండరీలు కొట్టడంతో ఆసిస్ విజయం పూర్తైంది. మార్ష్ 77 పరుగులు చేయగా.. మ్యాక్స్ వెల్ 28 పరుగులు చేశాడు. కివీస్ బౌలర్లలో బౌల్డ్ రెండు వికెట్లు తీశాడు.  టీ 20 ప్రపంచకప్ ఫైనల్‌లో న్యూజిలాండ్ 172 పరుగుల భారీ స్కోరు సాధించింది. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ దెబ్బకు ఆసీస్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు.  మిచెట్ స్టార్క్ బాధితుడిగా మారాడు.4 ఓవర్లు వేసిన స్టార్క్ ఒక్క వికెట్ కూడా తీసుకోకుండా ఏకంగా 60 పరుగులు సమర్పించుకున్నాడు.  క్రీజులో ఉన్నంత సేపు చెలరేగిపోయిన విలియమ్సన్ ఆసీస్ ఫీల్డింగ్‌ను చెల్లాచెదురు చేశాడు. మైదానం నలువైపులా బంతులను తరలిస్తూ ఫీల్డర్లను పరుగులు పెట్టించాడు. 32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న కివీస్  కెప్టెన్.. ఆ తర్వాత మరింతగా చెలరేగిపోయాడు. ఆ తర్వాత మరో 5 ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు. మొత్తంగా 48 బంతులు ఎదుర్కొన్న విలియమ్సన్ 10 ఫోర్లు, 3  సిక్సర్లతో 85 పరుగులు చేసి అవుటయ్యాడు. ఓపెనర్లు మార్టిన్ గప్టిల్ 28, మిచెల్ 11, ఫలిప్స్ 18, నీషమ్ 13 పరుగులు చేశారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో న్యూజిలాండ్ నాలుగు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో హేజిల్‌వుడ్ 3 వికెట్లు తీసుకోగా, జంపాకు ఒక వికెట్ దక్కింది. 

పాలిటిక్స్ లోకి సోనూసూద్! పంజాబ్ ఎన్నికల్లో పోటీ..

సినిమాల్లో విలన్.. కాని నిజ జీవితంలో మాత్రం ఆయన హీరో.. ఇదంతా చెబుతోంది ఎవరి గురించో తెలిసింది కదూ... రీల్ విలన్.. రియల్ హీరోగా జనాల నుంచి నీరాజనాలు అందుకుంటున్న సోనుసూద్ గురించే. కరోనా టైమ్‌లో సోనూ సూద్ చాలా సేవ చేశారు. సాయం అంటే సోనూ సూద్.! సోనూ సూద్ అంటే సాయం అన్న రేంజ్‌లో మార్మోమోగింది. లాక్‌డౌన్‌లో చిక్కుకుపోయిన నిస్సహాయంగా ఉన్న వందలాది మంది వలసదారులను వారి స్వంత రాష్ట్రానికి తీసుకెళ్లడానికి సోనూ సూద్ బస్సులు, రైళ్లు, విమానాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం ప్రారంభంలో రెండవ వేవ్ సమయంలో, అతను కోవిడ్ రోగులకు ఆక్సిజన్‌ను సరఫరా చేశారు.ఏకంగా ఢిల్లీ ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్‌గానూ నియమించింది.  స్టార్‌హీరోలకు లేని క్రేజ్ ఆయన సొంతమైంది. సెలబ్రెటీలు సైతం సాహో అన్నారు. వెల్‌డన్‌ అంటూ అప్రిషియేట్ చేశారు.  తన అద్భుతమైన నటనతో పాటు కొవిడ్‌ సమయంలో విశేష సేవాకార్యక్రమాలతో ప్రజాదరణ పొందిన సోనూ సూద్‌ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారనే ప్రచారం చాలా రోజులుగా సాగుతోంది. సోను రాజకీయాల్లోకి రావాలంటూ కొందర డిమాండ్ కూడా చేశారు. కొన్ని పార్టీలు కూడా ఆయనను ఆహ్వానించినట్లు వార్తలు వచ్చాయి.  అయితే తనపై వస్తున్న  రాజకీయ వార్తలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చారు సోనుసూద్. తనను రాజకీయ నాయకులు, పార్టీలు సన్మానించినప్పటికీ, తన స్వచ్ఛంద సంస్థకు రాజకీయాలతో సంబంధం లేదని సోనూసూద్ ఎప్పుడూ చెబుతూనే ఉన్నారు.  ఇంతకాలం సైలెంట్ గా ఉన్న సోనూసూద్ పొలిటికల్ ఎంట్రీపై ఆదివారం కీలక ప్రకటన చేశారు. తన సోదరి మాళవిక సూద్‌ రాబోయే పంజాజ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే, ఆమె ఏ పార్టీలో చేరనున్నారనే అంశాన్ని మాత్రం సోనూసూదా వెల్లడించలేదు.‘‘మాళవిక పోటీకి సిద్ధమయ్యారు. ప్రజలకు సేవ చేయాలన్న ఆమె నిబద్ధత సాటిలేనిది. రాజకీయ పార్టీలో చేరాలనుకోవడం జీవితంలో తీసుకునే అతిపెద్ద నిర్ణయం. కేవలం సాధారణ సమావేశాలు మాత్రమే కాదు. ఇది పూర్తిగా సిద్ధాంతాలతో ముడిపడిన అంశం. ఏ పార్టీలో చేరనున్నారనేది సరైన సమయంలో ప్రకటిస్తాం’’ అని మోగాలోని తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో సోనూ సూద్‌ ప్రకటించారు. సోనూ సూద్‌ ఆయన సోదరి మాళవికతో కలిసి ఇటీవలే పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీని కలిశారు. గతంలో సోనూ సూద్‌ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌తోనూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అలాగే దిల్లీ ప్రభుత్వం చేపట్టిన ‘దేశ్‌ కా మెంటార్స్‌’ అనే కార్యక్రమానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గానూ వ్యవహరిస్తున్నారు. దీంతో సోనూ సోదరి మాళవిక కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారా.. ఆప్ నుంచి పోటీ చేస్తారా అన్నదానిపై క్లారిటీ రావడం లేదు. ఇండిపెండెంట్ గానూ పోటీ చేసే అవకాశం ఉందనే చర్చ కూడా సాగుతోంది. మొత్తంగా సోనూసూద్ సోదరి పొలిటికల్ ఎంట్రీ రాజకీయ వర్గాల్లో మాత్రం హాట్ టాపిక్ గా మారింది. 

బంజార రేడియో, యూట్యూబ్ చానల్ ప్రారంభం.. తెలుగువన్ పై ప్రశంసల వర్షం 

దేశంలో బంజారా జాతికి గొప్ప విశిష్టత ఉంది. సంస్కృతి, సంప్రదాయాలకు గిరిజనులు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నారు. అయితే ఇప్పటికీ బంజార బాష, సంస్కృతికి సమాజంలో సరైన గుర్తింపు లేదు. లంబాడాలు అభివృద్దికి ఆమడ దూరంలోనే ఉంటున్నారు. అందుకే దేశంలోనే తొలిసారిగా తెలుగు వన్ గొప్ప కార్యం చేపట్టింది. బంజార జాతి అభ్యున్నతి కోసం రెడియో , యూట్యాబ్ ఛానెల్ తీసుకొచ్చింది. హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో సేవాలాల్ ఉత్సవ కమిటీ మరియు స్వామి వివేకానంద సంఘ ఆధ్వర్యంలో నిర్వహించిన బంజార ఉత్సవ్ 2021లో ఈ చానెళ్లను లాంఛ్ చేశారు. బంజారా ఉత్సవ్ కు ముఖ్య అతిథిగా హాజరైన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా టోరీ గోర్ బంజార రేడియో మరియు యూట్యూబ్ చానెల్  ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో తెలుగు వన్ ఎండీ కంఠమనేని రవిశంకర్, మాజీ ఎంపీ రవీంద్రనాయక్, సేవాలాల్ ఉత్సవ కమిటీ చైర్మన్ అశోక్ రాథోడ్ పాల్గొన్నారు.  బంజారా భాష,సంస్కృతిని పెంపొందించే టోరీ గోర్ బంజార రేడియో మరియు యూట్యూబ్ చానెల్ ను లాంచ్ చేయడం ఎంతో ఆనందంగా ఉందని గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. రాష్ట్రంలో బంజారా జాతి అభివృద్ధి దిశలో ముందుకు పోవాలని కోరుకున్నారు. గిరిజన బిడ్డలు గొప్ప చదువులు చదివి ఉన్నంత ఉద్యోగాలను పొందాలని దత్తాత్రేయ ఆకాక్షించారు. బంజారా జాతి అభ్యున్నతి కోసమే దేశంలోనే తొలిసారిగా  బంజార రేడియో, యూట్యూబ్ ఛానల్ తీసుకొచ్చామని తెలుగు వన్ ఎండీ రవి శంకర్ చెప్పారు.  బంజారాలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బంజారలు అన్ని రంగాల్లో ఎదగాలన్నదే తెలుగు వన్ ఆశయమని చెప్పారు రవిశంకర్. బంజార బాష, సంస్కృతిని ప్రపంచానికి గొప్పగా పరిచయం చేసేందుకు తెలుగువన్ చేస్తున్న కృషి అమోఘమని  రవీంద్రనాయక్ ప్రశంసించారు. తెలుగు వన్ ఎండీ రవిశంకర్ ను ఆయన అభినందించారు.  ఇక బంజార ఉత్సవ్ లో గిరిజన జాతి ఔన్నత్యాని తెలిపేలా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. గిరిజన సంప్రాదాయాలు ఉట్టిపడేలా సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ఉత్సవాల్లో లంబాడి విన్యాసాలు, ఆటపాటలు అందరిని ఆకట్టుకున్నాయి. 

వైసీపీ అరాచకాలు.. అమిత్ షా హామీ.. అమ్మకానికో బడి.. టాప్ న్యూస్@7PM

కుప్పం ఎన్నికల్లో అరాచకాలపై ఎస్ఈసీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. కుప్పంలో ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా వైసీపీకి చెందిన స్థానికేతరులు తిష్ట వేశారని ఆక్షేపించారు. బోగస్ ఓట్లు, ఓటర్లను భయపెట్టేందుకు వైసీపీ ప్రణాళికలు రచిస్తోందని ఆరోపించారు. దొంగ ఓటర్లను అడ్డుకోవడంలో పోలీస్‌శాఖ తీవ్ర వైఫల్యం చెందిందని దుయ్యబట్టారు. ఎస్ఈసీ, డీజీపీలు వెంటనే చర్యలకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ------------ తిరుపతిలోని తాజ్‌ హోటల్‌ వేదికగా జరుగుతున్న సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి మాట్లాడుతూ పలు కీలక అంశాలపై ప్రస్తావించారు. ఆయన ప్రస్తావనకు తెచ్చిన అంశాలపై కేంద్ర మంత్రి, సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ అమిత్ షా స్పందించి.. హామీ ఇచ్చారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న అంశాలు రెండు రాష్ట్రాలవే కాదని.. ఇవి జాతీయ అంశాలని షా పేర్కొన్నారు. ------- ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మాజీ డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ప్రకంపనలు సృష్టిస్తోంది. హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకు సమాధానం దొరికిందని  టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. జగన్ అండ్ యూ కిల్డ్ వివేకా అని తెలిపోయింది విజయసాయిరెడ్డి అంటూ ట్వీట్ చేశారు. బాబాయ్ పై జగన్ రెడ్డి గొడ్డలిపోటును గుండెపోటు అని కవర్ చెయ్యబోయిన డాక్టర్ వీసా రెడ్డి అడ్డంగా దొరికిపోయాడని అయ్యన్న ఎద్దేవా చేశారు. ----------- ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ విమర్శలు కురిపించారు. అప్పుడు ‘అమ్మఒడి’, ఇప్పుడు ’అమ్మకానికో బడి’ అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఎయిడెడ్ స్కూళ్ల విలీనంపై ప్రభుత్వం జీవోను జారీ చేయడం సరైందికాదన్నారు. ఎయిడెడ్ విద్యా సంస్థల సరెండర్‌ను సులభతరం చేయడానికి నాలుగు ఆప్షన్స్ ఇచ్చిందంటూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.  ----------- జగన్ సర్కారుపై బీజేపీ నేత సునీల్ దేవదర్ అతి భక్తి ప్రదర్శించారు. రైతుల మహా పాదయాత్రలోఎవరూ పాల్గొనవద్దని ఏపీ బీజేపీ నేతలపై సునీల్ దేవదర్ ఒత్తిడి చేస్తున్నారు. రైతులకు మద్దతు పలకాల్సిన అవసరం లేదని సునీల్ దేవదర్ ఫోన్ చేసి చెప్తున్నట్లు తెలుస్తోంది. యాత్రను ఆడ్డుకోవాలని చూస్తున్న పోలీసులకు సహకరించేందుకే.. తమను ఆపే ప్రయత్నం చేస్తున్నారని ఏపీ బీజేపీ నేతలు అంటున్నారు --------- ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలాడుతున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. వడ్లు కొనేందుకు రూ. 10 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించలేదా? అని ప్రశ్నించారు. ధర్నాలు చేసేందుకు సీఎం కేసీఆర్ ఎందుకు బయటకు రాలేదన్నారు. ఢిల్లీ జంతర్ మంతర్‌లో ముఖ్యమంత్రి ఎందుకు దీక్ష చేయడం లేదన్నారు. వడ్లు కొనలేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎందుకు ఓట్లు వేయాలని నిలదీశారు. ----------- నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరుగుతోన్న బంజారా ఉత్సవ్ లో బండి సంజయ్, ఈటల తదితరులు పాల్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రతీ తండాల్లో సేవాలాల్ దేవాలయాన్ని నిర్మిస్తామని బండి చెప్పారు. గిరిజన రిజర్వేషన్లు కోసం పోరాడిన రవీంద్ర నాయక్ ను కేసీఆర్ అవమానించాడని బండి సంజయ్ మండిపడ్డారు. గిరిజనులను వేదిస్తోన్న కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ నుంచి తరిమి కొట్టాలని సంజయ్ అన్నారు. -----------  గ్యారాపత్తి ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ జరిపించాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేసింది. సీపీఐ మావోయిస్టు భద్రాద్రికొత్తగూడెం-తూర్పుగోదావరి డివిజన్‌ కమిటీ పేరుతో లేఖను విడుదల చేశారు. ఇరు రాష్ట్రాల సమన్వయంతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. మావోయిస్టు ఉద్యమాలను అణచివేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. పోలీసుల ద్వారా ఇన్‌ఫార్మర్‌ వ్యవస్థను పెంచి పోషిస్తున్నాయని మవోలు మండపడ్డారు. ---------- విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను తగ్గించడంతో పంజాబ్‌లో పెట్రోలు ధర, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతంలో డీజిల్ ధర భారీగా తగ్గాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్సయిజ్ డ్యూటీని పెట్రోలుపై లీటరుకు రూ.5 చొప్పున, డీజిల్‌పై లీటరుకు రూ.10 చొప్పున తగ్గించిన తర్వాత కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు వ్యాట్‌ను తగ్గించి, ప్రజలకు ఉపశమనం కల్పించాయి ---------- మధ్యప్రదేశ్ లోని భింద్ జిల్లాలో ఆశ్చర్యకర ఘటన జరిగింది. తన గేదె పాలివ్వడంలేదంటూ ఓ రైతు పోలీసులను ఆశ్రయించాడు. నవగాం గ్రామానికి చెందిన బాబూలాల్ జటావ్ వ్యవసాయదారుడు. ఆయనకు కొన్ని పాడిగేదెలు ఉన్నాయి. అయితే వాటిలో ఒకటి కొన్ని రోజులుగా పాలివ్వడంలేదంటూ బాబూలాల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. గేదెను కూడా పోలీస్ స్టేషన్ కు తోలుకు వెళ్లాడు. తన గేదెకు ఎవరో చేతబడి చేసి ఉంటారని, అందుకే పాలివ్వడంలేదని తెలిపాడు.

కుప్పకూలుతున్న ఆర్థిక వ్యవస్థ.. ఏపీలో త్వరలో ఎమర్జెన్సీ?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అడుగడుగునా ఎదురు దెబ్బలు తగులు తున్నాయి. అవమానాలు ఎదురవుతున్నాయి. రెండు మూడు  రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం సిగ్గుతో తలవంచుకునేలా జగన్ సర్కారు ముఖాన తలుపులు వేసింది. రాష్ట్రం దివాళా దారిలో పోతోందనే అర్థం వచ్చేలా, అదనపు రుణం పొందేందుకు అర్హత కోల్పోయిందని ప్రపంచం అంతటికీ తెలిసే విధంగా చాటింపు వేసింది. మూలధనం వ్యయం లక్ష్యాలను చేరుకోవడంలో జగన్ రెడ్డి ప్రభుత్వం  వెనకబడినట్లు కేంద్రం లెక్కలు చెప్పింది. ప్రస్తుత (2021-22) ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకు మూలధన వ్యయంలో 26 శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని,  రాష్ట్రంలో ఆస్తులను సృష్టించడంలో రాష్ట్రం వెనకబడిందని, అందుకే అదనపు రుణానికి ‘నో ఛాన్స్’ అంటూ తేల్చి చెప్పింది. ఆ విధంగా కేంద్రం అంతో ఇంతో అప్పు వేస్తుందని ఆశగా తలుపు తట్టిన జగన్ రెడ్డి ప్రభుత్వం ముఖం మీదనే కేంద్రం తలుపులు వేసింది.  తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ఆరోగ్యశాఖకు ఏ కంపెనీ కూడా వైద్య పరికరాలు సరఫరా చేయవద్దు అంటూ వైద్య పరికరాల ఉత్పత్తి దారుల జాతీయ యూనియన్‌ (ఏఐఎంఈడీ) తన అధికారిక వెబ్‌సైట్‌లో ‘రెడ్‌ నోటీస్‌’ జారీ చేసింది. వైద్య పరికరాలు సరఫరా చేసే కంపెనీలు.. ఆంధ్రాతో అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఆ నోటీసులో గట్టి సూచనలు చేసింది. జాతీయ స్థాయిలో ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఇంతవరకు అంతో ఇంతో మిగిలుందని అనుకుంటున్న ముఖ్యమత్రి జగన్ రెడ్డి ప్రభుత్వ పరువు పూర్తిగా తుడిచి పెట్టుకు పోయిందని రాజకీయ వర్గాలు బావిస్తున్నాయి. రాష్ట్రంలోనే కాదు, జాతీయ స్థాయిలో జగన్ ప్రభుత్వ పరువుతో పాటుగా, రాష్ట్రం పరువు, రాష్ట్ర ప్రజల పరువు కూడా చుక్క మిగలకుండా చక్కగా తుడిచి పెట్టుకు పోయిందని, విశ్లేషకులు భావిస్తున్నారు.     అయితే, ‘ఇంతటితో అయి పోలేదని అసలు కథ ముందుందని ఏపీ ప్రభుత్వ అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రముఖ ఆంగ్ల పత్రిక, ‘ఎకనమిక్ టైమ్స్’ ప్రచురించిన కథనం ప్రకారం, ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోవడం, రాష్ట్రంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి (ఫైనాన్సియల్ ఎమర్జెన్సీ) విధించడం  అనివార్యమయ్యే పరిస్థితులు తలెత్తడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదు ఎవరో వ్యక్తపరిచిన అభిప్రాయం కాదు. రాష్ట్ర ప్రభుత్వ   అధికారులే,రాష్ట్ర అర్తిఅక్ వ్యవస్థ కుప్ప కూలడం తధ్యమని,  అయితే ఎప్పుడు, అనేదే ప్రశ్నఅంటున్నారు.  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఓటి పడవలో ప్రయాణం సాగిస్తోంది. సో... పడవ మునకేయడం, ఖాయం. అయితే ఎప్పుడు, నవంబర్ చివరకే మునకేస్తుందా, సంవత్సరం చివరి వరకు సాగుతుందా అనేది ఇప్పుడు, మన ముందున్నప్రశ్న అని అధికారులు అంతర్గత చర్చల్లో చర్చిస్తున్నట్లు సమాచారం. అది ముందుముందు పుట్టే అప్పుల మీద ఆధారపడి ఉంటుందని, అధికారులు అంటున్నారు. ఇక ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఎప్పుడైనా రాష్ట్రంలో అర్తిక ఎమర్జెన్సీ విధించే అవకాశం  ఉందని, సీనియర్ అధికారులే చెపుతున్నారని పత్రిక సమాచారం. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం 2021 – 22 లో రాష్ట్ర రెవిన్యూలోటు కనీవినీ ఎరుగని రీతిలో, ఎకంగా. 662.80 శాతానికి చేరుకుంది.ద్రవ్య లోటు 107.79 శాతానికి చేరింది.  అలాగని రాష్రానికి ఆదాయం లేకుండా పోయిందని అనుకునే వీలులేదు. పన్నులు పెరగడంతో రెవెన్యూ ఆదాయం పెరుగుతోంది, కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్స్ రూపంలో రావలసినదానికంటే ఎంతో కొంత ఎక్కువగానే వస్తోంది. అయినా, ఇవేవీ కూడా రాష్ట్ర ఆర్థిక పతనాన్ని ఆపలేక పోతున్నాయని అధికారాలు అంటున్నారు. అంతేకాదు, ఆదాయ మార్గాలన్నీ మూసకు పోయాయి. ఖజానాకు డబ్బులు చేర్చే కాలువలు ఎండి  పోయాయని ఏపీ ఆర్థిక శాఖ అధికారులు పేర్కొన్నట్లు పత్రిక పేర్కొంది. అలాగని, రాష్ట్ర ఆదాయం అడుగంటి పోయిందని కాదు.. ఆదాయం ఉంది, ఆర్ధిక క్రమశిక్షణ లోపించిందని అధికారులు అంటున్నారు. కాగ్ నివేదిక ప్రకారం, రూ.38,914.18 కోట్ల ఋణంతో కలుపుకుని ప్రస్తుత ఆర్థిక  సంవత్సరం తొలి ఆరు మాసాలలో  రాష్ట్ర ఆదాయం, 1,04,804.91 కోట్లుగా ఉంది. అయితే ఆదాయంలో సగం, (రూ.50, 419.15 కోట్లు) సంక్షేమ పథకాలు, ఉచితాల పేరిట కరిగిపోతే, ఉద్యోగుల జీతాలు, సబ్సిడీలు, పాత అప్పుల మీద చెల్లించే వడ్డీలు అన్నీ కలుపుకుంటే, కాగ్ నివేదిక ప్రకారం,  మొత్తం ఖర్చు రూ.1,04,723.91  కోట్లకు చేరింది. అంటే నిండా వందకోట్లు కూడా, అభివృద్ధి కార్యక్రంలకు మిగలలేదు.  రాష్ట్ర ప్రభుత్వం 2021-22 వార్షిక బడ్జెట్’లో రూ.5,000.08కోట్ల రెవిన్యూ లోటును అంచనావేసింది.అయితే, ఏప్రిల్ – సెప్టెంబర్ మద్య కాలంలోనే, రెవిన్యూ లోటు రూ.33,140.62కోట్లకు (662.80శాతం)చేరింది. అదలా ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం తొలి ఆరు మాసాలలోనే వార్షిక లక్ష్యం, రూ.37,029.79 కోట్లకు మించి రూ.39,914.18 కోట్లు అప్పు చేసింది. నిజానికి గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే, ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ప్రభుత్వ ఆదాయం రూ.19,986.17 కోట్లు పెరిగింది. అయినా, బడ్జెట్’ లో ప్రతిపాదించిన  రూ. 30,571.53 కోట్లు పెట్టుబడి వ్యయంలో కేవలం రూ.6,419.51 కోట్లు మాత్రమే మొదటి ఆరు నెలల్లో ఖర్చు చేసింది, అంటే, అర్తిక వ్యవస్థ పట్టాలు తప్పి పరుగులు తీస్తోందని వేరే చెప్పనక్కర్లేదు. ప్రభుత్వం దృష్టి మొత్తం నగదు బదిలీ మీదనే కేంద్రీకృతం కావడంతో ఆర్థిక శాఖతో సహా ఏ ప్రభుత్వ శాఖ కూడా అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆలోచించడమే లేదని, అధికారులు అంటున్నారు. గత సంవత్సరం బడ్జెట్’లో  కాపిటల్ వర్క్స్ కోసంగా రూ.29,300.42 కోట్లు కేటాయిస్తే, అందులో ఖర్చు చేసింది రూ.18,385.49 కోట్లు మాత్రమే.  ఈ నేపధ్యంలోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సమీక్షించిన ఆర్థిక శాఖ అధికారులు, రాష్ట్ర ఆర్ధిక  వ్యవస్థ కుప్ప కూలేది ఖాయం అనే నిర్ణయానికి  వచ్చినట్లు సమాచారం. ఎటొచ్చి ఎప్పుడన్న విషయంలోనే సమావేశంలో ప్రదంగా చర్చ జరిగిందని సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు.ఆలాగే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్దంలో పరిస్థితి కొంత మెరుగు పడవచ్చని, కొందరు ధికారులలో చిన్ని చిన్నిఆశలు  ఉన్నా, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఒంటెద్దు పోకడలు కొనసాగిస్తే మాత్రం, కుబేరుడే దిగివచ్చిన ఎపీని కాపాడలేని  ఈ పరిస్థితిలో కేంద్రం జోక్యం చేసుకుని ఆర్ధిక ఎమర్జెన్సీ విధించడం ఒక్కటే, రాష్ట్రాన్ని రక్షించే తారక మంత్రం అవుతుందని అధికారులు అంటున్నారు. అదే జరిగితే, ఆర్థిక అత్యవసర పరిస్థితి కారణం కేంద్ర పాలన విధించిన తొలి రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర సృష్టిస్తుంది. ఆ ఘనత ఒక్క ఛాన్స్ జగన్ రెడ్డికే దక్కుతుంది.