సోము వీర్రాజుకు ఉద్వాసన? కొత్త అధ్యక్షుడు ఎవరంటే ..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో బీజేపీ, బలమెంతో,మొన్నటి స్థానిక ఎన్నికల్లో మరో మారు రుజువైంది. కేంద్ర నాయకత్వం ఎంత బూస్ట్ ఇచ్చినా, ఏకంగా కేంద్ర హోమ్ మంత్రి, పార్టీ వ్యూహ కర్త అమిత్ షా దిశా నిర్దేశం చేసినా, ఫలితం మాత్రం శూన్యం. మిత్ర పక్షం  జనసేన కొన్ని జిల్లాల్లో అయినా కొంతవరకు ఉనికిని చాటుకుంది కానీ, కమల దళం మాత్రం ఏ జిల్లాలోనూ  ఉన్నాను అనిపించుకోలేదు. ఇదలా ఉంటే, అమిత్ షా పర్యటన తర్వాత పార్టీలో అంతర్మథనం మొదలైందని అంటున్నారు.  ఏపీ బీజేపీలో ఒక వర్గం పక్కాగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు సిద్డంవుతుంటే, మొదటి నుంచి వైసీపీతో స్నేహ సంబంధాలను కొనసాగిస్త్నున్న మరో వర్గం మాత్రంప ఆద్రిలోనే నడుస్తోంది. ప్రతిపక్షాన్ని విమర్శించడం వలన ప్రయోజనం లేదని రుజువైనా ఇంకా తెలుగు దేశం, చంద్రబాబునే లక్ష్యంగా చేసుకుని, ఫలితంలేని పంథాలో ముందుకు సాగుతోంది కాగా, అమిత్ షా ఆదేశాల మేరకు, ఈ రోజు (నవంబర్ 21) రాజధాని రైతుల మహా పాదయాత్రలో పాల్గొనేందుకువి జయవాడ నుంచి నెల్లూరుకి పార్టీ నేతలు, కార్యకర్తలు బయలు దేరారు.అయితే, పార్టీ రాష్ట్ర శాఖ  అధ్యక్షుడు సోము వీర్రాజు, మరో ముఖ్య నేత విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొనడం లేదు. బీజేపీ రాజ్య సభ సభ్యులు సుజనా చౌదరి, సి.ఎం.రమేశ్‌, పార్టీ మాజే అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, కేంద్ర మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నాయకురాలు  పురందేశ్వరి నెల్లూరులో పాదయాత్రలో  పాల్గొంటున్నారు.  అమిత్ షా రాజధాని రైతుల మహా పాదయాత్ర పార్టీ సంపూర్ణ మద్దతు ఇవ్వడంతో పాటుగా, పార్టీ నాయకులు, కర్యకర్తలు పాదయాత్రలో తప్పక పాల్గొనాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా, సోము వీర్రాజు,ఇతర ముఖ్యనాయకులు, ముఖ్యంగా వైసీపీ అనుకూల వర్గంగా ముద్రపడిన నాయకుల పాదయాత్రలో ఎందుకు పాల్గొనక పోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.ఎందుకు, కొందరు నాయకులు, సాకులు చూపి తప్పించుకుంటున్నారు? అనేది ఇటు పార్టీలో అటు  రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశం  అయింది.  వరుస ఓటములతో పార్టీ క్షేత్ర స్థాయిలో పార్టీ కనుమరుగై పోయిన నేపధ్యంలో   సోము వీర్రాజు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం. అయితే, నిజానికి పార్టీ అధిష్టానమే ఆయన్ని అధ్యక్ష పదవి నుంచి తప్పించే ఆలోచన చేస్తోందని, అందుకే  అయన తనంతట తానుగా బాధ్యతల నుంచి తప్పుకునే నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. అదైన,ఇదైనా సోము వీర్రాజు స్థానంలో ఏపీ బీజేపీ నాయకత్వంలో త్వరలోనే మార్పు తధ్యమని అంటున్నారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి వీర్రాజు శక్తి సామర్ధ్యాలు సరిపోవదం లేదు. మరో వంక ఆయనలోనూ ముందున్న ఉత్సాహం ఇప్పుడు కనిపించడం లేదు. ఫలితంగా  ఏపీలో బీజేపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది.ఇక రాష్ట్రంలో తిరుపతి ఎంపీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికతో  సహా, అన్ని ఎన్నికల్లోనూ బిజెపి చావుదెబ్బ తినడం వంటి కారణాలు సోము వీర్రాజు స్థానంలో వేరే వారికి అవకాశం ఇవ్వాలన్న ఆలోచనకు కారణమయ్యాయని సమాచారం. మరోవంక సోము వీర్రాజు, పార్టీ సీనియర్ నాయకులూ ఎవరూ సహకరించక పోవడం, మిత్రపక్షం జనసేన కూడా రాష్ట్ర నాయకత్వాన్ని కాదని నేరుగా కేంద్ర నాయకత్వంతో సంప్రదింపు జరపడం, రాష్ట్రంలో ఉమ్మడి కార్యాచరణకు కలిసి రాక పోవడం వంటి,అనేక  అవమానకర సంఘటనలు ఎదురవుతున్న పరిస్థితిలో, పొమ్మనేదాకా చూరు పట్టుకుని వేళ్ళాడే కంటే ముందుగ గౌరవప్రదంగా తనంతటతానే పదవినుంచి తప్పుకోవడం ఉత్తమం అనే భావిస్తునట్లు తెలుస్తోంది.  అయితే, ఈసారి ఏపీలో నాయకత్వ మార్పు అంటూ జరిగితే, సోము వీర్రాజుతో పాటుగా, మరో కొందరిపై కూడా వేటు పడడం ఖాయమని  అంటున్నారు. అలాగే, ఈసారి, పార్టీ నాయకత్వ కూర్పులో ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు అధ్యక్ష పదవితో పాటుగా కీలక పదవువులు ఇచ్చే అవకాశం  ఉందని అంటున్నారు. ఏపీలో బీజేపీ ఎదగాలంటే ఇతర పార్టీల సీనియర్ నాయకులను ఆకర్శించక తప్పదని అమిత్ షా ఇప్పటికే స్పష్టం చేశారు. అదే డైరెక్షన్’లో పార్టీని ముందుకు తీసుకుపోయే నేతకే ఈ సారి పార్టీ అధ్యక్ష పదవి దక్కుతుందని అంటున్నారు.

తిండి లేదు.. తాగడానికి మురికినీళ్లే దిక్కు! వరద బాధితులను వదిలేసిన జగన్ సర్కార్ 

కుండపోత వర్షాలు, వరదలతో అల్లాడిపోయిన రాయలసీమలో దారుణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత మూడు రోజులతో పోలిస్తే వర్షాలు తగ్గినా... వరద ముంపు మాత్రం ఇంకా పోలేదు. కడప, చిత్తూరుతో పాటు నెల్లూరు జిల్లాల్లో దుర్భత పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడి వరద బాధిత ప్రాంతాల్లోని పరిస్థితి చూస్తే గుండె చెరువైపోతుంది. వరద బారిన పడిన ప్రజలు కట్టుబట్టలతో మిగిలిపోయారు. చివరికి గూడు కూడా మిగలని కుటుంబాలు ఎన్నో. అక్కడ కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తి స్థాయిలో మెరుగుపడక .. పూర్తి సమాచారం బయటకు రావడం లేదు.  వరద బాధితులు ఆకలితో అలమటిస్తున్నారు. మంచి నీరు దొరక్క మురికినీళ్లతోనే కడుపు నింపుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇంత దుర్భరమైన పరిస్థితి ఉంటే హుటహుటిన స్పందించాల్సిన అధికార యంత్రాంగం జాడ లేకుండా పోయింది.  జరిగేదేదో జరుగుతుందన్నట్లుగా  అధికారులు చూస్తూ ఉండిపోతున్నారు. వరద పరిస్థితిపై మూడు రోజుల ముందుగానే అంచనాలు ఉన్నాప్పటికీ ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. విరుచుకుపడిన తర్వాత కూడా అదే పరిస్థితి. అంతా అయిపోయిన తర్వాత కూడా అదే. అధికారుల నిర్లక్ష్యంతో పోయిన ప్రాణాలు పోగా .. ఎలాగోలా ప్రాణాలు కాపాడుకున్న వారికి ఆకలిదప్పులు తీర్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది.  వరద ప్రాంతాల్లో స్వచ్చంద సంస్థలు చేస్తున్న అరకొర సాయమే ఎక్కువగా ఉంది. ప్రభుత్వం వైపు నుంచి పునరావాస శిబిరాలే అతి తక్కువగా ఉంటే.. అందులోకి తరలించుకు వచ్చిన వారు ఇంకా తక్కువ. వచ్చిన వాళ్లకు కూడా సరిగ్గా ఆహారం అందించడం లేదు. కనీసం మంచి నీళ్లు కూడా అందుబాటులో లేవంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించవచ్చు. తమ ఆస్తులు పొగొట్టుకున్న రోడ్డున పడ్డ బాధితులు.. ఏం చేయోలో తెలియక కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తమకు న్యాయం చేయాలంటూ అనేక చోట్ల ప్రజలు ఆందోళనలకు దిగుతున్నారు. ఇంత దారుణంగా పరిస్థితి ఉంటే ప్రభుత్వం నిమిత్త మాత్రంగా ఉండటం ఏమిటన్న ఆగ్రహం వారిలో కనిపిస్తోంది.  ప్రభుత్వంలోని పై స్థాయి వాళ్లే పెద్దగా పట్టించుకోవడం లేదు. సీఎం జగన్ సొంత జిల్లాలోనూ సహాయ చర్యలకు దిక్కు లేకుండా పోయింజి. దీంతో కింది స్థాయి అధికార యంత్రాగం కూడా అంతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వరద వస్తుంది… పోతుంది అన్న పద్దతిలో ఫిక్సయిపోయారు. అలాగే వచ్చింది.. పోయింది.. కానీ తుడిచిపెట్టుకుపోయిన జీవితాల గురించి మాత్రం ఎవరూ ఆలోచించడం లేదు. ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు ప్రభుత్వాల స్పందన వేరుగా ఉంటుంది. ఇప్పటి వరకూ అఘామేఘాల మీద ప్రజా జీవితాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చే ప్రభుత్వాలను చూశాం కానీ నిమ్మకు నీరెత్తినట్లుగా.., జరగాల్సింది జరుగుతుందన్నట్లుగా చూసే ప్రభుత్వాలను మాత్రం ప్రజలు ఇప్పుడే చూస్తున్నారు.  

అనంతపురం- కడప రాకపోకలు నెల రోజులు బంద్! కూలిన పాపాగ్ని నది వంతెన.. 

రాయలసీమ జిల్లాల్లో వరద బీభత్సం కొనసాగుతోంది. కుండపోత వర్షాలు కొంత తగ్గినా.. వరద ఉధృతి మాత్రం తీవ్రంగానే ఉంది. కడప,  అనంతపురం, చిత్తూరు జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాలో దాదాపు 6 వందల గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. వాగులు, వంకలన్ని పొంగి పొర్లుతూ ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. వరద పోటుకు వందలాది వంతెనలు కుప్పకూలాయి. రహదారులైతే వందల కిలోమీటర్ల మేర ధ్వంసమయ్యాయి. సీఎం జగన్మోరన్ రెడ్డి సొంత జిల్లా కడపలో చరిత్రలో ఎప్పుడు లేనంతగా వరద వచ్చిందని అంటున్నారు.  వరద ఉధృతికి కడప జిల్లా కమలాపురంలో పాపాగ్ని నదిపై ఉన్న వంతెన  అర్ధరాత్రి కుప్పకూలింది. వెలిగల్లు జలాశయం నాలుగు గేట్లు ఏత్తివేయడంతో వరద నీరు పోటెత్తింది. గత రెండు రోజులుగా వంతెన వద్ద ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. నీరు అంచుల వరకు చేరడంతో నానిపోయిన వంతెన.. శనివారం సాయంత్రం నుంచి కొంచెంకొంచెంగా నానుతూ వస్తోంది. ఈ క్రమంలో అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ బ్రిడ్జి అనంతపురం నుంచి కడపకు వెళ్లే జాతీయ రహదారిపై ఉండడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ఈ మార్గంలో వెళ్లాల్సిన వాహనాలను దారి మళ్లిస్తున్నారు. రాకపోకలు పునరుద్ధరించేందుకు నెల రోజులకుపైగా పట్టే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. వరద పూర్తిగా తగ్గాకే మరమ్మత్తు పనులు చేపట్టడం వీలు కానుంది. ఈ నేపథ్యంలో ఈ రహదారి అందుబాటులోకి రావడానికి నెల రోజులకు పైగానే సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

చంద్రబాబుకు రజనీకాంత్ పరామర్శ.. వైసీపీ తీరుపై జాతీయ నేతల ఆగ్రహం

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఫోన్ చేసి పరామర్శించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శుక్రవారం చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరిని లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగతంగా దూషించడంపై రజనీకాంత్ విచారం వ్యక్తం చేశారు.  చంద్రబాబుకు ఫోన్ చేసిన రజనీకాంత్ పరామర్శించారు. ఏపీలో ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు.  చంద్రబాబు భార్యను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత దూషణలకు పాల్పడడంపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబుకు కుటుంబానికి అండగా నిలుస్తున్న పలువురు జాతీయ నేతలు ఏపీ రాజకీయాల్లో ఇలాంటి ఘటనలు దురదృష్టకరమని పేర్కొంటున్నారు. అన్నాడీఎంకే పార్టీ సీనియర్‌ నేత మైత్రేయన్‌ కూడా చంద్రబాబుకు ఫోన్‌ చేసి మాట్లాడారు. అనంతరం, ‘నాకు 1984 నుంచి ఎన్టీఆర్‌ కుటుంబంతో పరిచయాలు ఉన్నాయి. ఎన్టీఆర్‌ కుమార్తె భువనేశ్వరిపై అసెంబ్లీలో వ్యక్తిగత దూషణలు చేశారని విని బాధపడ్డాను. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాను. చంద్రబాబుకు  ఫోన్‌ చేసి మాట్లాడాను’ అని మైత్రేయన్‌ ట్వీట్‌ చేశారు. 

గత 30 ఏండ్లలో అతిపెద్ద వర్షం.. టీటీడీకి రూ.4 కోట్ల నష్టం

రాయలసీమలో వరద బీభత్సం కొనసాగుతోంది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరదలు తీవ్ర స్థాయిలో పోటెత్తాయి. వరదలతో రాయలసీమ అల్లాడిపోయింది. తిరుపతిలోనూ గతంలో ఎప్పుడు లేనంతగా వరద బీభత్సం కనిపించింది. గత 30 సంవత్సరాల్లో ఇంత భారీ వర్షం కురవలేదని, భారీ వర్షాలతో టీటీడీకి రూ 4 కోట్లకుపైగా నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు.   భారీ వర్షాలకు శేషాచలం కొండల్లోని డ్యాములు, చెక్ డ్యామ్ లు పొంగి పొర్లాి,  కపిలతీర్థం జలపాతం గుండా తిరుపతి నగరంలోకి వరద ప్రవేశించింది. తిరుమల మొదటి ఘాట్ రోడ్ లోని అక్కగార్ల గుడి వద్ద రక్షణగోడ దెబ్బతిన్నది.  ఘాట్ రోడ్ లో నాలుగు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగి పడ్డాయి.రెండవ ఘాట్ రోడ్ లో 13 ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడ్డాయి. టిటిడి సిబ్బంది, అధికారులు యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగి తాత్కాలిక రక్షణ ఏర్పాట్లతో ట్రాఫిక్ ను పునరుద్ధరించారు.  తిరుమల నారాయణగిరి గెస్ట్ హౌస్ ను ఆనుకొని ఉన్న రక్షణ గోడ పడిపోవడంతో మూడు గదులు దెబ్బతిన్నాయి. అధికారులు నారాయణ గిరి, ఎస్వీ అతిథి గృహాల్లోని యాత్రికులను ముందు జాగ్రత్త గా ఇతర ప్రాంతాలకు తరలించారు.. శ్రీవారి మెట్టు మార్గంలో కొంతమేరకు రోడ్డు, కొంతమేరకు ఫుట్ పాత్ భారీ వర్షాలకు దెబ్బ తిన్నాయి. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం వెనుక వైపు ఉన్న గోడతో పాటు, రాంనగర్, వినాయక నగర్, జిఎంబి క్వార్టర్స్,  శ్రీనివాసం విశ్రాంతి గృహం కాంపౌండ్ వాల్స్ దెబ్బ తిన్నాయి.కపిలతీర్థం ఆలయంలో ఒక మండపం వర్షాలకు దెబ్బతింది.దీని మరమ్మతులకు 70 లక్షల రూపాయలు ఖర్చు కావచ్చని అధికారులు అంచనా వేశారు.. వర్షం వల్ల టీటీడీ సర్వర్లు దెబ్బతిని సేవలకు అంతరాయం కలిగింది. ఐటి విభాగం అధికారులు, సిబ్బంది వెంటనే పునరుద్ధరించి భక్తుల సేవలకు ఇబ్బంది లేకుండా చేశారు. స్వామి వారి దర్శనం కోసం వచ్చి భారీ వర్షాల కారణంగా తిరుపతిలో ఆగిపోయిన భక్తులకు శ్రీనివాసం, మాధవం, రెండు మరియు మూడో సత్రాల్లో వసతి, ఆహారం ఏర్పాటు చేశారు. టికెట్లు ఉండి దర్శనానికి రాలేక పోయిన భక్తులను వర్షాలు తగ్గాక స్వామివారి దర్శనానికి అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు.తిరుమల, తిరుపతిలో దెబ్బతిన్న రోడ్లు, ఇతర మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి యాత్రికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని టీటీడీ అధికారులు చెబుతున్నారు

వరదల్లోనూ కక్ష రాజకీయాలా..! అర్ధరాత్రి కూన రవికుమార్ అరెస్ట్..  

ఆంధ్రప్రదేశ్ లో విపక్ష నేతల అరెస్టులు కొనసాగుతున్నాయి. ఓ వైపు భారీ వర్షాలు, వరదలతో రాయలసీమ జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి లక్షలాది మంది జల దిగ్బంధంలో చిక్కుకుని అల్లాడిపోతున్నారు. ఇలాంటి సమయంలో వరద సహాయక చర్యలపై దృష్టి సారించాల్సిన జగన్ సర్కార్... అది చేయకుండా టీడీపీ నేతలను టార్గెట్ చేయడంపైనే ఫోకస్ చేసినట్లు కనిపిస్తోంది.  శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రభుత్వ మాజీ విప్, తెలుగు దేశం పార్టీ నేత కూన రవికుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం   శాంతినగర్‌ కాలనీలోని ఆయన సోదరి ఇంట్లో ఉన్న రవికుమార్‌ను శనివారం అర్థరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో రవికుమార్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు ఎచ్చెర్ల పోలీసు స్టేషన్‌కు తరలించించారు..అర్థరాత్రి పూట రవికుమార్ ఇంతటితో పాటు, ఆయన సోదరుడు కూన సత్యారావు ఇళ్లల్లో కూడా సోదాలు నిర్వహించారు పోలీసులు. కూన రవికుమార్ సోదరి ఇంట్లో  ఉన్నారన్న పక్కా సమాచారంతో ఇంటిని చుట్టుముట్టి, ఓ హై డ్రామా మధ్య అరెస్టు చేశారు.  శనివారం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన భార్య పై అసెంబ్లీ సాక్షిగా వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో నిరసన కోసం బయలుదేరిన సమయంలో హౌస్ అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులపై దురుసుగా వ్యవహరించారని.. కూన రవికుమార్ పై టూ టౌన్ సిఐ ఫిర్యాదు మేరకు అరెస్టు చేసినట్లు సమాచారం. కూర రవికుమార్ ను అరెస్ట్ చేయడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి పూట పోలీసులు దౌర్జన్యం చేశారని, దురుసుగా వ్యవహరించారని ఆరోపించారు. వరదలతో జనాలు అల్లాడుతున్నా పట్టించుకోకుండా టీడీపీ నేతలను అరెస్ట్ చేస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు తమ్ముళ్లు.

ఢిల్లీకి చేరిన వరి యుద్ధం.. మోడీతో తేల్చుకుంటానంటున్న సీఎం 

తెలంగాణలో కొన్ని రోజులుగా ప్రకంపనలు రేపుతున్న వరి ధాన్యం కొనుగోలు యుద్దం ఢిల్లీకి చేరుతోంది. తెలంగాణ వరి ధాన్యం కొంటారో లేదో చెప్పాలంటూ కేంద్రానికి రెండు రోజుల డెడ్ లైన్ విధించిన కేసీఆర్.. ఆ గడువు ముగియడంతో మరోసారి మీడియా ముందుకు వచ్చారు. తమ డిమాండ్ పై కేంద్రం నుంచి స్పందన రాలేదని చెప్పారు. యాసంగిలో ధాన్యం కొనుగోలుతో కేంద్రంతో తేల్చుకుంటామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. చివరి ప్రయత్నంగా ఆదివారం ఢిల్లీకి వెళ్లి కేంద్రమంత్రులను కలుస్తామని ప్రకటించారు. అవకాశం ఉంటే ప్రధాని మోదీని కూడా కలుస్తామని తెలిపారు.  వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం సరైన స్పష్టత ఇవ్వడం లేదని సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నిసార్లు డిమాండ్‌ చేసినా కేంద్రం స్పందించడం లేదని దుయ్యబట్టారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరిని ఎండగట్టారు గులాబీ బాస్.  తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వరిధాన్యం కొనుగోలు మీద జరుగుతున్న వ్యవహారంలో ఎన్నిసార్లు నిరంతరంగా డిమాండ్‌ చేసినా కేంద్రం నుంచి ఉలుకూ లేదు పలూకు లేదని చెప్పారు. ఎటువంటి సమాధానం కూడా వస్తలేద్ననారు. అన్ని రాష్ట్రాల నుంచి ధాన్యం సేకరించినట్లే తెలంగాణ నుంచి సేకరించాలని అన్నారు కేసీఆర్. వచ్చే సంవత్సరం టార్గెట్‌ వెంటనే ఇవ్వాలన్నారు, కేంద్రం ఇచ్చే టార్గెట్ ను బట్టి రాష్ట్రంలో సర్దుబాటు చేయాల్సి ఉంటుందని కేసీఆర్ చెప్పారు. దీనిపై కేంద్రానికి ఎన్ని సార్లు చెప్పినా సరైన పద్ధతుల్లో రావడం లేదన్నారు. సాగు చట్టాలను వెనక్కి తీసుకోవడంపై కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. అయితే పై ప్రధాని మోడీ క్షమాపణ చెప్తే సరిపోదన్నారు. రైతులపై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. చనిపోయిన రైతుల కుటుంబాలకు కేంద్ర సర్కార్ రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి చనిపోయిన ఒక్కో రైతు కుటుంబానికి మూడు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు కేసీఆర్. 

నీరో చక్రవర్తి.. వైసీపీకి చుక్కలే.. ఎన్టీఆర్ కు క్లాస్.. ఢిల్లీకి సీఎం.. టాప్ న్యూస్@7PM

సీఎం జ‌గ‌న్ ఏరియ‌ల్ స‌ర్వే పేరుతో గాల్లో తిరుగుతున్నార‌ని, నేల‌కు దిగితే జ‌నం వ‌ర‌ద క‌ష్టాలు క‌నిపిస్తాయ‌ని టీడీపీ నేత నారా లోకేష్ సూచించారు. రోమ్ త‌గ‌ల‌బ‌డుతుంటే నీరో చ‌క్ర‌వ‌ర్తి ఫిడేలు వాయించుకుని శాడిస్టిక్ ఆనందం పొందార‌ని మ‌నం చ‌రిత్ర పుస్త‌కాల‌లో చ‌దువుకున్నామ‌ని తెలిపారు. ఇప్పుడు నీరోకి మ‌రో రూపమైన జ‌గ‌న్‌రెడ్డిని ప్ర‌త్య‌క్షంగా చూస్తున్నామ‌న్నారు. రాయ‌ల‌సీమ మొత్తం అకాల‌వ‌ర్షాల‌కు అల్ల‌క‌ల్లోల‌మైతే క‌నీసం అటువైపు క‌న్నెత్తి చూసే ఆలోచ‌న కూడా జ‌గ‌న్‌రెడ్డికి రాలేద‌ని తప్పుబట్టారు.  ------- అసెంబ్లీలో శుక్రవారం మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబంపై వైసీపీ ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై నందమూరి కుటుంబం తీవ్రంగా స్పందించింది. చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి అండగా నందమూరి కుటుంబం నిలిచింది. శనివారం మీడియా సమావేశంలో తమ మనోభావాలను వ్యక్తం చేశారు. జరిగిన పరిణామాలు దురదృష్టకరమైనవని వారు అన్నారు. వ్యక్తిగత అజెండాగా పెట్టుకుని వైసీపీ నేతలు మాటల దాడి చేశారని మండిపడ్డారు.  ------ ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనపై టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి గురించి తప్పుగా మాట్లాడిన వారికి పుట్టగతులు ఉండవని అన్నారు. ఎన్టీఆర్ కుమార్తె గురించి వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను చూసి సభ్యసమాజం తలదించుకుంటోందని అన్నారు. త్వరలోనే వైసీపీ నేతలకు అసలు సినిమా చూపిస్తామని చెప్పారు. -------- జూనియర్ ఎన్టీఆర్ ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనపై స్పందించారు. రాజకీయాల్లో విమర్శలు చేసుకోవడం సర్వసాధారణమని, విమర్శలు ప్రజాసమస్యలపైనే జరగాలన్నారు. వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. ముఖ్యంగా మన ఆడపడుచుల గురించి పరుషపదజాలంతో మాట్లాడడం అరాచక పరిపాలనకు నాంది పలుకుతుందన్నారు --------- జూనియర్‌ ఎన్టీఆర్‌పై టీడీపీ నేతలు, శ్రేణులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఏపీ అసెంబ్లీలో వైసీపీ నేతలు నారా భువనేశ్వరిని ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఇలాగేనా స్పందించేది అని దుమ్మెత్తిపోస్తున్నారు. మీ మేనత్త భువనేశ్వరిని అనకూడని మాటలు అని మానసిక క్షోభకు గురిచేస్తే.. చంద్రబాబు నాయుడు కన్నీరు మున్నీరుగా విలపిస్తే జూనియర్ ఎన్టీఆర్‌కు చీమైనా కుట్టలేదా? అని ప్రశ్నిస్తున్నారు.  --- జూనియర్ ఎన్టీఆర్‌పై అభిమాని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కుటుంబంపై ఏపీ అసెంబ్లీలో జరిగిన తీరుపై జూనియర్ ఎన్టీఆర్ సరిగా స్పందించలేదని అన్నారు. అసలు స్పందించకుండా ఉంటే బాగుండేదని సూచించారు. ఎన్టీఆర్ అనే పదంతో పేరు ప్రతిష్టలు సంపాదించిన తమరు స్పందించిన తీరు బాగోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘కర్ర విరగదు.. పాము చావదు’ అనే సామెతగా జూనియర్ ఎన్టీఆర్ స్పందన ఉందని అభిమాని క్లాస్ తీసుకున్నారు.  ------- యాసంగిలో ధాన్యం కొనుగోలుతో కేంద్రంతో తేల్చుకుంటామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. చివరి ప్రయత్నంగా మరోసారి ఢిల్లీకి వెళ్తున్నామని చెప్పారు..ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరిని ఎండగట్టారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వరిధాన్యం కొనుగోలు మీద జరుగుతున్న వ్యవహారంలో ఎన్నిసార్లు నిరంతరంగా డిమాండ్‌ చేసినా కేంద్రం నుంచి ఉలుకూ లేదు పలూకు లేదు. ఎటువంటి సమాధానం కూడా వస్తలేదు ------- మంబయి క్రూయిజ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్ కు బాంబే హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ సంబంధిత నేరాలకు పాల్పడినట్టు ఎలాంటి సానుకూల ఆధారాలు లేవని న్యాయస్థానం స్పష్టం చేసింది. అరెస్టయిన సమయంలో ఇచ్చిన వాంగ్మూలాలు చెల్లుబాటు కావని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరోకు తేల్చి చెప్పింది. ----- చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ధోనీ, చెన్నై జట్టు యజమాని శ్రీనివాసన్ ఐపీఎల్ ట్రోఫీని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కు అందించారు.ఈ సందర్భంగా ధోనీని, చెన్నై సూపర్ కింగ్స్ జట్టును, ఫ్రాంచైజీ యాజమాన్యాన్ని సీఎం స్టాలిన్ అభినందించారు. ధోనీ జార్ఖండ్ కు చెందినవాడే అయినా తమిళనాడు ప్రజల కోసం వచ్చినట్టుందని వ్యాఖ్యానించారు. ------- సినీ దర్శకుడు సురేందర్ రెడ్డి కరోనా బారిన పడ్డారు.'ఏజెంట్' సినిమా కోసం సురేందర్ రెడ్డి యూరప్ కు వెళ్లారు. ప్రస్తుతం యూరప్ లో కరోనా కేసులు పెద్ద సంఖ్యలోనే నమోదవుతున్న సంగతి తెలిసిందే. అక్కడే ఆయన కరోనా బారిన పడడంతో అక్కడే సెల్ఫ్ క్వారంటైన్ లో వున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.  -------

నందమూరి వంశంలో పుట్టలేదా?.. పౌరుషం ఏమైంది?...

జూనియర్‌ ఎన్టీఆర్‌పై టీడీపీ నేతలు, శ్రేణులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఏపీ అసెంబ్లీలో వైసీపీ నేతలు నారా భువనేశ్వరిని ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఇలాగేనా స్పందించేది అని దుమ్మెత్తిపోస్తున్నారు. మీ మేనత్త భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని కించపరిస్తే స్పందించే తీరు ఇదేనా అంటూ నిప్పులు చెరుగుతున్నారు. భువనేశ్వరిని అనకూడని మాటలు అని మానసిక క్షోభకు గురిచేస్తే.. ఆమె భర్త, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కన్నీరు మున్నీరుగా విలపిస్తే జూనియర్ ఎన్టీఆర్‌కు చీమైనా కుట్టలేదా? అని ప్రశ్నిస్తున్నారు. నందమూరి వంశంలో జూనియర్‌ పుట్టలేదా? అని నిలదీస్తున్నారు. నందమూరి తారక రామారావు పేరు వాడుకుంటూ, ఆయన వారసత్వాన్ని అనుభిస్తూ.. ఆయన కుమార్తెను కించపరిస్తే నీకు ఎందుకు పౌరుషం రాలేదని ప్రశ్నిస్తున్నారు. మీ మేనత్తను అవమానించిన వారిపై స్పందించే తీరిదేనా అని తూర్పారపడుతున్నారు. అసలు గుడివాడలో, గన్నవరంలో నీ మిత్రులకు టీడీపీ టిక్కెట్లు ఇప్పించుకోడానికి చంద్రబాబును జూనియర్‌ ఎన్టీఆర్‌ ఎంతలా పీడించిందీ ఆ పార్టీ శ్రేణులు గుర్తుచేసుకుంటున్నారు. నిజానికి టీడీపీని వాడేసుకుంటున్నదే జూనియర్ ఎన్టీర్‌ అని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు జూనియర్ ఎన్టీఆరే కొందరి చేత మేనత్తను, మేనమామను వెనక ఉండి మరీ తిట్టిస్తున్నారనే అనుమానాలు టీడీపీ కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీలో తన మేనత్తపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఇంత సమయం గడిచే వరకు జూనియర్ ఎన్టీఆర్ స్పందించకుండా జాప్యం చేయడం పైనా టీడీపీ శ్రేణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏపీ అసెంబ్లీలో శుక్రవారం జరిగిన సంఘటనపై అన్ని వర్గాల వారు, ఆడపడుచులు తీవ్రంగా స్పందిస్తుంటే జూనియర్ ఎన్టీఆర్‌ మాత్రం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు ఉండాల్సి వచ్చిందని నిలదీస్తున్నారు. వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలపై నందమూరి కుటుంబంలోని ప్రతి ఒక్కరూ స్పందించినా మీరెందుకు బయటికి రాలేదంటున్నారు. నందమూరి ఫ్యామిలోని ఏనాడూ మీడియాలోకి రాని వ్యక్తులు కూడా తమ ఇంటి ఆడబిడ్డకు జరిగిన అవమానంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తుంటే.. మీరు తక్షణమే స్పందించకపోవడానికి కారణం ఏమిటని అడుగుతున్నారు. చివరికి తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా వైసీపీ నేతలు చేసింది తప్పు అని డైరెక్ట్‌గా ఖండించారు కదా.. మీకేమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. కర్ర విరగకుండా.. పాము చావకుండా అన్న చందంలో జూనియర్ ఎన్టీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా ఎందుకు వీడియో విడుదల చేయాల్సి వచ్చిందని టీడీపీ శ్రేణులు, నేతలు నిలదీస్తున్నారు.

కారు కూతలు.. బడాయి మాటలు! క్రెడిట్ అంతా కేసీఆర్ దేనట..

కేంద్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుందో ఏమో కానీ, ఇక్కడ హైదరబాద్’లో అధికార తెరాస మహా ధర్నా నిర్వహించిన మర్నాడే, ఎంతో కాలంగా వివాదస్పదంగా ఉన్న సాగు చట్టాలను రద్దు చేయాలనే నిర్ణయాన్ని తీసుకుంది. ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ గురునానక్ జయంతి సందేశంతో పాటుగా సిక్కులకు ఈ శుభ వార్త కూడా అందించారు. అయితే, హైదరబాద్’లో తెరాస నిర్వహించిన మహా ధర్నాకు, ఈ సందర్భంగా తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ పాసింగ్ కామెంట్స్’గా ఉత్తరాది రైతులు సాగు చట్టాలకు వ్యతిరేకంగా డెల్లి వేదికగా చేస్తున్న ఆందోళనకు సంబంధించి చేసిన వ్యాఖ్యలకు మధ్య గొప్ప సంబంధం ఏదో ఉందని అనుకోలేము. ఇవే వివాదాస్పద చట్టాలకు సంబంధించి, గతంలోనూ తెరాస రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసింది. కేటీఆర్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర కీలక నేతలంతా ధర్నా, రాస్తా రోకో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి వచ్చిన వెంటనే ఇవే వివాదస్పద చట్టాలకు తెరాస మద్దతు పలికింది.ముఖ్యమంత్రి అక్కడ ఫస్ట్ యూ టర్న్ తీసుకున్నారు. అంతేకాదు, పార్లమెంట్ ఉభయసభల్లోనూ తెరాస ఎంపీలు వ్యవసాయ  బిల్లుల (సాగు చట్టాల)కు మద్దతు తెలిపారు. స్వయంగా ముఖ్యమంత్రి చట్టాలను మెచ్చుకున్నారు. ఇదంతా చరిత్ర.  అయితే హుజూరాబాద్’ ఓటమి షాక్ నుంచి బయటపడేందుకు, ఈ సందర్భంగా  ఇచ్చిన దళిత బందు హామీ నుంచి రాజకీయ చర్చను పక్కదారి పట్టించేందుకు  ముఖ్యమంత్రి వరి వివాదాన్ని తెరమీదకు తెచ్చారు. భారీ డైలాగ్స్’ పోగేసి  బ్రహ్మాండం బద్దలు చేస్తున్న భ్రమలను సృష్టించారు, ఈ ‘వరి ఉరి’ పోరాటంలో భాగంగా నిర్వహించిన మహాధర్నాలో మరో మారు కేసీఆర్ మరో యూ టర్న్, తీసుకున్నారు.ఈసారి, చట్టాలను వ్యతిరేకించారు. గతం మొత్తాన్ని పక్కన పెట్టి కొత్త స్వరం ఎత్తుకున్నారు. అదలా ఉంటే, యాదృచ్చికంగా, వచ్చిన చట్టాల రద్దు ప్రకటన తమ ఖాతాలో వేసుకోవాలని, తెరసా మంత్రులు, ఇతర నాయకులు ఆ విధంగా ముఖ్యమంత్రిని పొగడ్తలతో ముంచెత్తే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రులు ఎర్రబెల్లి, నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి ఇలా ఒకరి వెంట ఒకరు, టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన మహాధ‌ర్నాతోనే కేంద్రం రైతు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేసిందని చంకలు గుడ్డుకకున్నారు. తాజాగా  తెరాస అధికార ప్రతినిధి, అరుపుల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అయితే, జాతీయ స్థాయిలో తమకు  పోటీగా కేసీఆర్ నిలుస్తారని భయపడే మోడీ అఘమేఘాల మీద రద్దు నిర్ణయం తీసుకున్నారని, నమ్మించేందుకు చాలా శ్రమ తీసుకున్నారు.  ముఖ్యంత్రి రెండు గంటలు ధర్నాలో కూర్చుంటేనే. మోడీ గజగజ వణికి పోయి చట్టాల రద్దు నిర్ణయం తీసుకున్నారని తెరాస నేతలు చప్పట్లు కొట్టు కున్నారు.  అయితే వాస్తవం అది కాదు. మహా ధర్నాకు మోడీ నిర్ణయానికి మోకాలుకు బోడి గుండుకు ఉన్న సంబంధం కూడా లేదు. అది యాదృచ్చికంగా జరిగిన సంఘటన.   నిజానికి, త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్ననేపధ్యంలో ఢిల్లీ రైతుల సుదీర్ఘ ఆందోళనలో కీలక భూమిక పోషిస్తున్న పంజాబ్ రైతులను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాని గురునానక్ జయంతిని సాగు చట్టాల రద్దు ప్రకటనకు ముహూర్తంగా ఎంచుకున్నారు. అందుకే , గురునానక్ జయంతి సుభాకంశాలతో పాటుగానే చట్టాల రద్దు ప్రకటన చేశారు. మహా ధర్నా , గురునానక్ జయంతి పక్కపక్కన రావడం యాదృచ్చికం .. ఆ యాదృచ్చిక సంఘటన ఆధారంగా తెరాస నాయకులూ ఇంట హడావిడి చేస్తున్నారంటే, గులాబీ పార్టీ  రాజకీయంగా ఎంతగా దివాలా తీసిందో అర్తంచేసుకోవచ్చని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.  అయితే అధికార పార్టీ ఇలా దివాలకోరు రాజకీయ పంథాను ఎంచుకోవడానికి కారణం లేక పోలేదని పరిశీలకులు భావిస్తున్నారు. దళిత బంధును  పక్కన పెట్టినా, రైతుల వద్ద నుంచి కొనవలసిన వడ్లను కొనే పరిస్థితి లేక కేంద్రం ఇచ్చిన వివరణతో తప్పించుకునే మార్గం లేక ... తెరాస నాయకులు సొంత డప్పు కొట్టుకుంరున్నారని అంటున్నారు.

ఇది నీ కుటుంబం కాదా?.. మిత్రులని వెనకేసుకొస్తున్నావా?...

నంద‌మూరి కుటుంబంలో బాల‌కృష్ణ త‌ర్వాత ఫైర్‌బ్రాండ్ ఎవ‌రంటే జూనియ‌ర్ ఎన్టీఆరే. బాల‌య్య త‌ర్వాత ఆ ఫ్యామిలీలో అంత‌టి క్రేజ్ ఉన్నోడు. బుడ్డోడు.. స్వ‌త‌హాగా ఆవేశ‌ప‌రుడు. ఫుల్ ఎమోష‌న‌ల్‌. మాటంటే ప‌డ‌రు. మాట‌కు మాట గ‌ట్టిగా జ‌వాబిచ్చే స‌త్తా ఆయ‌న సొంతం. అలాంటి ఎన్టీఆర్‌.. త‌న నంద‌మూరి కుటుంబ స‌భ్యురాలిని, స్వ‌యానా మేన‌త్త‌ను.. వైసీపీ మూక‌లు అంతేసి మాట‌లు అంటే.. చాలా సాదాసీదాగా స్పందించాడు. అది కూడా చాలా ఆలస్యంగా బయటికి వచ్చి.  నంద‌మూరి ఫ్యామిలీ అంతా మూకుమ్మ‌డిగా ముందుకొచ్చి మీడియా స‌మావేశం పెట్టిన  తర్వాత.. విమర్శలు వస్తాయని అనుకున్నాడో  ఏమో  ట్విట్టర్ వేదికగా ఓ వీడియో రీలిజ్ చేశాడు. ఏవో కొన్ని పదాలు చెప్పేశాడు. మహిళలను కించపరుస్తూ మాట్లాడిన వారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పాడు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి, వ్యక్తిగత దూషణలకు, అదీ ఆడపడుచుల గురించి పరుష పదజాలంతో మాట్లాడటం ఒక అరాచక పాలనకు నాంది అన్నారు  జూనియర్ ఎన్టీఆర్‌.  ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై ఎన్టీఆర్ ఇచ్చిన రియాక్షన్ పై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. జరిగిన పరిణామాలను ఖండించాడు తప్ప, సంఘటనకు కారణం అయిన వాళ్ళను విమర్శించలేదు ఎన్టీఆర్. జూనియర్ నోట ఎక్కడా నందమూరి మాట రాలేదు. వైసీపీ అన్న పదం కూడా లేదు. చంద్రబాబు కుటుంబంపై నీచంగా మాట్లాడిన ఎమ్మెల్యేల గురించి చెప్పలేదు. పైగా ఒక కుటుంబం అని మాట్లాడారు ఎన్టీఆర్. దీంతో ఆ కుటుంబం ఈయనది కాదా అన్న ప్రశ్న వస్తోంది.  జూనియర్ వీడియో చూసిన  వాళ్లంతా.. అసెంబ్లీలో  జరిగిన సంఘటను జనరలైజ్ చేశాడు తప్ప.. తన కుటుంబ సభ్యురాలు మీద జరిగింది అరాచకంగా జూనియర్ ఫీల్ అవలేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా RRR సినిమా వారి వత్తిడి మీదే ఇచ్చారనే చర్చ సాగుతోంది. ఎన్టీఆర్ మాటలు వైసీపీని సమర్ధిస్తున్నట్లుగా ఉన్నాయనే ఆరోపణలు కూడా కొన్ని వర్గాల నుంచి వస్తున్నాయి. జూనియర్ స్పందనపై టీడీపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆయన అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌పై అభిమాని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కుటుంబంపై ఏపీ అసెంబ్లీలో జరిగిన తీరుపై జూనియర్ ఎన్టీఆర్ సరిగా స్పందించలేదని అన్నారు. అసలు స్పందించకుండా ఉంటే బాగుండేదని సూచించారు. ఎన్టీఆర్ అనే పదంతో పేరు ప్రతిష్టలు సంపాదించిన తమరు స్పందించిన తీరు బాగోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘కర్ర విరగదు.. పాము చావదు’ అనే సామెతగా జూనియర్ ఎన్టీఆర్ స్పందన ఉందని అభిమాని క్లాస్ తీసుకున్నారు.  భువ‌నేశ్వ‌రిపై పిచ్చి వాగుడు వాగుతున్న కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీలు త‌న మిత్రులు కాబ‌ట్టే జూనియ‌ర్ ఎన్టీఆర్ అలా స్సందించారా అన్న ఆరోపణలు వస్తున్నాయి. మేన‌త్త‌ను అంతేసి మాట‌లు అంటే.. క్యారెక్ట‌ర్ అసాసినేష‌న్ చేస్తే.. సీరియస్ గా స్పందించకుండా ఇలా సింపుల్ గా మాట్లాడటం ఏంటని కొందరు జూనియర్ అభిమానులు కూడా నిలదీస్తున్నారు. మిగితా కుటుంబ సభ్యులు ఆవేశంగా ఊగిపోతుంటే..  జూనియర్ మాత్రం సింపుల్ రియాక్షన్ ఇవ్వడాన్ని తమ్ముళ్లు తప్పు పడుతున్నారు. ఇంత దారుణం జరిగినా సీరియస్ గా తీసుకోని వ్యక్తి  నంద‌మూరి కుటుంబ స‌భ్యుడు ఎలా అవుతాడని కూడా కొందరు ఆవేశంగా ప్రశ్నిస్తున్నారు. రాజ‌కీయాల‌కు తాను దూరం అని ఎన్టీఆర్‌ స‌మ‌ర్థించుకోడానికి కూడా లేదు. ఇది రాజ‌కీయం కాదే? కుటుంబ వ్య‌వ‌హారం.. కుటుంబ ప‌రువు, ప్ర‌తిష్ట‌, మ‌ర్యాద‌ల‌కు సంబంధించిన మేట‌ర్‌. కుటుంబం లేనిది ఆయ‌న ఎక్క‌డ‌? నంద‌మూరి ఇంటిపేరు లేక‌పోతే.. ఎన్టీఆర్‌కు గుర్తింపేముంది.. విలువేముంది? ఏ కుటుంబం వ‌ల్ల‌నైతే అత‌నికి ఇంత‌టి హోదా, గౌర‌వం ల‌భిస్తుండే.. ఇప్పుడు ఆ కుటుంబ‌మంతా క‌లిసి.. భువ‌నేశ్వ‌రికి మ‌ద్ద‌తుగా నిల‌బ‌డితే.. జూనియ‌ర్ ఎన్టీఆర్‌, క‌ల్యాణ్‌రామ్‌లు వాళ్లతో కలిసి రాకపోవడం త‌ప్పుకాదా? పాలిటిక్స్ వ‌ద్దంటూనే పాలిటిక్స్ చేస్తున్నారా? అంటూ తెలుగు త‌మ్ముళ్లు ప్ర‌శ్నిస్తున్నారు. జూనియర్ అభిమానులు కూడా ఇలానే నిలదీస్తున్నారు. 

నందమూరి ఫ్యామిలీ జోలికొస్తే ఖబర్దార్.. టీటీడీపీ నేతల ఫైర్

ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబంపై వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతోంది. టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనకు దిగాయి. తెలంగాణ టీడీపీ ఆందోళనలకు పిలుపిచ్చింది. ఆదివారం నుంచి  119 నియోజకవర్గల్లో మౌన ప్రదర్శన చేపట్టనున్నట్లు టీటీడీపీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు చెప్పారు.  ఏపీ శాసనసభలో చంద్రబాబుపై వైసీసీ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు తెలంగాణ టీడీపీ నేతలు.  ఇలాంటి ఘటనలు గతంలో ఎప్పుడు జరగలేదన్నారు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు. ప్రజా అవసరమైన చట్టాలు శాసనసభ లో చేస్తారు..కానీ వ్యక్తిగత దూషణలు సరైంది కాదన్నారు. అత్యధిక కాలం ముఖ్యమంత్రి గా సేవలు అందించింది చంద్రబాబు నాయుడుపై  నీచండా మాట్లారాని ఆయన మండిపడ్డారు. ఇంటికి పరిమితమైన ఒక ఇల్లాలిపై అసభ్యంగా మాట్లాడటం దారుణమన్నారు నర్సింహులు.  జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదన్నారు బక్కని నర్సింహులు. 16 నెలలు జైల్లో జగన్ జైల్లో ఉన్నారన్నారు. నాని , వంశీ, చంద్రశేఖర్, అంబటి రాంబాబు మాటలు అత్యంత నీచంగా ఉన్నాయన్నారు. ఎన్టీఆర్ కూతురుపై గౌరవ శాసనసభ లో మాట్లాడే బాషా కాదన్నారు. వైసీపీ నేతల ఇండల్లోనూ మహిళలు ఉన్నారని అన్నారు నర్సింహులు. మహాత్మాగాంధీ ,అంబేద్కర్ సిద్ధాంతాలకు అనుగుణంగా టీడీపీ నడుస్తుందన్నారు.

ఏపీ ఎమ్మెల్యేలు కొందరు పశువుల కంటే హీనం..

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ జరిగిన ఘటనలపై నందమూరి కుటుంబ సభ్యులు తీవ్రంగా స్పందిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరిపై పలువురు నేతలు వ్యక్తిగతంగా అవమానకరరీతిలో వ్యాఖ్యలు చేయడంపై సినీ నటులు నందమూరి కల్యాణ్‌రామ్‌, నారా రోహిత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాక్‌ స్వాతంత్ర్య హక్కును ఉపయోగించుకుని నోటికొచ్చినట్లు మాట్లాడటం తగదని అన్నారు. ఈ మేరకు శనివారం ట్విటర్‌ వేదికగా ప్రకటన విడుదల చేశారు.   నందమూరి కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ.. ‘‘అసెంబ్లీ అనేది ప్రజా సమస్యలను చర్చించి వాటి పరిష్కారం కోసం పాటు పడే దేవాలయం వంటిది. అక్కడ చాలా మంది మేధావులు, చదువుకున్న వారు ఉంటారు. అలాంటి ఓ గొప్ప ప్రదేశంలో రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి గురించి, అదీ వ్యక్తిగతంగా మాట్లాడటం అనేది బాధాకరం. ఇది సరైన విధానం కాదు. సాటి వ్యక్తిని, ముఖ్యంగా మహిళలను గౌరవించే మన సంప్రదాయంలో మహిళలను అసెంబ్లీలో అకారణంగా దూషించే పరిస్థితి ఎదురుకావటం దురదృష్టకరం. అందరూ హుందాగా నడుచుకోవాలని మనవి చేసుకుంటున్నా’’ అని పేర్కొన్నారు.   ‘‘ఉన్నత విలువలతో ప్రజాసమస్యలపై అర్థవంతమైన చర్చలు జరగాల్సిన అసెంబ్లీలో నిన్న కొందరు సభ్యులు పశువుల కంటే హీనంగా సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరిపై అసభ్యపదజాలంతో కూడిన వ్యాఖ్యలు చేయడం దిగ్భ్రాంతికరం. రాజకీయ విమర్శలు.. విధానాలపై ఉండాలి కానీ కుటుంబసభ్యులను అందులోకి లాగి అసభ్యంగా మాట్లాడటం క్షమార్హం కాదు. రాజ్యాంగం ప్రసాదించిన వాక్‌ స్వాతంత్ర్య హక్కును దుర్వినియోగం చేసి నోటికొచ్చినట్టు మాట్లాడం తగదు. వ్యక్తిగతంగా టార్గెట్‌ చేసి చంద్రబాబు నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలనుకుంటే అది మీ భ్రమే అవుతుంది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉండటం వల్లే మీ మనుగడ సాగింది. ఇప్పటికీ వాటికి కట్టుబడి ఉండటం వల్లే సంయమనంతో ఉన్నాం. శిశుపాలుడి వంద తప్పులు పూర్తయినట్టు నిన్నటితో మీ వంద తప్పులు పూర్తయ్యాయి. ఇక, మీ అరాచకాన్ని ఉపేక్షించేది లేదు. ప్రతి ఒక్క తెలుగుదేశం సైనికుడు వైసీపీ దుశ్శాసనుల భరతం పడతారు. ఈ వికృత క్రీడలను వెనుక ఉండి ఆడిస్తోన్న వారు కూడా కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని గుర్తు పెట్టుకోవాలి. ఇలాంటి స్థాయిలేని వ్యక్తుల మధ్యలో మీరు రాజకీయం చేయాల్సి రావడం దురదృష్టకరం పెదనాన్న. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మేమంతా మీ వెంటే ఉంటాం’’ అని నారారోహిత్‌ అన్నారు.   

ఏపీ అంతటా అంబటి సెగలు.. వైకాపాకు చితి మంటలేనా?

ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిని వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా, వైకాపా ఎమ్మెల్ల్యే అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యల్లో రాజకీయ వర్గాల్లో దుమారాన్ని రేపుతున్నాయి. పార్టీలకు వర్గాలకు అతీతంగా అందరూ వైకాప నేతల తీరును ఎండగడుతున్నారు. దీంతో  వైకాపా ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ముందు ముఖ్యమంత్రి ఇతర మంత్రులు కొంత దూకుడుగా అంబటిని సమర్ధించే ప్రయత్నం చేసిన ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం కావడం, అన్ని పార్టీలు వైకాపాను తప్పు పట్టడంతో వైకాపా డిఫెన్సులో పడింది. నష్ట నివారణ చర్యలు చేపట్టింది.  అయితే, చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్లుగా, మంత్రి పేర్నినానీ, ప్రెస్ మీట్ పెట్టి మరీ తమ అసహనాన్ని ప్రదర్శించారు. ‘అనని మాటలను అన్నారని, జరగని సంఘటన జరిగిందని’ టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందని, ఎదురు దాడి ప్రారంభించారు. అంతే కాదు, వైసీపే ప్రభుత్వాన్నిఅస్థిర పరిచేందుకు, తెలుగు దేశం పార్టీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. అదే సమయంలో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అసహనం ప్రదర్శించారు.చివరకు కనీసం థాంక్స్ అయినా చెప్పకుండానే మైక్ ఆఫ్ చేసుకుని వెళ్లి పోయారు.    మరోవంక తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ అసెంబ్లీ లో ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు, ఇతర వైకాపా నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా తెలుగు తమ్ముళ్ళు భగ్గు మంటున్నారు. రాష్ట్ర లేదా స్థానిక పార్టీ నాయకులు ఎవరూ ఎలాంటి పిలుపు ఇవ్వకపోయినా ఎక్కడి కక్కడ తెలుగు దేశం కార్యకర్తలు నిరశన తెలియచేస్తున్నారు.ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, అంబడీ తిష్టి బొమ్మలను తగుల బెట్టి, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మరో వంక  టీడీపీ ఎమ్మెల్యే బాల కృష్ణ, సహా నందమూరి కుటుంబ సభ్యులు, వైసీపీ నాయకుల తీరును దుయ్యబట్టారు. “ఇలాంటి నీచపు, నికృష్టపు మాటలు మాట్లాడితే సహించేది లేదు. ఖబడ్దార్‌.. భరతం పడతాం” అని బాల కృష్ణ హెచ్చరించారు. అలాగే ఇతర కుటుంబ సభ్యులు కూడా వైసీపీ నాయకుల తీరుపట్ల తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్త పరిచారు.  మరోవంక బీజేపీ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి ప్రత్యేకంగా, వైసేపీ నేతలు టం సోదరిపై చేసిన సంస్కార రహిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖడించారు. ఎన్టీఆర్ కుమార్తెలుగా తను , భువనేశ్వరి ఐటిక విలువలతో పెరిగామని న్నారు. రాజకీయ విమర్శలలోకి కుటుంబసభ్యులను తీసుకు రావడం తగదని అన్నారు. టీడీపీ నాయకులతో పాటుగా  కాంగ్రెస్, బీజేపీ నాయకులు కూడా, వైసీపీ నాయకుల నోటి దురుసు, దుర్మార్గపు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి అసెంబ్లీలో ఆడపడుచుపై అసత్య ఆరోపణలు సరికావని అన్నారు.  శాసన సభలో  ప్రతిపక్ష నాయకుడిని అవమానపరచడానికి ఆయన భార్య వ్యక్తిత్వాన్ని చులకన చేసి మాట్లాడడం సభామర్యాద కాదని తెలిపారు. అసలు సభలో లేని, సభకు సంబంధం లేని వ్యక్తుల పేర్లు ప్రస్తావించి వారిపై చవకబారు ఆరోపణలు చేయడం విజ్ఞతకాదని మండిపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ఉండాల్సిన శాసనసభ వ్యక్తిగత దూషణలకు, నిందారోపణలకు వేదికవ్వటం విచారకరమన్నారు. మహిళలు, కుటుంబ సభ్యులపై నిందారోపణలకు స్వస్తి పలకాలన్నారు. అసభ్య పదజాలంతో దూషణల పర్వంగా ఏపీ అసెంబ్లీ మారిందని మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. సభను అవమానిస్తూ ఆనందించే ధోరణి అధికార పార్టీలో ఉందని ఆయన ఆరోపించారు. తప్పు చేశామని గ్రహించే స్థాయిలో అధికారపక్షం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఆంధ్రప్రదేశ్‌ గురించి దేశమంతా సిగ్గుగా మాట్లాడుకుంటున్నారని అవేదన వ్యక్తపరిచారు. అసెంబ్లీ సభ్యత, సంస్కారాన్ని మంటగలిపారని విమర్శించారు. అసెంబ్లీ వేదికగా ప్రతిపక్ష నేత కుటుంబ సభ్యుల గురించి మాట్లాడటం దురదృష్టకరమని... మనస్సాక్షి ప్రకారం నడుచుకోవాలని హితవుపలికారు. అలాగే ఇంకా అనేక మంది ఇతర పార్టీల నాయకులు కూడా, వైసీపీ నేతల తీరును తప్పు పడుతున్నారు,అందుకే  వైసీపీలో కలవరం మొదలిందని అంటున్నారు.

ఏపీలో అరాచక పాలన.. చంద్రబాబు కన్నీటిపై జూనియర్ రియాక్షన్

ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై స్పందించారు జూనియర్ ఎన్టీఆర్. వ్యక్తిగత దూషణలు సరికాదన్నారు రాజకీయంలో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమన్న జూనియర్.. అసెంబ్లీలో జరిగిన ఘటన తన మనసును కలిచివేసిందని అన్నారు. సభలో సమస్యలన్నీ పక్కన పెట్టి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపడుచుల గురించి పరుష పదజాలంతో మాట్లాడటం ఆరాచక పాలనకు నిదర్శనమన్నారు. స్త్రీ జాతిని గౌరవించడం మన సంస్కృతి అన్నారు జూనియర్ ఎన్టీఆర్. మన నవ నాడుల్లో, రక్తంలో ఇమిడిపోయిన సంప్రదాయాన్ని,  భవిష్యత్ తరాలకు జాగ్రత్తగా అప్పగించాలన్నారు.  ప్రజా సమస్యలను పక్కన పెట్టి, వ్యక్తిగత దూషణలకు, అదీ ఆడపడుచుల గురించి పరుష పదజాలంతో మాట్లాడటం ఒక అరాచక పాలనకు నాంది అని నటుడు జూనియర్ ఎన్టీఆర్‌ అన్నారు. ఎన్టీఆర్‌ ట్విటర్‌ వేదికగా ప్రత్యేక వీడియోను షేర్‌ చేస్తూ, మహిళలను కించపరుస్తూ మాట్లాడిన వారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.   ‘‘అందరికీ నమస్కారం. మాట మన వ్యక్తిత్వానికి ప్రమాణం. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు చాలా సర్వ సాధారణం. అవి ప్రజా సమస్యలపై జరగాలే కానీ, వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత విమర్శలుగా ఉండకూడదు. నిన్న ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటన నా మనసును కలచి వేసింది. ఎప్పుడైతే మనం ప్రజా సమస్యలను పక్కన పెట్టి, వ్యక్తిగత దూషణలకు దిగుతున్నామో, ముఖ్యంగా మన ఆడపడుచుల గురించి పరుష పదజాలంతో మాట్లాడుతున్నామో అది ఒక అరాచక పాలనకు నాంది పలుకుంది. స్త్రీ జాతిని గౌరవించటం అనేది మన సంస్కృతి. మన నవ నాడుల్లో, మన జవ జీవాల్లో మన రక్తంలో ఇమిడిపోయిన ఒక సంప్రదాయం. దాన్ని రాబోయే తరాలకు జాగ్రత్తగా అప్పగించాలి. అంతేకానీ, మన సంస్కృతిని కలచి వేసి, కాల్చేసి ఇదే రాబోయే తరాలకు  బంగారు బాట వేస్తున్నామనుకుంటే అది మన తప్పు. అది మనం చేసే చాలా పెద్ద తప్పు’’   ‘‘ఈ మాటలు నేను ఒక వ్యక్తిగత దూషణకు గురైన కుటుంబానికి చెందిన సభ్యుడిగా మాట్లాడటం లేదు. ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా ఈ దేశానికి చెందిన ఒక పౌరుడిగా సాటి తెలుగువాడిగా మాట్లాడుతున్నా. రాజకీయ నాయకులకు ఒకటే విన్నపం. ఈ అరాచక సంస్కృతిని ఇక్కడే ఆపేయండి. ప్రజాసమస్యలపై పోరాడండి. రాబోయే తరానికి బంగారు బాట వేసేలా నడవడిక ఉండేలా జాగ్రత్త పడండి. ఇది నా విన్నపం మాత్రమే. ఇది ఇక్కడితో ఆగిపోతుందని మనసారా కోరుకుంటున్నా’’అని ఎన్టీఆర్‌ భావోద్వేగంతో మాట్లాడారు.  

ధరణి సమస్యలపై కాంగ్రెస్ పోరాటం.. దామోదర చైర్మెన్ గా ప్రత్యేక కమిటీ

తెలంగాణ ప్రభుత్వంపై పోరాటంలో దూకుడు పెంచింది ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే రైతు సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. వరి ధాన్యాన్ని కొనుగోళ్లు చేయాలంటూ కల్లాల్లోకి కాంగ్రెస్ పేరుతో కార్యాచరణ ప్రకటించారు రేవంత్ రెడ్డి. పీసీసీ పిలుపుతో కాంగ్రెస్ నేతలు వరి కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తున్నారు. అక్కడ రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. కొనుగోళ్లు వెంటనే చేపట్టాలంటూ ఆందోళనలు చేస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రోజుకో జిల్లాలో పర్యటిస్తూ నిరసనలో పాల్గొంటున్నారు. కేసీఆర్ సర్కార్ తీరుపై విరుచుకుపడుతున్నారు. పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని కూడా కాంగ్రెస్ ఉద్యమిస్తోంది. ఇప్పుడు వీటితో పాటు లక్షలాది మందికి పెద్ద సమస్యగా మారిన ధరిణి వెబ్ సైట్ పై ఫోకస్ చేసింది హస్తం పార్టీ. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా ధరణి, భూ సమస్యల అంశాలపై పరిశీలనకు టీపీసీసీ కమిటీని నియమించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజా నర్సింహ ఈ కమిటీగా  ఛైర్మన్ గా ఉండనుండగా.. కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి కన్వీనర్ గా ఉన్నారు.  భూసమస్యలపై వేసిన కాంగ్రెస్ కమిటీలో  సభ్యులుగా మాజీ ఎమ్మెల్యే ఈరవర్తి అనిల్, బెల్లయ్య నాయక్, కొండపల్లి దయాసాగర్, ప్రత్యేక ఆహ్వానితులుగా కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, దళిత కాంగ్రెస్ చైర్మన్ ప్రీతమ్ లను నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ కమిటీ ధరణి, అసైన్డ్ భూములు, వక్ఫ్ భూములు, భూ సేకరణ అంశాలపై అధ్యయనం చేసి 45 రోజులలో టీపీసీసీ కి నివేదిక ఇస్తుందని టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. 

భువనేశ్వరికి కాదు భూదేవీకి అవమానం.. 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ జరిగిన పరిణామాలు చాలా దారుణమన్నారు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు. సభ్య సమాజం తల దించుకునేలా వైసీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించారన్నారు. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి జరిగిన అవమానం భూదేవికి జరిగినట్లే అన్నారు రఘురామ. యావత్ మహిళలకు జరిగిన అవమానమన్నారు. ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనపై మహిళా లోకమంతా  రోడ్డెక్కి ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు రఘురామ రాజు.  వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై మాట్లాడకుండా సభను పక్కదారి పట్టించడం సరికాదన్నారు ఎంపీ రఘురామ రాజు.  ఏపీ ‘‘మీ ఆడవాళ్ల గురించి ఇలా మాట్లాడితే ఏం చేస్తారు?రోజులన్నీ మీవి కావు.. అది గమనించి నడుచుకోవాలి. నందమూరి కుటుంబం ఎంత ఆవేదన పడిందో చూశాం. ఎన్టీఆర్‌ జాతి సంపద, కుటుంబ పెద్దగా భావించాలి. ఇది ఎన్టీఆర్‌ కుటుంబ సమస్య కాదు.. తెలుగు వారికి జరిగిన అవమానం. ఈ ఘటనపై ప్రతిఒక్కరూ స్పందించాలి. మహిళలంతా ఏకమై ముందుకు కదలాలి’ అని రఘురామ కృష్ణం రాజు  పిలుపునిచ్చారు.

అసెంబ్లీలో ఆడపడుచుపై నిందలా.. వైసీపీపై రేణుకా ఫైర్..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబ సభ్యులపై వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వైసీపీ నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అసెంబ్లీలో ఆడపడుచుపై అసత్య ఆరోపణలు సరికావని  కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి అన్నారు. సభలో ప్రతిపక్ష నాయకుడిని అవమానపరచడానికి ఆయన భార్య వ్యక్తిత్వాన్ని చులకన చేసి మాట్లాడడం సభామర్యాద కాదన్నారు. అసలు సభలో లేని, సభకు సంబంధం లేని వ్యక్తుల పేర్లు ప్రస్తావించి వారిపై చవకబారు ఆరోపణలు చేయడం విజ్ఞత కాదని మండిపడ్డారు. అధికారం, సభలో మంద బలం ఎప్పుడూ శాశ్వతం కాదని.... కేవలం మన హుందాతనం, ప్రవర్తన మాత్రమే  శాశ్వతమన్నారు రేణుకా చౌదరి.  ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ఉండాల్సిన శాసనసభ వ్యక్తిగత దూషణలకు, నిందారోపణలకు వేదికవ్వటం విచారకరని రేణుకా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత రాజకీయాల్లో హుందాతనం లోపిస్తోందని అన్నారు. ప్రజా ప్రతినిధులు బాధ్యత మరచి అసభ్య పదజాలంతో మాట్లాడటం సరైంది కాదని తెలిపారు. అధికార, ప్రతిపక్షాలు సంయమనంతో వ్యవహరించాలని సూచించారు.  మహిళలు, కుటుంబ సభ్యులపై నిందారోపణలకు స్వస్తి పలకాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక ఎజెండాగా సభ్యులు పనిచేయాలని రేణుకా చౌదరి హితవుపలికారు.