వైసీపీ ఎమ్మెల్యేలు DNA పరీక్షలు చేయించుకోవాలి...

వైసీపీ ఎమ్మెల్యేల నీచ వ్యాఖ్య‌ల‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ మొత్తం ర‌గిలిపోతోంది. సామాన్య ప్ర‌జానీకం సైతం రోడ్డు మీద‌కు వ‌చ్చి ధ‌ర్నాలు, నిర‌స‌న‌లు చేస్తున్నారు. పిచ్చి వాగుడు వాగిన‌ వారి నాలుకలు కోస్తామంటూ గ‌ట్టిగా హెచ్చ‌రిస్తున్నారు. జ‌నానికే ఇంత ఆవేశం, ఆగ్ర‌హం క‌లిగితే.. ఇక నంద‌మూరి కుటుంబానికి, టీడీపీ శ్రేణుల‌కు ఇంకెంత కోపం రావాలి? అదే జ‌రుగుతోంది. వైసీపీ నేత‌ల తీరును నంద‌మూరి ఫ్యామిలీ ముక్త‌కంఠంతో ఖండించింది. ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తే ఖ‌బ‌డ్దార్ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అటు, టీడీపీ మ‌హిళా నేత‌లు సైతం వైసీపీని చెడుగుడు ఆడుకుంటున్నారు.  ఆనాడు సీతను అవమానించిన రావనాసురుడికి ఏ గతి పట్టిందో ఇవాళ భువనేశ్వరిని అవమానించిన వైసీపీకి అదే గతి పడుతుందంటూ మాజీ మంత్రి పీత‌ల సుజాత తీవ్రంగా మండిప‌డ్డారు. అమ్మ లాంటి నారా భువనేశ్వరి గురించి అలా మాట్లాడితే వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు ఏమి చేస్తున్నారని పీతల సుజాత నిలదీశారు. పదేళ్లు టీడీపీలో ఉన్న రోజాకు ఎవరు ఎలాంటి వారో తెలియదా? అని ప్రశ్నించారు.  నారా లోకేష్ గురించి మాట్లాడే వైసీపీ ఎమ్మెల్యేలు ముందు డీఎన్ఏ పరీక్షలు  చేయించుకోవాలన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఇంటికి వెళ్లి వాళ్ల ఆడవారితో డీఎన్ఏ పరీక్షలకు వెళదామని చెప్తే బాగుంటుందంటూ పీత‌ల సుజాత ఫైర్ అయ్యారు. 

ఏడ‌దాగున్నావ్ ఎన్టీఆర్‌?.. మేన‌త్త‌ను తిట్టినా స్పందించ‌వా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌. నంద‌మూరి వార‌సుడు. బాల‌య్య త‌ర్వాత ఆ ఫ్యామిలీలో అంత‌టి క్రేజ్ ఉన్నోడు. బుడ్డోడు.. చిచ్చ‌ర‌పిడుగే. గ‌తంలో ఓసారి పార్టీ జెండా ప‌ట్టుకొని.. ఖాకీ డ్రెస్ వేసుకొని.. చైత‌న్య‌ర‌థంపై ప‌ర్య‌టించి.. టీడీపీని గెలిపించే ప్ర‌య‌త్నం చేశారు. కానీ, విఫ‌ల‌మ‌య్యారు. అప్ప‌టినుంచీ రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. సినిమానే జీవితంగా గ‌డుపుతున్నారు. ఫ్యాన్స్ మాత్రం అప్పుడ‌ప్పుడూ జూనియ‌ర్ రావాలంటూ ఫ్లెక్సీలు, నినాదాల‌తో ఆయ‌న్ను గుర్తు చేస్తుంటారు. ఎన్టీఆర్ మాత్రం మౌనంగా తిర‌స్క‌రిస్తూనే ఉంటారు. ఇదంతా ఓకే. గ‌త‌మంతా వ‌దిలేద్దాం. ప్ర‌స్తుతానికి వ‌ద్దాం.  నంద‌మూరి కుటుంబంలో బాల‌కృష్ణ త‌ర్వాత ఫైర్‌బ్రాండ్ ఎవ‌రంటే జూనియ‌ర్ ఎన్టీఆరే. స్వ‌త‌హాగా ఆవేశ‌ప‌రుడు. ఫుల్ ఎమోష‌న‌ల్‌. మాటంటే ప‌డ‌రు. మాట‌కు మాట గ‌ట్టిగా జ‌వాబిచ్చే స‌త్తా ఆయ‌న సొంతం. అలాంటి ఎన్టీఆర్‌.. త‌న నంద‌మూరి కుటుంబ స‌భ్యురాలిని, స్వ‌యానా మేన‌త్త‌ను.. వైసీపీ మూక‌లు అంతేసి మాట‌లు అంటుంటే.. బ‌య‌ట‌కొచ్చి ఖండించ‌డ‌మే లేదు. నంద‌మూరి ఫ్యామిలీ అంతా మూకుమ్మ‌డిగా ముందుకొచ్చి.. మీడియా స‌మావేశం పెట్టినా.. అందులో జూనియ‌ర్ లేడు. క‌ల్యాణ్‌రామ్ కూడా రాలేదు. ఎన్టీఆర్ నంద‌మూరి కుటుంబం కాదా? ఆయ‌న‌కు బాధ్య‌త లేదా? క‌ల్యాణ్‌రామ్‌కు ఏమైంది? ఆయ‌నెందుకు రాలేదు? హ‌రికృష్ణ ఫ్యామిలీ నంద‌మూరి ఇంటిపేరును త్య‌జించేసిందా? కుటుంబంతో తెగ‌దెంపులు చేసేసుకుందా? అలా ఏమీ లేదు క‌దా? మ‌రి, ప్రెస్‌మీట్‌కు జూనియ‌ర్ ఎన్టీఆర్‌, క‌ల్యాణ్‌రామ్ రావొచ్చుక‌దా? ఇప్పుడు కాక‌పోతే ఇంకెప్పుడు వ‌స్తారు? గ‌తంలో ఎప్పుడూ మీడియాకు క‌నిపించ‌ని చైత‌న్య‌కృష్ణ‌, శ్రీనివాస్‌లాంటి వాళ్లే ముందుకొచ్చి.. భువ‌నేశ్వ‌రికీ మ‌ద్ద‌తుగా నిలిస్తే.. ఎన్టీఆర్‌, క‌ల్యాణ్‌రామ్‌ల‌కు అంత ఇగో ఎందుకు? ఫ్యామిలీతో క‌ల‌వ‌రెందుకు? ఇప్పుడుకాక ఇంకెప్పుడు? ఓహో అందుకా... భువ‌నేశ్వ‌రిపై పిచ్చి వాగుడు వాగుతున్న కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీలు త‌న మిత్రులు కాబ‌ట్టే జూనియ‌ర్ ఎన్టీఆర్ స్పందించ‌డం లేదా? మేన‌త్త‌ను అంతేసి మాట‌లు అంటుంటే.. క్యారెక్ట‌ర్ అసాసినేష‌న్ చేస్తుంటే.. నోరు మూసుకొని.. మౌనంగా ఊరుకుంటున్నవాడు నంద‌మూరి కుటుంబ స‌భ్యుడు ఎలా అవుతాడు? రాజ‌కీయాల‌కు తాను దూరం అని ఎన్టీఆర్‌ స‌మ‌ర్థించుకోడానికి కూడా లేదు. ఇది రాజ‌కీయం కాదే? కుటుంబ వ్య‌వ‌హారం.. కుటుంబ ప‌రువు, ప్ర‌తిష్ట‌, మ‌ర్యాద‌ల‌కు సంబంధించిన మేట‌ర్‌. కుటుంబం లేనిది ఆయ‌న ఎక్క‌డ‌? నంద‌మూరి ఇంటిపేరు లేక‌పోతే.. ఎన్టీఆర్‌కు గుర్తింపేముంది.. విలువేముంది? ఏ కుటుంబం వ‌ల్ల‌నైతే అత‌నికి ఇంత‌టి హోదా, గౌర‌వం ల‌భిస్తుండే.. ఇప్పుడు ఆ కుటుంబ‌మంతా క‌లిసి.. భువ‌నేశ్వ‌రికి మ‌ద్ద‌తుగా నిల‌బ‌డితే జూనియ‌ర్ ఎన్టీఆర్‌, క‌ల్యాణ్‌రామ్‌లు రాక‌పోవ‌డం త‌ప్పుకాదా? పాలిటిక్స్ వ‌ద్దంటూనే పాలిటిక్స్ చేస్తున్నారా? ఎన్టీఆర్ బ్ర‌ద‌ర్స్ స్పందించ‌క‌పోవ‌డాన్ని ఎలా చూడాలి? అంటూ తెలుగు త‌మ్ముళ్లు ప్ర‌శ్నిస్తున్నారు.. కాదు కాదు నిల‌దీస్తున్నారు. 

వ్రతం చెడినా .. మోడీకి ఫలితం దక్కుతుందా? 

వివాదాస్పద సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. సంవత్సర కాలంగా ఈ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు ఆందోళన సాగిస్తున్నా, వందల సంఖ్యలో ఆందోళన చేస్తున్న రైతులు మరణించినట్లు వార్తలు వచ్చినా, చివరకు ఉద్యమం ముసుగులో  జాతీయ జెండాకు అవమానమేజరిగినా, చలించని ప్రధాని నరేంద్ర మోడీ, ఇప్పుడు ఒక్క సారిగా ఎందుకు దిగి వచ్చారు? ఎందుకు, చట్టాల రద్దు నిర్ణయం తీసుకున్నారు?ఈ ప్రశ్నలకు  ఎవరి భాష్యం వారు చెప్పుకోవచ్చును? కానీ, ఎవరు ఎన్ని కారణాలు చెప్పినా, ఒకటి మాత్రం నిజం. ఇది పూర్తిగా రాజకీయ నిర్ణయం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, మరో మూడు నాలుగు నెలల దూరంలో బారులు తీరిన ఐదు రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయమే కానీ, మరొకటి కాదు. ఈ విషయంలో ఎవరికీ, రెండవ అభిప్రాయం అవసరం లేదు.  నిజానికి ప్రధాని ప్రకటనలోనే ఆ విషయం స్పష్టమైంది.సాగు చట్టాలు రైతు వ్యతిరేకం అంటూ  ప్రతిపక్షాలు, రైతు సంఘాలు చేస్తున్న ఆరోపణలను ప్రదాని అంగీకరించలేదు.ఆందోళన చేస్తున్న రైతు నేతలు ఎత్తి చూపుతున్న చట్టాల్లోని దోషాలాను ఒప్పుకోలేదు. ఆ కారణంగా చట్టాలను రద్దు చేస్తున్నామని చెప్పలేదు.చట్టాలు మంచివే, రైతులకు మేలు చేసేవే, అయినా కొందరికి ఆ చట్టాలు నచ్చలేదు. ప్రభుత్వం వారికి నచ్చచెప్పే ప్రయత్నంలో విఫలమైంది.  అందుకే చట్టాలు రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నాం, క్షమించాలి’ అని ప్రధాని రైతులను క్షమాపణ కోరారు.   అంటే ఇది మనస్పూర్తిగా తీసుకున్న నిర్ణయం కాదు, రాజకీయ అవసరాల కోసం తీసుకున్న నిర్ణయమని చెప్పకనే చెప్పారు. ఒకప్పుడు రాజకీయ అవసారాలకోసం, నిర్ణయాలు మార్చుకోమని, దేశ హితంకోరి తీసుకున్న నిర్ణయాలను వెనక్కి తీసుకోమని చెప్పిన ప్రధాని, ఇపుడు అందుకు విరుద్ధంగా నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం దేశ హితాన్ని పక్కన పెట్టారు. అందుకే కావచ్చు ఒక విధంగా, ఇది మోడీ రాజకీయ జీవితంలో చెరగని ముద్రగా/ మచ్చగా  నిలిచి పోతుందని కొందరు విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా బీజేపీ కార్యకర్తలు, అభిమానులు అయితే మోడీ నిర్ణయమే తప్పని అంటున్నారు.     అయితే, అదెలా ఉన్నా, వ్రతం చెడిన మోడీకి ఫలితం దక్కుతుందా? ముఖ్యంగా పంజాబ్’లో ఫలితం కలిపిస్తుందా? ఇప్పుడు జాతీయ రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది. నిజానికి, ప్రస్తుతానికి అయితే, ఒక్క పంజాబ్ మినహా మిగిలిన నలుగు రాష్ట్రాల్లో బలం తగ్గినా బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని, సర్వేలు చెపుతున్నాయి. అయితే, ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్న నేపధ్యంలో పరిస్థితి ఎటు తిరిగి ఎక్కడ తేలుతుందో అనేభయం కమల దళంలో కనిపిస్తోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు జనాకర్షక నిర్ణయాలు, బీజేపీలో గూడుకట్టుకున్న ఎన్నికల భయాన్ని తెలియచేసే విధంగా ఉన్నాయని అంటున్నారు. ఈ నిర్ణయం తీసుకున్న సమయ సందర్భాలను బట్టి చూస్తే ముఖ్యంగా పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీని ఓడించే  ప్రధాన లక్ష్యంతో ప్రధాని గురునానక్ జయంతి  రోజున ఈ ప్రకటన చేశారని అంటున్నారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్ ఏర్పటు చేసే  కొత్త పార్టీ, అదే విధంగా సాగు చట్టాలను వ్యతిరేకించి ఎన్డీఎ నుంచి బయటకు వచ్చిన చిరకాల మిత్ర పక్షం అకాలీ దళ్’ను కలుపుకుని, కాంగ్రెస్ పార్టీని  దెబ్బ తీసేందుకే మోడీ ముహూర్తం చూసుకుని మరీ సాగు చట్టాల రద్దు నిర్ణయం ప్రకటించారని అంటున్నారు.  ఇతర విషయాలు ఎలా ఉన్నప్పటికీ, సాగు చట్టాలను వెనక్కి తీసుకోవడంలో బీజేపీ ఒక విధంగా విపక్షాలను నిరయుధాలను చేసే వ్యూహం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యమంగా పంజాబ్ ‘ లో పూర్తిగా కమిలి (వాడి) పోయిన కమలాన్నిబతికించుకోవడంతో  పాటుగా, యూపీలో పార్టీ బలాన్ని పెంచుకుని, భవిష్యత్ (లోక్ సభ ఎన్నికల)కు పునాదులు వేసుకునేందుకే బీజేపీ సాగు చట్టాలకు చాప చుట్టిందని, విశ్లేషకులు అంటున్నారు.  అయితే, ఇంతచేసి వ్రతం చెడినా బీజేపీకి ఆశించిన ఫలితంగా దక్కుతుందా అనేది ఒకటైతే   రాజకీయ ప్రయోజనాల కోసం వెనకడుగు వేయడం బీజేపీకి, మోడీ ప్రభుత్వానికి కొత్త కాదని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.  గతంలో మిత్ర పక్షాల మద్దతు అవసరం అయిన సమయంలో, బీజేపీ, వాజ్ పేయి ప్రభుత్వం రామజన్మ భూమి, ఉమ్మడి పౌర స్మ్రుతి, ఆర్టికల్ 370 వంటి పార్టీ మూల సూత్రాలను తాత్కాలికంగా పక్కన పెట్టింది. అలాగే. సంపూర్ణ మెజారిటీ అధికారంలోకి వచ్చిన ప్రధాని మోడీ ప్రభుత్వం కూడా, గత కాంగ్రెస్/ యూపీఏ ప్రభుత్వ హయాంలో చేసిన, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ హామీ చట్టం, భూసేకరణ పునరావాస చట్టం, పశు సంరక్షణ, గోసంరక్షణ, ఈపీఎఫ్  సవరణ చట్టాల విషయంలో వెనకడుగు వేసింది. ఒక విధంగా చూస్తే, రాజకీయ సంగీత స్వరాలాపనలో ఎక్కడ స్రుతి పెంచాలో, ఎక్కడ తగ్గించాలో బీజేపీకి తెలుసు. అందుకే, ఎదరు దెబ్బలు తిన్నా ఎదిగి వస్తోందని,రాజకీయాల్లో ఎక్కడా రైజ్ అవ్వల్లో మాత్రమే కాదు, ఎక్కడ తల వంచాలో, ఎక్కడా వంగలో కూడా తెలిసినప్పుడే ప్రస్థానం ముందుకు సాగుతుంది.. లేదంటే ఎకక్డ వేసియన్ గొంగళి అక్కడే ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.

83లో లోకేష్ జననం.. 85లో మాధవరెడ్డి టీడీపీ సభ్యత్వం! నిప్పుతో నీచ రాజకీయం..

నారా చంద్ర‌బాబు నాయుడు. ఆర‌డుగుల నిఖార్సైన మ‌నిషి. 71 ఏళ్ల నిప్పులాంటి జీవితం. 40 ఏళ్ల స్వ‌చ్ఛ రాజ‌కీయం. తెలుగు జాతి నిండు గౌర‌వం. ఆంధ్రుల ఆత్మవిశ్వాసం. ఐటీ ప్ర‌ధాత‌. తెలుగు జాతిని ప్ర‌పంచ ప‌టంలో నిలిపిన ఘ‌న‌త‌. న‌వ్యాంధ్ర విధిరాత‌. నాలుగు ద‌శాబ్దాల రాజ‌కీయ జీవితంలో చిన్న‌మ‌చ్చ కూడా లేని నాయ‌కుడు. ఒక్క అవినీతి ఆరోప‌ణ కూడా అంట‌ని నిత్య కార్మికుడు. రాజ‌కీయ రుషి. అలాంటి చంద్ర‌బాబుపైనే అసంబ‌ద్ధ ఆరోప‌ణ‌లు చేశారు. దారుణ‌మైన కామెంట్ల‌తో పెద్దాయ‌న‌ను తీవ్రంగా క్షోభ పెట్టారు. గుండె ప‌గిలేలా బాధ‌పెట్టారు. భోరున విల‌పించేలా నీచంగా అవ‌హేళ‌న చేశారు.  చంద్ర‌బాబు జీవిత‌మంతా తెరిచిన పుస్త‌కం. ఆస్తులంతా ఏటేటా ప్ర‌జ‌ల ముందు ఉంచుతున్న స్వ‌చ్చ నాయ‌కుడు. నారా వారి ప‌ల్లె నుంచి అమ‌రావ‌తి వ‌ర‌కూ.. రాజ‌కీయంగా అనేక‌ ఉన్న‌త శిఖ‌రాలు అధిరోహించారు. విద్యార్థి నాయ‌కుడి నుంచి.. మూడు సార్లు ముఖ్య‌మంత్రి, మూడు ప‌ర్యాయాలు ప్ర‌తిప‌క్ష నేత‌గా రాణించారు. ఐర‌న్‌లేడీ ఆఫ్ ఇండియా-ఇందిరాగాంధీనే ఢీ కొట్టిన మొన‌గాడు.. మోదీపై ధ‌ర్మ‌పోరాటం చేసిన ధీరుడు.. కోట్ల నుంచి వైఎస్ వ‌ర‌కూ.. అనేక ఉద్దండుల‌ను ఎదుర్కొన్న యోధుడు. యునైటెడ్ ఫ్రంట్ క‌న్వీన‌ర్‌గా జాతీయ స్థాయిలో చ‌క్రం తిప్పి.. దేవెగౌడ‌ను దేశ ప్ర‌ధానిగా ఎంపిక చేసిన చాణ‌క్యుడు. ఇలా.. దేశ‌,రాష్ట్ర రాజ‌కీయాల్లో చంద్ర‌బాబు స్థాయి ఉన్న నాయ‌కుడు మ‌రొక‌రు లేర‌నే చెప్పాలి. అందుకే కాబోలు.. చంద్ర‌బాబును రాజ‌కీయంగా దెబ్బ తీయ‌లేమ‌ని అనుకున్నారు కాబోలు.. దొంగ‌దారిన దొంగ‌దెబ్బ తీస్తున్నారు వైసీపీ నాయ‌కులు. క్యారెక్ట‌ర్ అసాసినేష‌న్‌కు దిగుతున్నారు.  చంద్ర‌బాబు వారి శ‌త్రువు కాబ‌ట్టి.. ఆయ‌న‌నేదైనా అంటే అనొచ్చు.. పాపం భువ‌నేశ్వ‌రి ఏం చేశారు? ఎప్పుడైనా రాజ‌కీయాల జోలికి వ‌చ్చారా? ఎవ‌రినైనా చిన్న‌మాట‌న్నా అన్నారా? అస‌లు భువ‌నేశ్వ‌రికి వైసీపీ పార్టీ పూర్తి పేరైనా తెలిసుంటుందా? అలాంటిది.. ఏమాత్రం రాజ‌కీయ వాస‌న‌లు అంట‌ని భువ‌నేశ్వ‌రిపై.. ఈ కౌర‌వ వార‌సులు అలాంటి ఆరోప‌ణ‌లు చేయ‌డం నీచాతి నీచం. దారుణం. దుర్మార్గం. ఉన్మాదం..   చంద్ర‌బాబుది చిన్న కుటుంబం. చింతలేని కుటుంబం. అత‌ను-ఆమె. కొడుకు-కోడ‌లు-మ‌న‌వ‌డు. అంతే. భార్య భువ‌నేశ్వ‌రి అంటే ఆయ‌న‌కి ప్రాణం. భ‌ర్తే ఆమెకు స‌ర్వ‌స్వం. నిత్యం రాజ‌కీయాల‌తో బిజీగా ఉండే భ‌ర్త‌ను.. కంటికి రెప్ప‌లా జాగ్ర‌త్తగా చూసుకుంటారు భువ‌నేశ్వ‌రి. వేళ‌కు భోజ‌నం చేసేలా ఆరాట‌ప‌డ‌తారు. హెరిటేజ్ MDగా, NTR ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా భువ‌నేశ్వ‌రి సైతం నిత్యం బిజీగా ఉంటారు. క‌రోనా కాలంలో ఎన్టీఆర్ ట్ర‌స్ట్ త‌ర‌ఫున ఎన‌లేని సేవ చేశారు. అమ‌రావ‌తి కోసం చేతికున్న బంగారు గాజులు విరాళంగా ఇచ్చారు. అలాంటి భువ‌నేశ్వ‌రి క్యారెక్ట‌ర్‌కే క‌లంకం తెచ్చేలా వైసీపీ నేత‌లు నిండు స‌భ‌లో ఆరోప‌ణ‌లు చేయ‌డాన్ని చంద్ర‌బాబు త‌ట్టుకోలేక‌పోయారు. గుండెప‌గిలేలా విల‌పించారు.  1981, సెప్టెంబ‌ర్ 10న చంద్ర‌బాబు-భువ‌నేశ్వ‌రిల వివాహం జ‌రిగింది. 1983, జ‌న‌వ‌రి 23న లోకేశ్ పుట్టారు. వైసీపీ మూక‌ల నోటి నుంచి వ‌స్తున్న మాధ‌వ‌రెడ్డి ఆ టైమ్‌లో అస‌లు రాజ‌కీయాల్లోనే లేరు. 1985లో మాధ‌వ‌రెడ్డి టీడీపీలో చేరారు. కారుకూత‌లు కూసే వారికి ఈ వివ‌రాల‌న్నీ తెలీక కావు.. విజ్ఞ‌త లేక‌. రాజ‌కీయ ప్ర‌యోజ‌నం కోస‌మో, చంద్ర‌బాబును నైతికంగా ప‌డ‌గొట్టాల‌నో.. అలా మాధ‌వ‌రెడ్డి పేరుతో పిచ్చిపిచ్చి పేలాప‌న‌లు పేలుతున్నారు.  చంద్ర‌బాబు-భువ‌నేశ్వ‌రీలు క‌డిగిన ముత్యాల్లాంటి వార‌ని తెలుగు ప్ర‌జ‌లంద‌రికీ తెలుసు. పురంధేశ్వ‌రీ చెప్పిన‌ట్టు.. ఎన్టీఆర్ కుటుంబమంతా నైతిక విలువ‌ల‌తో పెరిగిన వారే. ఈ వైసీపీ కూతుల‌కు చంద్ర‌బాబును తాత్కాలికంగా భావోద్రేగానికి గురి చేసుంటారేమో కానీ, ఆయ‌న కంట కారిన ప్ర‌తీ క‌న్నీటి చుక్క‌కు.. ఫ‌లితం అనుభ‌వించ‌క త‌ప్ప‌దు. ప్ర‌జాక్షేత్రంలో ఇంత‌కంటే ఘోర పరాభ‌వం త‌ప్ప‌దు. శిక్ష ప‌డాల్సిందే. త‌గిన శాస్త్రి జ‌ర‌గాల్సిందే. 

మరో నీరో చక్రవర్తి ఫిడేలు రాగాలు...

అన్నమంతా పట్టి చూడనవసరం లేదు. ఒక మెతుకు పట్టుకుంటే చాలు అన్నం ఉడికిందో లేదో తెలిసి పోతుంది. అలాగే, వ్యక్తుల నైజం ఏమిటో, వారు ఎలాంటి వారో తెలుసు కోవడానికి కూడా లోతుల్లోకి వెళ్లి విశ్లేషణలు చేయనవసరం లేదు. ఈ సూత్రం, ఈ సత్యం, వ్యక్తులకే కాదు, పార్టీలకు కూడా వర్తిస్తుందని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరో మారు రుజువు చేసింది. నిజానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా ఆర్టిస్టులు ఎవరికీ కూడా, భాష విషయంలో ఎలాంటి పట్టిపులు లేవన్నది జగద్విదితం. మంత్రులు మొదలు అన్ని స్థాయిల్లో బూతులు మాట్లాడేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకున్నారా, అనిపించే విధంగా వైసీపీలో అన్ని స్థాయిల్లో బూతుగణాలు ఉన్నాయి.     అందుకు వైసీపీ సభ్యులు శుక్రవారం శాసన సభలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, అవమానించి పొందిన ఆనందమే నిదర్శనం. అలాగే, రాష్ట్రానికే తలవంపులు తెచ్చిన ఆ సంఘటనపై ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, మంత్రి పదవిని ఆశిస్తున్న ఎమ్మెల్యేలు, స్పందించిన తీరు ఇంకా దుర్మార్గంగా ఉందని సామాన్యులు సైతం, వీళ్ళా మా నాయకులు అని  సిగ్గుతో తలలు వంచుకునున్న్తారు.ఛీ కొడుతున్నారు.   నిజానికి, ఉభయ తెలుగు రాష్ట్రాలలో రాజకీయ నాయకులు సభ్యత, సంస్కారం గీతలను ఎప్పుడోనే దాటేశారు. కొద్ది రోజుల క్రితం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా, తెలుగునాట దిగజారుతున్న రాజకీయ విలువలు ముఖ్యంగా రాజకీయ నాయకులు వాడుతున్న అసభ్యకర భాష పట్ల అవేదన వ్యక్త పరిచారు. ఈ పరిస్థితి చూస్తుంటే, రాజకీయాలంటేనే విరక్తి కలుగు తోందని అన్నారు.   ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజం. బండ్లు ఓడలవుతాయి ఓడలు బండ్లవుతాయి. అంతమాత్రాన ఓడిన వారిని చూసి అవహేళన చేయడం, అవమాన పరిచి ఆనందం పొందడం, అయితే రాక్షసత్వం,కాదంటే అజ్ఞానంతో కలిసిన అహంకారం, అనిపించుకుంటుంది. అయినా  అధికార ప్రతిపక్ష సభ్యులు, ఒకరినొకరు విమర్శించుకోవచ్చును.కానీ,కుటుంబ సభ్యులను, అందులోనూ రాజకీయాలతో సంబంధమే లేని మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం దిగజారుడు రాజకీయాల్లో పరాకాష్టగా  సామాన్య ప్రజలు కూడా ఆవేదన వ్యక్త పరుస్తున్నారు.  నిజానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు గతంలోనూ చాలా సందర్భాలలో సభలో సభా మర్యాద తప్పారు. దేవుడిచ్చిన నోరును దుర్వినియోగం చేశారు.అందుకు తమకంటే ముందు అధికారంలో ఉన్న తెలుగు దేశం పార్టీనే తమకు ఆదర్శం అంటే, అందులో కొంత నిజం ఉంది. కాదనలేము, కానీ, రాను రాను రాజు గుర్రం గాడిద అవుతోంది, అన్నట్లుగా పరిస్థితి దిగజారడం పట్ల అటో మేథావులు, రాజకీయ నాయకులు ఇటు సామాన్యులు కూడా విచారం వ్యక్త పరుస్తున్నారు.    గతాన్ని పక్కన పెట్టి తాజా ఉదంతాన్నే తీసుకుంటే, అసెంబ్లీ సమావేశాల తోలి రోజున  బీఏసీ సమావేసంలో ముఖ్యమంత్రి మున్సిపల్ ఎన్నికల విజయ దురహంకారాన్ని ప్రదర్శించారు. కుప్పం ఎన్నికల ఫలితాలను కడుపులో పెట్టుకుని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబాబు సభకు వస్తే చూడాలని ఉందని, వ్యంగ్యంగా, అవహేళన చేశారు. అలాగే, సమావేశాలు ఎంత కాలం నిర్ణయించాలి అనే విషయంలోనూ అచ్చెం నాయుడు చేసిన ప్రతిపాదనను ముఖ్యమంత్రి మరోమారు అదే రీతిలో అవహేళన చేశారు. అదేదో పిచ్చాపాటి ముచ్చట్లు అనంట్లుగా  పెద్దాయన ముచ్చట పడుతున్నారు, 26 వరకు నిర్వహిద్దామని అన్నారు. అంటే, ముందుగానే సభలో ప్రతిపక్షాన్ని, ప్రతిపక్ష నాయకుని అవమానించే ప్రణాళికతోనే ముఖ్యమంత్రి సభను 26 వరకు నిర్వహించాలని నిర్ణయానికి వచ్చారని వేరే చెప్పనక్కరలేదు. ఓ వంక అకాల వర్షాలు , వరదలు రాష్ట్రాన్ని అతలా కుతలం చేస్తున్నాయి, మరో వంక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దీనావస్తకు చేరుకుంది....ఇలాంటి పరిస్థితిలో ... నీరో చక్రవర్తిలా జగన్ రెడ్డి  ఈ ఫిడేలు రాగాలు ఏమిటని రాజకీయ విశ్లేషకులు కూడా విస్తుపోతున్నారు. ‘ఎదుటి వారి వేదనను చూసి నవ్వుకునే నీవు ఏడ్చే రోజు ఒకటి తప్పక వస్తుంద’ని, బైబిల్ చెప్పిదో లేదో కానీ, అది రుజువైన వాస్తవం. ఇదే చంద్రబాబును ఉద్దేశించి, గతంలో ఓ పెద్ద మనిషి, ఈ రోజు నువ్వు మీ అమ్మ కడుపులోంచి ఎందుకు బయటకు వచ్చానా అని గుక్కపట్టి ఏడ్చేలా  చేస్తాను, అని సభలోనే శపధం చేశారు. చివరకు ఆ శపధం చేసిన అయన ఏమయ్యారో అందరికీ తెలుసు ..అలాగే ఆరోజు ఆయన ఆ మాటలు అన్న రోజున చప్పట్లు కొట్టిన పార్టీ ఎక్కడుందో ఏమైందో కూడా తెలుసు .. అందుకే .. దుర్భాష ఏదైనా మీ నోట రానీయకుడి అంటుంది బైబిల్ .. జగ రెడ్డికి ఇదైనా తెలిసే ఉండాలి . తెలుసో లేదో .  

జగన్ పార్టీపై నందమూరి కుటుంబం అటాక్.. పేరు పేరునా ఖబర్దార్.. 

నంద‌మూరి కుటుంబం. ప‌ద్ద‌తైన కుటుంబం. స్వ‌చ్ఛ‌మైన మ‌నుషులు. ఆవేశంలేని శాంత‌మూర్తులు. బాల‌కృష్ణ మిన‌హా రాజ‌కీయ వాస‌న‌లు అంత‌గా లేని కుటుంబ స‌భ్యులు. ఆడా-మ‌గా-పిల్లా.. అంతా బాధాత‌త్ప హృద‌యాల‌తో మీడియా ముందుకు వ‌చ్చారు. క‌న్నీటిని ఆపుకుంటూనే.. క‌న్నెర్ర జేశారు. పెద్ద నోరేసుకొని ప‌డ‌కుండానే.. స్మూత్‌గా మాట్లాడుతూనే.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు నంద‌మూరి కుటుంబ స‌భ్యులు. బాల‌కృష్ణ‌, రామ‌కృష్ణ‌, ఉమా మ‌హేశ్వ‌రి, సుహాసిని, చైత‌న్య కృష్ణ‌, శ్రీనివాస్‌.. ఇలా ఒక్కొక్క‌రూ వారి బాధ‌ను వెళ్ల‌గ‌క్కుతూనే, భువ‌నేశ్వ‌రీకి మ‌ద్ద‌తుగా నిలిచారు. జ‌గ‌న్‌కు, జ‌గ‌న్ మంత్రుల‌కు, వైసీపీ మూక‌ల‌కు.. ఒక్కొక్క‌రి భ‌ర‌తం ప‌డ‌తామంటూ.. పేరు పేరునా హెచ్చ‌రించారు నంద‌మూరి కుటుంబం తమ కుటుంబ సభ్యులపై నీచంగా మాట్లాడినా, ఇష్చమెచ్చినట్లుగా వీర్రవిగినా సహించలేదన్నారు బాలకృష్ణ. ఇకపై ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. ఇప్పటికే చాలా సంయమనం పాటించామని, ఇకపై ఎవరూ నోరు జారితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బాలయ్య హెచ్చరించారు. అందరి భరతం పడతాం ఖబర్దార్ అని వార్నింగ్ ఇచ్చారు. రాజకీయాల్లో అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదన్నారు బాలయ్య. మళ్లీ ఇలాంచి నీచ, నికృష్ఠ మాటలు మాట్లాడితే తమ దెబ్బ చూపిస్తామన్నారు.  రాజకీయాల్లో విమర్శలు సహజమన్నారు బాలకృష్ణ. అంశాల వారీగా ఎవరైనా విమర్శలు చేయవచ్చన్నారు. అయితే వైసీపీ నేతలు వాడుతున్న బాష దారుణంగా ఉందన్నారు. భువనేశ్వరిపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం అత్యంత నీచమన్నారు బాలకృష్ణ. రాష్ట్రాభివృద్దికి జరగకుండా కుట్రలు చేస్తున్నారని అన్నారు. అందరి ఇండ్లలో ఆడవాళ్లు ఉన్నారు.. హేళన చేయవద్దన్నారు. వైసీపీ నేతల బాష, వేషం చూస్తే అసెంబ్లీలో ఉన్నామా లేక గొడ్ల చావిడీలో ఉన్నామో తెలియడం లేదు. అభివృద్దిపై చర్చకు బదులు వ్యక్తిగత ఎజెండాను తీసుకొచ్చారని మండిప్డడారు. మీరు మారకపోతే. మీ మెడలు వంచుతామన్నారు.   చంద్రబాబును, ఆయన కుటుంబంపై అసభ్యకరమైన కామెంట్లు చేసిన వైసీపీ ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు నందమూరి రామకృష్ణ. అసెంబ్లీ జరిగిన పరిణామాలు చాలా దారుణంగా ఉన్నాయన్నారు. కొడాలి నాని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వంశీ, అంబటి రాంబాబుపై విరుచుకుపడ్డారు. దేవాలయం లాంటి నందమూరి ఫ్యామిలీ జోలికి వస్తే పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. ఓరెయ్ నానీగా, ఓరెయ్ వంశీగా, ఓరెయ్ ద్వారంపూడి... అంబటి రాంబాబు.. మరోసారి నోరు జారితే తాట తీస్తామని రామకృష్ణ హెచ్చరించారు. రాజకీయాల కోసం తమ కుటుంబాన్ని ఇబ్బందిపాలు చేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పారు.   వైసీపీ ఎమ్మెల్యేలకు సిగ్గు, లజ్జా ఉందా అని నందమూరి చైతన్య కృష్ణ అన్నారు. చంద్రబాబు బాధపడుతుంటే చూడలేకపోయామన్నారు అసెంబ్లీలో భువనేశ్వరిపై అత్యంత నీచంగా మాట్లాడారని, రాజకీయాల కోసం మహిళ పట్ల ఇంత నీచంగా వ్యవహరిస్తారా అని చైతన్య ప్రశ్నించారు. వల్లభనేని వంశీ, కొడాలి నానీ, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జుగుప్సాకరంగా మాట్లాడరని విమర్శించారు. వంశీ, నానీ, రాంబాబు మాటలపై సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించాలన్నారు. వాళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే వాళ్ల మాటల వెనుక జగన్ ఉన్నారన్నది స్పష్టమవుతుందన్నారు చైతన్య కృష్ణ. నందమూరి కుటుంబం ఆదర్శవంతమైన కుటుంబమన్నారు చైతన్య కృష్ణ. ఎన్టీఆర్ తమను చాలా పద్దతిగా పెంచారన్నారు.  

వైసీపీ ఎమ్మెల్యేలకు సిగ్గు, లజ్జా ఉందా.. 

చంద్రబాబు బాధపడుతుంటే చూడలేకపోయామన్నారు నందమూరి చైతన్య కృష్ణ. అసెంబ్లీలో భువనేశ్వరిపై అత్యంత నీచంగా మాట్లాడారని అన్నారు. రాజకీయాల కోసం మహిళ పట్ల ఇంత నీచంగా వ్యవహరిస్తారా అని చైతన్య ప్రశ్నించారు. వల్లభనేని వంశీ, కొడాలి నానీ, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జుగుప్సాకరంగా మాట్లాడరని విమర్శించారు. వంశీ, నానీ, రాంబాబు మాటలపై సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించాలన్నారు. వాళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే వాళ్ల మాటల వెనుక జగన్ ఉన్నారన్నది స్పష్టమవుతుందన్నారు చైతన్య కృష్ణ.  నందమూరి కుటుంబం ఆదర్శవంతమైన కుటుంబమన్నారు చైతన్య కృష్ణ. ఎన్టీఆర్ తమను చాలా పద్దతిగా పెంచారన్నారు. రాజకీయాల కోసం తమ కుటుంబాన్ని ఎందుకు లాగుతున్నారని నిలదీశారు.

ఓరెయ్ నానీగా, వంశీగా, అంబటిగా.. తాటతీస్తాం..

చంద్రబాబు, ఆయన కుటుంబంపై అసభ్యకరమైన కామెంట్లు చేసిన వైసీపీ ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు నందమూరి రామకృష్ణ. అసెంబ్లీ జరిగిన పరిణామాలు చాలా దారుణంగా ఉన్నాయన్నారు. కొడాలి నాని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వంశీ, అంబటి రాంబాబుపై విరుచుకుపడ్డారు. దేవాలయం లాంటి నందమూరి ఫ్యామిలీ జోలికి వస్తే పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. ఓరెయ్ నానీగా, ఓరెయ్ వంశీగా, ఓరెయ్ ద్వారంపూడి... అంబటి రాంబాబు.. మరోసారి నోరు జారితే తాట తీస్తామని రామకృష్ణ హెచ్చరించారు. రాజకీయాల కోసం తమ కుటుంబాన్ని ఇబ్బందిపాలు చేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పారు.  

భరతం పడతాం.. ఖబర్దార్! జగన్ కు బాలయ్య వార్నింగ్ 

తమ కుటుంబ సభ్యులపై నీచంగా మాట్లాడినా, ఇష్చమెచ్చినట్లుగా వీర్రవిగినా సహించలేదన్నారు బాలకృష్ణ. ఇకపై ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. ఇప్పటికే చాలా సంయమనం పాటించామని, ఇకపై ఎవరూ నోరు జారితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బాలయ్య హెచ్చరించారు. అందరి భరతం పడతాం ఖబర్దార్ అని వార్నింగ్ ఇచ్చారు. రాజకీయాల్లో అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదన్నారు బాలయ్య.  చంద్రబాబుకు జరిగిన అవమానంపై నందమూరి ఫ్యామిలీ ఆవేదన వ్యక్తం చేసింది. రాజకీయాల్లో విమర్శలు సహజమన్నారు బాలకృష్ణ. అంశాల వారీగా ఎవరైనా విమర్శలు చేయవచ్చన్నారు. అయితే వైసీపీ నేతలు వాడుతున్న బాష దారుణంగా ఉందన్నారు. భువనేశ్వరిపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం అత్యంత నీచమన్నారు బాలకృష్ణ. రాష్ట్రాభివృద్దికి జరగకుండా కుట్రలు చేస్తున్నారని అన్నారు. అందరి ఇండ్లలో ఆడవాళ్లు ఉన్నారు.. హేళన చేయవద్దన్నారు. 

వరదలతో సీమ విలవిల.. ఎవరిదీ ముంపు పాపం?

కుండపోత వర్షంతో వరద పోటెత్తింది. రాయలసీమ అతలాకుతలమైంది. చిత్తూరు, కడప, అనంతపురంతో పాటు నెల్లూరు జిల్లాలో వరద విలయం స్పష్టించింది. వందలాది గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రాణ నష్టం కూడా ఇటీవల కాలం ఎప్పుడు లేనంతగా జరిగింది. అసలు ఎవరూ ఊహించని రీతిలో అపార నష్ఠం జరిగింది. దీంతో వరద ముంపునకు అసలు కారణమేంటీ అన్న చర్చ సాగుతోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ముంపు పెరిగిందనే విమర్శలు వస్తున్నాయి.  మూడు రోజులుగా వాయుగుండం ప్రభావంతో విస్తారంగా వానలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందస్తుగానే హెచ్చరించింది. దీంతో క్షేత్ర స్థాయిలో జలాశయాల పరిధిలో, నది పరివాహక ప్రాంతాల్లో అనుక్షణం అప్రమత్తం చేయాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉంది. జలాశయాల్లోకి చేరే నీటిని ఎప్పటికప్పడు అంచనా వేయాలి. వరద ముంపు, ముప్పును తప్పించాల్సి ఉంది. కాని అధికారులు ఇవేమి చేసినట్లు కనిపించలేదు. ఎన్ని క్యూసెక్కుల వరద వస్తోంది, ఎంత వదలాలి. ఎంత నీరు వదిలాలి అన్న లెక్కలను చూసుకోలేదు. దీంతో జరగరాని నష్టం జరిగిపోయింది. నది పరివాహకంలో గ్రామాల్లోకి నీరు దూసుకెళుతుందని ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటే ఇంత విషాదం ఉండేది కాదని చెబుతున్నారు. కడప జిల్లాలోని అన్నమయ్య జలాశయం ప్రమాదంలో పడింది. ఎప్పుడు లేనంతగా కట్ట కోతకు గురైంది. అన్నమయ్య జలాశయం నిల్వ సామర్థ్యం 2.239 టీఎంసీలు కాగా, గరిష్ఠంగా 2.48 లక్షల క్యూసెక్కుల నీటిని బయటకు వదిలే వెసులుబాటు ఉంది. అయిదో గేటు సాంకేతిక లోపంతో మొరాయించింది. కొన్నిరోజులుగా మరమ్మతులు చేయాలని అధికారులు ప్రయత్నిస్తున్నా నిధులు ఇవ్వలేదు. మిగతా 4 గేట్ల సామర్థ్యం మేరకు పూర్తిస్థాయిలో పనిచేయలేదు. వరద ఎక్కువగా వస్తుందని భయపడి అధికార యంత్రాంగం పూర్తిగా ఎత్తలేదని తెలిసింది. దీంతో మట్టి కట్టపైకి నీరు చేరడానికి కారణమైంది. ఎగువన పింఛ జలాశయంలోకి ఎంత నీరు వస్తుంది. తాత్కాలిక కట్ట తెగితే వరద ప్రవాహం ఎలా ఉంటుంది అని దిగువన ఉన్న వారికి సమాచారం చేరవేయాల్సి ఉంది. విపత్తు జరిగితే జిల్లా కీలక అధికారులు ముందుగానే సిద్ధంగా ఉండాలి. క్షేత్రస్థాయిలో విపత్తులు తలెత్తితే ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలి. సమర్థంగా పనిచేసేలా అధికారులకు బాధ్యతలు అప్పగించాలి. వెంటనే కార్యాచరణలోకి దిగాలి. ఇక్కడ అది చేయలేదనే మాట సర్వత్రా వినిపిస్తోంది. ముందుచూపు కొరవడంతోనే వరద ముంపు ముంచేసినట్లు బాధితులు ఆక్రోశిస్తున్నారు.  వరద ఉద్ధృతికి కోతకు గురైన అన్నమయ్య జలాశయం కట్ట.. ఎందరికో కడుపు కోత మిగిల్చింది. జలాశయాన్ని బద్ధలుకొట్టుకుని చెయ్యేరులోకి దూసుకొచ్చిన వరద నీరు.. ఏరూ ఊరును ఏకం చేసింది. పదుల సంఖ్యలో గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. నీటి ప్రవాహ ఉద్ధృతికి.. నిస్సహాయ స్థితిలో ఉన్న ఎందరో కొట్టుకుపోయారు. ముళ్లపొదల్లో.. ఇళ్ల శిథిలాల్లో శవాలై తేలారు. వందలాది మూగజీవాలు సైతం ఏటి పాలయ్యాయి. కనీవిని ఎరుగని స్థాయిలో కల్లోలం సృష్టించిన తుపాను జన జీవనాన్ని కకావికలం చేసింది. ప్రశాంతంగా ఉన్న పల్లెల బతుకు చిత్రాన్ని తారుమారు చేసింది.  వరదనీరు పోటెత్తుతున్న వేళలో రాజంపేట డిపో నుంచి ఆర్టీసీ  బస్సులను ఎందుకు పంపారో ఎవరికి అంతుపట్టడంలేదు. ఉదయం డిపో నుంచి అనంతపురానికి బయలుదేరిన బస్సు రామాపురం చెక్‌పోస్టు వద్దకు వెళ్లేసరికి వరద నీరు ఒక్కసారిగా వచ్చేసింది. దీంతో ముందుకు వెళ్లలేక వెనక్కి తిప్పుకుని వస్తున్న సమయంలో వరదతాకిడి ఎక్కువై వరదలో చిక్కుకుంది. రెండు, మూడు గంటల తరువాత పోలీస్, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో ఉన్నవారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. రెండో బస్సులో ఆరుగురు ఉంటే వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వరద తాకిడికి ఆర్టీసీ అద్దె బస్సు మునిగిపోయింది. ఇందులోని ఏడుగురిలో డ్రైవరు, మరో ప్రయాణికుడు మాత్రం బస్సు పైకి ఎక్కారు. మిగిలిన వారు బస్సులోనే చిక్కుకున్నారు.   

ఆర్థరాత్రి నీటమునిగిన నెల్లూరు.. వరదలో పరుగులు తీసిన ప్రజలు 

ఆంధ్రప్రదేశ్ లో వరద బీభత్సం కొనసాగుతోంది. రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. వందలాది గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా వరదలు వచ్చాయంటున్నారు రాయలసీమ అధికారులు. వరదలతో ప్రాణ నష్టం కూడా పెరిగిపోతోంది.  నెల్లూరులో గత అర్ధరాత్రి ప్రజలు భయంతో వణికిపోయారు. ఎడతెరిపిలేని వర్షాలతో అతలాకుతలం అవుతున్న నగరంలో అర్ధరాత్రి దాటాక స్థానిక భగత్‌సింగ్ కాలనీ పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ఉదయం నుంచే కొంతకొంతగా నీరు చేరడంతో అప్రమత్తమైన అధికారులు బాధితులు కొందరిని అక్కడి నుంచి జనార్దనరెడ్డి కాలనీలోని టిడ్కో ఇళ్లకు తరలించారు.అర్ధరాత్రి దాటాక వరద నీరు కాలనీని పూర్తిగా ముంచెత్తడంతో ప్రజలు ప్రాణభయంతో వణికిపోయారు. పిల్లలను పట్టుకుని రక్షించుకునేందుకు నడుము లోతు నీళ్లలో పరుగులు తీశారు. దీంతో రంగంలోకి దిగిన సహాయక బృందాలు కాలనీ వాసులను నగరంలోని డీకేడబ్ల్యూ కళాశాలకు తరలించారు. 

కృష్ణుడి చేయి విరిగిందని హాస్పిటల్ వెళ్లిన పూజారి..

ఎవరికి గాయమైనా హాస్పిటల్ వెళతారు. దెబ్బ తగిలిన చోట చికిత్స తీసుకుంటారు. కాని ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన ఓ పూజారి.. ఆలయంలోని కృష్ణుడి విగ్రహం చేయి విరిగిందంటూ ఆస్పత్రికి పరుగులు తీశారు పూజారి. విగ్రహానికి కట్టు కట్టాలంటూ వైద్యులను వేడుకున్నారు. మొదట డాక్టర్లు పట్టించుకోకపోవడంతో తల గోడకేసుకుని తనను తాను గాయపర్చుకున్నాడు. దీంతో చేసేదేమి లేక వైద్యులు కృష్ణుడి విగ్రహానికి కట్టు కట్టారు. ప్రస్తుతం ఈ సంఘటన బాగా వైరల్‌గా మారింది. అర్జున్‌ నగర్‌లోని ఖేరియా మోడ్‌లోని పత్వారీ ఆలయ పూజారి లేఖ్‌ సింగ్‌  శ్రీకృష్ణుడి విగ్రహానికి స్నానం చేయిస్తుండగా పొరపాటుగా విగ్రహం చేయి భాగం దెబ్బతింది. అంతే ఆ విగ్రహాన్ని తీసుకుని వెంటనే ఆగ్రా జిల్లా ఆస్పత్రికి పరుగులు పెట్టారు. విగ్రహానికి కట్టుకట్టాలని అక్కడి వైద్యులను వేడుకున్నారు. ఈ వింత వాదన విన్న డాక్టర్లు ముందు పూజారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆయన వినలేదు. దీంతో పూజారిని సంతృప్తి పరిచేందుకు డాక్టర్‌ కృష్ణుడి విగ్రహానికి ప్లాస్టర్‌ కట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ఈ ఘటనకు సంబంధించిన వివరాలను  ఆగ్రా జిల్లా ఆస్పత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్‌ డాక్టర్ అశోక్ అగర్వాల్ వివరించారు. ‘పూజారి దేవతా విగ్రహం తీసుకుని వచ్చి వైద్యం చేయమని విజ్ఞప్తి చేశారు. అతనికి ఏం చెప్పాలో మాకు అర్థం కాలేదు. అయితే అతనికి హృద్రోగ సమస్యలున్నాయి. అందుకే పూజారిని ఎక్కువగా ఇబ్బందిపెట్టదలుచుకోలేదు. దీంతో పాటు అతని సెంటిమెంట్‌ను పరిగణలోకి తీసుకునే ‘శ్రీ కృష్ణ’ పేరుతో పేరు నమోదు చేసుకున్నాం. ఆతర్వాత విగ్రహానికి కట్టు కట్టాం’  అన్నారు. తాను నిత్యం పూజించే విగ్రహం చేయి  విరగడంతో తల్లడిల్లిన పూజారిని స్థానికులు అభినందిస్తున్నారు. దేవుడి పట్ల ఆయనకున్న భక్తిని చూసి అబ్బురపడుతున్నారు. ఇప్పుడా పూజారి ఆగ్రాలో పాపులర్ అయ్యారు.   

కేంద్రం ర‌ద్దు చేసిన చ‌ట్టాల్లో ఏముంది? రైతుల పోరాటమెందుకు? గెలుపెవరది?

కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై కేంద్ర సర్కార్ వెనక్కి తగ్గింది. మూడు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు గురు నానక్ జయంతి రోజున ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. దీంతో ఏడాదిగా రైతులు చేస్తున్న పోరాటం ఫలించినట్లైంది. అదే సమయంలో మోడీ ప్రభుత్వం ఓడిపోయిందంటూ విపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాయి. బీజేపీ మాత్రం తమది రైతుల పక్షపాత ప్రభుత్వమని చెబుతోంది.  ఈ నేపథ్యంలో మోడీ సర్కార్ తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల్లో ఏముంది, ఆ చట్టాలతో రైతులు నష్టం కలుగుతుందా.. రైతులు ఎందుకు అంతలా ఆ చట్టాలను వ్యతిరేకించారు అన్న దానిపై సమగ్రంగా చూద్దాం.. రైతుల మేలు కోస‌మేన‌ని చెబుతూ మోదీ ప్ర‌భుత్వం గ‌త ఏడాది మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను తీసుకొచ్చింది. రైతులకు లాభం చేకూర్చేందుకే ఈ చ‌ట్టాల‌ను తెచ్చామని కేంద్ర ప్ర‌భుత్వం స‌మ‌ర్థించుకున్న‌ప్ప‌టికీ.. రైతులు మాత్రం ఈ చ‌ట్టాల‌ను తీవ్రంగా వ్య‌తిరేకించారు. వీటి వ‌ల్ల లాభాల కంటే న‌ష్టాలే ఎక్కువగా ఉన్నాయ‌ని విమ‌ర్శించారు. వెంట‌నే కొత్త సాగు చ‌ట్టాల‌ను ఉప‌సంహ‌రించుకోవాల‌ని డిమాండ్ చేశారు. అయినా కేంద్రం వెన‌క్కి త‌గ్గ‌క‌పోవ‌డంతో రైతులు రోడ్డెక్కి ధ‌ర్నాలు చేశారు. సాగు చ‌ట్టాల ఉప‌సంహ‌ర‌ణ కోసం ఇప్ప‌టికీ దేశ రాజ‌ధాని వ‌ద్ద రైతులు దీక్ష‌లు చేస్తూనే ఉన్నారు. ఈ క్ర‌మంలో ఎట్ట‌కేల‌కు కేంద్రం త‌లొగ్గింది. కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకుంటున్నామ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్ర‌క‌టించారు. దీంతో రైత‌న్న‌లు సంబురాల్లో మునిగిపోయారు. మరి కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన ఆ మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాలు ఏంటి? వాటిని అన్న‌దాత‌లు ఎందుకు అంత‌లా వ్య‌తిరేకించారు? ఒక‌సారి చూద్దాం.. నిత్య‌వ‌స‌ర వ‌స్తువుల (స‌వ‌ర‌ణ ) బిల్లు – 2020 వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల వ‌ర్త‌క‌, వాణిజ్యం ( ప్రోత్సాహం, స‌దుపాయ క‌ల్ప‌న )బిల్లు -2020 ధ‌ర‌ల హామీ, వ్య‌వ‌సాయ సేవ‌ల ఒప్పంద బిల్లు ( సాధికార‌త, ర‌క్ష‌ణ ) -2020 చ‌ట్టాల్లో ఏముంది? నిత్య‌వ‌స‌ర వ‌స్తువుల (స‌వ‌ర‌ణ ) బిల్లు దేశంలో ప్ర‌స్తుతం నిత్య‌వ‌స‌ర స‌రుకుల చ‌ట్టం-1955 అమ‌లులో ఉంది. దీనికి స‌వ‌ర‌ణ‌గా కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాన్ని తీసుకొచ్చింది. నిత్య‌వ‌స‌ర స‌రుకుల జాబితాలో ఉన్న వ‌స్తువుల ఉత్ప‌త్తి, స‌ర‌ఫ‌రా, పంపిణీ, వాణిజ్యాల నియంత్రణ అధికారం కేంద్రానికి ఉంటుంది. వ్య‌వ‌సాయరంగంలో పోటీ, రైతుల ఆదాయం పెంచ‌డానికి ఉద్దేశించిన చ‌ట్టంగా ఆర్డినెన్స్‌లో పేర్కొన్నారు. వినియోగ‌దారుల ప్ర‌యోజ‌నాల‌ను కాపాడుతూనే నిత్య‌వ‌స‌ర వ‌స్తువుల‌పై నియంత్ర‌ణ వ్య‌వ‌స్థ‌ను స‌ర‌ళీక‌రించ‌డం ఈ చ‌ట్టం ఉద్దేశ‌మ‌ని చెప్పారు. అయితే కొన్ని ర‌కాల ఆహార ప‌దార్థాలు, ఎరువులు, పెట్రోలియం ఉత్ప‌త్తులు వంటి స‌రుకుల‌ను నిత్య‌వ‌స‌రాలుగా పేర్కొన‌డానికి కేంద్ర ప్ర‌భుత్వానికి ఈ చ‌ట్టం అధికారం ఇస్తుంది. అంటే యుద్ధం వ‌చ్చిన‌ప్పుడు, ప్ర‌కృతి విప‌త్తులు త‌లెత్తిన‌ప్పుడు, ధ‌ర‌లు విప‌రీతంగా పెరిగిన‌ప్పుడు లాంటి అసాధార‌ణ ప‌రిస్థితులు త‌లెత్తిన‌ప్పుడు నిత్య‌వ‌స‌రాల ఉత్ప‌త్తి, స‌ర‌ఫ‌రా, పంపిణీ, వాణిజ్యాన్ని కేంద్ర ప్ర‌భుత్వం నియంత్రించ‌గ‌ల‌దు. ఈ కొత్త సాగు చ‌ట్టం ప్ర‌కారం తృణ ధాన్యాలు, ప‌ప్పులు, ఆలుగ‌డ్డ‌లు, ఉల్లిగ‌డ్డ‌, నూనె గింజ‌లు వంటి ఆహార ప‌దార్థాల స‌ర‌ఫరా, నిల్వ‌ను నియంత్రించే అధికారం కేంద్రానికి ఉంటుంది. వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల వ‌ర్త‌క‌, వాణిజ్యం ( ప్రోత్సాహం, స‌దుపాయ క‌ల్ప‌న )బిల్లు -2020 వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల అమ్మ‌కాల‌పై రైతుల‌కు పూర్తి స్వేచ్ఛ క‌ల్పిస్తుంద‌ని ఈ బిల్లులో పేర్కొన్నారు. ఈ చ‌ట్టం ప్ర‌కారం క‌నీస మ‌ద్దతు ధ‌ర కోసం ప్ర‌భుత్వాల‌పై ఆధార‌ప‌డ‌కుండా పండించిన పంట‌ను త‌మ ఇష్టానుసారం రైతులు ఎక్క‌డైనా అమ్ముకోవ‌చ్చు. ఇందులో భాగంగా మార్కెట్ క‌మిటీ స‌రిహ‌ద్దులు దాటి విక్ర‌యించే వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌పై రాష్ట్రాలు కానీ.. స్థానిక ప్ర‌భుత్వాలు కానీ ఎలాంటి ప‌న్నులు, ఫీజులు వ‌సూలు చేయ‌డానికి వీల్లేదు. అంటే త‌మ పంట‌ను అమ్ముకునేందుకు, ధ‌ర‌ను నిర్ణ‌యించుకునేందుకు రైతులు, ప్రైవేటు వ్యాపారుల‌కు ఈ బిల్లు పూర్తి స్వేచ్ఛ క‌ల్పిస్తుంది. ఎల‌క్ట్రానిక్ వ‌ర్త‌కానికి కూడా ఇది అనుమ‌తిస్తుంది. కాబ‌ట్టి ఆన్‌లైన్‌లో క్ర‌య‌విక్ర‌యాల కోసం ఎల‌క్ట్రానిక్ ట్రేడింగ్ వేదిక‌ను ఏర్పాటు చేసుకోవ‌చ్చు. పాన్‌కార్డు ఉన్న కంపెనీలు, భాగ‌స్వామ్య సంస్థ‌లు, రిజిస్ట‌ర్డ్ సొసైటీలు, ఫార్మ‌ర్ ప్రొడ్యూస‌ర్ ఆర్గ‌నైజేష‌న్‌, వ్య‌వ‌సాయ స‌హ‌కార సంస్థ‌లు ఏవైనా స‌రే ఆన్‌లైన్ వ‌ర్త‌క వేదిక‌ను ఏర్పాటు చేయ‌వ‌చ్చు. ధ‌ర‌ల హామీ, వ్య‌వ‌సాయ సేవ‌ల ఒప్పంద బిల్లు ఈ బిల్లు ప్ర‌కారం ఒక రైతు తాను పంట వేయ‌డానికి ముందే కొనుగోలుదారుడితో నిర్ణీత కాలానికి ఒప్పందం కుదుర్చుకోవ‌చ్చు. క‌నిష్టంగా ఒక పంట‌కాలం నుంచి ఐదేళ్ల వ‌ర‌కు ఈ ఒప్పందాన్ని చేసుకోవ‌చ్చు. ఈ ఒప్పంద ప‌త్రంలోనే వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల ధ‌ర‌ను పేర్కొనాల్సి ఉంటుంది. ఈ ఒప్పంద వ్య‌వ‌సాయంలో త‌లెత్తే స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఒక అథారిటీ ఉంటుంది. అదే మూడంచెల వ్య‌వ‌స్థ స‌యోధ్య బోర్డు, స‌బ్ డివిజిన‌ల్ మెజిస్ట్రేట్‌, అప్పీలేట్ అథారిటీ. ప్రైవేటు వ్యాపారికి, రైతుకు మ‌ధ్య ఒప్పందం స‌మ‌యంలో ఏదైనా వివాదం త‌లెత్తితే మొద‌ట బోర్డు ప‌రిధిలో స‌యోధ్య కుద‌ర్చ‌డానికి ప్ర‌య‌త్నిస్తారు. అక్క‌డ ప‌రిష్కారం దొర‌క్క‌పోతే 30 రోజుల తర్వాత స‌బ్ డివిజ‌న‌ల్ మెజిస్ట్రేట్‌ను సంప్ర‌దించ‌వ‌చ్చు. స‌బ్ డివిజిన‌ల్ మెజిస్ట్రేట్ నిర్ణ‌యం న‌చ్చ‌కుంటే అప్పీలేట్ అథారిటీని సంప్ర‌దించ‌వ‌చ్చు. వీటిలో ఏ స్థాయిలోనైనా స‌రే రైతుకు వ్య‌తిరేకంగా నిర్ణ‌యం వ‌స్తే రిక‌వ‌రీ కోసం వ్య‌వ‌సాయ భూమిని తీసుకోవ‌డానికి ఈ చ‌ట్టం అంగీక‌రించ‌దు. ఎందుకు వ్య‌తిరేకించారు? నిజానికి ఈ మూడు చ‌ట్టాలు రైతులు మేలు చేసేలా క‌నిపించినా ఏ మాత్రం ప్ర‌యోజ‌న‌క‌ర‌మైన‌వి కావ‌ని రైతు సంఘాలు, విప‌క్షాలు మొద‌ట్నుంచి ఆరోపిస్తూనే ఉన్నాయి. ఈ చ‌ట్టాల వ‌ల్ల ప్రైవేటు వ్యాపారులు, బ‌హుళ జాతి కంపెనీల గుప్పిట్లో రైతులు చిక్కుకునే ప్ర‌మాద‌మే ఎక్కువ‌గా ఉన్నాయ‌ని వారు ఆరోపిస్తున్నారు. స‌న్న‌కారు రైతుల‌ను ఈ చ‌ట్టాలు క‌ష్టాల్లోకి నెట్టేస్తాయ‌ని.. రైతుల ఆత్మ‌హ‌త్య‌లు పెరుగుతాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. అందుకే రైతులు కూడా ఈ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ ఆందోళ‌న‌కు దిగారు. ఎట్ట‌కేల‌కు విజ‌యం సాధించారు.

వైన్స్‌తో వేల‌ కోట్ల ఆదాయం.. తెలంగాణలో ఏపీ వ్యాపారుల ఉత్సాహం..

ఏ ప్ర‌భుత్వానికైనా కాసులు కుమ్మ‌రించే వ్యాపారం ఏదంటే.. మ‌ద్యం షాపులే. తెలంగాణ స‌ర్కారు లిక్క‌ర్ రాబ‌డితోనే మ‌నుగ‌డ సాగిస్తోంది. ఇక‌, ఏపీ ప్ర‌భుత్వ‌ త‌ల‌రాత మొత్తం వైన్స్ చుట్టూనే తిరుగుతోంది. సీఎం కేసీఆర్‌కు మ‌ద్యం ప్రియులంటే మ‌హా ప్రేమ‌. అందుకే అడ‌క్కున్నా.. గ‌ల్లీ గ‌ల్లీలో మ‌ద్యం షాపులు పెట్టిస్తున్నారు. తాగాల‌ని లేకున్నా.. తాగేలా టెంప్ట్ చేస్తున్నారు. ఆబ్కారీ అధికారుల‌కు టార్గెట్ పెట్టి మ‌రీ స‌రుకు అమ్మిస్తున్నారు. ఇక జ‌గ‌న్‌రెడ్డి ఏమ‌న్నా త‌క్కువా? రెండు ఫుల్ బాటిళ్లు ఎక్కువే అమ్మిస్తున్నారు. ఊరూపేరు లేని సొంత బ్రాండ్లు తీసుకొచ్చి.. ప్ర‌భుత్వ త‌ర‌ఫునే వైన్స్ పెట్టించి.. మందుబాబుల జేబులు, ఆరోగ్యం అన్నీ లూటీ చేస్తున్నారు. ఇది చాల‌ద‌న్న‌ట్టు.. మ‌ద్యం రాబ‌డినే ష్యూరిటీగా చూపించి.. వేల కోట్ల అప్పులు కూడా చేస్తున్నారు. మ‌రోవైపు, మ‌ద్య‌పాన నిషేధం అంటూ రాజ‌కీయ ప‌బ్బ‌మూ గ‌డుపుకుంటున్నారు. ఇలా రెండు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు త‌మదైన స్టైల్‌లో లిక్క‌ర్ పాలిటిక్స్ చేస్తూ.. ఆ ఇద్ద‌రూ పోటీప‌డుతున్నారు. అది వేరే విష‌యం.. ఇక లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. తెలంగాణ‌లో క‌రువు తీరేలా మ‌ద్యం దుకాణాలు రాబోతున్నాయి. ఖ‌జానా నిండేలా రాబ‌డి ఇప్ప‌టికే వ‌చ్చేసింది. తెలంగాణ‌లో ఈ గ్లాసులు, కాసుల గ‌ల‌గ‌ల‌లో ఏపీ వాటా భారీగా ఉండ‌టం ఆస‌క్తిక‌రం.  తెలంగాణ‌లో మద్యం దుకాణాలకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. సుమారు 70వేల వ‌ర‌కూ దరఖాస్తులు దాఖలయ్యాయి. రెండేళ్ల క్రితం అప్లికేష‌న్ల‌తో పోలిస్తే.. ఇది దాదాపు డ‌బుల్‌. ఒక్కో ద‌ర‌ఖాస్తుకు 2 ల‌క్ష‌ల ఫీజు వ‌సూలు చేసింది స‌ర్కారు. డ్రాలో మ‌ద్యం షాపు రాకున్నా.. ఈ 2ల‌క్ష‌లు రిట‌ర్న్ ఇవ్వ‌రు. ఇలా, ఒక్క‌సారే గంప‌గుత్త‌గా ప్ర‌భుత్వ ఖ‌జానాకు కేవలం దరఖాస్తుల రూపంలోనే సుమారు రూ.1,400 కోట్ల ఆదాయం వ‌చ్చి ప‌డింది. ఇక వైన్స్ ఏర్పాటుకు స్లాబ్‌ల‌ను బ‌ట్టి వ‌సూలు చేసే రుసుం రాబ‌డి.. ఇంత‌కంటే భారీ మొత్త‌మే ఉంటుంది. ఇక లిక్క‌ర్ సేల్స్ మీద వ‌చ్చే ప‌న్నుల బాదుడు అది వేరే లెక్క‌. తెలంగాణ స‌ర్కారుకు జాక్‌పాట్ త‌గిలిన‌ట్టే. ఇంత‌కంటే ఇంట్రెస్టింగ్ మ్యాట‌ర్ మ‌రోటి ఉంది. తెలంగాణ‌లో వైన్స్ పెట్టేందుకు ఏపీ వ్యాపారులు భారీగా ఎగ‌బ‌డ్డారు. ఏపీ బోర్డ‌ర్‌లో ఉండే తెలంగాణ జిల్లాలో చాలా షాపుల‌కు ఏపీ వాళ్లు ద‌ర‌ఖాస్తులు చేశారు. ఎందుకుంటే.. తెలంగాణ మ‌ద్యానికి ఏపీలో ఫుల్ డిమాండ్ ఉంది. జ‌గ‌న‌న్న అమ్మే నాసిర‌కం బ్రాండ్లు తాగ‌లేక‌.. అంతేసి ధ‌ర పెట్ట‌లేక‌.. చాలామంది ఏపీ వాసులు తెలంగాణ జిల్లాల నుంచే మ‌ద్యం కొనుగోలు చేస్తున్నారు. గ‌ప్‌చుప్‌గా ఏపీలో తాగుతున్నారు..అమ్ముతున్నారు. అందుకే, తెలంగాణ‌లోనూ మ‌న‌దే దుకాణం ఉంటే.. ఆ బిజినెస్సే వేరు అనుకుంటూ.. ఏపీ వ్యాపారులు ఈసారి భారీగా అప్లికేష‌న్లు పెట్టారు.  సరిహద్దు జిల్లాలైన ఖమ్మం, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెంలలోని దుకాణాలకు ఏపీ నుంచి పెద్ద సంఖ్య‌లో దరఖాస్తులు వ‌చ్చాయ‌ని తెలుస్తోంది. స‌గ‌టున ఒక్కో దుకాణానికి 24 మంది పోటీ ప‌డ‌గా.. స‌రిహ‌ద్దు జిల్లాల్లో మాత్రం యావ‌రేజ్‌న ఒక్కో షాపున‌కు 40మందికి పైనే పోటీ ప‌డ్డారు. శనివారం లాటరీ పద్ధతిలో దుకాణాలను కేటాయించనున్నారు. జ‌గ‌న‌న్న మ‌ద్యం పాల‌సీ.. ఇలా తెలంగాణ‌కు కాసుల వ‌ర్షం కురిపిస్తోంద‌ని అంటున్నారు. 

చంద్ర‌బాబు క‌న్నీటి శాపం, కార్య‌క‌ర్త‌ల ఆత్మ‌హ‌త్యాయ‌త్నం, జ‌గ‌న్‌కు మోదీ ఫోన్‌.. టాప్‌న్యూస్

1. అప్పుడు తన తల్లిని దూషించారు.. ఇప్పుడు తన భార్య విషయం తీసుకువచ్చి అవమానించారంటూ ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు వెక్కి వెక్కి ఏడ్చారు. క‌న్నీరు ఆగ‌క ప్రెస్‌మీట్‌లోనే భోరున విలపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో తన తల్లిని దూషిస్తే.. తాను గట్టిగా వైఎస్‌ను ప్రశ్నించానన్నారు. దీంతో తప్పు జరిగింది.. క్షమించమని అడిగారన్నారు. ఇవాళ వైసీపీ నేతలు నీచ రాజకీయాల కోసం తన భార్యను లాగే ప్రయత్నం చేశారన్నారు. ఈ కౌరవ సభ.. గౌరవం లేని సభ అంటూ మండిప‌డ్డారు చంద్ర‌బాబు.  2. స్పీకర్‌ తమ్మినేని సీతారాం తన ప్రవర్తనపై ఆలోచించుకోవాలన్నారు ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు. "మాట్లాడుతుండగానే నా మైక్‌ కట్‌ చేశారు. గౌరవంగా బతికేవాళ్లను కించపరుస్తున్నారు. 40 ఏళ్లు పనిచేసింది.. ఇలా అవమానపడటానికా? అని బాధపడుతున్నా. అవతలివారు బూతులు తిడుతున్నా.. సంయమనం పాటిస్తున్నా. నాకు బూతులు రాక.. తిట్టలేక కాదు.. అది మా విధానం కాదు." అని చంద్రబాబు అధికార ప‌క్షంపై విరుచుకుప‌డ్డారు.  3. శాసనసభలో ప్ర‌తిప‌క్ష నేత‌, మాజీ సీఎం చంద్రబాబు కుటుంబంపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై సీఎం జ‌గ‌న్ స్పందించారు. ఆ సమయంలో తాను సభలో తాను లేనని చెప్పారు. సభకు వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలేంటో తెలుసుకున్నానన్నారు. తాను సభలోకి వచ్చేసరికి చంద్రబాబు ఎమోషనల్‌గా మాట్లాడుతున్నారని, చంద్రబాబు ప్రస్టేషన్‌లో ఉన్నారని అన్నారు.  4. కుటుంబ సభ్యులను కించపరచటం తగదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. తన భార్యను కించపరిచారని, ఆమె గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లే విధంగా మాట్లాడారని ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు కంటతడి పెట్టడం బాధాకరమని అన్నారు. ఏపీలో చోటుచేసుకుంటున్న రాజకీయ వైపరీత్యాలు తీవ్ర ఆవేదనను కలిగిస్తున్నాయని పవన్ తెలిపారు. ఒక పక్క వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుంటే ప్రజాప్రతినిధులు ఇవేమి పట్టనట్టు ఉన్నారని పవన్ విమర్శించారు. 5. వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి పరిటాల సునీత విమర్శలు గుప్పించారు. వ్యక్తిగతంగా విమర్శించే హక్కు ఏ ఒక్కరికి లేదని అన్నారు. 40 ఏళ్ల రాజకీయ సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తిపై ఇన్ని అబాండాలు వేస్తుంటే సీఎం జగన్ వెకిలి నవ్వులు నవ్వుతున్నాడని సునీత మండిపడ్డారు. అలాంటి మాట‌లు మాట్లాడే వారిని చెప్పుతో కొట్టాలంటూ టీడీపీ నేత అనిత తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు.  6. చంద్ర‌బాబు, లోకేశ్‌లు విజ‌య‌వాడ నుంచి హైద‌రాబాద్ వెళ్లారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ లో యువకులు, కార్యకర్తలు మోకాళ్లపై కూర్చుని అంతా నీ వెంట ఉంటామంటూ చంద్రబాబుకు మ‌ద్ద‌తు ప‌లికారు. "సిద్ధం సిద్ధం.. పోరాటానికి సిద్ధం.. అంతా నీ వెంటే.. మేమంతా నీవెంటే.." అంటూ నినాదాలతో హోరెత్తించారు.  7. అనంతపురంలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించారు. టీడీపీ కార్యకర్తలు బంగినాథ, విశ్వేశ్వరనాయుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకునేందుకు ప్రయత్నించారు. పరిస్థితి విషమించడంతో ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. అంబేద్కర్‌ విగ్రహం దగ్గర ఈ ఘటన జరిగింది. చంద్రబాబు కుటుంబసభ్యులపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు తెలుస్తోంది. 8. వినుకొండ నియోజకవర్గంలో వైసీపీ వర్గీయులు అరాచకం సృష్టించారు. జడ్పీటీసీ ఎన్నికలో ఓటమితో దాడులకు దిగారు. శావల్యాపురం జడ్పీటీసీ ఎన్నికలో వైసీపీ అభ్యర్థి ఓటమిపాలయ్యారు. దీంతో దాడులకు తెగబడ్డారు. టీడీపీ వర్గీయుల ఇళ్లపై రాళ్లు, మద్యం సీసాలతో దాడి చేసి బీభత్సం సృష్టించారు. మహిళలు, చిన్నారులు భయభ్రాంతులకు గురి చేశారు.   9. ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పీఎం మోదీ.. సీఎం జ‌గ‌న్‌కు ఫోన్ చేశారు. కొనసాగుతున్న సహాయక చర్యలపై అడిగి తెలుసుకున్నారు. ఏపీకి అన్ని విధాలుగా సాయమందిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు.  10. కడప జిల్లా రాజంపేట వరదల్లో 12 మంది జల సమాధి అయ్యారు. వరద ప్రవాహానికి అన్నమయ్య ప్రాజెక్ట్‌ కట్ట తెగిపోయింది. చెయ్యేరులోకి వరద ప్రవాహం పెరిగింది. నది దాటుతున్న ఆర్టీసీ బస్సు వ‌ర‌ద‌లో మునిగిపోయింది. ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. కొందరు ప్రయాణికులు బస్ టాప్‌పైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. చిత్తూరు జిల్లాలోనూ భారీగా వానలు కురుస్తున్నాయి. తిరుమల కొండపైన వరద బీభత్సం నెలకొంది. తిరుపతి నగరంలో అనేక కాలనీలు నీట మునిగాయి. 

ఉక్కుమ‌నిషే విల‌విలా ఏడిస్తే? ఆ క‌న్నీటి ప‌వ‌ర్ ఎంతో తెలుసా?

నారా చంద్ర‌బాబు నాయుడు. 70ఏళ్లు దాటిన న‌వ యువ‌కుడు. 40 ఏళ్ల రాజ‌కీయ ఉద్దండుడు. దేశ రాజ‌కీయాల్లోనే మేరుప‌ర్వ‌తం లాంటి నాయ‌కుడు. మంచి, మ‌ర్యాద‌.. స‌హ‌నం, సంస్కారం, హుందాత‌నం.. ఇలాంటి ల‌క్ష‌ణాల‌న్నీ క‌ల‌గ‌లిసిన విల‌క్ష‌ణ‌ నేత‌. మిస్ట‌ర్ క్లీన్‌, మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్‌. ఆయ‌న‌లా ఈయ‌న‌ది ఫ్యాక్ష‌న్ ర‌క్తం కాదు. అరాచ‌క మ‌న‌స్త‌త్వం అంత‌క‌న్నా కాదు. స‌మాజ‌మే దేవాల‌యం.. ప్ర‌జ‌లే దేవుళ్లు అని న‌మ్మి, ఆచ‌రించిన పార్టీ అది. అలాంటి చంద్ర‌బాబు అంత‌లా భావోద్రేగానికి గురికావ‌డం మామూలు విష‌యం ఏమాత్ర‌మూ కాదు. ఇది వైసీపీ నేత‌ల దుర్మార్గానికి ప‌రాకాష్ట‌. అధికార పార్టీ ఉన్మాదానికి ప్ర‌తీక‌.  విశాఖ‌పై హుద్‌హుద్ విరుచుకుప‌డినా లెక్క చేయ‌క..  తుఫానుకు ఎదురొడ్డి ధీటుగా నిలిచిన గుండెధైర్యం ఆయ‌న‌ది. అలిపిరిలో ల్యాండ్‌మైన్స్ పేలినా.. అద‌ర‌కుండా.. బెద‌ర‌కుండా.. దుమ్ము దులిపేసుకుంటూ న‌డిచివ‌చ్చిన నిలువెత్తు సాహ‌సం ఆయ‌న‌ది. అలాంటి ధైర్య‌శాలి ఇప్పుడింత‌లా.. చిన్న‌పిల్లాడిలా.. వెక్కి వెక్కి ఏడ్వ‌డం.. తెలుగుజాతి ఇంత‌కు ముందెప్పుడూ చూడ‌ని బాధాక‌ర దృశ్యం. కేవ‌లం దృశ్యం కాద‌ది.. అంత‌కుమించి విషాదం.. దారుణం.  ఉమ్మ‌డి రాష్ట్రంలో 40 సీట్ల ద‌గ్గ‌రే ఆగిపోయినా అల‌సిపోలేదు. నిండు అసెంబ్లీలో వైఎస్సార్ త‌న త‌ల్లిని కించ‌ప‌రిచేలా మాట్లాడినా చెద‌ర‌లేదు. రాష్ట్రాన్ని రెండు ముక్క‌లు చేసినా వెర‌వ‌లేదు. న‌వ్యాంధ్ర‌ను సన్‌రైజ్ స్టేట్‌గా వెలిగేలా చేశారు. కేంద్రం ద్రోహం చేసినా.. ధ‌ర్మ పోరాట‌మే చేశారు కానీ ఎక్క‌డా దారి త‌ప్ప‌లేదు. రెండేళ్ల క్రితం 23 సీట్ల‌తో ఓడిపోయినా అద‌ర‌లేదు. కేసులు, కుట్ర‌ల‌తో పార్టీ నాయ‌కుల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తున్నా.. త‌న‌పై, త‌న కొడుకుపై కేసులు క‌డుతున్నా.. ఆఖ‌రికి త‌న ఇంటిపై వైసీపీ శ్రేణులు దాడుల‌కు తెగ‌బ‌డినా.. టీడీపీ కార్యాల‌యంపై వైసీపీ మూక‌ దాడి చేసి విధ్వంసం చేసినా.. బెద‌ర‌కుండా.. తొణ‌గ‌కుండా.. నిటారుగా నిల‌బ‌డ్డారు. ఎదురుదాడే చేశారు కానీ.. ఇంత‌కు ముందెప్పుడూ.. ఇలా క‌న్నీరు కార్చ‌లేదు. అలాంటి చంద్ర‌బాబు ఇప్పుడు భోరున విల‌పించడం.. అధికార ప‌క్ష రాజ‌కీయ పత‌నానికి నిద‌ర్శ‌నం. స్పందించే గుణం, చలించే తత్వం, ఖండించలేని మేధావితనం.. మూకుమ్మడిగా చచ్చిన నేల మీద రాలిన బొట్టు… చంద్ర‌బాబు కార్చిన ఆ కన్నీరు. చంద్ర‌బాబు ఉక్కుమ‌నిషి అని గుర్తెరిగే.. గురి చూసి ఆయ‌న వీక్‌నెస్ మీద కొట్టారు. తినేది పిడికిలంత‌. ధ‌రించేది ఒక జ‌త‌. ఎలాంటి హంగు-ఆర్భాటం లేదు.. ఆస్తుల‌కై వెంప‌ర్లాట అసలే లేదు. గ‌త‌మంతా ప్ర‌జ‌ల‌కే అంకితం. భ‌విష్య‌త్తంతా రాష్ట్రానికే సొంతం. ప‌ని త‌ప్ప మ‌రో ధ్యాస లేదు. తెలుగు జాతి కోస‌మే ఆయ‌న జీవితం. త‌మ్ముళ్లే వార‌సులు. కుటుంబ స‌భ్యులే ఆస్తిపాస్తులు. అందుకే, చంద్ర‌బాబు ఆయువు ప‌ట్టులాంటి ఆయ‌న కుటుంబం ప‌రువు మ‌ర్యాద‌ల‌పై దెబ్బ‌కొట్టింది వైసీపీ. ఎన్ని దెబ్బ‌లు కొట్టినా.. గోడ‌కు కొట్టిన బంతిలా తిరుగొస్తున్నాడ‌నే అక్క‌స్సుతో.. చంద్ర‌బాబు ఫ్యామిలీ ఇమేజ్‌ను టార్గెట్ చేశారు దుర్మార్గులు. అర్థ‌నారీశ్వ‌రుడులాంటి చంద్ర‌బాబుకు.. భార్య భువ‌నేశ్వ‌రే స‌ర్వ‌స్వం. ప్రాణంకంటే ప్రియం. అందుకే ఆమెపై ఈ దాడి కావొచ్చు. అంత‌లా అవ‌మానించినా.. ప్రెస్‌మీట్ పెట్టి భోరున ఏడ్చారే కానీ.. క‌న్నీరు తుడుచుకున్నారే కానీ.. తిరిగి ఎలాంటి అవ‌హేళ‌న‌లు చేయ‌లేదు. జ‌గ‌న్ భార్య‌నో, అంబ‌టి అర్థాంగినో, కొడాలి ఇంటి ఆవిడ‌నో.. కించ‌ప‌ర‌చ‌లేదు. అదీ చంద్ర‌బాబు సంస్కారం. కానీ, కుసంస్కారుల‌కు ఈ విష‌యం త‌ల‌కెక్కేనా? సిగ్గులేని జాతికి.. వేల కోట్లు దోచుకున్నా.. సీబీఐ, ఈడీ కేసులున్నా.. ఏళ్ల పాటు జైల్లో మ‌గ్గినా.. అదేమంత పెద్ద విష‌యం కాక‌పోవ‌చ్చు. హుందాగా బ‌తికే నాయ‌కుడికి.. ప‌రువే ప్రాణంగా మ‌సులుకునే నేత‌కి.. త‌న ఇంటి వారిని ప‌ళ్లెత్తు మాట అన్నా.. ఇలానే వెక్కి వెక్కి ఏడుస్తారు. క‌న్నీటికి ఎంతో విలువ ఉంటుంది.   చంద్రబాబుకు భ‌విష్య‌త్తును ఊహించ‌గ‌ల విజ‌న్ ఉంది. ఆయ‌న చెప్పింది ప్ర‌తీదీ నిజం అయింది. జ‌గ‌న్‌కు ఒక్క‌ఛాన్స్ ఇస్తే రాజధాని ఉండదు అని చెప్పినప్పుడు ఎవ‌రూ నమ్మలా. అరాచకం రాజ్య‌మేలుతుంది అన్నప్పుడూ తలకెక్కలా. మీ బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించండి అని చెప్పినప్పుడూ తెలుసుకోలా. రాష్ట్రం సర్వనాశనం అవుతుంది మీ ఇష్టం అంటూ చేతులెత్తి మొక్క‌న‌ప్పుడు మెద‌డుకు చేర‌లా. రెండేళ్లుగా అవన్నీ నిజం అని రుజువు అయ్యాయ్. అవుతున్నాయ్‌.  పిల్లినైనా.. పులినైనా.. కార్న‌ర్ చేసి టార్చ‌ర్ చేస్తే ముందు క‌న్నీరే వ‌స్తుంది. ఆ త‌ర్వాతే అస‌లు అటాక్ మొద‌ల‌వుతుంది. కరుడుకట్టిన పోరాటానికి నాంది ప‌డుతుంది. ఇప్పుడ‌దే స‌మ‌యం ఆస‌న్న‌మైంది. చంద్ర‌బాబు కంట కారిన ఆ ఆఖ‌రి బొట్టే.. జ‌గ‌న్ ప్ర‌భుత్వ వినాశ‌నానికి తొలిమెట్టు. కన్నీటికి ఉన్న శ‌క్తి అలాంటిది. రాసిపెట్టుకో జ‌గ‌న్‌.. నవంబర్ 19.. చంద్ర‌బాబుతో క‌న్నీరు పెట్టించిన రోజు.. వైసీపీ ప్ర‌భుత్వ పత‌నానికి పునాది ప‌డిన రోజు. నిండు స‌భ‌లో చంద్ర‌బాబు శ‌ప‌థం చేసిన‌ట్టు.. మ‌ళ్లీ ముఖ్య‌మంత్రిగానే ఆయ‌న‌ ఆ అసెంబ్లీలో అడుగుపెట్టేది.. చంద్ర‌బాబు కార్చిన ప్ర‌తీ క‌న్నీటి చుక్క‌కూ.. శిక్ష అనుభ‌వించేందుకు సిద్ధంగా ఉండు జ‌గ‌న్‌.. ఎనీ డౌట్స్‌..?

వివేకా హ‌త్య‌లో అవినాశ్ పాత్ర‌పై జ‌గ‌న్ క్లారిటీ..!

వైఎస్ వివేకా హ‌త్య జ‌రిగి రెండేళ్లు దాటేసింది. ఈ రెండేళ్లూ జ‌గ‌న్‌రెడ్డినే సీఎంగా ఉన్నారు. అయినా, బాబాయ్ హ‌త్య కేసు తేల్చ‌లేక‌పోయారు. వివేకా హంత‌కుల‌ను ప‌ట్టుకోలేక‌పోయారు. వివేకా కూతురు సునీత ప‌ట్టు వ‌ద‌ల‌కుండా పోరాడుతుండ‌టంతో.. సీబీఐ విచార‌ణ జ‌రుగుతోంది. ఆ కేసు ఇప్పుడిప్పుడే కొలిక్కి వ‌స్తోంది. ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరిలను సీబీఐ నిందితులుగా తేల్చింది. ద‌స్త‌గిరి అప్రూవ‌ర్‌గా మారి.. హ‌త్య కేసు కుట్ర మొత్తం బ‌య‌ట‌పెట్టారు. ప‌రోక్షంగా పెద్ద‌లు స‌హ‌క‌రించార‌ని వాగ్మూలం ఇచ్చారు. ఎంపీ అవినాశ్‌రెడ్డికి వ్య‌తిరేకంగా కేసు బ‌ల‌ప‌డుతోంది. స‌రిగ్గా.. ఇలాంటి స‌మ‌యంలో సీఎం జ‌గ‌న్‌రెడ్డి వివేకా హ‌త్య కేసుపై స్పందించ‌డం.. ఎంపీ అవినాశ్‌రెడ్డికి సంబంధం లేద‌న్న‌ట్టు మాట్లాడ‌టం అనుమానాల‌కు తావిస్తోందని అంటున్నారు. కేసును ప‌రోక్షంగా ప్ర‌భావితం చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు కూడా వినిపిస్తున్నాయి. వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డికి సీఎం జగన్‌ క్లీన్‌ చిట్‌ ఇచ్చారు. అవినాష్‌రెడ్డి మరో చిన్నాన్న కొడుకు అని.. ఒక కన్ను మరో కన్నును ఎందుకు పొడుచుకుంటుందని చెప్పుకొచ్చారు. త‌మ‌ కుటుంబంలో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని సీఎం జగన్‌ విమర్శించారు. గ‌తంలో మా చిన్నాన్నను ఓడించడానికి.. మా ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను లాక్కొన్నార‌ని టీడీపీపై ఆరోప‌ణ‌లు చేశారు. చంద్ర‌బాబు హయాంలోనే ఇదంతా జరిగింది కాబ‌ట్టి.. మా చిన్నాన్నను ఎవరైనా ఏదైనా చేసి ఉంటే అది వాళ్లే చేసి ఉండాలంటూ మ‌ళ్లీ పాత పాటే అందుకున్నారు.  

చంద్ర‌బాబు అంత‌లా ఎందుకు ఏడ్చారు? అసెంబ్లీలో అస‌లేం జ‌రిగింది?

చంద్ర‌బాబు భోరున విల‌పించారు. చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చారు. త‌న్నుకొస్తున్న ఏడుపును ఆపుకోలేక‌పోయారు. ముభానికి చేతులు అడ్డుపెట్టుకొని మ‌రీ విల‌విలా ఏడ్చేశారు. చంద్ర‌బాబును అంత‌లా ఏడిపించారు దుర్మార్గులు..వైసీపీ నాయ‌కులు. అసెంబ్లీలో చంద్ర‌బాబునే కాదు ఆయ‌న అర్థాంగి భువ‌నేశ్వ‌రిపైనా ప‌రోక్షంగా అసంబ‌ద్ధ వ్యాఖ్య‌లు చేయ‌డాన్ని చంద్ర‌బాబు భ‌రించ‌లేక‌పోయారు. అంబ‌టి రాంబాబు నోటికొచ్చిన‌ట్టు వాగడం.. చంద్ర‌బాబు మండిప‌డ‌టం.. ఆ త‌ర్వాత అంబ‌టి వ్యాఖ్య‌ల‌ను క‌వ‌ర్ చేసేలా మంత్రి కొడాలి నాని డైవ‌ర్ట్ చేయ‌డం.. స‌భ‌లో ర‌చ్చ ర‌చ్చ న‌డిచింది.  ఉద‌యం నుంచీ అసెంబ్లీలో తీవ్ర వాగ్వాదం జ‌ర‌గుతూ వ‌చ్చింది. మంత్రులు కొడాలి నాని రెచ్చిపోయి మాట్లాడారు. ‘చంద్రబాబులా మేం లుచ్చా పనులు చేయడం లేదు’ అని వ్యాఖ్యానించారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన టీడీపీ సభ్యులు ‘చంచల్ గూడ జైల్లో సమావేశాలు పెట్టుకునే పార్టీ వైసీపీ’ అంటూ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. వెంటనే కొడాలి నాని తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని టీడీపీ పట్టుబట్టింది. నాని వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించారు. ‘వ్యవసాయంపై చర్చతో పాటు బాబాయికి గొడ్డలి పోటు, తల్లికి ద్రోహం సహా అన్ని విషయాలపై చర్చకు సిద్దమే’ అని బాబు సవాలే విసిరారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంతో మరో మంత్రి కన్నబాబు.. హెరిటేజ్ సంస్థ విషయం ప్రస్తావనకు తెచ్చారు. మంగళగిరిలో తనయుడు ఓటమిని తట్టుకున్న చంద్రబాబు కుప్పం ఓటమిని తట్టుకోలేరా..? అంటూ కన్నబాబు వ్యంగ్యంగా మాట్లాడారు. చాలాసేపు ఇరు స‌భ్యుల మ‌ధ్య కౌంట‌ర్లు న‌డిచాయి.  ఇక అంబటి రాంబాబు.. స‌భ‌లో మ‌రింత డ‌బుల్ మీనింగ్‌తో మాట్లాడారు. చంద్రబాబును అవమానపరుస్తూ వెట‌కారంగా మాట్లాడుతూ.. మాధ‌వ‌రెడ్డి పేరు ప్ర‌స్తావిస్తూ వేరే మీనింగ్ వ‌చ్చేలా వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌ల వ‌ల్ల‌భ‌నేని వంశీ చేసిన ఆరోప‌ణ‌ల‌ను ప‌రోక్షంగా గుర్తు చేశారు. అంబ‌టి అలా మాట్లాడ‌టంతో తీవ్ర మనస్థాపానికి గురైన చంద్రబాబు స‌భ‌లోనే కంటతడి పెట్టారు. అసెంబ్లీని బ‌హిష్క‌రిస్తూ.. మ‌ళ్లీ ముఖ్య‌మంత్రిగానే స‌భ‌లో అడుగుపెడ‌తానంటూ ప్ర‌క‌టించారు.  చంద్ర‌బాబు వెళ్లిపోయాక కూడా వైసీపీ స‌భ్యుల అవ‌హేళ‌న‌ ఆగ‌నే లేదు. అంబ‌టి రాంబాబు కామెంట్ల‌ను క‌వ‌ర్ చేసేలా మంత్రి కొడాలి నాని మాట్లాడారు. చంద్ర‌బాబు.. వైఎస్‌ వివేకా హ‌త్య కేసు ప్ర‌స్తావించారు కాబట్టి.. అంబ‌టి రాంబాబు.. దివంగ‌త మాధ‌వ‌రెడ్డి మ‌ర్డ‌ర్ టాపిక్‌ను గుర్తు చేయ‌డానికే ఆయ‌న పేరు ప్ర‌స్తావించారంటూ స‌మ‌ర్థించే ప్ర‌య‌త్నం చేశారు. అంబ‌టి సైతం మ‌ళ్లీ మైక్ అందుకొని తాను అలానే అన్నానంటూ చెప్పుకొచ్చారు. ఇదంతా స‌భ‌లో జ‌రిగితే.. అసెంబ్లీ బ‌య‌ట మీడియా స‌మావేశంలో చంద్ర‌బాబు క‌న్నీటిప‌ర్యంత మ‌య్యారు.  అప్పుడు తన తల్లిని దూషించారు.. ఇప్పుడు తన భార్య విషయం తీసుకువచ్చి అవమానించారంటూ ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు వెక్కి వెక్కి ఏడ్చారు. క‌న్నీరు ఆగ‌క ప్రెస్‌మీట్‌లోనే భోరున విలపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో తన తల్లిని దూషిస్తే.. తాను గట్టిగా వైఎస్‌ను ప్రశ్నించానన్నారు. దీంతో తప్పు జరిగింది.. క్షమించమని అడిగారన్నారు. ఇవాళ వైసీపీ నేతలు నీచ రాజకీయాల కోసం తన భార్యను లాగే ప్రయత్నం చేశారన్నారు. ఈ కౌరవ సభ.. గౌరవం లేని సభ.  "ఈరోజు నా భార్యను కించపరిచేలా దూషించారు. ఆమె ఏరోజూ రాజకీయాల్లోకి రాలేదు. అధికారంలో ఉన్నపుడు నేనెవరినీ కించపరచలేదు. నిండు గౌరవ సభలో ఆనాడు ద్రౌపదికి అవమానం జరిగింది. నా జీవితంలో ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ చూడలేదు. నా రాజకీయ జీవితంలో ఏనాడూ ఇంత బాధ భరించలేదు. బూతులు తిట్టినా.. ఎన్ని అవమానాలకు గురిచేసినా భరించాం. ప్రజలు ప్రతిపక్షంలో కూర్చొబెట్టినా బాధ్యతగా భావించా. రెండున్నరేళ్లుగా తనను అవమానిస్తూ వస్తున్నారని, ప్రజల కోసం భరిస్తున్నా. దేశం కోసం తప్పితే స్వార్థం కోసం ఆలోచించలేదు. వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదు" అన్నారు చంద్ర‌బాబు.   "స్పీకర్‌ తమ్మినేని సీతారాం తన ప్రవర్తనపై కూడా ఆలోచించుకోవాలి. మాట్లాడుతుండగానే నా మైక్‌ కట్‌ చేశారు. గతంలో తెదేపా ప్రభుత్వంలో తమ్మినేని మంత్రిగా పనిచేశారు. గౌరవంగా బతికేవాళ్లను కూడా కించపరుస్తున్నారు. 40 ఏళ్లు పనిచేసింది.. ఇలా అవమానపడటానికా? అని బాధపడుతున్నా. అవతలివారు బూతులు తిడుతున్నా.. సంయమనం పాటిస్తున్నా. నాకు బూతులు రాక.. తిట్టలేక కాదు.. అది మా విధానం కాదు." అని చంద్రబాబు అన్నారు.

త‌ల్లిని దూషించారు.. భార్య‌ను అవ‌మానించారు.. చంద్ర‌బాబు భావోద్రేగం..

అప్పుడు తన తల్లిని దూషించారు.. ఇప్పుడు తన భార్య విషయం తీసుకువచ్చి అవమానించారంటూ ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు వెక్కి వెక్కి ఏడ్చారు. క‌న్నీరు ఆగ‌క ప్రెస్‌మీట్‌లోనే భోరున విలపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో తన తల్లిని దూషిస్తే.. తాను గట్టిగా వైఎస్‌ను ప్రశ్నించానన్నారు. దీంతో తప్పు జరిగింది.. క్షమించమని అడిగారన్నారు. ఇవాళ వైసీపీ నేతలు నీచ రాజకీయాల కోసం తన భార్యను లాగే ప్రయత్నం చేశారన్నారు. ఈ కౌరవ సభ.. గౌరవం లేని సభ అంటూ మండిప‌డ్డారు. మీడియా సమావేశంలో గుండెలవిసేలా విలపించారు చంద్ర‌బాబు. రెండు నిమిషాల పాటు మాట్లాడలేకపోయారు. ఏనాడూ ఇంటినుంచి బయటకు రాని భువనేశ్వరిని లక్ష్యంగా చేసుకుని వైసీపీ నేతలు వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదన్నారు. భువనేశ్వరి చేసిన త్యాగం గొప్పదన్నారు. ప్రతి సంక్షోభంలోనూ ఆమె తనకు అండగా నిలిచారని చెప్పారు. వ్యక్తిగత దూషణలు చేస్తున్న వారి ఇళ్లల్లోని వారిని కూడా ఇలాగే తిడితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు. రాజకీయాల్లో విలువలు ఇంత నీచంగా పడిపోయాయనుకోలేదంటూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. "ఈరోజు నా భార్యను కించపరిచేలా దూషించారు. ఆమె ఏరోజూ రాజకీయాల్లోకి రాలేదు. అధికారంలో ఉన్నపుడు నేనెవరినీ కించపరచలేదు. నిండు గౌరవ సభలో ఆనాడు ద్రౌపదికి అవమానం జరిగింది. నా జీవితంలో ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ చూడలేదు. నా రాజకీయ జీవితంలో ఏనాడూ ఇంత బాధ భరించలేదు. బూతులు తిట్టినా.. ఎన్ని అవమానాలకు గురిచేసినా భరించాం. ప్రజలు ప్రతిపక్షంలో కూర్చొబెట్టినా బాధ్యతగా భావించా. రెండున్నరేళ్లుగా తనను అవమానిస్తూ వస్తున్నారని, ప్రజల కోసం భరిస్తున్నా. దేశం కోసం తప్పితే స్వార్థం కోసం ఆలోచించలేదు. వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదు" అన్నారు చంద్ర‌బాబు.   "జగన్‌ ప్రజల పాలిట భస్మాసురుడిగా మారారు. ఇవాళ్టి ఘటనలను ఏవిధంగా అభివర్ణించాలో అర్థం కాలేదు. ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి.. నాకు పదవులు అవసరం లేదు. నా రికార్డులు బద్దలు కొట్టాలంటే చాలా సమయం పడుతుంది. ప్రజల కోసం ఇంటికి రాకుండా ఎంతకాలం పనిచేసినా నా భార్య ప్రోత్సహించారు. హుద్‌హుద్‌ సమయంలో విశాఖలో చాలా రోజులున్నా." అంటూ గ‌తాన్ని గుర్తు చేసుకున్నారు.  "స్పీకర్‌ తమ్మినేని సీతారాం తన ప్రవర్తనపై కూడా ఆలోచించుకోవాలి. మాట్లాడుతుండగానే నా మైక్‌ కట్‌ చేశారు. గతంలో తెదేపా ప్రభుత్వంలో తమ్మినేని మంత్రిగా పనిచేశారు. గౌరవంగా బతికేవాళ్లను కూడా కించపరుస్తున్నారు. 40 ఏళ్లు పనిచేసింది.. ఇలా అవమానపడటానికా? అని బాధపడుతున్నా. అవతలివారు బూతులు తిడుతున్నా.. సంయమనం పాటిస్తున్నా. నాకు బూతులు రాక.. తిట్టలేక కాదు.. అది మా విధానం కాదు." అని చంద్రబాబు అన్నారు. పెద్ద పెద్ద మహానాయకులతో పని చేశానని, జాతీయ స్థాయిలో కూడా అనేక మంది నాయకులతో పని చేశానని చంద్రబాబు అన్నారు. గడిచిన రెండున్నరేళ్లుగా సభలో ఎన్నో విమర్శలు.. ప్రతి విమర్శలు చేసుకున్నామన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ.. రూలింగ్‌లో ఉన్నప్పుడు కానీ ఎప్పుడూ ఇలాంటి అనుభవాలు తాను చూడలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.