పులివెందుల కోర్టుకు శివశంకర్ రెడ్డి.. అవినాష్ రెడ్డిని సీబీఐ ప్రశ్నిస్తుందా? 

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. వివేకా కారు డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్ మెంట్ ఆధారంగా సీీబఐ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో కీలక అనుమానితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సన్నిహితుడు,  వైసీపీ నేత, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని సీబీఐ హైదరాబాద్ లో అరెస్ట్ చేసింది. బుధవారం శివశంకర్ రెడ్డిని అదుపులోనికి తీసుకున్న సీబీఐ.. ఉస్మానియాలో వైద్యపరీక్షల తర్వాత మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచింది. తర్వాత ట్రాన్సిట్ వారెంట్‌పై శివశంకర్‌రెడ్డిని కడపకు తరలించింది సీబీఐ. పులివెందుల కోర్టులో శివశంకర్‌రెడ్డిని హాజరుపరచనుంది.  మరోవైపు వివేకా హత్య కేసులో అరెస్ట్ అయిన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి... సీబీఐకి లేఖ రాశారు. వివేకా హత్యకేసులో తన తండ్రికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ‘‘మూడు రోజుల కిందటే మా నాన్న భుజానికి ఆపరేషన్‌ జరిగింది. మా నాన్న భుజానికి ఇంకా నొప్పి ఉంది. ఆయన పనులు ఆయన చేసుకోలేక పోతున్నారు. మాకు న్యాయం చేయాలని’’ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి లేఖలో కోరారు. 

రాజు లేని రాజధానా? హైకోర్టు లేకుండా న్యాయ రాజధానా? హైకోర్టు సీజే సంచ‌ల‌నం..

జ్యుడీషియల్‌ క్యాపిటల్‌ అంటే ఏమిటి? ఏపీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా వ్యాఖ్యలు ఇవి. చీఫ్ జ‌స్టిస్‌కే జ్యూడీషియ‌ల్ క్యాపిట‌ల్‌పై క్లారిటీ రావ‌ట్లేదంటే సీఎం జ‌గ‌న్‌రెడ్డి మూడు ముక్క‌లాట ఎంత న్యాయ విరుద్ధంగా ఉందో అర్థ‌మైపోతోంది. ఇటీవ‌ల ఏపీ హైకోర్టుకు సీజేగా వ‌చ్చిన జ‌స్టిస్ ప్ర‌శాంత్‌కుమార్ మిశ్రా.. ఏపీ ప్ర‌భుత్వానికి షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఇటీవ‌ల అమ‌రావ‌తి రైతుల‌ది మాత్ర‌మే కాదు ఏపీ ప్ర‌జ‌లంద‌రి రాజ‌ధాని అంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన సీజే.. తాజాగా క‌ర్నూలులో న్యాయ రాజ‌ధానిపై స‌ర్కారును ప్ర‌శ్న‌ల‌తో క‌డిగేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.  రాజధాని వ్యాజ్యాల విచారణ సందర్భంగా హైకోర్టు విషయంలో చీఫ్‌ జస్టిస్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు జ్యుడీషియల్‌ క్యాపిటల్‌ అంటే ఏమిటంటూ పలు ప్రశ్నలు సంధించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన పాలనా వికేంద్రీకరణ చట్టంలో హైకోర్టు కర్నూలులో ఉండాలని స్పష్టత ఇవ్వలేదన్నారు. హైకోర్టు ప్రధాన బెంచ్‌ను అమరావతిలో ఏర్పాటు చేసేందుకు రాష్ట్రపతి నోటిఫికేషన్‌ ఇచ్చారని గుర్తు చేశారు. కేంద్రం నోటిఫికేషన్‌ ఇచ్చేంత వరకు అమరావతి నుంచి హైకోర్టును తరలించడానికి వీలుకాదన్నారు. అలాంటప్పుడు హైకోర్టు లేకుండా జ్యుడీషియల్‌ రాజధాని ఏర్పాటు ఎలా సాధ్యమని ప్రశ్నించారు. రాజు లేకుండా రాజధాని ఎలా సాధ్యమని వ్యాఖ్యానించారు.  హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేస్తామని వికేంద్రీకరణ చట్టంలో హామీ ఇచ్చినట్లు ఉందని, అలాంటి హామీని వికేంద్రీకరణ చట్టంలో పొందుపర్చవచ్చా అని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయం కర్నూలు, ఇతర ప్రాంతాల మధ్య విభేదాలు తెచ్చే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు.  పిటిష‌నర్ల త‌ర‌ఫు న్యాయ‌వాది వాదిస్తూ.. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్ర హైకోర్టు అమరావతిలో ఏర్పాటుకు రాష్ట్రపతి నోటిఫై చేశారని గుర్తు చేశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలంటే కేంద్రం నోటిఫికేషన్‌ ఇవ్వాలనీ, పునర్విభజన చట్టానికి సవరణ చేయాలన్నారు. పునర్విభజన చట్టం ప్రకారం ఇప్పటికే ప్రిన్సిపల్‌ బెంచ్‌ని అమరావతిలో ఏర్పాటు చేస్తూ రాష్ట్రపతి నోటిఫికేషన్‌ ఇచ్చినందున మరోసారి ఈ విషయంలో చట్టం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదని వాదించారు. అమరావతి విషయంలో ఒకసారి తీసుకున్న నిర్ణయం మార్చడానికి వీల్లేదన్నారు. అదే సూత్రం హైకోర్టుకు వర్తిస్తుందన్నారు. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ సమ్మతితో బెంచ్‌లు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందన్నారు. కోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తూ కర్నూలులో లోకాయిక్త, హెచ్‌ఆర్సీ ఏర్పాటు చేశారని చెప్పారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయవిభాగాలన్నీ ఒకచోట ఉంటేనే రాజధాని అవుతుందని వాదించారు. 

రోడ్డెక్కిన ముఖ్యమంత్రి.. యుద్ధం ఆపేదిలేదన్న కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి రోడ్డెక్కారు. రైతుల కోసమంటూ  ధర్నాకు దిగారు. ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఆందోళన చేస్తుండటం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. వరి ధాన్యం విషయంలో కొన్ని రోజులుగా కేంద్రంతో పోరాటం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అధికార పార్టీగా ఉండి కూడా ఇటీవలే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. తాజాగా ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వైఖరి స్పష్టం చేయాలంటూ అధికార టీఆర్‌ఎస్ పార్టీ  వద్ద మహాధర్నాకు దిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు.  మహాదర్నాలో మోడీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు కేసీఆర్. కేంద్రం తన విధానాలను మార్చుకోవాలన్న డిమాండ్‌తో ఈ యుద్ధాన్ని చేపట్టినట్టు తెలిపారు. ఈ యుద్ధం ఒక్కరోజుతో ఆగేది కాదు.. ఇది ఆరంభం మాత్రమేనని హెచ్చరించారు. వరి కొనుగోలు విషయంలో కేంద్రం ద్వంద్వ ప్రమాణాలను నిరసిస్తూ మహా ధర్నాకు దిగినట్టు కేసీఆర్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు.  కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు కేసీఆర్. ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటాన్ని స్పూర్తిగా తీసుకొని రైతులు పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం వైఖరి రైతులకు నష్టం చేకూర్చేలా ఉందని విమర్శించారు. కేంద్రం దిగివచ్చి రైతులకు న్యాయం చేసే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు.

కుప్పంను వైసీపీ కొల్ల‌గొట్టిందిలా.. అరాచ‌కం పీక్స్‌...

ప‌ది రోజులుగా ఒక‌టే పంతం. కుప్పం. చంద్ర‌బాబు ఆయువుప‌ట్టుపై దెబ్బ‌కొట్టాల‌నేదే వైసీపీ వ్యూహం. నోటిఫికేష‌న్ రాక‌ముందు నుంచే ప‌క్కాగా ప్లాన్ చేసింది. కుప్పం టీడీపీ నేత‌ల‌కు అడుగ‌డుగునా ఇబ్బందులు సృష్టించింది. అధికార పార్టీకి అగెనెస్ట్‌గా ఉంటే టార్గెట్ అవుతామ‌నేలా భ‌యంక‌ర వాతావ‌ర‌ణం క్రియేట్ చేసింది. ఇక నోటిఫికేష‌న్ వ‌చ్చాక‌.. అధికార ప‌క్షం మ‌రింత రెచ్చిపోయింది. బ‌లం, బ‌ల‌గం, డ‌బ్బు, ద‌బాయింపు.. కుప్పంలో కుంప‌టి రాజేశారు. ఏం చేసైనా స‌రే.. ఈ సారి కుప్పం మున్సిపాలిటీని టీడీపీ నుంచి లాక్కోవాల‌ని కుట్ర చేశారు. గ‌ట్టి పోటీ ఇచ్చానా.. వైసీపీ అరాచ‌కాల ముందు ప‌సుపు ద‌ళం నిల‌వ‌లేక‌పోయింది. కుప్పం ఫ‌లితం అధికార ప‌క్షానికి అనుకూలంగా వ‌చ్చినా.. ఆ ఫ‌లితం ఎన్ని దౌర్జ‌న్యాల ఫ‌ల‌మో అంద‌రికీ తెలిసిందే. కుప్పంలో గెలిచామ‌ని విర్ర‌వీగుతోంది వైసీపీ. ఇదంతా దొంగ ఓట్ల గెలుపేన‌ని టీడీపీ అంటోంది. నామినేషన్ల నుంచే భ‌యోత్పాతం మొద‌లుపెట్టింది అధికార పార్టీ. 25 వార్డులున్న పట్టణంలో ఒక స్థానాన్ని వైసీపీ ఏకగ్రీవం చేయించుకుంది. 24 వార్డులకు పోలింగ్‌ జరగ్గా.. 19 వైసీపీ, 6 టీడీపీ ఖాతాలో చేరాయి. కుప్పంలో గెలుపు కోసం అధికార, పోలీస్‌ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసిందని, ప్రచారం నుంచి పోలింగ్‌ వరకూ అక్రమాలకు పాల్పడిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.  కుప్పంలో పాగా వేసేందుకు వైసీపీ ముఖ్యనేతలు అక్కడే మోహరించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, పెద్దిరెడ్డి తమ్ముడు ద్వారకనాథరెడ్డితోపాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల ఛైర్మన్లు, మండల పార్టీ నేతలు మకాం వేశారు. ఓటర్లను వ్యక్తిగతంగా కలిసి తాయిలాలు, బెదిరింపుల‌కు దిగారు. వైసీపీకి ఓటు వేయకుంటే ప్రభుత్వ పథకాలు నిలిపివేస్తామంటూ వాలంటీర్లు, మెప్మా, వెలుగు సంఘాల ద్వారా ఓటర్లను భ‌య‌పెట్టారు.  టీడీపీ నాయకులను అరెస్టు చేసి రెండు రోజుల పాటు ప్రచారానికి ఆటంకం కలిగించారనే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. పోలింగ్‌కు ముందురోజు కొందరు నాయకులను అదుపులోకి తీసుకొని, తర్వాత వదిలేశారు. ఇలా భ‌యాభ్రాంతుల‌కు గురి చేయ‌డంతో టీడీపీ శ్రేణులు బాగా డీలా పడ్డాయని చెబుతున్నారు. టీడీపీ నుంచి మొద‌ట‌ అభ్యర్థులుగా ఎంచుకున్న కొందరు నాయకులు.. తర్వాత ఒత్తిళ్లకు తలొగ్గి పోటీకి ముందుకు రాకపోవడం, అప్పటికప్పుడు కొత్తవారిని బరిలో నిలపాల్సి రావడం, బూత్‌ ఏజెంట్లు బలహీనంగా ఉండటం వైసీపీకి కలిసొచ్చినట్టు చెబుతున్నారు. స్థానిక టీడీపీ నాయకులపై ఉన్న వ్యతిరేకత కూడా ప్రభావం చూపిందన్న అభిప్రాయాలూ ఉన్నాయి.  ఏమి చేసైనా.. ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేసైనా.. కుప్పంలో వైసీపీ గెలిచిన తీరు ఆ పార్టీకి గొప్పేమో కానీ.. ప్ర‌జ‌లు మాత్రం అధికార పార్టీ తీరును అస‌హ్యించుకుంటున్నారు.  

వైసీపీ గెలిచింది.. ప్రజాస్వామ్యం ఓడింది..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొత్త పుంతలు తొక్కు తున్నాయి.అరచాకమే రాజకీయం అనే స్థాయికి దిగజారుతున్నాయి. రాష్ట్రంలో సాగుతున్నఅరాచక పాలన వికృత రూపం అద్దంలో ప్రతిబింబంలా కనిపిస్తోంది. అయినా, అధికార వైసీపే ఎన్నికల విజయాలను చూసి మురిసిపోతోంది.అదే తమ ప్రభుత్వ పరమార్ధం అన్నట్లుగా,ఎన్నికలలో గెలుపు కోసం రాష్ట్ర భవిష్యత్’ను పణంగా పెట్టిన నిజాన్ని, మరుగు పరిచేందుకు అధికార పార్టీ వికారాలు ప్రదర్శిస్తోంది.   గ్రామా స్థాయినుంచి మున్సిపల్, కార్పొరేషన్ వరకు అంచెలవారీగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు ఎంత ‘చక్క’ గా జరిగాయో, పులివెందుల రాజకీయం ఎన్ని కొత్త పుంతలు తొక్కిందో ప్రపంచ మంతా చూసింది. ఛీ ..అంది అసహ్యించుకుంది. అయినా, ఈ అరాచక, అప్రజాస్వామ్య ఎన్నికల్లో అధికార వైసీపీ ‘గొప్ప’ విజయం సాధించిందని, అద్భుతాలు సృష్టించిందని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మొదలు మంత్రులు, వైసీపీ నాయకులు సంతోష పడుతున్నారు, సంబురాలు చేసుకుంటున్నారు.  ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అయితే, ‘దేవుడి’ దయతో వందకు 97 మార్కులు సాధించామని సంతోషాన్ని వ్యక్తం చేశారు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న చందంగా, ‘పనిచేస్తున్న’ ప్రభుత్వానికి అన్ని వర్గాల ప్రజలు అండగా నిలిచారని అన్నారు.  అయితే ఎన్నికలు జరిగిన తీరుతెన్నులను దగ్గర నుంచి చూసిన ప్రజాస్వామ్య వాదులు, రాజకీయ విశ్లేషకులు మాత్రం స్థానిక ఎన్నికల్లో ‘వైసీపీ గెలిచి ప్రజాస్వామ్యం ఓడి పోయింది’ని  అంటున్నారు.ఆవేదన వ్యక్త పరుస్తున్నారు. ప్రస్తుత మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలే కాదు, తిరుపతి, బద్వేల్ ఉపఎన్నికలు మొదలు రాష్ట్రంలో గత రెండున్నర సంవత్సరాలలో జరిగిన అన్ని ఎన్నికలు, ఉప ఎన్నికలు అన్నిట్లోనూ ప్రజాస్వామ్యం ఓడిపోయిందని, విశ్లేషకులు అంటున్నారు. ఆవేదన వ్యక్త పరుస్తున్నారు.  అదలా ఉంటే, ఈ ఎన్నికల్లో అధికార పార్టీ నిజంగా అంత గొప్ప విజయాన్ని సాధించిందా. ప్రజలు నిజంగానే అధికార పార్టీకి తిరుగులేని ఆధిక్యాన్ని కట్టబెట్టారా, అంటే, లేదు. గెలుపు ఘనంగా కనిపించినా ఓట్ల పరంగా చూస్తే, ఎన్నిక ఎన్నికకు వైసీపీ ఓటు దిగివస్తోంది. టీడీపీ ఓటు గ్రాఫ్ పైకి పాకుతోంది.  తాజాగా జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలనే తీసుకుంటే, మొత్తం 353 స్థానాలకు ఎన్నికలు జరిగితే, 28 బలవంతపు ఏకాగ్రీవాలు కలిపి వైసీపీ 261 స్థానాలు గెలుచుకుంది. ప్రధాన ప్రతిపక్షం 82 స్థానాలు, జనసేన ఐదు స్థానాలు, స్వతంత్ర అభ్యర్ధులు మరో ఐదు స్థానాలు గెలుచుకున్నారు. నెల్లూరు నగరపాలిక తో పాటుగా నాలుగు పురపాలికలు,ఎనిమిది నగర పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ పది  మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో స్పసప్ష్టమైన ఆధిక్యతను సాదించింది. ఇది పైకి కొంత ఘనంగా కనిపించినా, అధికార వైసీపీ, తెలుగు దేశం పార్టీల మధ్య ఓట్ల వ్యత్యాసాని పరిగణలోకి తీసుకుంటే, వైసీపే గెలుపులోని డొల్లతనం బయట పడుటిందని విశ్లేషకులు అంటున్నారు. రెండు పార్టీల  మధ్య ఓట్ల వ్యత్యాసం కేవలం రెండు శాతమే ఉందని, ఎన్నికల గణాంకాలు సూచిస్తున్నాయని, రాజకీయ  విశ్లేషకులు పేర్కొంటున్నారు. అధికార పార్టీ  రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అయితే ఈ ఎన్నికల్లో చోటు చేసుకున్న పరిణామాలు అధికార పార్టీకి ప్రమాదకరమైన సంకేతాలని హెచ్చరించారు. నిజమే, గత అసెంబ్లీ ఎన్నికలలో  వైసీపీ, టీడీపీల మధ్య ఇంచుమించుగా పది శాతం వరకు ఓట్ల వ్యత్యాసం ఉంది. ఇప్పుడు అది, రెండు శాతానికి పడిపోయింది అంటే, మున్సిపోల్స్ లో వైసీపీ గ్రాఫ్ ఎంత వేగంగా పడిపోతోందో అర్ధం చేసుకోవచ్చును. నిజానికి, వైసీపీ అధికారంలోకి వచ్చి ఇంకా రెండున్నర సంవత్సరాలే అయింది. మరో రెండున్నర సంవత్సరాలు మిగిలే వుంది. ఇంతలోనే గ్రాఫ్ ఇలా గల్లంతు అయితే, అసెంబ్లీ ఎన్నికల నాటికి, ఎక్కడికి దిగజారుతుందని, అధికార పార్టీ ఏమ్మేల్య్యేలే ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. అంతే కాదు, ఈ గెలుపు, గెలుపు కాదు, రేపటికి ఓటమికి ముందస్తు హెచ్చరిక మాత్రమే అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.  స్థానిక సంస్థలు,అసెంబ్లీ,ఉపఎన్నికల్లో సహజంగానే ప్రజలు అధికారా పార్టీ వైపు మొగ్గు చూపుతారు. ఆ విధంగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందే అదికార పార్టీకి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. అందుకు తోడు,అధికార పార్టీ, గత రికార్డులు అన్నిటినీ బద్దలు చేస్తూ, ఎన్నికల అక్రమాల చరిత్రను కొత్త మలుపు తిప్పింది. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసింది.  టీడీపీ అభ్యర్థులను పోటీ చేయకుండా ఉండేందుకు సామదానదండోపాయలను ప్రయోగించింది కుప్పం, నెల్లూరు  సహా అనేక చోట్ల అభ్యర్ధులు నామినేషన్లను విత్ డ్రా చేసుకునేలా భయాందోళనలు సృష్టించారు.చివరికి పొరుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక బస్సుల్లో తెచ్చిన జనాలతో దొంగ ఓట్లు వేయించారనే ఆరోపణలున్నాయి.అయినా, అవేవీ ఆశించిన విధంగా పనిచేయలేదు. అందుకే, ఈ ఎన్నికల ఫలితాలు అధికార ప్రతి కంటే ప్రతిపక్షాలకే అనుకూలంగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

తెలుగు స్టేట్స్‌పై ఎన్ఐఏ పంజా.. 14 చోట్ల అటాక్స్.. ఎందుకంటే..

గురువారం తెల్ల‌వారుతూనే తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిప‌డ్డాయి. ఎప్పుడూ లేనిది ఏపీ, తెలంగాణ‌పై ఏక‌కాలంలో ఎన్ఐఏ దాడులు చేసింది. తెల్ల‌వారుజామున 5 గంట‌ల‌కే చ‌క‌చ‌కా దిగిపోయారు ఎన్ఐఏ అధికారులు. 14 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు.  ఉగ్ర‌వాదులు, టెర్ర‌ర్ అటాక్స్‌, బాంబ్ బ్లాస్టింగులు, మావోయిస్టులు లాంటి దేశ విద్రోహ‌ ఘ‌ట‌న‌లను మాత్ర‌మే డీల్ చేసే ఎన్ఐఏకు తెలుగు రాష్ట్రాల్లో ఏం ప‌ని? ఏకంగా 14 ప్రాంతాల్లో సోదాలు చేయాల్సినంత సీరియ‌స్ మేట‌ర్ ఏముంది? అంటూ అంతా ఆరా తీయ‌డం మొద‌లుపెట్టారు. ఇంత‌కీ ఎన్ఐఏ దాడుల‌కు కార‌ణం ఏంటంటే... ఇటీవ‌ల మ‌ర‌ణించిన మావోయిస్టు కేంద్ర క‌మిటీ నేత ఆర్కేపై ఓ పుస్త‌కాన్ని రిలీజ్ చేయ‌బోయారు కొంద‌రు సానుభూతిప‌రులు. హైద‌రాబాద్‌లో ఆ బుక్ ప్రింటింగ్ జ‌ర‌గ్గా.. పోలీసులు దాడి చేసి మొత్తం సాహిత్యాన్ని సీజ్ చేశారు. ఆ ప్రింటింగ్ ప్రెస్.. పౌర‌హ‌క్కుల నాయ‌కురాలు సంధ్య భ‌ర్త‌దిగా గుర్తించారు. విష‌యం తెలిసి ఎన్ఐఏ రంగంలోకి దిగింది. ఆర్కే జీవిత చ‌రిత్ర గురించి పుస్త‌క‌మే ప్రింట్ చేశారంటే.. అంత‌ ఇన్ఫ‌ర్మేష‌న్ వారికి ఎక్క‌డి నుంచి వ‌చ్చింది? ఆర్కే గురించి అన్ని వివ‌రాలు ఎవ‌రికి తెలుసు? ఆర్కే గురించి అంత స‌మ‌చారం ఉన్న‌వారికి.. మావోయిస్టులు, వారి కార్య‌క‌లాపాల గురించి కూడా తెలిసుంటుందిగా? వారిని ప్ర‌శ్నిస్తే కీల‌క స‌మాచారం రాబట్టొచ్చుగా? అనే దిశ‌గా ఎన్ఐఏ విచార‌ణ చేప‌ట్టింది. అందులో భాగంగా తెలంగాణ‌, ఏపీలోకి ప‌లు ఇళ్ల‌పై ఎన్ఐఏ అధికారులు ఆక‌స్మిక దాడులు చేశారు.   ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులో విరసం నేత కల్యాణ్‌రావు ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. విశాఖపట్నం అరిలోవ కాలనీలోని న్యాయవాద దంపతులు శ్రీనివాసరావు, అన్నపూర్ణ ఇళ్లలోనూ ఎన్‌ఐఏ తనిఖీలు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌ నాగోల్‌లో రవిశర్మ, అనురాధ ఇళ్లలోనూ త‌నిఖీలు జరుగుతున్నాయి. మావోయిస్టులతో సంబంధాలు.. ఆర్కే జీవిత చరిత్రపై పుస్తకం ప్రచురించే విషయంలోనూ ఎన్‌ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు.  

టీడీపీకి 14 శాతం ఓట్లు హైక్.. జగన్ పతనం మొదలైందా? 

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకుంది. అయితే ఫలితాలను పూర్తి స్థాయిలో విశ్లేషిస్తే మాత్రం మినీ లోకల్ వార్ లో వైసీపీ గెలిచినా.. టీడీపీకి ఊరట దక్కిందనే అంచనాలే వస్తున్నాయి. బుధవారం వచ్చిన ఫలితాల్లో తెలుగు దేశం పార్టీకి గతంలో పోలిస్తే మెరుగైన ఫలితాలు వచ్చాయి. 2021 మార్చిలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలతో పోల్చితే.. టీడీపీ భారీగా పుంజుకుంది. అధికార వైసీపీ మాత్రం పెద్ద శాతంలో ఓట్లను కోల్పోయింది. తాజా ఫలితాల్లో  తెలుగుదేశానికి ఓట్లు శాతం పెరిగాయి. దొంగ ఓట్లు, దొంగ నోట్లు, దౌర్జన్యాలకు దిగినా టీడీపీ మంచి ఫలితాలు సాధించింది.దీంతో జగన్ పార్టీకి పతనం మొదలైందనే చర్చ సాగుతోంది.  మినీ లోకల్ వార్ లో ప్రకాశం జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు తెలుగుదేశం గట్టి పోటీ ఇచ్చింది. 2021 మార్చిలో 12 నగరపాలికలు, 75 పురపాలికలు, నగర పంచాయతీలలో 2,164 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో  వైసీపీకి 52.63 శాతం ఓట్లు, 82.60 శాతం సీట్లు వైసీపీ చేజిక్కించుకుంది. 2021 నవంబరులో అంటే 6 నెలల వ్యవధిలో జరిగిన ఒక నగరపాలిక, 12 మున్సిపల్, నగర పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ ఓట్ల శాతం 30.13 శాతం నుంచి సుమారు 44 నికి పెరిగింది . అంటే 6 నెలల్లోనే 14 శాతం ఓట్లు టీడీపీకి పెరిగాయి. అలాగే సీట్ల సంఖ్య 12.72 శాతం  నుంచి 25 శాతానికి దాదాపు 13 శాతం పెంచుకుంది తెలుగు దేశం పార్టీ.  12 మున్సిపాలిటీలకుగాను 7 మున్సిపాలిటీలలో టీడీపీ నువ్వా నేనా అన్న స్థాయిలో పోటీ ఇచ్చింది. దర్శి నగర పంచాయతీని కైవసం చేసుకోగా.. కొండపల్లి, జగ్గయ్యపేట మున్సిపాలిటీల్లో మెజార్జీ సీట్లు సాధించింది. గుంటూరు కార్పొరేషన్ లో జరిగిన ఒక డివిజన్ ఉప ఎన్నికలో టీడీపీ జయకేతనం ఎగురవేసింది.  6 నెలల వ్యవధిలోనే ఇంత భారీ స్థాయిలో తెలుగుదేశం సీట్లు, ఓట్లు పెరగడం వైసీపీకి పెద్ద దెబ్బే అంటున్నారు. ఇది వైసీపీపై వేగంగా పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతకు అద్దం పడుతోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తమపై ప్రజా వ్యతిరేకత పెరిగిందని గ్రహించిన వైసీపీ.. కుప్పం ఫలితాన్ని హైలెట్ చేసి ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. కుప్పం పోలింగ్ లో ఏం జరిగిందో రాష్ట్ర ప్రజలకు తెలుసంటున్నారు. కుప్పంలో దొంగ ఓట్లతోనే వైసీపీ గెలిచిందని అంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఫలితాలు తెలుగు దేశం పార్టీకి మంచి బూస్ట్ ఇచ్చాయంటున్నారు తమ్ముళ్లు, చంద్రబాబు నాయకత్వానికి ఓటర్లలో ఆదరణ పెరిగిందని చెబుతున్నారు.  మరోవైపు మినీ లోకల్ వార్ ఫలితాలపై రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చ సాగుతోంది. సహజనంగా ఏ ప్రభుత్వానికైనా చివరి సంవత్సరంలో వ్యతిరేకత వస్తుంది.. కానీ జగన్ రెడ్డి  ప్రభుత్వానికి మాత్రం రెండున్నరేళ్లలోనే భారీ స్థాయి వ్యతిరేకత కనిపిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  ఏపీ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని జనాలు నమ్ముతున్నారనే సంకేతం ఫలితాల ద్వారా వచ్చిందంటున్నారు. ఆయన వస్తేనే ఆంధ్రా నిలబడుతుందనే చర్చ జనాల్లో రోజురోజుకు పెరిగిపోతుందని రాజకీయ అనలిస్టులు చెబుతున్నారు, మొత్తంగా మినీ లోకల్ వార్ ఫలితాలు టీడీపీలో జోష్ నింపుతుండగా.. అధికార వైసీపీలో మాత్రం కలవరం రేపుతుందనే చర్చ అన్ని వర్గాల్లో సాగుతోంది.   

వివేకా గొడ్డలిపోటు సూత్రధారి ఎంపీ అవినాశ్ రెడ్డే!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. వివేకా కారు డ్రైవర్ ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్ మెంట్ ప్రకంపనలు రేపుతుండగా.. ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న వైసీపీ నేత దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. శివశంకర్ రెడ్డి అరెస్టుతో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని అంటున్నారు.  వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి టీడీపీ నేత నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వివేకా డ్రైవర్ దస్తగిరి వాంగ్మూలం మేరకు గొడ్డలిపోటు సూత్రధారి వైసీపీ ఎంపీ వైయస్ అవినాశ్ రెడ్డేనని ఆరోపించారు. హైదరాబాదులో  శివశంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేయడం అనుమానాలను మరింత బలపరుస్తోందని చెప్పారు. అవినాశ్ రెడ్డికి శివశంకర్ రెడ్డి అన్నీ తానై వ్యవహరించారని లోకేష్ అన్నారు. ఈ హత్యలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి శివశంకర్ రెడ్డి పాత్రపై ముందు నుంచి అనుమానాలు ఉన్నాయని చెప్పారు లోకేష్. ఈ కేసు నుంచి అవినాశ్ రెడ్డిని తప్పించేందుకు సిట్ బృందాన్ని జగన్ మార్చేశారని మండిపడ్డారు. సీబీఐ విచారణ వద్దన్నది కూడా జగనే అని దుయ్యబట్టారు. తన బులుగు మీడియాలో వైయస్సాసుర చరిత్ర గురించి జగన్ ఎప్పుడు రాయిస్తారని ప్రశ్నించారు.   

మీడియా చర్చలతో మరింత కాలుష్యం.. సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు  

దేశ రాజధాని ప్రాంతంలో కాలుష్యం కోరలు చాచింది. ఇది ఈ సంవత్సరమేవచ్చిన సమస్య కాదు, దశాబ్దాలుగా రాజధాని ప్రజలను వేదిస్తున్న సమస్య. ప్రతి సంవత్సరం చలికాలం రాగానే, కాలుష్యం కోరలు చాచి విరుచుకు పడడం,  రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, పర్యావరణ వేత్తల అవే డైలాగులు రీప్లే చేయడం అలవాటుగా మారిపోయింది. అలాగే, బాధితులు కోర్టులను ఆశ్రయించడం రోటీన్’గ జరిగి పోతున్నాయి. అయితే, ఈరోజు ఢిల్లీ కాలుష్యంపై సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు, మీడియా చర్చల ద్వారా విడులయ్యే కాలుష్యమే ఢిల్లీ కాలుష్యం కంటే ఎక్కువగా, ఎక్కువ ప్రమాద కారిగా మారిందని తీఫ్ర వ్యాఖ్యలు చేసింది.కోర్టు ముందుకు వచ్చిన అంశాలను డిబేట్లలో పరిగణనలోకి తీసుకోకపోవటమే అందుకు కారణంగా పేర్కొంది. ప్రతి ఒక్కరికి సొంత అజెండా ఉందని, ఆయా చర్చల్లో నిజమైన కారణాలు పక్కకు వెళ్లిపోతున్నాయని ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. చిన్న, సన్నకారు రైతులకు పంటవ్యర్థాలను తొలగించే యంత్రాలను ఉచితంగా పంపిణీ చేయాలని పర్యావరణ కార్యకర్త ఆదిత్య దుబే, న్యాయవిద్యార్థి అమన్ బంకా దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. మీడియా చర్చల్లో ప్రతి అంశాన్ని వివాదాస్పదంగా మార్చాలనుకుంటున్నారు. అలా జరిగితే నిందలు మాత్రమే మిగులుతాయి. ఇతరుల కంటే టీవీ ఛానళ్లలోని చర్చలే ఎక్కువగా కాలుష్యాన్ని కలిగిస్తున్నాయి. ఏం జరుగుతోంది, సమస్య ఏమిటి? అని వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. కోర్టులోని అంశాలు పక్కకు వెళ్లిపోతున్నాయి. ప్రతి ఒక్కరికీ సొంత అజెండా ఉంది. అలాంటి వాటివల్ల ఉపయోగం లేదు. మేము ఎలాంటి సాయం చేయలేం. నియంత్రించలేమని ధర్మాసనం పేర్కొంది.  పంట వ్యర్థాలను తగలబెట్టటం కాలుష్య కారకాల్లో ఒకటని, దానికి పరిష్కారం కనుగొనాలని డిల్లీ తరఫున హాజరైన సీనియర్ అడ్వకేట్ అభిశేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. అందుకు కేంద్ర ప్రభుత్వ గణాంకాలను చూపించారు. సింఘ్వీ వాదనలపై ఈ మేరకు స్పందించింది ధర్మాసనం.మరోవైపు.. టీవీ డిబేట్లను ప్రస్తావిస్తూ.. పంట వ్యర్థాలను తగలబెట్టే అంశంపై న్యాయస్థానాన్ని తాను తప్పుదోవపట్టిస్తున్నట్లు పేర్కొంటున్నారని కోర్టుకు తెలిపారు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. ' కొన్ని ఛానళ్లలో నాపై బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేయటం నేను చూశాను. పంట వ్యర్థాలను కాల్చటం వల్ల కేవలం 4-7 శాతం మేర మాత్రమే ఉందని చూపించటం ద్వారా నేను కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నట్లు చెప్పారు. దానిపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా.' అని పేర్కొన్నారు. అయితే.. తాము ఎప్పుడూ తప్పుదోవ పట్టలేదని, ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నప్పుడు అలాంటి విమర్శలు వస్తాయని ధర్మాసనం పేర్కొంది.

గవర్నర్ కు కొవిడ్.. దిగొచ్చిన జగన్.. కేసీఆర్ లేఖాస్త్రం.. టాప్ న్యూస్@7PM

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. 88 ఏళ్ల హరిచందన్ ఈ ఉదయం అస్వస్థతకు గురయ్యారు.  దీంతో, ఆయనను విజయవాడ నుంచి హైదరాబాదుకు ప్రత్యేక విమానంలో తరలించారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలోచేర్పించారు. ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం గవర్నర్ కు ఆక్సిజన్ అందిస్తున్నామని వైద్యులు తెలిపారు.------హైదరాబాద్ లాల్ బంగ్లాలో యోధ లైఫ్‌లైన్ డయోగ్నస్టిక్స్ సెంటర్‌ను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మెగాస్టార్‌ చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ వెంకయ్యనాయుడు రాష్ట్రపతి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు.  ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు చేస్తున్న సేవలు అనిర్వచనీయమని చిరంజీవి కొనియాడారు. ------- రాష్ట్రంలోని ఎయిడెడ్ సంస్థలు యథావిధిగా నడుపుకోవచ్చని సీఎం జగన్ తెలిపారు. విద్యారంగంపై సీఎం జగన్ సమీక్ష జరిపారు. సమీక్షలో జాతీయ విద్యా విధానం, అమలుపై చర్చించారు. రాష్ట్రంలో 2,663 ప్రాధమికోన్నత పాఠశాలలను హైస్కూళ్ళలో విలీనం చేశామని అధికారులు తెలిపారు. విలీనం చేసినా దాతల పేర్లు కొనసాగిస్తామని సీఎం పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా విద్యార్థులు చేస్తున్న ఆందోళనల దెబ్బకు సర్కార్ దిగివచ్చింది. --------- వైసీపీ గెలుపుపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. కుప్పంలో వైసీపీ గెలిచిన గెలుపు ఒక గెలుపా? అని ప్రశ్నించారు. మంత్రులు సంబరాలు జరుపుకోవడం సిగ్గుచేటన్నారు. దొంగ ఓట్లతో గెలిచి మంత్రులు బొకేలు ఇచ్చు కోవడం దారుణమన్నారు. టీడీపీ కార్యకర్తలు చేసిన పోరాటాన్ని అభినందిస్తున్నామని చెప్పారు. ఈ రోజు వైసీపీ విజయాలను డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు ఇవ్వాలన్నారు. డీజీపీ లేకపోతే వైసీపీ గెలిచేది కాదన్నారు ------- వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో కీలక అనుమానితుడిగా ఉన్న దేవిరెడ్డి శంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. వివేకానందారెడ్డి మాజీ డ్రైవర్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా దేవిరెడ్డి శంకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం దేవిరెడ్డిని అరెస్ట్ చేస్తున్నట్లు కుటుంబ సభ్యులకు వారెంట్ ఇచ్చారు. దేవిరెడ్డి శంకర్ రెడ్డి కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి అత్యంత సన్నిహితుడని తెలుస్తోంది.  -------- పంజాబ్‌ తరహాలో తెలంగాణలో ధాన్యాన్ని సేకరించాలని  కోరుతూ ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. రబీ ధాన్యాన్ని కొనేలా ఎఫ్‌సీఐకి ఆదేశాలు ఇవ్వాలన్నారు. తెలంగాణ నుంచి ఎంత మొత్తంలో కొనుగోలు చేస్తారో స్పష్టం చేయాలని కేసీఆర్ కోరారు. ఖరీఫ్‌లో 55.75 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం దిగుబడి వచ్చిందన్నారు. వచ్చే రబీలో ఎంత ధాన్యం సేకరిస్తారో ముందే ప్రకటించాలన్నారు కేసీఆర్.  -------- గతంలో కేంద్రానికి అనేక బిల్లుల విషయంలో పార్లమెంట్‌లో టీఆర్ఎస్ ఎంపీలు సహకరించారని బీజేపీ రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్‌ అన్నారు. ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్రాన్ని బ్లేమ్ చేయడం సరికాదన్నారు. వ్యక్తిగత అవసరాల కోసం‌ కొందరు ధాన్యం అంశాన్ని వాడుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణలో టూరిజం అభివృద్ధిలో సహకరిస్తామని ఆయన తెలిపారు.  ------ మెదక్ జిల్లా అచ్చంపేటలో జమునా హెచరీస్ ముందు దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈటల కుటుంబీకుల ఆధీనంలోని ప్రభుత్వ భూమిని దళితులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆందోళనకు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. హామీతో దళితులు ఆందోళనలు విరమించారు.  ----- మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీబ్ బెనర్జీ న్యాయస్థానం ఉద్యోగులు, తదితరులకు సంచలన సందేశం ఇచ్చారు. ఈ న్యాయస్థానంలో ఫ్యూడల్ సంస్కృతిని ధ్వంసం చేయలేకపోయినందుకు తాను తీవ్రంగా విచారిస్తున్నానని చెప్పారు. తనకు సంపూర్ణ సహకారం అందించిన హైకోర్టు ఉద్యోగులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఈ న్యాయస్థానంలో ఫ్యూడల్ సంస్కృతిని పూర్తిగా నిర్మూలించలేకపోయినందుకు విచారిస్తున్నానని చెప్పారు.  -------- ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ఇంట విషాదం నెలకొంది. ఆయన సోదరుడు రంగస్వామి నాయుడు తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 63 సంవత్సరాలు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. రంగస్వామి నాయుడు మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.   

కేసీఆర్ ఛానెల్‌కు ఆంధ్రా సీఈవో.. క్యా బాత్ హై!

నిధులు మ‌న‌వి.. నీళ్లు మ‌న‌వి.. నియామ‌కాలు మ‌న‌వే.. ఉద్య‌మ స‌మ‌యంలో మంచి మంచి స్లోగ‌న్స్ ఇచ్చారు. అంద‌ల‌మెక్కాక సంబంధం లేని ప‌నులు చేస్తున్నారు. తెలంగాణ నీటి ప్రాజెక్టుల‌న్నీ దాదాపు ఆంధ్రా కాంట్రాక్ట‌ర్ల‌కే క‌ట్ట‌బెట్టారు కేసీఆర్‌. ఇక నియామ‌కాలు అస‌లే లేవు. నిధులు ఆయ‌న జేబుల్లోనే వేసుకుంటున్నార‌నే ఆరోప‌ణ‌లు. ఇక‌ ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల సంగ‌తి ప‌క్క‌న‌పెడితే.. త‌న సొంత వ్యాపారాల్లోనూ ఆంధ్రా వారికే పెద్ద‌పీట వేస్తున్నారు గులాబీ బాస్‌. తాజాగా, త‌న అధికార ఛానెల్‌.. టీ న్యూస్‌ సీఈవోగా ఆంధ్రా వ్య‌క్తిని నియ‌మించుకున్నారు.  మొద‌ట్లో న‌మ‌స్తే తెలంగాణ‌ను క‌ట్టా శేఖ‌ర్‌రెడ్డి.. టీ న్యూస్‌ను నారాయ‌ణ‌రెడ్డి.. చేతుల్లో పెట్టారు కేసీఆర్‌. చాలా ఏళ్లు వాళ్లే పింక్ మీడియాను న‌డిపించారు. అయితే, రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరాక‌.. రెడ్ల వ‌ర్గ‌మంతా ఏక‌మ‌వుతోంద‌నే అనుమానంతో.. త‌న మీడియా హౌజ్ నుంచి రెడ్లను చాక‌చ‌క్యంగా సైడ్ చేశారు. శేఖ‌ర్‌రెడ్డి, నారాయ‌ణ‌రెడ్డిల‌కు నామినేటెడ్ పోస్టులు క‌ట్ట‌బెట్టి హుందాగా త‌ప్పించారు. సంస్థ‌లోని రెడ్డి ఉద్యోగులను తొల‌గించ‌డ‌మో, ప్రాధాన్య‌త త‌గ్గించ‌డ‌మో చేశారు. న‌మ‌స్తే తెలంగాణ సీఈవోగా ఆంధ్ర‌జ్యోతికి చెందిన తీగుళ్ల కృష్ణ‌మూర్తికి గ‌తంలోనే బాధ్య‌త‌లు అప్ప‌గించారు. తాజాగా, తీగుళ్లకు సన్నిహితుడైన వి.సుందర రామ శాస్త్రి అలియాస్ వీఎస్ఆర్ శాస్త్రిని టీ న్యూస్ కొత్త సీఈవోగా నియమించ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామం. ఎందుకంటే ఆయ‌నది ఆంధ్రా నేప‌ధ్యం కాబ‌ట్టి.  ఈనాడులో ఉన్న‌త స్థానంలో ప‌ని చేసిన శాస్త్రి ఆ త‌ర్వాత ఎన్టీవీలో కీల‌క బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. ఇప్పుడు ఆయ‌న టీ న్యూస్ సీఈవో అయ్యారు. మీడియాలో చాలా చాల సీనియ‌ర్ ఆయ‌న‌. వ‌య‌సుకు త‌గ్గ‌ట్టే.. చాద‌స్త‌మూ ఎక్కువే అంటారు. అలాంటి వెట‌ర‌న్ జర్న‌లిస్ట్‌ను టీ న్యూస్ సీఈవో సీట్లో కూర్చోబెట్ట‌డంలో కేసీఆర్ లెక్క ఏమై ఉంటుందో? ఆంధ్ర‌పై అక్క‌సు వెళ్ల‌గ‌క్కే టీ న్యూస్ ప‌గ్గాలను ఆంధ్రా లేబుల్‌ ఉన్న వ్య‌క్తి చేతిలో పెట్ట‌డం అనూహ్యం.  ఇక‌, న‌మ‌స్తే తెలంగాణ‌, టీ న్యూస్.. ఇద్ద‌రు సీఈవోలు బ్ర‌హ్మ‌ణ వ‌ర్గ‌మే కావ‌డం ఆస‌క్తిక‌రం. మరోవైపు టీ న్యూస్ ఇన్‌పుట్ ఎడిటర్‌గా చానల్‌లో కీ రోల్ ప్లే చేస్తున్న పి.వి.శ్రీనివాస్ లేటెస్ట్‌గా రాజీనామా చేశారు. ఆయనను ఎమ్మెల్సీ చేస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. 

మున్సిపోల్స్ లో  ఓడి గెలిచిన టీడీపీ.. శభాష్ తమ్ముళ్లు 

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకుంది. చంద్రబాబు కోట కుప్పంలోనూ పాగా వేసింది. పెనుగోండలో ఫ్యాన్ గాలి వీచింది. అయితే మినీ లోకల్ వార్ లో వైసీపీ గెలిచినా... టీడీపీకి ఊరట దక్కిందనే అంచనాలే రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తున్నాయి. మినీ లోకల్ వార్ లో టీడీపీకి  గతంలో పోలిస్తే మెరుగైన ఫలితాలు వచ్చాయి. ఇంతకు ముందు పూర్తి స్థాయిలో జరిగిన మున్సిపల్ , పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో చెప్పుకోవడానికి కూడా సరైన ఫలితాలు రాలేదు. కానీ మినీ లోకల్ వార్‌లో మాత్రం మంచి ఫలితాలే వచ్చాయి. దర్శి నగర పంచాయతీని కైవసం చేసుకుంది. దాదాపు అన్ని నగర పంచాయతీల్లోనూ గట్టి పోటీ ఇచ్చింది.  దొంగ ఓట్లు వేయించారనే ఆరోపణలు ఉన్న కుప్పంలో  మొత్తం 25 వార్డుల్లో 19 చోట్ల వైసీపీ అభ్యర్థులు గెలిచారు. నెల్లూరు కార్పొరేషన్‌లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఒక్క డివిజన్ కూడా టీడీపీకి రాలేదు. పెనుకొండ, బుచ్చి నగర పంచాయతీల్లో రెండు చోట్ల వార్డు సభ్యులు గెలిచారు. మిగిలిన చోట్ల టీడీపీకి మంచి ఫలితాలు వచ్చాయి. అసలు టీడీపీకి నాయకుడే లేని నియోజకవర్గం అయిన దర్శి నగర పంచాయతీని టీడీపీ గెల్చుకుంది. అక్కడ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు అందరూ వైసీపీలోనే ఉన్నారు. అయినా టీడీపీ గెలిచింది.  పోటీ చేయడానికే టీడీపీకి గడ్డు పరిస్థితులు ఎదురైన దాచేపల్లిలో హోరాహోరీ పోరు జరిగింది. కొద్దిలో టీడీపీ విజయం మిస్ అయింది. ఇక కృష్ణా జిల్లాలోని కొండపల్లి, జగ్గయ్యపేట మున్సిపాలిటీల్లో  ఫలితాలే సాధించారు. గుంటూరులో ఆరో వార్డుకు జరిగిన ఉపఎన్నికలో టీడీపీ గెలిచింది. వైసీపీ నేతలు తాడో పేడో అన్నట్లుగా తీసుకుని పెద్ద ఎత్తున ఖర్చుకు వెనుకాడని చోట వైసీపీ విజయాలు సాధించింది. అలా కాకుండా లైట్‌ తీసుకున్న చోట టీడీపీ విజయం సాధించింది. మినీ లోకల్ వార్ ఫలితాలు టీడీపీ నేతల్లో కాస్త ఆశలు నింపుతున్నాయి. ఇన్ని నిర్బంధాలు.. ఎలాంటి వనరులు లేని పరిస్థితుల్లోనూ టీడీపీకి ఈ మాత్రం ఓట్లు రావడం వైసీపీ నేతలను కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది. వైసీపీ పతనానికి ఇది నాంది అని అంటున్నారు తమ్ముళ్లు. 

టీడీపీకి భారీగా పెరిగిన ఓటింగ్.. వైసీపీలో గుబుల్‌..

"వైసీపీ నాయకుల బెదిరింపులకు భయపడి బేతంచర్లలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి టీడీపీ తరఫున ఒక్క నాయకుడు లేడు. ఇన్‌ఛార్జిని నియమించి అభ్యర్థులను పోటీలో పెడితే ఆరు స్థానాలు గెలిచాం. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సొంత వార్డులో వైసీపీ ఓడిపోయింది. ప్రజల్లో మార్పు మొదలైంది. 7 నెలల్లో టీడీపీకి 13శాతం ఓటింగ్‌ పెరిగింది. దమ్ముంటే వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలి.. మళ్లీ మీరు గెలిస్తే పార్టీ మూసేస్తాం" అని అచ్చెన్నాయుడు సవాల్‌ విసిరారు.   డబ్బు, అధికారం, పోలీసులు, వాలంటీర్లను ఉపయోగించి మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీ గెలిచిందని టీడీపీ  రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. కుప్పంలో వైసీపీ గెలుపును ఎవరూ లెక్కలోకి తీసుకోవడం లేదన్నారు. ప్రభుత్వం, పోలీసులు, డబ్బు, మంత్రులు, ప్రతి ఒక్కరూ అక్కడే ఉండి దొంగ ఓట్లు వేయించి గెలిచారని.. కుప్పంలో వైసీపీ గెలిచిన‌ట్టు కాద‌న్నారు అచ్చెన్న‌.  "విశాఖపట్నంలో మోసం చేసి గెలిచారు. దాచేపల్లిలో టీడీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థులే లేరని ప్రగల్భాలు పలికారు. దాచేపల్లిలో అనేక ఇబ్బందులు పెట్టారు ఏమైంది? 11 వార్డుల్లో వైసీపీ గెలిస్తే, తొమ్మిది వార్డుల్లో టీడీపీ గెలిచింది. జ‌గ్గ‌య్య‌పేట‌లో రీకౌంటింగ్ కోసం దౌర్జ‌న్యం చేశారు. రెండు.. మూడు స్థానాల్లో ఫలితాలు తారుమారు చేశారు. ప్రజలు వైసీపీ వైపు ఉంటే ఎందుకు భయపడుతున్నారు?" అని ప్ర‌శ్నించారు అచ్చెన్నాయుడు.

ఏపీలో ఆట మొదలైంది.. కమల దళంలోకి  RRR?

కేంద్ర హోం మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు అమిత్ షా ఏపీ పై సంధించిన ఆకర్షణ అస్త్రం పని చేయడం మొదలైంది... వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు, బీజేపీలో చేరేందుకు సిద్దమయినట్లు తెలుస్తోంది. రఘురామ ఈ సంవత్సరం చివర్లో వైసీపీకి, పార్లమెంట్ సభ్యత్వాని రాజీనామా చేసి, డిసెంబర్ 25న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి రోజున బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ తర్వాత నెస్ట్ ఇయర్ ఫిబ్రవరి మార్చి నెలల్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు  జరిగే  ఉపఎన్నికల్లో నర్సాపూర్ నుంచి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తారని పార్టీ వర్గాల ద్వారాతెలుస్తోంది. నిజానికి, అమిత్ షా ఏపీ పర్యటనకు ముందే, ఆయన అభిమానులు  ‘ట్రిపుల్  ఆర్’గా పిలుచుకుంటున్న రఘురామ కృష్ణంరాజు, పార్టీ ఎంట్రీకి సంబందించిన స్కెచ్ సిద్దమైందని తెలుస్తోంది. గతంలో చాలా కాలం క్రితమే ఆయన బీజేపీలో చేరేందుకు అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నడ్డా వద్ద సంసిద్ధతను వ్యక్త పరిచారు. అయితే, అప్పట్లో ఒకరిద్దరు రాష్ట్ర నాయకులు అడ్డుపుల్లలు వేయడంతో ఆ ప్రయత్నం అప్పట్లో ఆగిపోయిందని పార్టీ వర్గాల సమాచారం.   నిజానికి, రఘురామ కృష్ణం రాజు వైసీపీపై తిరుగుబాటు బావుటా ఎగరేసిననాటి నుంచి కమల దళంతో,కాషాయ కూటమి,సంఘ్ పరివార్’తో రాసుకు పూసుకు తిరుగుతున్నారు.బీజేపీ నాయకులనే కాకుండా ఆర్ఎస్ఎస్ అగ్ర నేతలతో అనేక సందర్భాలలతో సమావేసమయ్యారు అలాగే,అనేక సందర్భాలలో బీజేపీ హిందుత్వ ఎజెండాను తమనోటితో వినిపించారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం మత వివక్షకు పాల్పడుతోందని విమర్శించారు. తిరుపతి వెంకన్న స్వామి ఆస్తుల విక్రయానికి టీటీడీ చేసిన తీర్మానాన్ని బహిరంగంగా వ్యతిరేకించడంతోనే రెబెల్ ఎంపీ రాజు తిరుగుబాటుకు శ్రీకారం చుట్టారు.  రాష్ట్రంలో జగన్ రెడ్డి పాలనలో నిబంధనలకు వ్యతిరేకంగా జరుగతున్న మత ప్రచారం, మత మార్పిడులకు సంబంధించి, ప్రధానికి, రాష్ట్రపతికి ఫిర్యాదులు, విజ్ఞాపనలు అందజేశారు.  అదలా ఉంటే ఇంచుమించుగా ఒక సంవత్సరానికి పైగానే, ఆయన ప్రతి రోజు రచ్చబండలో జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉతికి ఆరేస్తున్నారు. చురకలు అంటిస్తున్నారు. వాతలు పెడుతున్నారు. చివరకు దమ్ముంటే, తన పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయించాలని, జగన్ రెడ్డికి సవాల్ విసిరారు. వైసీపీ కూడా, ఆయన్ని అనర్హునిగా ప్రకటించాలని కోరుతూ లోక్ సభ స్పీకర్’కు విజ్ఞప్తి చేసింది. మరో వంక జగన్ రెడ్డి ప్రభుత్వం రఘురామ పై కేసులు పెట్టి అరెస్ట్ చేసింది. జైలుకు పంపింది. బైలు రాకుండా అడ్డుకుంది. అంతే కాదు, జైలులో  చిత్ర హింసలకు గురిచేసిందని ఆయన కోర్టులో కేసు వేశారు.ఇలా జగన్ రెడ్డిపై ఓ వంక రాజకీయ పోరాటం, మరో వంక న్యాయపోరాటం చేస్తున్నారు.మొత్తానికి వార్తల్లో ఎంపీ గా అందరి నోళ్ళలో నలుగుతున్నారు. జగన్ రెడ్డికి పంతికిండి రాయిలా, కంట్లో నలుసులా ఇబ్బంది పెడుతున్నారు.  ఇక ఇప్పుడు, స్వయంగా అమిత్ షా ఇతర పార్టీల నుంచి వచ్చేవాళ్ళను పార్టీలోకి తెచ్చుకుని వారికి సముచిత స్థానం కలిపించాలని, ఆ విధంగా రాష్ట్రంలో బీజేపీని, 2024 ఎన్నికలలో అధికారమే లక్ష్యంగా బలోపేతంచేయాలని రాష్ట్ర నాయకులకు క్లాసు తీసుకున్నారు. ఈ నేపధ్యంలో.. అందుకు తొలి అడుగుగా ‘ట్రిపుల్ ఆర్’తో అమిత్ షానే శ్రీకారం చుట్టారని అంటున్నారు. అయితే, రఘురామ రాకతోనే, రాష్ట్రంలో బీజేపీ రెండు బలమైన ప్రాతీయ పార్టీలు టీడీపీ, వైసీపీలను ఎదిరించి అధికారం అందుకోగలుగుతుందా, అంటే అది అంత ఈజీ వ్యవహారం కాదని అంటున్నారు పరిశీలకులు. అదెలాగున్నప్పటికీ, బీజేపీ, ఎన్నికలకు రెండున్నర సంవత్సరాల ముందుగానే ఏపీ మీద దృష్టి పెట్టింది. అలాగే, పొరుగు తెలుగు రాష్రం తెలంగాణలోనూ కమల దళం కదులుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాలలో బెంగాల్ ఫార్ములా అమలు చేసేందుకు బీజేపీ సిద్ధమైందని అంటున్నారు. మొతానికి ఏపీలో షా ఆట మొదలైంది.. కొత్త రాజకీయం మొదలైంది. ఇక ఇది ఏ మలుపు తిరుగుతుంది. ఎక్కడకు పోతుంది అనేది కాలమే నిర్ణయిస్తుందని విశ్లేషకులు అంటున్నారు.

దొంగ ఓట్లతో గెలిచి సంబరమా! 

ఏపీలో జరిగిన నెల్లూరు కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు ముగిసింది. టీడీపీ అదినేత చంద్రబాబు నియోజకవర్గంలో కుప్పంలో అనూహ్యంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. దీంతో జగన్ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. కుప్పంలో చంద్రబాబును ఓడించామన్నారు మంత్రి పెద్దిరెడ్డి.  కుప్పం ఫలితంపై తెలుగు దేశం పార్టీ స్పందించింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తొలిరోజు నుంచి కుప్పంలో వైసీపీ అరాచకాలకు పాల్పడిందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. చేతకాని ఎన్నికల సంఘం టీడీపీ ఓటమికి కారణమని విమర్శించారు. పోలీసు వ్యవస్థ వైసీపీకి ప్రత్యక్షంగా సపోర్ట్ చేసిందని చెప్పారు. ఈ ఎన్నికల్లో నైతిక గెలుపు టీడీపీదే అన్నారు అచ్చెన్నాయుడు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అచ్చెన్నాయుడు మండిపడ్డారు. పెద్దిరెడ్డి దొంగ ఓట్ల మంత్రి అని దుయ్యబట్టారు. పక్కనున్న నియోజకవర్గాల నుంచి పెద్దిరెడ్డి దొంగ ఓటర్లను తెప్పించి ఓట్లు వేయించారని మండిపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ ప్రజాదరణను కోల్పోయిందని... ఎన్నికల ప్రక్రియ సక్రమంగా జరిగితే వైసీపీ ఘోరంగా ఓడిపోతుందని అచ్చెన్నాయుడు చెప్పారు.

జగన్ సర్కార్ కు బిగ్ షాక్.. అప్పుల వసూలుకు రాష్ట్రానికి కేంద్ర అధికారులు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకు పోయింది. ఇంతలా అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి నవరత్నాలు, సంక్షేమ ఉచిత తాయిలాలు ప్లస్ వైసీపే ట్రేడ్ మార్క్ అవినీతి కారణమా, లేక ఇంకైదైనా కారణమా, అంటే, అది వేరే చర్చ. ఈ అన్నిటితో పాటు, ఇంకొన్ని కలుపుకుని మొత్తంగా  కర్ణుడి చావుకు  ఉన్నని కారణాలే ఉండవచ్చును. అయితే, ఇప్పుడు విషయం అది కాదు. అప్పులు ఇచ్చిన వాళ్ళు వచ్చి సర్కార్ తలుపులు తట్టే పరిస్థితికి రాష్ట్ర ప్రతిష్ట దిగజారి పోయింది.  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర విద్యుత్ సంస్థలు, గ్రామీణ విద్యుత్ సంస్థ, విద్యుత్ ఆర్ధిక సహాయ  సంస్థల నుంచి అందిన కాడికి అప్పులు తెచ్చుకుంది. అలా తెచ్చిన రుణాలను ఇంకేందుకో వాడుకుంది. ఇప్పుడు అ  అప్పులు తడిసి మోపెడయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం గడువులోగా అప్పులు తిరిగి చెల్లించలేదు. పొడిగింపులు ఇచ్చినా ఫలితం లేక పోయింది. చివరకు  అప్పులు తిరిగి చెల్లించే పరిస్థితిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లేదనే విషయం కేంద్ర సంస్థలు కొంచెం ఆలస్యంగానే అయినా గుర్తిచాయి కావచ్చును, మరోదారి లేక అప్పు వసూలుకోసం ఇంతకు ముందు ఎప్పుడు లేని విధంగా కేంద్ర సంస్థల సీఈఓలు రాష్ట్రానికి వచ్చారు. నిన్న(మంగళవారం) సాయంత్రమే కేంద్ర విద్యుత్ సంస్థల అధికారులు అప్పుల వసూలుకు విజయవాడ చేరుకున్నారని, తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ చెప్పారు.  నిజానికి, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాటి నుంచి, అన్ని రంగాలలోనూ అనాలోచిత నిర్ణయాలనే తీసుకుంటోంది. ఆర్థిక క్రమశిక్షణ అనే పదాన్ని ప్రభుత్వ నిఘంటువు నుంచి చెరిపేసింది. రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చేసింది. రాష్ట్ర విభజన అనంతరం గత తెలుగు దేశం ప్రభుత్వం,అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రణాలికాబద్ధంగా ఒక్కొక వ్యవస్థను పటిష్ట ప్రచుకుంటూ వస్తే, ఆతర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందుకు విరుద్ధంగా ఒక్కొక్క వ్యవస్థను అప్పుల ఊబిలోకి తీసుకుపోతున్నారు. ఇందుకు, ఒక సజీవ ఉదాహరణ విధ్యత్ రంగం. కమిషన్లకు కక్కుర్తి పడి,రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలను వదులుకుని, ప్రైవేటు సంస్థల నుంచి ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేస్తోందని కేశవ్ గతంలోనూ పలు సంధర్భాలలో హెచ్చరించారు.అయితే, జగన్ రెడ్డి ప్రభుత్వం అవేవి పట్టించుకోకుండా ఆపుల మీద అప్పులు చేసుకుంటూ పోయింది.చివరకు, అప్పుల వసూలుకు కేంద్ర సంస్థలు రాష్ట్రానికి రావడం కలకలం రేపుతోంది.  గత కొన్నేళ్ళుగా, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విద్యుత్ సంస్ధలు ఏపీ జెన్ కో, ట్రాన్స్ కో, జగన్ రెడ్డి ప్రభుత్వం అడుగుజాడల్లో అప్పులపై ఆధారపడి మనుగడ సాగిస్తున్నాయని, ఎప్పటినుంచో వినవస్తోంది. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ ఆర్ధిక సంస్ధలకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో ఎప్పుడైతే ఏపీ జెన్ కోను నిరర్ధక ఆస్తుల జాబితాలో పెట్టారని తెలిసిందో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఢిల్లీకి పరుగులు తీశారు. కొంత గడువు ఇస్తే అప్పులు తిరిగి చెల్లిస్తామన్నారు. కానీ అప్పటికే అప్పులు తిరిగి చెల్లించకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితిలోనే కేంద్ర విధ్యత్ సంస్థల అధికారులు రాష్ట్రానికి వచ్చారని పయ్యావుల కేశవ్ అన్నారు. అయితే, కేంద్ర విద్యుత్ సంస్థల అధికారులు, రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిని సమీక్షించేందుకే రాష్ట్రానికి వచ్చారని, అప్పుల వసూలూకు కాదని అధికార వర్గాలు నిజాలను దాచేసే ప్రయత్నాలు చేస్తున్నారు.  అయితే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది అనే విషయంలో ఎవరికీ, ఎలాంటి సందేహం లేదు. రిజర్వు బ్యాంక్ నుంచి వారం వారం తెచ్చుకునే ఋణ సదుపాయం కూడా నిన్నటితో బంద్ అయిపోయిందని సమాచారం. అదలా ఉంటే విద్యుత్ శాఖ పరిధిలో ఉన్న ఐదు ఎనర్జీ కార్పోరేషన్ల అప్పులే దాదాపు రూ.87 వేల కోట్లు ఉన్నాయని అధికార వర్గాల సమాచారం. ఇందులో ఆర్ఈసీ, పీఎఫ్సీ ఇచ్చిన అప్పులే రూ.60 వేల కోట్ల నుంచి రూ.70 వేల కోట్ల వరకూ ఉంటాయని అంచనా. వీటిలోనూ తక్షణం చెల్లించాల్సిన రూ.2 వేల కోట్ల వరకు ఉంటాయని అంటున్నారు. ఈ రూ.2 వేల కోట్ల అయినా చెల్లించే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందా అంటే, లేదని వేరే చెప్పనక్కర లేదు.అలాంటి పరిస్థితి లేదు కాబట్టే కేంద్ర అధికారులు అప్పు వసూలు కోసం అమరావతి రావాల్సిన పరిస్ధితి వచ్చింది. దీంతో ప్రభుత్వానికి ఇదో తీరని అవమానంగా మిగులుతోంది. ఇప్పటివరకూ ఇలా అప్పుల వసూలు కోసం కేంద్రం నుంచి అధికారులు వచ్చిన ఘటనలు ఎప్పుడూ లేవని డిస్కంలే చెప్పడం కొస మెరుపు.

వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ ముఖ్య అనుచరుడు అరెస్ట్! 

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో  కీలక అనుమానితుడిగా ఉన్న  దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పులివెందులకు చెందిన శంకర్ రెడ్డి అనారోగ్య కారణం వల్ల రెండు రోజుల క్రితం హైదరాబాద్ వెళ్ళినట్లు సమాచారం. హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు హాస్పటల్‌లో ఆయనను సీబీఐ బృందం అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి శంకర్ రెడ్డి అత్యంత సన్నిహితుడు.  వివేకానంద రెడ్డి హత్య కేసులో మొదటి నుంచి శంకర్ రెడ్డిపై ఆరోపణలు వస్తున్నాయి. కారు డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలోనూ ఆయన పేరు ఉంది. దీంతో టీడీపీ కూడా శంకర్ రెడ్డిని టార్గెట్ చేసింది.  వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేస్తే ఎర్రా గంగిరెడ్డి రూ. 40 కోట్లు ఇస్తాడని శంకర్ రెడ్డి తనకు చెప్పినట్టు దస్తగిరి తన స్టేట్ మెంట్ లో చెప్పాడని టీడీపీ అదికార ప్రతినిధి పట్టాభి చెప్పారు. అంతేకాదు, హత్య జరిగిన తర్వాత దస్తగిరి సహా పలువురు శంకర్ రెడ్డి ఇంటికి వెళ్లారని, అప్పుడు కూడా తమకేమీ సమస్య రాకుండా ఎర్ర గంగిరెడ్డి చూసుకుంటారని హామీనిచ్చిట్టు శంకర్ రెడ్డి భరోసా ఇచ్చారని దస్తగిరి పేర్కొన్నట్టు తెలిపారు. ఆ తర్వాత కూడా దస్తగిరి మరో కీలక విషయాన్ని ప్రస్తావించారని చెప్పారు. అక్కడి నుంచి బంధువుల ఇంటికి వెళ్లు రాజా రెడ్డి హాస్పిటల్‌లో రక్తపు మరకలను కడిగినట్టు వాంగ్మూలంలో చెప్పారని అన్నారు. ఆయన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాత పేరుతో ఉన్న రాజారెడ్డి హాస్పిటల్‌కే ఎందుకు వెళ్లారో చెప్పాలని సీఎం జగన్‌ను డిమాండ్ చేశారు. అక్కడైతే అందరూ తమ వారే ఉంటారు కాబట్టి.. భయపడాల్సిన పని ఉండదని అక్కడి వెళ్లినట్టే కదా అని పట్టాభి ఆరోపించారు. శంకర్ రెడ్డి మరెవరో కాదని, కడప ఎంపీ, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ఆప్తుడైన వైఎస్ అవినాశ్ రెడ్డికి సన్నిహితుడని టీడీపీ నేత పట్టాభి అన్నారు. అంతేకాదు, వివేకా హత్య జరిగిన రోజు సంఘనా స్థలికి చేరుకుని సాక్ష్యాలను వీరిద్దరే అంటే అవినాశ్ రెడ్డి, శంకర్ రెడ్డిలే తారుమారు చేశారని ఆరోపించారు.వివేకా హత్య జరిగినప్పుడు సాక్షి మీడియా దాన్ని గుండెపోటుగా చిత్రించిందని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి పేర్కొన్నారు. సాక్షి మీడియాకు వివేకా గుండె పోటుతో మరణించాడని చెప్పింది కూడా శంకర్ రెడ్డే అని తెలిపారు. ఈ విషయాన్ని సునీత పిటిషన్‌లో స్పష్టంగా పేర్కొన్నారని వివరించారు. వివేకా హత్య కేసును రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం జగన్ మీడియా చేసిందని ఆరోపించారు.

కేసీఆర్ పొలిటిక‌ల్ సూసైడ్‌?.. బీజేపీతో అంత ఈజీ కాదయా?

కేసీఆర్ వ‌ర్సెస్ బండి సంజ‌య్‌. టీఆర్ఎస్ వ‌ర్సెస్ బీజేపీ. ఇద్ద‌రి మ‌ధ్య.. రెండు పార్టీల మ‌ధ్య.. వ‌రిపై పొలిటిక‌ల్‌ వార్ ఓ రేంజ్‌లో సాగుతోంది.  కీల‌క‌మైన వ‌రి పోరులో రేవంత్‌రెడ్డికి ఛాన్స్ లేకుండా పోయింది. ఇదంతా కాంగ్రెస్‌ను సైడ్‌వేస్‌లోకి పంపించే ఎత్తుగ‌డ‌లో భాగ‌మేన‌ని కూడా అంటున్నారు. కేసీఆర్‌-బీజేపీ కుమ్మ‌క్కై.. ఇద్ద‌రి ఉమ్మ‌డి ప్ర‌ధాన‌ ప్ర‌త్య‌ర్థి కాంగ్రెస్‌-రేవంత్‌ను అణ‌గ‌దొక్కే కుట్ర చేశార‌ని చెబుతున్నారు. వ‌రుస ప‌రిణామాలూ అందుకు బ‌లం చేకూర్చుతున్నాయి. మ‌రి, కేసీఆర్ వేసిన ఈ ఎత్తుగ‌డ ఏ మేర‌కు వ‌ర్క‌వుట్ అవుతుంది? తాత్కాలికంగా పొలిటిక‌ల్ అడ్వాంటేజ్ ల‌భించినా.. లాంగ్‌ర‌న్‌లో అది ఎవ‌రికి లాభం? కాంగ్రెస్‌ను ఖ‌తం చేయ‌డం ఎంత‌వ‌ర‌కు సాధ్యం? బీజేపీని ఎంక‌రేజ్ చేస్తే.. పాముకు పాలు పోసి పెంచిన‌ట్టేనా? ఆ పార్టీ తిరిగి కేసీఆర్‌ను కాటేయ‌కుండా ఉంటుందా? ఇలా చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు దాగున్నాయి ఇందులో.  ఎంత‌కాద‌న్నా తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ అప్పుడూ ఇప్పుడూ బ‌లంగానే ఉంద‌నేది వాస్త‌వం. ఎమ్మెల్యేల సంఖ్య త‌క్కువే ఉన్నా.. హ‌స్తం ఓటుబ్యాంకు మాత్రం స్ట్రాంగ్‌గా ఉంది. లీడ‌ర్ల‌కూ కొద‌వేం లేదు. పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి ప‌గ్గాలు చేప‌ట్టాక‌.. కాంగ్రెస్ కేడ‌ర్‌లో రెట్టించిన ఉత్సాహం క‌నిపిస్తోంది. ఈసారి అధికారం హ‌స్తగ‌తం కావ‌డం ఖాయ‌మ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదే కేసీఆర్‌లో క‌ల‌వ‌రానికి కార‌ణం. అందుకే కాంగ్రెస్‌కు కౌంట‌ర్‌గా బీజేపీని పైకి లేపుతున్నార‌ని అంటున్నారు. వ‌రి కొనుగోలుపై బీజేపీని విమ‌ర్శించ‌డం.. పెట్రో ధ‌ర‌ల పెంపుపై నిల‌దీయ‌డం.. బండి సంజ‌య్ రోడ్డెక్క‌డం.. ఆయ‌న్ను అడ్డుకోవ‌డం.. కోడిగుడ్ల దాడి.. ధ‌ర్నాలు, మ‌హాధ‌ర్నాల‌తో పొలిటిక‌ల్ హీట్ పెంచ‌డం.. అంతా కేసీఆర్ స్కెచ్‌లో భాగ‌మనే అనుమానం. ఇప్ప‌టి వ‌ర‌కైతే కేసీఆర్ స్క్రిప్ట్ పక్కాగా వ‌ర్క‌వుట్ అవుతోంది. వారం రోజులుగా కాంగ్రెస్ వార్త‌ల్లో లేదు. రాజకీయ‌మంతా టీఆర్ఎస్‌-బీజేపీ మ‌ధ్య‌నే తిరుగుతోంది. మ‌రి, ముందుముందు ఏం జ‌ర‌గ‌నుంది? కేసీఆర్‌కు కాంగ్రెస్‌తో ప్ర‌మాదమా? లేక‌, బీజేపీతో అంత‌క‌న్నా ప్ర‌మాద‌మా? అనేది ఆస‌క్తిక‌రం.   ఒక‌సారి బెంగాల్‌లో ఏం జ‌రిగిందో గుర్తు చేసుకుంటే.. 40 ఏళ్ల పాటు బెంగాల్‌లో గంప‌గుత్త‌గా పాలించిన కామ్రేడ్ల‌ను తృణ‌మూల్ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ గ‌ట్టిగా ఎదుర్కొన్నాడు. క‌మ్యూనిస్టుల‌పై పోరులో బిజీగా ఉండి బీజేపీని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. ఇదే ఛాన్సుగా.. చాప‌కింద నీరులా.. క‌మ‌ల‌నాథులు బెంగాల్‌లో బాగా బ‌ల‌ప‌డ్డారు. ఖ‌త‌ర్నాక్ కామ్రేడ్ల‌నే ఢీకొట్టిన దీదీకి.. ఇప్పుడు కాషాయ ద‌ళం చుక్క‌లు చూపిస్తోంది. అధికారం అంచుల దాకా చేరుకున్నా.. తృటిలో ప‌వ‌ర్‌ చేజారిపోయింది. నందిగ్రామ్‌లో మ‌మ‌త‌నే ఓడించి స‌త్తా చాటారు క‌మ‌ల‌నాథులు. తెలంగాణ‌లోనూ బెంగాల్ ప‌రిస్థితులు త‌ప్ప‌క‌పోవ‌చ్చు అంటున్నారు.   కాంగ్రెస్‌ను క‌ట్ట‌డి చేసేందుకు బీజేపీని ఎంక‌రేజ్ చేస్తున్న‌ కేసీఆర్ వ్యూహం ఇప్పుడు బాగానే వ‌ర్క‌వుట్ అవుతున్నా.. భ‌విష్య‌త్తులో అది ఆయ‌నకే ఎస‌రు తెస్తుంద‌ని అంటున్నారు. ఒక విధంగా కేసీఆర్ స్ట్రాట‌జీ.. పొలిటిక‌ల్ సూసైడ్ లాంటిదంటున్నారు. అందుకు బ‌ల‌మైన కార‌ణాలే చూపిస్తున్నారు. కాంగ్రెస్ వేరు.. బీజేపీ వేరు. రేవంత్‌రెడ్డి నాయ‌క‌త్వంలో కాంగ్రెస్ బాగా బ‌ల‌పడి వ‌చ్చే ఎన్నిక‌ల్లో మెరుగైన సీట్లు సొంతం చేసుకుంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అయితే, కాంగ్రెస్ నేరుగా అధికారంలోకి వ‌స్తే స‌రే స‌రి. లేదంటే.. మ్యాజిక్ ఫిగ‌ర్ దాట‌లేదంటే.. కాంగ్రెస్‌ను ఖ‌తం చేయ‌డం కేసీఆర్‌కు చాలా సింపుల్‌. గ‌తంలో మాదిరే ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ అని ఓ పిలుపిస్తే చాలు.. గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పొలో మంటూ గులాబీ గూటికి వ‌రుస క‌ట్టేస్తారు. కాంగ్రెస్‌ను చీల్చ‌డం చాలా ఈజీ. అది కేసీఆర్‌కు లాభ‌మేగా? కాంగ్రెస్ ఎంత బ‌ల‌ప‌డితే.. ప‌రోక్షంగా కేసీఆర్ కూడా అంతే బ‌ల‌ప‌డిన‌ట్టేగా? అయితే, కాంగ్రెస్ నేరుగా అధికారంలోకి వ‌స్తుంద‌నే భ‌య‌మే కేసీఆర్‌తో ఇలా చేయిస్తోంద‌ని అంటున్నారు. అంటే, రేవంత్‌రెడ్డి-కాంగ్రెస్‌ల‌ గెలుపును కేసీఆర్ ప‌రోక్షంగా క‌న్ఫామ్ చేసిన‌ట్టేనా? కానీ, కాంగ్రెస్ కోసం బీజేపీని బ‌ల‌ప‌డ‌నిస్తే మాత్రం గులాబీ బాస్‌కు పెను ప్ర‌మాదం త‌ప్ప‌దంటున్నారు. కాంగ్రెస్‌ను తొక్కేసి.. బీజేపీని ఎద‌గ‌నిస్తే.. కాషాయపార్టీకి భారీగా ఎమ్మెల్యే సీట్లు వ‌స్తే.. అధికారంలోకి రాకపోయినా.. కేసీఆర్ విసిరే వ‌ల‌కు ఒక్క బీజేపీ ఎమ్మెల్యే కూడా చిక్క‌రు. పైగా చుక్క‌లు చూపిస్తారు. క‌మ‌ల ద‌ళాన్ని చీల్చ‌డం అంత సులువు కానే కాదు. సైద్దాంతిక నిబ‌ద్ద‌త, పార్టీపై మ‌క్కువ‌ ఎక్కువ ఉండే బీజేపీలో గోడ‌మీద పిల్లులు దాదాపు ఉండ‌రు. ఇక‌ ఎలాగూ కేంద్రంలోనూ మ‌ళ్లీ బీజేపీ ప్ర‌భుత్వ‌మే వ‌స్తుందంటున్నారు కాబ‌ట్టి.. కేసీఆర్ వేసే బిస్కెట్ల‌కు కాంగ్రెస్ వారిలా బీజేపీ నేత‌లు ఆశ ప‌డ‌క‌పోవ‌చ్చు. ఇలా చూస్తే.. కేసీఆర్‌కు కాంగ్రెస్ కంటే బీజేపీతోనే ఎక్కువ ప్ర‌మాదం అంటున్నారు.  బెంగాల్‌లో మ‌మ‌త.. కామ్రేడ్ల మీద ఫోక‌స్ పెట్టి.. క‌మ‌ల‌నాథుల‌ను లైట్ తీసుకున్నందుకు ఇప్పుడు శిక్ష అనుభ‌విస్తున్నట్టే.. కేసీఆర్ సైతం కాంగ్రెస్‌ను అణిచేస్తూ.. బీజేపీని ఎగ‌దోయ‌డం.. పొలిటిక‌ల్ సూసైడ్ అని విశ్లేషిస్తున్నారు.

బుగ్గనకు షాక్.. యనుమల సెటైర్లు.. రేవంత్ కు ఝలక్.. టాప్ న్యూస్@1PM

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ముందు విజయవాడలోని ఓ ఆస్పత్రిని సంప్రదించగా ఆయనకు కోవిడ్ లక్షణాలు ఉన్నట్లుగా అనుమానించారు. వెంటనే గవర్నర్ వ్యక్తిగత వైద్యులు ఆయనను హైదరాబాద్‌కు తరలించారు.  --- అసెంబ్లీ నిర్వహించాలని రాజ్యాంగం గుర్తు చేసిందని... ఆరునెలలకు ఒసారైనా అసెంబ్లీ పెట్టాలనే నిబంధన రాజ్యాంగంలో లేకపోతే అది కూడా పెట్టేవారు కాదేమో అని శాసనమండలి ప్రధాన ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు అన్నారు. పార్లమెంట్‌కు మరే ఇతర రాష్ట్రాలకు లేని కోవిడ్ నిబంధనలు ఏపీ ప్రభుత్వానికే వర్తిస్తున్నాయా అని ప్రశ్నించారు. ఒక్కరోజు అసెంబ్లీతో ఒరిగేదేమీ లేదని వ్యాఖ్యానించారు. 14 ఆర్డినెన్సులు ప్రవేశపెట్టి ఎలాంటి చర్చా లేకుండా ఆమోదింపచేసుకోవటం వల్ల ప్రజలకు ఏం ఉపయోగమని నిలదీశారు --- కొవిడ్ రోగులకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదంటూ  తిరుపతిలో రోగులు ఆందోళనకు దిగారు. తిరుపతి విష్ణు నివాసం క్వారంటైన్ కేంద్రంలో నిరసన చేపట్టారు. తాగునీటిలో పురుగులు వస్తున్నాయని బాధితులు ఆవేదన చెందారు. అల్పాహారం, భోజనం నాణ్యతగా లేవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు చేస్తే కూడా పట్టించుకోవడం లేదని నిరసన తెలుపుతున్నారు. --- తమకు కంచుకోటగా చెప్పుకునే ప్రకాశం జిల్లాలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. దర్శీ నగర పంచాయతీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. దర్శి నగర పంచాయతీలోని 20 వార్డుల్లో టీడీపీ 13, వైసీపీ 7 వార్డులు గెలుచుకున్నాయి. దర్శిలో గెలవడానికి వైసీపీ అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. భారీగా డబ్బు వెదజల్లింది. అయినా టీడీపీ చేతిలో పరాజయం తప్పలేదు.  ---  నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలం మున్సిపాలిటీ కౌంటింగ్ లో ఉద్రిక్తతలు తలెత్తాయి.8వ వార్డులో మొదట ఓట్ల లెక్కింపులో టీడీపీ అభ్యర్థి మూడు ఓట్లతో గెలిచినట్లు ప్రకటించారు. తర్వాత వైసీపీ అభ్యర్థి కోరడంతో రీకౌంటింగ్ జరిపారు. అయితే రీకౌంటింగ్ తర్వాత వైసీపీ అభ్యర్థి గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. దీంతో రీకౌంటింగ్ లో అక్రమాలు జరిగాయంటూ టీడీపీ అభ్యర్థి కౌంటింగ్ హాల్ దగ్గర ఆందోళనకు దిగాడు.  --- బేతంచెర్ల మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌కు భారీ షాక్ తగిలింది. బుగ్గన నివాసం ఉండే 15 వార్డులో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. వైసీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి వెంకట సాయి కుమార్ 114 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఈ గెలుపుతో టీడీపీ శ్రేణులు బేతంచెర్లలో సంబరాలు చేసుకుంటున్నాయి. --- టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వెంకట్ రాంరెడ్డి నామినేషన్‌పై ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. నామినేషన్ పాత్రలు దాఖలు చేసే సమయంలో ఫిర్యాదు దారులను లోపలికి అనుమతించాలన్నారు. ఎన్నికల నిర్వహణ అధికారులు, టీఆర్ఎస్ పార్టీ వెంకట్ రాం రెడ్డికి సహకారం అందిస్తోందని ఆరోపించారు.  ---- తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు చేదు అనుభవం ఎదురైంది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి  వెంకట్‌రాంరెడ్డిపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసే క్రమంలో ఎల్పీ ముందు మీడియాకు అనుమతించేందుకు అసెంబ్లీ సిబ్బంది నిరాకరించారు. దీంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎల్పీ కార్యాలయంలోనే సమావేశమయ్యారు -------- ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీల నాయకులపై 15 కేసులు నమోదు అయ్యాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన, శాంతి భద్రతలకు విఘాతం, రైతులు, పోలీసులపై దాడుల చేయడంపై కేసులు నమోదయ్యాయి. నల్గొండ జిల్లాలో ఇరుపార్టీ నాయకులపై నల్గొండ రూరల్, మిర్యాలగూడ వన్ టౌన్, మాడ్గుల పల్లి, వేముల పల్లి పోలీస్ స్టేషన్లలో పోలీసులు పది కేసులు నమోదు చేశారు. ------- ముఖ్యమంత్రి స్టాలిన్‌ మినహాయించి మిగతా డీఎంకే నేతలు సక్రమంగా పని చేయడం లేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, నటి ఖుష్బూ విమర్శించారు. స్థానిక పట్టణంబాక్కం బీచ్‌ రోడ్డులో నివసిస్తున్న మత్స్యకారుల కుటుంబాలకు బీజేపీ తరఫున రొట్టెలు, పాలు తదితరాలను ఖుష్బూ పంపిణీ చేశారు. కొళత్తూర్‌ నియోజకవర్గంలో పదేళ్లుగా ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆ నియోజకవర్గంలో భారీస్థాయిలో చేరిన వరద నీటిని తొలగించడంలో విఫలమయ్యారని అన్నారు.  ---