బాబుకు సోనూసూద్ పరామర్శ.. వరదలో ఇసుక అమ్ముతారట.. దిగొచ్చిన కమలం.. టాప్ న్యూస్@8PM

టీడీపీ అధినేత చంద్రబాబుకు నటుడు సోనూసూద్ ఫోన్ చేశారు. ఇటీవల అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబంపై వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో చంద్రబాబును సోనూసూద్ పరామర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వేదిక అవ్వాల్సిన అసెంబ్లీలో ఇలాంటి ఘటన దురదృష్టకరమన్నారు. శాసనసభలో విధ్వంస ధోరణి సరికాదని, హైదరాబాద్‌కు వచ్చినప్పుడు చంద్రబాబును కలుస్తానని సోనూసూద్ చెప్పారు. -------- చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ నేతల వ్యాఖ్యలకు నిరసనగా ఉద్యోగుల రాజీనామా కొనసాగుతున్నాయి. రైల్వే కోడూరులో దుద్యాల అనితా దీప్తి అనే మహిళా ఉద్యోగిని తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సీఎం జగన్, మంత్రి కొడాలి నానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎర్రగుంట్ల పట్టణ పేదరికి నిర్మూలన సంస్థ కో ఆర్డినేటర్‌గా పని చేస్తున్న అనితా దీప్తి..రైల్వే కోడూరులోని ఎన్టీఆర్ విగ్రహం ముందు టీడీపీ నేతలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు -------- వైసీపీ కౌరవ మూకకు ప్రజానీకం బుద్ది చెబుతారని టీడీపీ నేత పట్టాభి హెచ్చరించారు. టీడీపీ అదినేత చంద్రబాబు కంట కన్నీరుతో.. ప్రపంచంలోని తెలుగువారంతా ఆవేదన చెందారని తెలిపారు. వార్డు మెంబర్లుగా ఓడిన చరిత్ర వైఎస్ కుటుంబానిదన్నారు. అవమానించిన అసెంబ్లీలోనే చంద్రబాబును రారాజుగా నిలిపేలా.. టీడీపీ కార్యకర్తలు పసుపు ప్రతిజ్ఞ చేయాలని పట్టాభి కోరారు -------- అందరికీ అందుబాటులోకి ఇసుక అంటూ ఏపీ ప్రభుత్వం పత్రికా ప్రకటనలు ఇవ్వడం పట్ల జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు వరద నష్టంతో బాధపడుతుంటే ఇసుక అమ్ముతామంటూ ప్రభుత్వం ప్రకటనలు ఇస్తోందని మండిపడ్డారు. వరద కారణంగా పచ్చని పంట పొలాల్లో ఇసుక మేట వేసిందని వెల్లడించారు. ఇలాంటి తరుణంలో ఇసుక అమ్మకాలపై పత్రికా ప్రకటనలు ఇచ్చిన వైసీపీ సర్కారును ఏమనాలని  ప్రశ్నించారు. ---------- తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మళ్లీ కలిశారు. జల వివాదాల తర్వాత సీఎంలిద్దరూ ఒకే వేదికపై కనిపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ పక్కపక్కనే కూర్చుని చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనవరాలు స్నిగ్ధారెడ్డికి, ఏపీ సీఎం జగన్ వద్ద ప్రత్యేకాధికారిగా పని చేస్తున్న కృష్ణమోహన్ రెడ్డి కుమారుడైన రోహిత్ రెడ్డితో వివాహం జరిగింది.  --------- కేసీఆర్ తో కలిసి ఏపీ సీఎం జగన్ వివాహ వేడుకల్లో పాల్గొన్న ఫోటోను తన పోస్టుకు జత చేసిన నారా లోకేష్.. ఘాటు వ్యాఖ్యలు చేశారు. వరదల్లో చిక్కుకుని ప్రజలు ప్రాణాలు రక్షించాలని వేడుకుంటున్నారని అన్నారు. జనాలను ఆదుకోవడంలో విఫలమైన ముఖ్యమంత్రి.. తీరిగ్గా పెళ్లిళ్లకు వెళుతున్నారని కామెంట్ చేశారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ పోస్ట్ చేశారు నారా లోకేష్. ఏపీని దేవుడే కాపాడాలంటూ కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.  --- రాజధాని అమరావతికి బీజేపీ కట్టుబడి ఉందని ఎంపీ సుజనాచౌదరి అన్నారు. రైతుల పాదయాత్రకు బీజేపీ తరపున సంఘీభావం తెలుపుతున్నామని చెప్పారు. అమరావతి రాజధాని ఒక్క అంగుళం కూడా కదలదన్నారు. చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు. ఏ పార్టీ అయినా సభ్య సమాజాన్ని దృష్టిలో ఉంచుకుని మాట్లాడాలని సూచించారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు తెలుసుకోవాలన్నారు -------- టీఆర్ఎస్  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారయ్యారు. ఢిల్లీకి వెల్లే ముందు అభ్యర్దులను ఖరారు  చేశారు సీఎం కేసీఆర్.పలువురు  అభ్యర్దులకు బీ ఫాం ఇచ్చారు. సోమవారం అధికారికంగా  అభ్యర్థులను ప్రకటించనుంది టీఆర్ఎస్ అధిష్ఠానం.ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో పలుజిల్లాల్లో కొందరికి రెన్యూవల్ ఇవ్వగా.. మరికొందరికి మొండిచెయ్యి ఇచ్చారు గులాబీ బాస్.సింగర్ సాయిచంద్, ఎల్ రమణకు అవకాశం ఇచ్చారు.  --- సీఎం కేసీఆర్ దీక్ష చేస్తే కేంద్రం దిగొచ్చిందా? అని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు.ముఖ్యమంత్రి దీక్ష చేసింది తెలంగాణ రైతుల కోసమా..? పంజాబ్ రైతుల కోసమా? అన్నది అర్థంకాలేదన్నారు. కేసీఆర్ ఢిల్లీ ఎందుకు వెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు. ధర్నా చౌక్‌ తీసేయాలన్న ముఖ్యమంత్రి అక్కడే ధర్నా చేశారని విమర్శించారు. మిల్లర్లతో కలిసి ప్రభుత్వం రైతులను దగా చేస్తోందని, రైతుల కోసం ఆలోచించే పార్టీ బీజేపీ అని అన్నారు.  ---------- వాదాస్పద సాగు చట్టాల్ని వెనక్కి తీసుకుంటామని ప్రకటించినప్పటికీ.. వాటిని చట్ట సభల్లో అధికారంగా రద్దు చేసి, కనీస మద్దతు ధరపై (ఎమ్‌ఎస్‌పీ) చట్టం చేసినప్పుడే తమ ఆందోళన విరమిస్తామని రైతు సంఘాలు స్పష్టం చేశాయి. సాగు చట్టాల్ని వెనక్కి తీసుకుంటామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం ప్రకటించారు. రైతులను అంచనా వేయడంలో విఫలమయ్యామని, వారికి క్షమాపణలు చెబుతున్నట్లు ఆయన తెలిపారు

వరదల్లో జనం చస్తుంటే..పెళ్లి వేడుకల్లో సీఎం! ఏపీకి దిక్కెవరు..? 

ఆంధ్రప్రదేశ్ ను వరదలు ముంచెత్తుతున్నాయి. చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలు భారీ వర్షాలకు అతలాకుతలమవుతున్నాయి. ఇంకా పలు గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. రోడ్లు కోతకు గురవుతున్నాయి. వంతెనలు కూలిపోతున్నాయి. ప్రాణ, ఆస్తుల నష్టాలతో పలు ప్రాంతాలవారు క్షణమొక యుగంలా గడుపుతున్నారు. పంట పొలాలు మునిగాయి. గ్రామాల్లో అంథకారం అలుముకుంది. బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. ఇళ్లల్లోని వస్తువులు వరద నీటితో కలిసిపోయాయి. భారీ వర్షాలతో ఇప్పటి వరకు 27మంది మరణించారు. వరదల కారణంగా పలువురు గల్లంతయ్యారు. వారి కోసం గాలింపుచర్యలు కొనసాగుతున్నాయి. కడప జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 24 మంది గల్లంతు కాగా 12 మృతదేహాలు గుర్తించారు. అయితే సుమారు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు గ్రామాల ప్రజలు చెపుతున్నారు. భారీగా ఆస్తులు, వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వరద ముంపు ప్రాంతాల్లో బాధితులకు మంచినీరు, ఆహారం అందడంలేదు. అధికారులు, వాలంటీర్లు పట్టించుకోవడంలేదు. వంతెనలు కొట్టుకుపోవడంతో వందలాది గ్రామాలకు.. ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. మరమత్తులు ఎప్పుడు పూర్తి అవుతాయో కూడా తెలియని పరిస్థితి. దీంతో జల దిగ్బంధంలో చిక్కుకున్న గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాయలసీమలో ఇంతటి దారుణ పరిస్థితులు ఉంటే ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. తన సొంత జిల్లా అతలాకుతలం అవుతున్నా జగన్ కనీసం కనికరించడం లేదని అంటున్నారు. ఇదిలా ఉండగానే హైదరాబాద్ లో జరిగిన పెళ్లి వేడుకకు సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరుకావడం తీవ్ర దుమారం రేపుతోంది. వరదలతో జనాలు అల్లాడుతుంటే పట్టించుకోకుండా వివాహానికి జగన్ హాజరుకావడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పెళ్లికి వెళ్లడమే కాదు.. అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రితో మంతనాలు సాగించారు జగన్మోహన్ రెడ్డి. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనవరాలు స్నిగ్ధారెడ్డి పెళ్లి వేడుక శంషాబాద్ కొత్తగూడలోని వీఎన్ఆర్ ఫామ్స్‌లో  వివాహం జరిగింది. ఏపీ సీఎం జగన్ వద్ద ప్రత్యేకాధికారిగా పని చేస్తున్న కృష్ణమోహన్ రెడ్డి కుమారుడైన రోహిత్ రెడ్డితో స్నిగ్ధారెడ్డి మూడు ముళ్లు వేయించుకున్నారు. ఈ పెళ్లికి కేసీఆర్, జగన్ హాజరయ్యారు. ఇద్దరూ చాలా సేపు  పక్కపక్కనే కూర్చుని చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. ఇదే ఇప్పుడు రచ్చగా మారింది. సీఎం జగన్ పై విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. రాయలసీమ వరదల్లో ఉంటే ముఖ్యమంత్రి కులాసాగా పెళ్లికి వెళ్లడం దారుణమంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు.కేసీఆర్ తో కలిసి జగన్ వివాహ వేడుకల్లో పాల్గొన్న ఫోటోను తన పోస్టుకు జత చేసిన లోకేష్.. ఘాటు వ్యాఖ్యలు చేశారు. వరదల్లో చిక్కుకుని ప్రజలు ప్రాణాలు రక్షించాలని వేడుకుంటున్నారని లోకేష్ అన్నారు. జనాలను ఆదుకోవడంలో విఫలమైన ముఖ్యమంత్రి.. తీరిగ్గా పెళ్లిళ్లకు వెళుతున్నారని కామెంట్ చేశారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ పోస్ట్ చేశారు నారా లోకేష్. సీఎం జగన్ తీరుపై సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏపీని దేవుడే కాపాడాలంటూ కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. హుదూద్ తుపాను సమయంలో విశాఖలో చంద్రబాబు చేసిన పనులు వివరిస్తూ మరికొందరు పోస్టులు పెట్టారు. చంద్రబాబు, జగన్ ను పోల్చుతూ చాలా మంది నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. 

జగన్ కు షాక్.. కూన రవికుమార్ కు బెయిల్.. 

శ్రీకాకుళం జిల్లా టీడీపీ సీనియర్ నేత, ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్ కు బెయిల్ వచ్చింది. శ్రీకాకుళం జిల్లా కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. కూనకు బెయిల్ రావడంతో పోలీసులు ఆయనను విడిచిపెట్టారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెనాయుడు పోలీస్ స్టేషన్ దగ్గరకు వెళ్లి కూన రవికుమార్ ను తీసుకొచ్చారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు అక్కడికి భారీగా వచ్చారు. కూనకు మద్దతుగా, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.  తెలుగు దేశం పార్టీ నేత కూన రవికుమార్‌ను పోలీసులు శనివారం అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం   శాంతినగర్‌ కాలనీలోని ఆయన సోదరి ఇంట్లో ఉన్న రవికుమార్‌ను ఎచ్చెర్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై కేసు నమోదు చేశారు.  అర్థరాత్రి పూట రవికుమార్ ఇంతటితో పాటు, ఆయన సోదరుడు కూన సత్యారావు ఇళ్లల్లో కూడా సోదాలు నిర్వహించారు పోలీసులు. కూన రవికుమార్ సోదరి ఇంట్లో  ఉన్నారన్న పక్కా సమాచారంతో ఇంటిని చుట్టుముట్టి, హైడ్రామా మధ్య అరెస్టు చేశారు.  శనివారం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన భార్య పై అసెంబ్లీ సాక్షిగా వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో నిరసన కోసం బయలుదేరిన సమయంలో హౌస్ అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులపై దురుసుగా వ్యవహరించారని.. కూన రవికుమార్ పై టూ టౌన్ సిఐ ఫిర్యాదు మేరకు అరెస్టు చేశారు. కూన రవికుమార్ ను అరెస్ట్ చేయడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి పూట పోలీసులు దౌర్జన్యం చేశారని, దురుసుగా వ్యవహరించారని ఆరోపించారు. వరదలతో జనాలు అల్లాడుతున్నా పట్టించుకోకుండా టీడీపీ నేతలను అరెస్ట్ చేస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు తమ్ముళ్లు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్... కూనను అరెస్ట్ ను తీవ్రంగా ఖండించారు. ప్రజలంతా వరదలతో అల్లాడుతుంటే జగన్ ప్రభుత్వం మాత్రం విపక్ష నేతలను అరెస్ట్ చేయడంపై ఫోకస్ చేసిందని ఆయన విమర్శించారు. 

కన్నీళ్లను దాచుకుని చంద్రబాబును ఓదార్చిన భువనేశ్వరి!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శుక్రవారం జరిగిన పరిణామాలు యావత్ తెలుగు జాతిని కలిచివేసింది. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టార్గెట్ గా సభలో వైసీపీ ఎమ్మెల్యేలు రెచ్చిపోయారు. చంద్ర‌బాబు ఉక్కుమ‌నిషి అని వాళ్లకు తెలుసు. రెచ్చగొట్టే కామెంట్లు రాజకీయ జీవితంలో ఆయన ఎన్ని చూసి ఉంటారు. ఆ విషయం వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా తెలుసుు. అందుకే గురి చూసి ఆయ‌న వీక్‌నెస్ మీద కొట్టారు. చంద్ర‌బాబు ఆయువు ప‌ట్టులాంటి ఆయ‌న కుటుంబం ప‌రువు మ‌ర్యాద‌ల‌పై దెబ్బ‌కొట్టారు. ఎన్ని దెబ్బ‌లు కొట్టినా.. గోడ‌కు కొట్టిన బంతిలా తిరుగొస్తున్నాడ‌నే అక్క‌స్సుతో చంద్ర‌బాబు ఫ్యామిలీ ఇమేజ్‌ను టార్గెట్ చేశారు.  అర్థ‌నారీశ్వ‌రుడులాంటి చంద్ర‌బాబుకు.. భార్య భువ‌నేశ్వ‌రే స‌ర్వ‌స్వం. ప్రాణంకంటే ప్రియం. అందుకే ఆమెపై దాడికి దిగారు. నిండు సభలో భువనేశ్వరిపై అసభ్యంగా మాట్లాడారు వైసీపీ ఎమ్మెల్యేలు.  అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేల నీచ, నికృష్ట వ్యాఖ్యలతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు చంద్రబాబు. సభలోనే ఉద్వేగానికి లోనయ్యారు. సభకు దండం పెట్టిన బయటికి వచ్చిన చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టారు. సభలో జరిగిన పరిమాణాలను వివరిస్తూ  భోరున ఏడ్చేశారు. చిన్న పిల్లాడిలా వెక్కివెక్కి ఏడ్చారు. ప్రస్తుతం దేశంలోని టాప్ రాజకీయ నేతల్లో ఒకరు చంద్రబాబు. 15 ఏండ్లు ముఖ్యమంత్రిగా, పదేండ్లు ప్రతిపక్ష నేతగా పనిచేశారు. అలాంటి చంద్రబాబు కన్నీళ్లు పెట్టడంతో దేశమంతా అవ్వాక్కైంది. చంద్రబాబు ఎందుకు ఏడ్చారో తెలుసుకుని షాకైంది. చంద్రబాబు కుటుంబంపై వైసీపీ ఎమ్మెల్యేలు నీచంగా ప్రవర్తించారని తెలుసుకుని జాతీయ స్థాయి నేతలు కూడా తీవ్రంగా స్పందించారు. చంద్రబాబుకు ఫోన్ చేసి పరామర్శించారు. ఓదార్చారు. వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అసెంబ్లీలో జరిగిన పరిణామాలతో ఉక్కుమనిషి లాంటి చంద్రబాబు విలవిల ఏడిస్తే.. ఆయన సతీమణి భువనేశ్వరి పరిస్థితి ఎలా ఉందో అన్న ఆందోళన అందరిలో వ్యక్తమైంది. తనపై సభ్య సమాజం తలదించుకునేలా వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన కామెంట్లను ఆమె తట్టుకుంటుందా అన్న భయం కూడా నారా ఫ్యామిలీతో పాటు టీడీపీ నేతల్లో కనిపించింది. అయితే అసెంబ్లీ జరిగిన ఘటనలు. ప్రెస్ మీట్ లో చంద్రబాబు బోరున విలపించడం చూసిన.. భువనేశ్వరి తీవ్ర మనస్తాపానికి గురయ్యారట. అయితే సాయంత్రానికి తేరుకుని భర్త చంద్రబాబుకే ఆమె ధైర్యం చెప్పారని తెలుస్తోంది.  చంద్రబాబు విలేకరుల సమావేశంలో విలపించిన ఆ దృశ్యాన్ని టీవీలో చూసిన భువనేశ్వరి.. తాను కూడా విపరీతంగా విలపించారు. ఆ సమయంలో ఇంట్లో ఆమె ఒక్కరే ఉన్నారు. ఈ విషయం తెలిసి చంద్రబాబు, లోకేశ్‌ శుక్రవారం సాయంత్రం హుటాహుటిన హైదరాబాద్‌లోని ఇంటికి వెళ్లారు. వారిని చూడగానే ఆమె మరోసారి రోదించారు. కానీ ఆ తర్వాత ఆమె త్వరగానే కోలుకున్నారు. జరిగిన ఘటనలపై బాధపడుతున్న చంద్రబాబును ఆమె ఓదార్చారని  కుటుంబ సన్నిహిత వర్గాలు తెలిపాయి. చంద్రబాబు ఇంటికి వెళ్లగానే.. ‘దిగజారిన మనుషులు ఏవో మాట్లాడతారు. అవన్నీ మనసులో పెట్టుకోవద్దు.. వదిలేయండి’ అని భువనేశ్వరి ఆయనను అనునయించినట్లు సమాచారం. ‘రాజకీయాల్లో ఒక్కోసారి ఇటువంటి వ్యక్తులను ఎదుర్కోవాల్సి వస్తుంది. నాన్నగారు ఉన్నప్పుడు కూడా కొంతమంది ఆయనను ఉద్దేశించి ఇలాగే నీచంగా మాట్లాడేవారు. మనసుకు బాధ కలిగినా వాటిని వెనక్కినెట్టి మన పని మనం చేసుకోవాలి. మిమ్మల్ని బాధ పెట్టడానికే ఇలా మాట్లాడుతుంటారు. వారిని పట్టించుకోవద్దు’ అని ఆమె అన్నట్టు ఆ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీలో జరిగిన ఘటనలతో శుక్రవారం బాగా బాధపడిన చంద్రబాబు.. భార్య భువేనశ్వరి ఇచ్చిన ధైర్యంతో త్వరగానే మామూలు స్థితికి వచ్చేశారని చెబుతున్నారు. శనివార ఆయన పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి వరద పరిస్థితిపై చర్చించారు. 

తెలంగాణ రైతుకు దిక్కులేదు.. దేశమంతా సాయమట! కేసీఆర్ ఢిల్లీ డ్రామా ఎందుకంటే?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్,  మంత్రులు, ఎంపీలు, అధికారులను, వెంటపెట్టుకుని ఢిల్లీకి పయనమయ్యారు. ఓ వంక రాష్ట్రంలో అకాల వర్షాలు, ఇతర సమస్యలతో ప్రజలు,   ధాన్యం కొనే నాధుడు లేక రైతులు ఇబ్బడులు పడుతున్నారు. రైతులు అయితే ఆర్తనాదాలే చేస్తున్నారు. ముఖ్యమంత్రి చెప్పిన విధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు అయితే తెరుస్తున్నారు. కానీ,తాళం వేసితిని గొళ్ళెం మరిచితిని అన్నట్లుగా, కేంద్రాలు తెరిచి కాంటా మరుస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచి నెల రోజులు అయినా, ఇంకా పది శాతం ధాన్యం అయినా కొనలేదు అంటే, పరిస్థితి ఏమ్తితో వేరే చెప్పనక్కర లేదు. ఇలాంటి  సమయంలో ముఖ్యమంత్రి ఏమి ఆశించి ఢిల్లీ యాత్ర పెట్టుకున్నారో, ఏమో ఎవరికీ అర్థం కావడం లేదని రాజకీయ విశ్లేషకులు  అంటున్నారు.  ఓ వంక ముందు వానా కాలం పంట కొనండి మహప్రభో, ఆ తర్వాత యాసంగి పంట సంగతి చూద్దామని ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఇతర రాజకీయ పార్టీలు. ప్రజసంఘాలు, మరీ ముఖ్యంగా  నెలల తరబడి, కొనుగోలు కేంద్రాల వద్ద పడి గాపులు పడుతున్న రైతులు కోరుతున్నారు. మరో వంక  మఖ్యమంత్రి, యాసంగి లెక్కల కోసం, ఢిల్లీకి పయనమై వెళుతున్నారు. ఇదేమిటని, ప్రతి ఒకరూ ముక్కున వేలేసుకుంటున్నారు.  ప్రతి ఒక్కరూ విస్మయం వ్యక్త పరుస్తున్నారు. అయినా, ‘అయినను పోయి రావలె హస్తినకు...’ తరహాలో ముఖ్యమంత్రి మందిమార్బలంతో ఢిల్లీ పయనమయ్యారు.  చిత్రం ఏమంటే, చేతికొచ్చిన వానాకాలం పంట కొనేనాధుడు లేక వానకు తడసి ముద్దవుతోందని రాష్ట్ర వ్యాప్తంగా రైతులు లబో దిబో మంటున్నారు. అయినా, వానాకాలం పంటను వానకు వదిలేసి  ఇంకా విత్తనం అయినా పడని యాసంగిలో కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొంటుందో లేదో తాడో పేడో తెలుచుకునేందుకు ముఖ్యమంత్రి యుద్ద సన్నద్ధమై హస్తినకు బయలుదేరారు. ఇంకా,ఇతర డిమాండ్స్ అవీ ఇవీ సిద్ధం చేసుకుని వెళుతున్నా, ప్రధాన లక్ష్యం మాత్రం, యాసంగి ధన్యం కొలుగోలు లెక్కలు తేల్చుకోవడమే అని ముఖ్యమంత్రే స్వయంగా  విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు.  నిజానికి, కేంద్ర ప్రభుత్వం యాసంగి పంట విషయంలోనే తప్పో ఒప్పో ఏదైనా ఒక స్పష్టత అయితే ఇచ్చిందనే పరిశీలకులు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం యాసంగిలో బాయిల్డ్ రైస్ గింజ కూడా కొనేది లేదని స్పష్టం చేసింది . రాష్ట్ర ప్రభుత్వాలు తమ సామర్ధ్యానికి అనుగుణంగా బాయిల్డ్ రైస్ కొనుగోలు చేస్తే అభ్యంతరం లేదని, అదే విధంగా ధాన్యం నిల్వలు అధికంగా ఉన్నదున ప్రత్యాన్మాయ పంటలపై దృష్టి పెట్టాలని స్పష్టం చేసింది.ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి లిఖిత పూర్వకంగా ఆమోదం తెలిపింది. అలాగే,  యాసంగిలో  సాధారణ ధాన్యం గోనుగోలుకు సంబంధించి, అన్ని రాష్ట్రాలతో సంప్రదించి ఏ రాష్ట్రం నుంచి ఎంతధాన్యం సేకరించేది ఫుడ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా (ఎఫ్ సీ ఐ) నిర్ణయం తీసుకుంటుందని, కేంద్ర ఆహార మత్రిత్వ శాఖ అరటి పండు వలచి చేతిలో పెట్టింది. ‘గులాబీ పత్రికలు సహా  పత్రికలు అన్నీ కూడా, యాసంగిలో  బాయిల్డ్  రైస్ కొనేది లేదని కేంద్ర స్పష్టంచేసిందని తాటికాయంత అక్షరాలతో వార్తను ప్రచురించాయి. సో.. యాసంగి అనేది ఇష్యూనేకాదాని పరిశీలకులు భావిస్తున్నారు. అయినా,ముఖ్యమంత్రి వరి ధాన్యం కొనుగోళ్ళ పై కేంద్రం సరైన స్పష్టత ఇవ్వడం లేదని ఢిల్లీపికి దండయాత్ర చేయడం విడ్డూరంగా ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.  నిజానికి, ఈ గోల మొదలు కావడానికి ముందే రాష్ట్ర  ప్రభుత్వానికి యాసంగి పంట మీద పూర్తి  క్లారిటీ ఉంది. క్లారిటీ  ఉంది కాబట్టే హుజూరాబాద్ ఓటమికి ముందే అప్పటి సిద్దిపేట కలెక్టర్, ‘వరి వేస్తే ఉరే’ అని సంచలన ప్రకటన చేశారు. ఇప్పుడు అందుకో ఇంకేందుకో గానీ, ఆయన్ని  పిలిచి ఏమ్మేల్సీని చేశారు. అది వేరే విషయం అనుకున్నా, కేంద్రం స్పష్టత ఇవ్వలేదని చెప్పడం మాత్రం, అయితే ఆత్మ వంచన అవుతుంది, కాదంటే అలవాడుగా చెప్పిన అబద్ధం అవుతుందని పరిశీలకులు అంటున్నారు. అలాగే, ప్రస్తుత వర్షాకాల పంటకు సంబంధించి, రెండు నెలల క్రితమే  40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటామని కేంద్ర స్పష్టం చేసింది . అదనంగా కొనాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్ధన విషయంలో కేంద్ర పరిసీలిస్తామని మాత్రమె చెప్పింది కానీ  హమీ ఇవ్వలేదు. సో.. సమస్యలు ఉన్నా ఇప్పుదు ఢిల్లీ వెళ్లి  సాధించేది మాత్రం శూన్యం అనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.రాష్ట్రంలో ఎదురవ్తున్న సంశయాల నుంచి తప్పించుకుపోయే ఎత్తుగదగానూ భావిస్తున్నారు. ఓ వంక ధాన్యం కొనేందుకు పైసలు లేవు.. ఈ నెల 4 న ప్రారంభం కావలాసిన  దలిత బంధు 24 వతున్నా ఇంకా మొదలు కాలేదు. సో... అసలు సమస్యలను పక్కదారి పట్టించేందుకే ముఖ్యమంత్రి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ.. అన్నట్లుగా  హస్తిన యాత్ర పెట్టుకున్నారని అంటున్నారు.  అలాగే, కేసీఆర్ ఢిల్లీ టూర్’కు వ్యక్తిగత  కారణం కూడా ఉందని వినవస్తోంది. ముఖ్యమంత్రి సతీమణి శోభ ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారని, ఆ కారణంగా కూడా కొంతకాలం ఢిల్లీలో ఉండేందుకువీలుగా ముఖ్యమంత్రి ఢిల్లీ యాత్ర పెట్టుకున్నారని విశ్వసనీయ వర్గల్ నుంచి వినవస్తోంది.  ఇదలా ఉంటే డిల్లీలో సాగు చట్టాల రద్దుకోసం సంవత్సర కాలంగా ధర్నా చేస్తున్న రైతుల వంక ఇంతకాలంలో ఒక్క సారైనా కన్నెత్తి చూడని కేసీర్ ఇప్పుడు ఆ ఆందోళనలో చనిపోయిన రైతుల కుటుంబాలకు రూ. 3లక్షల వంతున తెలంగాణ ప్రజల సొమ్మును నష్ట పరిహారంగా ప్రకటించారు.నిజానికి, రాష్ట్ర్రంలో కనీసం నష్ట పరిహారానికి నోచుకోని, తెలంగాణ అమరుల కుటుంబాలే 800 పై చిలుకు ఉన్నాయి, ఒకటికి వందసార్లు, 1200 మంది తెలంగాణ బిడ్డలు అతమబలిదానం చేసారని చెప్పుకుని, వారి త్యాగాల ఫలంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడి  ఏడేళ్ళు అయింది. అయినా  ఈ ఏడేళ్ళ కాలంలో అధికార లెక్కల ప్రకారమే రాష్ట్రంలో 750 మందికి పైగా రైతులు ఆత్మ హత్యలు చేసుకున్నారు, ఇంకా ఎందరో నిరుద్యోగ యువకులు ఆత్మహత్యలు చేస్కున్నారు... ఇందులో ఎవరికీ రాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వలేదు. అయిన  ‘అమ్మకు అన్నం పెట్టనోడు, పిన్నమ్మకు  వడ్డాణం చేయిస్తా అన్నట్లుగా,ఉత్తరాది రైతులకు నష్ట పరిహారం ఇస్తాననడం మరింత విడ్డూరంగా  ఉందని అంటున్నారు.

అమరావతికి బీజేపీ సంపూర్ణ మద్దతు.. అంగుళం కూడా కదలబోదన్న సోము

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇచ్చిన క్లాస్ తో ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలకు జ్ఞానోదయం అయింది. తమ పార్టీ అమరావతి మద్దతుగా తీర్మానం చేసినా.. ఇంత కాలం ఉద్యమానికి మద్దతు ఇవ్వలేదు ఏపీ బీజేపీ నేతలు. రాజధాని రైతుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చినా వాళ్లలో చలనం రాలేదు. కాని అమిత్ షా సమావేశంతో సీన్ మారిపోయింది. అమరావతి రాజధానికే కట్టుబడి ఉన్నామన్న అమిత్ షా ఆదేశాలతో సోము వీర్రాజు బృందం పరుగులు పెడుతోంది. ఇప్పటి వరకూ అమరావతి ఉద్యమానికి దూరంగా ఉన్న బీజేపీ ఇప్పుడు సంపూర్ణ మద్దతు పలికింది.  ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుతో పాటు ముఖ్య నేతలు అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఆదివారం ప్రకాశం జిల్లా నుంచి నెల్లూరు జిల్లాలోకి ఎంటరైంది పాదయాత్ర. విజయవాడ నుంచి పురందేశ్వరితో కలిసి వెళ్లిన సోము వీర్రాజు.. నెల్లూరు సరిహద్దులో అమరావతి రైతులను కలిశారు. వారికి మద్దతు తెలుపుతూ కొంత సేపు పాదయాత్రలో పాల్గొన్నారు. సోము వీర్రాజు, పురంధేశ్వరితో పాటు బీజేపీ నేతలు, కార్యకర్తలు అమరావతి రైతులతో కలిసి నడిచారు. ఇక ఎంపీ సుజనా చౌదరి గన్నవరం విమానాశ్రయం నుంచి ర్యాలీగా ఈ యాత్రకు బయలుదేరారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ కాజా నుంచి ఈ యాత్రలో పాల్గొంటుండగా.. మరో ఎంపీ సీఎం రమేష్‌ నేరుగా నెల్లూరు జిల్లా కావలి వద్ద నుంచి రైతులతో కలిసి నడవనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.  రాజధాని అమరావతికి బీజేపీ కట్టుబడి ఉందని ఆ పార్టీ నాయకురాలు పురందేశ్వరి, సోము వీర్రాజు తెలిపారు. అమరావతి నుంచి రాజధాని అంగుళం కూడా కదలదని చెప్పారు. అమరావతికి తాము కట్టుబడి ఉన్నామని గతంలోనే పార్టీ తీర్మానం చేసి తమ అభిప్రాయాన్ని వెల్లడించామని వివరించారు. ఇప్పుడు ప్రత్యక్షంగా రైతుల మహాపాదయాత్రలో పాల్గొంటూ వారికి మరింత అండగా నిలుస్తామని చెప్పారు. శాంతియుతంగా తమ నిరసన తెలియజేస్తోన్న అమరావతి ప్రాంత రైతులపై పోలీసుల ఆంక్షలు, దౌర్జన్యాలు సరికాదన్నారు.  రాజధాని చుట్టూ కేంద్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది.. అభివృద్ధి చేస్తోందన్నారు పురందేశ్వరి. అమరావతి అభివృద్ధికి కేంద్రం రూ.1500 కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు. బీజేపీ సహకరించడం లేదనే మాటలు అవాస్తవమని తెలిపారు. ఏపీకి ఇచ్చే హామీల విషయంలో కేంద్రం ఎక్కడా మడమ తిప్పలేదని, కేంద్రం నిధులతోనే ఏపీలో అభివృద్ధి జరుగుతుందని చెప్పుకొచ్చారు.ఎవరూ ఊహించని విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అనేక విధాలుగా సహకరిస్తోందని తెలిపారు.  రాష్ట్రానికి బీజేపీ సహకరించడం లేదనే మాట అవాస్తవమని వారు చెప్పారు.   తిరుపతి పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా బీజేపీకి చెందిన హేమాహేమీలతో ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను తెలుసుకోవడంతో పాటు.. పార్టీ బలోపేతం ముఖ్యంగా అమరావతి ఉద్యమం గురించి నిశితంగా చర్చించారు. అనంతరం రైతుల పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపాలని రాష్ట్ర నాయకత్వానికి ఆయన ఆదేశించారు. దీంతో బీజేపీ నేతలు ప్రత్యక్షంగా అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొంటున్నారు. 

కేసీఆర్ ను కలిసిన జగన్.. ఏం మాట్లాడుకున్నారో? 

తెలుగు రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్న సందర్భంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుసుకున్నారు. అవును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఓ వివాహ వేడుకల్లో కలుసుకున్నారు. చాలా సేపు ఇద్దరు పక్కపక్కనే కూర్చున్నారు. మాట్లాడుకున్నారు. ఇద్దరి మధ్య గుసగుసలు కూడా నడిచాయి. గతంలో ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత ఉండగా.. ఇటీవల కొంత గ్యాప్ వచ్చినట్లు కనిపించింది. జల వివాదం పై రెండు రాష్ట్రాల మధ్య వార్ నడిచింది. ఏపీ, తెలంగాణ మంత్రులు మాటల యుద్ధానికి దిగారు. పరస్పర సవాళ్లు కూడా విసురుకున్నారు. పాలనపైనా సెటైర్లు వేసుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జగన్, కేసీఆర్ లు కలుసుకోవడం... గుసగుసలు మాట్లాడుకోవడం చర్చనీయాంశంగా మారింది.  తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనవరాలి పెళ్లి శంషాబాద్ లో జరిగింది. ఈ వివాహానికే ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఇద్దరూ ఒకే సమయంలో రావడంతో పక్కపక్కనే కూర్చుకున్నారు. దాదాపు 10 నిమిషాల పాటు ఇద్దరు మాట్లాడుకున్నారు. జగన్ చెవిలో కేసీఆర్ ఏదో చెబుతూ కనిపించారు. జగన్ కూడా కేసీఆర్ ఏదో వివరించారు. ఈ ఘటన వివాహ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఏపీ సీఎం జగన్... కేంద్ర దగ్గర అడుక్కుంటున్నారంటూ వారం రోజుల క్రితం కామెంట్ చేసి కాక రాజేశారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. అయితే వివాహ వేడుకలో ప్రశాంత్ రెడ్డి కూడా జగన్ దగ్గరే ఉన్నారు.  జగన్, కేసీఆర్ లు ఏం మాట్లాడుకున్నారన్నది ఇప్పుడు చర్చగా మారింది. జల వివాదంపై మాట్లాడుకున్నారా? కేంద్రంతో ఎలా వ్యవహరించాలన్న దానిపై చర్చించారా అన్నది ఆసక్తిగా మారింది. శుక్రవారం ఏపీ అసెంబ్లీలో అనూహ్య ఘటనలు జరిగాయి. టీడీపీ చీఫ్ చంద్రబాబును వైసీపీ ఎమ్మెల్యేలు టార్గెట్ చేశారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై అసభ్యంగా మాట్లాడారు. సభలో జరిగిన పరిణామాలపై మనస్తాపం చెందిన చంద్రబాబు.. ప్రెస్ మీట్ లో బోరున విలపించారు. వెక్కి వెక్కి ఏడ్చారు. చంద్రబాబు కన్నీళ్లు పెట్టడం దేశ వ్యాప్తంగా చర్చగా మారింది. వైసీపీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ అంశంపైనా జగన్ తో కేసీఆర్ మాట్లాడారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. మొత్తంగా చాలా రోజుల తర్వాత కేసీఆర్, జగన్ కలుసుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. 

కేసీఆర్ ను కలిసిన జగన్.. అమరావతికి బీజేపీ సంపూర్ణ మద్దతు.. కూన అరెస్ట్.. టాప్ న్యూస్@1PM

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుసుకున్నారు. హైదరాబాద్ శంషాబాద్ లో జరిగిన తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనవరాలి పెళ్లికి సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ హాజరయ్యారు. అక్కడే ఇద్దరు ముఖ్యమంత్రులు కాసేపు పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం తర్వాత జగన్, కేసీఆర్ ఇప్పుడు కలుసుకోవలం చర్చగా మారింది.  ----- రాజధాని రైతులు చేపట్టిన మహాపాదయాత్ర కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి వరకూ ఈ పాదయాత్రకు.. ముఖ్యంగా అమరావతి ఉద్యమానికి దూరంగా ఉన్న బీజేపీ ఇప్పుడు సంపూర్ణ మద్దతు పలికింది.ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, పార్టీ జాతీయ నేతలు పురందేశ్వరి, సత్యకుమార్, ఎంపీలు సీఎం రమేష్, సుజనా చౌదరి రైతుల పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలపనున్నారు. అమరావతే రాజధానిగా ఉంటుందని ఈ సందర్బంగా సోము వీర్రాజు స్పష్టం చేశారు.  -- రాజధాని అమరావతికి బీజేపీ కట్టుబడి ఉందని ఆ పార్టీ నాయకురాలు పురంధేశ్వరి తెలిపారు. రైతులపై దాడులు సరికాదని.. ఈ చర్యలను అందరూ ఖండించాలన్నారు. అమరావతి అభివృద్ధికి కేంద్రం రూ.1500 కోట్లు కేటాయించిందని చెప్పారు. బీజేపీ సహకరించడం లేదనే మాటలు అవాస్తవమని తెలిపారు. ఏపీకి ఇచ్చే హామీల విషయంలో కేంద్రం ఎక్కడా మడమ తిప్పలేదని, కేంద్రం నిధులతోనే ఏపీలో అభివృద్ధి జరుగుతుందని పురంధేశ్వరి చెప్పుకొచ్చారు. ------ ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా 24 మంది చనిపోయారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. బాధితులకు కనీసం ఆహారం, త్రాగునీరు ఇచ్చే దిక్కు కూడా లేదన్నారు. సీఎం జగన్  గాల్లో ఒక రౌండ్ కొట్టొచ్చి కక్ష సాధింపు చర్యల్లో బిజీ అయిపోయారన్నారు. అర్థరాత్రి యుద్ధ వాతావరణం సృష్టించి టీడీపీ సీనియర్ నేత కూన రవికుమార్‌ని అరెస్ట్ చెయ్యడంపై పెట్టిన శ్రద్ధ వాతావరణ శాఖ హెచ్చరికలో లేదన్నారు. ముందస్తు చర్యలు తీసుకొని ఉంటే ఇంత ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగేదికాదని అన్నారు. --------- టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‎ను పోలీసులు అర్ధరాత్రి 12 గంటల సమయంలో అరెస్ట్ చేశారు. టూటౌన్ సీఐ ప్రసాదరావు పట్ల దుర్భాషలాడారంటూ రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన సోదరుడి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గృహ నిర్బంధం చేసిన పోలీసులు ఇంటి తలుపులు బద్దలుకొట్టి రవిని అరెస్ట్ చేశారు. అనంతరం ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్‎కు తరలించారు. అర్ధరాత్రి, అది కూడా తలుపులు బద్దలుకొట్టి అరెస్ట్ చేయడమేంటి..? అని పోలీసుల తీరుపై కుటుంబ సభ్యులు, జిల్లా టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ----------- అర్థరాత్రి తలుపులు పగలగొట్టి కూన రవికుమార్‌ను అరెస్టు చేయాల్సిన అవసరం ఏంటని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. మహిళల్ని కించపరిచే హక్కు వైసీపీకి ఉంటే.. వాటిపై నిరసన తెలిపే హక్కు టీడీపీకి ఉందన్నారు. రవికుమార్‌ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కావాలనే జగన్ ఉద్రిక్తలు సృష్టిస్తున్నారని విమర్శించారు.రదలతో  ప్రజలు ప్రాణాలు పోతుంటే దానిపై దృష్టి పెట్టకుండా టీడీపీ నేతల్ని ఎలా అరెస్టు చేయాలని సీఎం ఆలోచిస్తున్నారని మండిపడ్డారు.  --------- రాజకీయాల కోసం వ్యక్తిత్వ హననం దారుణమని నారా రోహిత్ అన్నారు. నారా వారిపల్లెలో పూర్వీకుల సమాధుల దగ్గర.. నిరసన చేపట్టారు. పెద్దమ్మ ఏనాడూ గడప దాటలేదని, క్రమశిక్షణకు నందమూరి కుటుంబం మారుపేరని అన్నారు. మరోమారు ఇటువంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని వైసీపీ నేతలను హెచ్చరించారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నందమూరి కుటుంబం ఏనాడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదని, నారా రోహిత్ అన్నారు ------ మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబు సతీమణి నారా భువ నేశ్వరిని నిండు సభలో వైసీపీ నేతలు అవమానించడం సిగ్గుచేటని మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ విమర్శించారు. మహిళలను గౌరవించలేని వైసీపీ తీరు నచ్చక ఆ పార్టీని వీడుతున్నట్లు తెలిపారు.గత ఎన్నికల్లో తాను, తన భర్త రెడ్డెప్ప వైసీపీ విజయానికి కృషి చేశామని అయితే, అధికార పార్టీలో ప్రజాస్వామ్యం అభాసుపాలవుతుండటం చూసి  జీర్ణించుకోలేక తాము వైసీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.  --- తెలంగాణ అమరవీరుల కుటుంబాలను గుర్తించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం మీడియా మీట్‎లో ఆయన మాట్లాడుతూ.. అమరవీరుల కుటుంబాలకు ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదని కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం టీఆర్ఎస్ పాలనలో 7,500 మంది రైతులు మృతి చెందారని, బాధిత రైతు కుటుంబాలకు ఇప్పటికీ పరిహారం అందలేదని ప్రశ్నించారు.  --- రైతుల పోరాట ఫలితంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిగొచ్చి, మూడు సాగు చట్టాలను ఉపసంహరిస్తామని చెప్పడంతో పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీకి కొత్త ఉత్సాహం వచ్చింది. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌరుల రిజిస్టర్ (ఎన్ఆర్‌సీ)ల రద్దు కోసం పార్లమెంటులో పట్టుబట్టాలని యోచిస్తోంది. పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల సమయంలో హిందూ ఓట్ల కోసం బీజేపీ, ముస్లిం ఓట్ల కోసం టీఎంసీ వీటిని బాగా ఉపయోగించుకుంది. ---- పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ చైనా వ్యాపార సంస్థలకు గట్టి మద్దతు ప్రకటించారు. తన ప్రభుత్వం చైనా పెట్టుబడిదారులకే పెద్ద పీట వేస్తుందని చెప్పారు. ఇస్లామాబాద్‌లోని ఛాలెంజ్ ఫ్యాషన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన చెన్ యాన్ నేతృత్వంలోని చైనీస్ బిజినెస్ ప్రతినిధి బృందంతో సమావేశం సందర్భంగా ఈ భరోసా ఇచ్చారు. పాకిస్థాన్, చైనాలు గతం, వర్తమానంలోనే కాకుండా భవిష్యత్తులో కూడా కలిసికట్టుగా ఉంటాయన్నారు

సోము వీర్రాజుకు ఉద్వాసన? కొత్త అధ్యక్షుడు ఎవరంటే ..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో బీజేపీ, బలమెంతో,మొన్నటి స్థానిక ఎన్నికల్లో మరో మారు రుజువైంది. కేంద్ర నాయకత్వం ఎంత బూస్ట్ ఇచ్చినా, ఏకంగా కేంద్ర హోమ్ మంత్రి, పార్టీ వ్యూహ కర్త అమిత్ షా దిశా నిర్దేశం చేసినా, ఫలితం మాత్రం శూన్యం. మిత్ర పక్షం  జనసేన కొన్ని జిల్లాల్లో అయినా కొంతవరకు ఉనికిని చాటుకుంది కానీ, కమల దళం మాత్రం ఏ జిల్లాలోనూ  ఉన్నాను అనిపించుకోలేదు. ఇదలా ఉంటే, అమిత్ షా పర్యటన తర్వాత పార్టీలో అంతర్మథనం మొదలైందని అంటున్నారు.  ఏపీ బీజేపీలో ఒక వర్గం పక్కాగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు సిద్డంవుతుంటే, మొదటి నుంచి వైసీపీతో స్నేహ సంబంధాలను కొనసాగిస్త్నున్న మరో వర్గం మాత్రంప ఆద్రిలోనే నడుస్తోంది. ప్రతిపక్షాన్ని విమర్శించడం వలన ప్రయోజనం లేదని రుజువైనా ఇంకా తెలుగు దేశం, చంద్రబాబునే లక్ష్యంగా చేసుకుని, ఫలితంలేని పంథాలో ముందుకు సాగుతోంది కాగా, అమిత్ షా ఆదేశాల మేరకు, ఈ రోజు (నవంబర్ 21) రాజధాని రైతుల మహా పాదయాత్రలో పాల్గొనేందుకువి జయవాడ నుంచి నెల్లూరుకి పార్టీ నేతలు, కార్యకర్తలు బయలు దేరారు.అయితే, పార్టీ రాష్ట్ర శాఖ  అధ్యక్షుడు సోము వీర్రాజు, మరో ముఖ్య నేత విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొనడం లేదు. బీజేపీ రాజ్య సభ సభ్యులు సుజనా చౌదరి, సి.ఎం.రమేశ్‌, పార్టీ మాజే అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, కేంద్ర మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నాయకురాలు  పురందేశ్వరి నెల్లూరులో పాదయాత్రలో  పాల్గొంటున్నారు.  అమిత్ షా రాజధాని రైతుల మహా పాదయాత్ర పార్టీ సంపూర్ణ మద్దతు ఇవ్వడంతో పాటుగా, పార్టీ నాయకులు, కర్యకర్తలు పాదయాత్రలో తప్పక పాల్గొనాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా, సోము వీర్రాజు,ఇతర ముఖ్యనాయకులు, ముఖ్యంగా వైసీపీ అనుకూల వర్గంగా ముద్రపడిన నాయకుల పాదయాత్రలో ఎందుకు పాల్గొనక పోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.ఎందుకు, కొందరు నాయకులు, సాకులు చూపి తప్పించుకుంటున్నారు? అనేది ఇటు పార్టీలో అటు  రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశం  అయింది.  వరుస ఓటములతో పార్టీ క్షేత్ర స్థాయిలో పార్టీ కనుమరుగై పోయిన నేపధ్యంలో   సోము వీర్రాజు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం. అయితే, నిజానికి పార్టీ అధిష్టానమే ఆయన్ని అధ్యక్ష పదవి నుంచి తప్పించే ఆలోచన చేస్తోందని, అందుకే  అయన తనంతట తానుగా బాధ్యతల నుంచి తప్పుకునే నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. అదైన,ఇదైనా సోము వీర్రాజు స్థానంలో ఏపీ బీజేపీ నాయకత్వంలో త్వరలోనే మార్పు తధ్యమని అంటున్నారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి వీర్రాజు శక్తి సామర్ధ్యాలు సరిపోవదం లేదు. మరో వంక ఆయనలోనూ ముందున్న ఉత్సాహం ఇప్పుడు కనిపించడం లేదు. ఫలితంగా  ఏపీలో బీజేపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది.ఇక రాష్ట్రంలో తిరుపతి ఎంపీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికతో  సహా, అన్ని ఎన్నికల్లోనూ బిజెపి చావుదెబ్బ తినడం వంటి కారణాలు సోము వీర్రాజు స్థానంలో వేరే వారికి అవకాశం ఇవ్వాలన్న ఆలోచనకు కారణమయ్యాయని సమాచారం. మరోవంక సోము వీర్రాజు, పార్టీ సీనియర్ నాయకులూ ఎవరూ సహకరించక పోవడం, మిత్రపక్షం జనసేన కూడా రాష్ట్ర నాయకత్వాన్ని కాదని నేరుగా కేంద్ర నాయకత్వంతో సంప్రదింపు జరపడం, రాష్ట్రంలో ఉమ్మడి కార్యాచరణకు కలిసి రాక పోవడం వంటి,అనేక  అవమానకర సంఘటనలు ఎదురవుతున్న పరిస్థితిలో, పొమ్మనేదాకా చూరు పట్టుకుని వేళ్ళాడే కంటే ముందుగ గౌరవప్రదంగా తనంతటతానే పదవినుంచి తప్పుకోవడం ఉత్తమం అనే భావిస్తునట్లు తెలుస్తోంది.  అయితే, ఈసారి ఏపీలో నాయకత్వ మార్పు అంటూ జరిగితే, సోము వీర్రాజుతో పాటుగా, మరో కొందరిపై కూడా వేటు పడడం ఖాయమని  అంటున్నారు. అలాగే, ఈసారి, పార్టీ నాయకత్వ కూర్పులో ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు అధ్యక్ష పదవితో పాటుగా కీలక పదవువులు ఇచ్చే అవకాశం  ఉందని అంటున్నారు. ఏపీలో బీజేపీ ఎదగాలంటే ఇతర పార్టీల సీనియర్ నాయకులను ఆకర్శించక తప్పదని అమిత్ షా ఇప్పటికే స్పష్టం చేశారు. అదే డైరెక్షన్’లో పార్టీని ముందుకు తీసుకుపోయే నేతకే ఈ సారి పార్టీ అధ్యక్ష పదవి దక్కుతుందని అంటున్నారు.

తిండి లేదు.. తాగడానికి మురికినీళ్లే దిక్కు! వరద బాధితులను వదిలేసిన జగన్ సర్కార్ 

కుండపోత వర్షాలు, వరదలతో అల్లాడిపోయిన రాయలసీమలో దారుణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత మూడు రోజులతో పోలిస్తే వర్షాలు తగ్గినా... వరద ముంపు మాత్రం ఇంకా పోలేదు. కడప, చిత్తూరుతో పాటు నెల్లూరు జిల్లాల్లో దుర్భత పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడి వరద బాధిత ప్రాంతాల్లోని పరిస్థితి చూస్తే గుండె చెరువైపోతుంది. వరద బారిన పడిన ప్రజలు కట్టుబట్టలతో మిగిలిపోయారు. చివరికి గూడు కూడా మిగలని కుటుంబాలు ఎన్నో. అక్కడ కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తి స్థాయిలో మెరుగుపడక .. పూర్తి సమాచారం బయటకు రావడం లేదు.  వరద బాధితులు ఆకలితో అలమటిస్తున్నారు. మంచి నీరు దొరక్క మురికినీళ్లతోనే కడుపు నింపుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇంత దుర్భరమైన పరిస్థితి ఉంటే హుటహుటిన స్పందించాల్సిన అధికార యంత్రాంగం జాడ లేకుండా పోయింది.  జరిగేదేదో జరుగుతుందన్నట్లుగా  అధికారులు చూస్తూ ఉండిపోతున్నారు. వరద పరిస్థితిపై మూడు రోజుల ముందుగానే అంచనాలు ఉన్నాప్పటికీ ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. విరుచుకుపడిన తర్వాత కూడా అదే పరిస్థితి. అంతా అయిపోయిన తర్వాత కూడా అదే. అధికారుల నిర్లక్ష్యంతో పోయిన ప్రాణాలు పోగా .. ఎలాగోలా ప్రాణాలు కాపాడుకున్న వారికి ఆకలిదప్పులు తీర్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది.  వరద ప్రాంతాల్లో స్వచ్చంద సంస్థలు చేస్తున్న అరకొర సాయమే ఎక్కువగా ఉంది. ప్రభుత్వం వైపు నుంచి పునరావాస శిబిరాలే అతి తక్కువగా ఉంటే.. అందులోకి తరలించుకు వచ్చిన వారు ఇంకా తక్కువ. వచ్చిన వాళ్లకు కూడా సరిగ్గా ఆహారం అందించడం లేదు. కనీసం మంచి నీళ్లు కూడా అందుబాటులో లేవంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించవచ్చు. తమ ఆస్తులు పొగొట్టుకున్న రోడ్డున పడ్డ బాధితులు.. ఏం చేయోలో తెలియక కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తమకు న్యాయం చేయాలంటూ అనేక చోట్ల ప్రజలు ఆందోళనలకు దిగుతున్నారు. ఇంత దారుణంగా పరిస్థితి ఉంటే ప్రభుత్వం నిమిత్త మాత్రంగా ఉండటం ఏమిటన్న ఆగ్రహం వారిలో కనిపిస్తోంది.  ప్రభుత్వంలోని పై స్థాయి వాళ్లే పెద్దగా పట్టించుకోవడం లేదు. సీఎం జగన్ సొంత జిల్లాలోనూ సహాయ చర్యలకు దిక్కు లేకుండా పోయింజి. దీంతో కింది స్థాయి అధికార యంత్రాగం కూడా అంతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వరద వస్తుంది… పోతుంది అన్న పద్దతిలో ఫిక్సయిపోయారు. అలాగే వచ్చింది.. పోయింది.. కానీ తుడిచిపెట్టుకుపోయిన జీవితాల గురించి మాత్రం ఎవరూ ఆలోచించడం లేదు. ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు ప్రభుత్వాల స్పందన వేరుగా ఉంటుంది. ఇప్పటి వరకూ అఘామేఘాల మీద ప్రజా జీవితాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చే ప్రభుత్వాలను చూశాం కానీ నిమ్మకు నీరెత్తినట్లుగా.., జరగాల్సింది జరుగుతుందన్నట్లుగా చూసే ప్రభుత్వాలను మాత్రం ప్రజలు ఇప్పుడే చూస్తున్నారు.  

అనంతపురం- కడప రాకపోకలు నెల రోజులు బంద్! కూలిన పాపాగ్ని నది వంతెన.. 

రాయలసీమ జిల్లాల్లో వరద బీభత్సం కొనసాగుతోంది. కుండపోత వర్షాలు కొంత తగ్గినా.. వరద ఉధృతి మాత్రం తీవ్రంగానే ఉంది. కడప,  అనంతపురం, చిత్తూరు జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాలో దాదాపు 6 వందల గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. వాగులు, వంకలన్ని పొంగి పొర్లుతూ ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. వరద పోటుకు వందలాది వంతెనలు కుప్పకూలాయి. రహదారులైతే వందల కిలోమీటర్ల మేర ధ్వంసమయ్యాయి. సీఎం జగన్మోరన్ రెడ్డి సొంత జిల్లా కడపలో చరిత్రలో ఎప్పుడు లేనంతగా వరద వచ్చిందని అంటున్నారు.  వరద ఉధృతికి కడప జిల్లా కమలాపురంలో పాపాగ్ని నదిపై ఉన్న వంతెన  అర్ధరాత్రి కుప్పకూలింది. వెలిగల్లు జలాశయం నాలుగు గేట్లు ఏత్తివేయడంతో వరద నీరు పోటెత్తింది. గత రెండు రోజులుగా వంతెన వద్ద ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. నీరు అంచుల వరకు చేరడంతో నానిపోయిన వంతెన.. శనివారం సాయంత్రం నుంచి కొంచెంకొంచెంగా నానుతూ వస్తోంది. ఈ క్రమంలో అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ బ్రిడ్జి అనంతపురం నుంచి కడపకు వెళ్లే జాతీయ రహదారిపై ఉండడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ఈ మార్గంలో వెళ్లాల్సిన వాహనాలను దారి మళ్లిస్తున్నారు. రాకపోకలు పునరుద్ధరించేందుకు నెల రోజులకుపైగా పట్టే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. వరద పూర్తిగా తగ్గాకే మరమ్మత్తు పనులు చేపట్టడం వీలు కానుంది. ఈ నేపథ్యంలో ఈ రహదారి అందుబాటులోకి రావడానికి నెల రోజులకు పైగానే సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

చంద్రబాబుకు రజనీకాంత్ పరామర్శ.. వైసీపీ తీరుపై జాతీయ నేతల ఆగ్రహం

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఫోన్ చేసి పరామర్శించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శుక్రవారం చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరిని లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగతంగా దూషించడంపై రజనీకాంత్ విచారం వ్యక్తం చేశారు.  చంద్రబాబుకు ఫోన్ చేసిన రజనీకాంత్ పరామర్శించారు. ఏపీలో ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు.  చంద్రబాబు భార్యను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత దూషణలకు పాల్పడడంపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబుకు కుటుంబానికి అండగా నిలుస్తున్న పలువురు జాతీయ నేతలు ఏపీ రాజకీయాల్లో ఇలాంటి ఘటనలు దురదృష్టకరమని పేర్కొంటున్నారు. అన్నాడీఎంకే పార్టీ సీనియర్‌ నేత మైత్రేయన్‌ కూడా చంద్రబాబుకు ఫోన్‌ చేసి మాట్లాడారు. అనంతరం, ‘నాకు 1984 నుంచి ఎన్టీఆర్‌ కుటుంబంతో పరిచయాలు ఉన్నాయి. ఎన్టీఆర్‌ కుమార్తె భువనేశ్వరిపై అసెంబ్లీలో వ్యక్తిగత దూషణలు చేశారని విని బాధపడ్డాను. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాను. చంద్రబాబుకు  ఫోన్‌ చేసి మాట్లాడాను’ అని మైత్రేయన్‌ ట్వీట్‌ చేశారు. 

గత 30 ఏండ్లలో అతిపెద్ద వర్షం.. టీటీడీకి రూ.4 కోట్ల నష్టం

రాయలసీమలో వరద బీభత్సం కొనసాగుతోంది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరదలు తీవ్ర స్థాయిలో పోటెత్తాయి. వరదలతో రాయలసీమ అల్లాడిపోయింది. తిరుపతిలోనూ గతంలో ఎప్పుడు లేనంతగా వరద బీభత్సం కనిపించింది. గత 30 సంవత్సరాల్లో ఇంత భారీ వర్షం కురవలేదని, భారీ వర్షాలతో టీటీడీకి రూ 4 కోట్లకుపైగా నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు.   భారీ వర్షాలకు శేషాచలం కొండల్లోని డ్యాములు, చెక్ డ్యామ్ లు పొంగి పొర్లాి,  కపిలతీర్థం జలపాతం గుండా తిరుపతి నగరంలోకి వరద ప్రవేశించింది. తిరుమల మొదటి ఘాట్ రోడ్ లోని అక్కగార్ల గుడి వద్ద రక్షణగోడ దెబ్బతిన్నది.  ఘాట్ రోడ్ లో నాలుగు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగి పడ్డాయి.రెండవ ఘాట్ రోడ్ లో 13 ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడ్డాయి. టిటిడి సిబ్బంది, అధికారులు యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగి తాత్కాలిక రక్షణ ఏర్పాట్లతో ట్రాఫిక్ ను పునరుద్ధరించారు.  తిరుమల నారాయణగిరి గెస్ట్ హౌస్ ను ఆనుకొని ఉన్న రక్షణ గోడ పడిపోవడంతో మూడు గదులు దెబ్బతిన్నాయి. అధికారులు నారాయణ గిరి, ఎస్వీ అతిథి గృహాల్లోని యాత్రికులను ముందు జాగ్రత్త గా ఇతర ప్రాంతాలకు తరలించారు.. శ్రీవారి మెట్టు మార్గంలో కొంతమేరకు రోడ్డు, కొంతమేరకు ఫుట్ పాత్ భారీ వర్షాలకు దెబ్బ తిన్నాయి. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం వెనుక వైపు ఉన్న గోడతో పాటు, రాంనగర్, వినాయక నగర్, జిఎంబి క్వార్టర్స్,  శ్రీనివాసం విశ్రాంతి గృహం కాంపౌండ్ వాల్స్ దెబ్బ తిన్నాయి.కపిలతీర్థం ఆలయంలో ఒక మండపం వర్షాలకు దెబ్బతింది.దీని మరమ్మతులకు 70 లక్షల రూపాయలు ఖర్చు కావచ్చని అధికారులు అంచనా వేశారు.. వర్షం వల్ల టీటీడీ సర్వర్లు దెబ్బతిని సేవలకు అంతరాయం కలిగింది. ఐటి విభాగం అధికారులు, సిబ్బంది వెంటనే పునరుద్ధరించి భక్తుల సేవలకు ఇబ్బంది లేకుండా చేశారు. స్వామి వారి దర్శనం కోసం వచ్చి భారీ వర్షాల కారణంగా తిరుపతిలో ఆగిపోయిన భక్తులకు శ్రీనివాసం, మాధవం, రెండు మరియు మూడో సత్రాల్లో వసతి, ఆహారం ఏర్పాటు చేశారు. టికెట్లు ఉండి దర్శనానికి రాలేక పోయిన భక్తులను వర్షాలు తగ్గాక స్వామివారి దర్శనానికి అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు.తిరుమల, తిరుపతిలో దెబ్బతిన్న రోడ్లు, ఇతర మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి యాత్రికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని టీటీడీ అధికారులు చెబుతున్నారు

వరదల్లోనూ కక్ష రాజకీయాలా..! అర్ధరాత్రి కూన రవికుమార్ అరెస్ట్..  

ఆంధ్రప్రదేశ్ లో విపక్ష నేతల అరెస్టులు కొనసాగుతున్నాయి. ఓ వైపు భారీ వర్షాలు, వరదలతో రాయలసీమ జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి లక్షలాది మంది జల దిగ్బంధంలో చిక్కుకుని అల్లాడిపోతున్నారు. ఇలాంటి సమయంలో వరద సహాయక చర్యలపై దృష్టి సారించాల్సిన జగన్ సర్కార్... అది చేయకుండా టీడీపీ నేతలను టార్గెట్ చేయడంపైనే ఫోకస్ చేసినట్లు కనిపిస్తోంది.  శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రభుత్వ మాజీ విప్, తెలుగు దేశం పార్టీ నేత కూన రవికుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం   శాంతినగర్‌ కాలనీలోని ఆయన సోదరి ఇంట్లో ఉన్న రవికుమార్‌ను శనివారం అర్థరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో రవికుమార్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు ఎచ్చెర్ల పోలీసు స్టేషన్‌కు తరలించించారు..అర్థరాత్రి పూట రవికుమార్ ఇంతటితో పాటు, ఆయన సోదరుడు కూన సత్యారావు ఇళ్లల్లో కూడా సోదాలు నిర్వహించారు పోలీసులు. కూన రవికుమార్ సోదరి ఇంట్లో  ఉన్నారన్న పక్కా సమాచారంతో ఇంటిని చుట్టుముట్టి, ఓ హై డ్రామా మధ్య అరెస్టు చేశారు.  శనివారం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన భార్య పై అసెంబ్లీ సాక్షిగా వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో నిరసన కోసం బయలుదేరిన సమయంలో హౌస్ అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులపై దురుసుగా వ్యవహరించారని.. కూన రవికుమార్ పై టూ టౌన్ సిఐ ఫిర్యాదు మేరకు అరెస్టు చేసినట్లు సమాచారం. కూర రవికుమార్ ను అరెస్ట్ చేయడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి పూట పోలీసులు దౌర్జన్యం చేశారని, దురుసుగా వ్యవహరించారని ఆరోపించారు. వరదలతో జనాలు అల్లాడుతున్నా పట్టించుకోకుండా టీడీపీ నేతలను అరెస్ట్ చేస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు తమ్ముళ్లు.

ఢిల్లీకి చేరిన వరి యుద్ధం.. మోడీతో తేల్చుకుంటానంటున్న సీఎం 

తెలంగాణలో కొన్ని రోజులుగా ప్రకంపనలు రేపుతున్న వరి ధాన్యం కొనుగోలు యుద్దం ఢిల్లీకి చేరుతోంది. తెలంగాణ వరి ధాన్యం కొంటారో లేదో చెప్పాలంటూ కేంద్రానికి రెండు రోజుల డెడ్ లైన్ విధించిన కేసీఆర్.. ఆ గడువు ముగియడంతో మరోసారి మీడియా ముందుకు వచ్చారు. తమ డిమాండ్ పై కేంద్రం నుంచి స్పందన రాలేదని చెప్పారు. యాసంగిలో ధాన్యం కొనుగోలుతో కేంద్రంతో తేల్చుకుంటామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. చివరి ప్రయత్నంగా ఆదివారం ఢిల్లీకి వెళ్లి కేంద్రమంత్రులను కలుస్తామని ప్రకటించారు. అవకాశం ఉంటే ప్రధాని మోదీని కూడా కలుస్తామని తెలిపారు.  వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం సరైన స్పష్టత ఇవ్వడం లేదని సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నిసార్లు డిమాండ్‌ చేసినా కేంద్రం స్పందించడం లేదని దుయ్యబట్టారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరిని ఎండగట్టారు గులాబీ బాస్.  తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వరిధాన్యం కొనుగోలు మీద జరుగుతున్న వ్యవహారంలో ఎన్నిసార్లు నిరంతరంగా డిమాండ్‌ చేసినా కేంద్రం నుంచి ఉలుకూ లేదు పలూకు లేదని చెప్పారు. ఎటువంటి సమాధానం కూడా వస్తలేద్ననారు. అన్ని రాష్ట్రాల నుంచి ధాన్యం సేకరించినట్లే తెలంగాణ నుంచి సేకరించాలని అన్నారు కేసీఆర్. వచ్చే సంవత్సరం టార్గెట్‌ వెంటనే ఇవ్వాలన్నారు, కేంద్రం ఇచ్చే టార్గెట్ ను బట్టి రాష్ట్రంలో సర్దుబాటు చేయాల్సి ఉంటుందని కేసీఆర్ చెప్పారు. దీనిపై కేంద్రానికి ఎన్ని సార్లు చెప్పినా సరైన పద్ధతుల్లో రావడం లేదన్నారు. సాగు చట్టాలను వెనక్కి తీసుకోవడంపై కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. అయితే పై ప్రధాని మోడీ క్షమాపణ చెప్తే సరిపోదన్నారు. రైతులపై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. చనిపోయిన రైతుల కుటుంబాలకు కేంద్ర సర్కార్ రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి చనిపోయిన ఒక్కో రైతు కుటుంబానికి మూడు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు కేసీఆర్. 

నీరో చక్రవర్తి.. వైసీపీకి చుక్కలే.. ఎన్టీఆర్ కు క్లాస్.. ఢిల్లీకి సీఎం.. టాప్ న్యూస్@7PM

సీఎం జ‌గ‌న్ ఏరియ‌ల్ స‌ర్వే పేరుతో గాల్లో తిరుగుతున్నార‌ని, నేల‌కు దిగితే జ‌నం వ‌ర‌ద క‌ష్టాలు క‌నిపిస్తాయ‌ని టీడీపీ నేత నారా లోకేష్ సూచించారు. రోమ్ త‌గ‌ల‌బ‌డుతుంటే నీరో చ‌క్ర‌వ‌ర్తి ఫిడేలు వాయించుకుని శాడిస్టిక్ ఆనందం పొందార‌ని మ‌నం చ‌రిత్ర పుస్త‌కాల‌లో చ‌దువుకున్నామ‌ని తెలిపారు. ఇప్పుడు నీరోకి మ‌రో రూపమైన జ‌గ‌న్‌రెడ్డిని ప్ర‌త్య‌క్షంగా చూస్తున్నామ‌న్నారు. రాయ‌ల‌సీమ మొత్తం అకాల‌వ‌ర్షాల‌కు అల్ల‌క‌ల్లోల‌మైతే క‌నీసం అటువైపు క‌న్నెత్తి చూసే ఆలోచ‌న కూడా జ‌గ‌న్‌రెడ్డికి రాలేద‌ని తప్పుబట్టారు.  ------- అసెంబ్లీలో శుక్రవారం మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబంపై వైసీపీ ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై నందమూరి కుటుంబం తీవ్రంగా స్పందించింది. చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి అండగా నందమూరి కుటుంబం నిలిచింది. శనివారం మీడియా సమావేశంలో తమ మనోభావాలను వ్యక్తం చేశారు. జరిగిన పరిణామాలు దురదృష్టకరమైనవని వారు అన్నారు. వ్యక్తిగత అజెండాగా పెట్టుకుని వైసీపీ నేతలు మాటల దాడి చేశారని మండిపడ్డారు.  ------ ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనపై టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి గురించి తప్పుగా మాట్లాడిన వారికి పుట్టగతులు ఉండవని అన్నారు. ఎన్టీఆర్ కుమార్తె గురించి వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను చూసి సభ్యసమాజం తలదించుకుంటోందని అన్నారు. త్వరలోనే వైసీపీ నేతలకు అసలు సినిమా చూపిస్తామని చెప్పారు. -------- జూనియర్ ఎన్టీఆర్ ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనపై స్పందించారు. రాజకీయాల్లో విమర్శలు చేసుకోవడం సర్వసాధారణమని, విమర్శలు ప్రజాసమస్యలపైనే జరగాలన్నారు. వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. ముఖ్యంగా మన ఆడపడుచుల గురించి పరుషపదజాలంతో మాట్లాడడం అరాచక పరిపాలనకు నాంది పలుకుతుందన్నారు --------- జూనియర్‌ ఎన్టీఆర్‌పై టీడీపీ నేతలు, శ్రేణులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఏపీ అసెంబ్లీలో వైసీపీ నేతలు నారా భువనేశ్వరిని ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఇలాగేనా స్పందించేది అని దుమ్మెత్తిపోస్తున్నారు. మీ మేనత్త భువనేశ్వరిని అనకూడని మాటలు అని మానసిక క్షోభకు గురిచేస్తే.. చంద్రబాబు నాయుడు కన్నీరు మున్నీరుగా విలపిస్తే జూనియర్ ఎన్టీఆర్‌కు చీమైనా కుట్టలేదా? అని ప్రశ్నిస్తున్నారు.  --- జూనియర్ ఎన్టీఆర్‌పై అభిమాని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కుటుంబంపై ఏపీ అసెంబ్లీలో జరిగిన తీరుపై జూనియర్ ఎన్టీఆర్ సరిగా స్పందించలేదని అన్నారు. అసలు స్పందించకుండా ఉంటే బాగుండేదని సూచించారు. ఎన్టీఆర్ అనే పదంతో పేరు ప్రతిష్టలు సంపాదించిన తమరు స్పందించిన తీరు బాగోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘కర్ర విరగదు.. పాము చావదు’ అనే సామెతగా జూనియర్ ఎన్టీఆర్ స్పందన ఉందని అభిమాని క్లాస్ తీసుకున్నారు.  ------- యాసంగిలో ధాన్యం కొనుగోలుతో కేంద్రంతో తేల్చుకుంటామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. చివరి ప్రయత్నంగా మరోసారి ఢిల్లీకి వెళ్తున్నామని చెప్పారు..ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరిని ఎండగట్టారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వరిధాన్యం కొనుగోలు మీద జరుగుతున్న వ్యవహారంలో ఎన్నిసార్లు నిరంతరంగా డిమాండ్‌ చేసినా కేంద్రం నుంచి ఉలుకూ లేదు పలూకు లేదు. ఎటువంటి సమాధానం కూడా వస్తలేదు ------- మంబయి క్రూయిజ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్ కు బాంబే హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ సంబంధిత నేరాలకు పాల్పడినట్టు ఎలాంటి సానుకూల ఆధారాలు లేవని న్యాయస్థానం స్పష్టం చేసింది. అరెస్టయిన సమయంలో ఇచ్చిన వాంగ్మూలాలు చెల్లుబాటు కావని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరోకు తేల్చి చెప్పింది. ----- చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ధోనీ, చెన్నై జట్టు యజమాని శ్రీనివాసన్ ఐపీఎల్ ట్రోఫీని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కు అందించారు.ఈ సందర్భంగా ధోనీని, చెన్నై సూపర్ కింగ్స్ జట్టును, ఫ్రాంచైజీ యాజమాన్యాన్ని సీఎం స్టాలిన్ అభినందించారు. ధోనీ జార్ఖండ్ కు చెందినవాడే అయినా తమిళనాడు ప్రజల కోసం వచ్చినట్టుందని వ్యాఖ్యానించారు. ------- సినీ దర్శకుడు సురేందర్ రెడ్డి కరోనా బారిన పడ్డారు.'ఏజెంట్' సినిమా కోసం సురేందర్ రెడ్డి యూరప్ కు వెళ్లారు. ప్రస్తుతం యూరప్ లో కరోనా కేసులు పెద్ద సంఖ్యలోనే నమోదవుతున్న సంగతి తెలిసిందే. అక్కడే ఆయన కరోనా బారిన పడడంతో అక్కడే సెల్ఫ్ క్వారంటైన్ లో వున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.  -------

నందమూరి వంశంలో పుట్టలేదా?.. పౌరుషం ఏమైంది?...

జూనియర్‌ ఎన్టీఆర్‌పై టీడీపీ నేతలు, శ్రేణులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఏపీ అసెంబ్లీలో వైసీపీ నేతలు నారా భువనేశ్వరిని ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఇలాగేనా స్పందించేది అని దుమ్మెత్తిపోస్తున్నారు. మీ మేనత్త భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని కించపరిస్తే స్పందించే తీరు ఇదేనా అంటూ నిప్పులు చెరుగుతున్నారు. భువనేశ్వరిని అనకూడని మాటలు అని మానసిక క్షోభకు గురిచేస్తే.. ఆమె భర్త, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కన్నీరు మున్నీరుగా విలపిస్తే జూనియర్ ఎన్టీఆర్‌కు చీమైనా కుట్టలేదా? అని ప్రశ్నిస్తున్నారు. నందమూరి వంశంలో జూనియర్‌ పుట్టలేదా? అని నిలదీస్తున్నారు. నందమూరి తారక రామారావు పేరు వాడుకుంటూ, ఆయన వారసత్వాన్ని అనుభిస్తూ.. ఆయన కుమార్తెను కించపరిస్తే నీకు ఎందుకు పౌరుషం రాలేదని ప్రశ్నిస్తున్నారు. మీ మేనత్తను అవమానించిన వారిపై స్పందించే తీరిదేనా అని తూర్పారపడుతున్నారు. అసలు గుడివాడలో, గన్నవరంలో నీ మిత్రులకు టీడీపీ టిక్కెట్లు ఇప్పించుకోడానికి చంద్రబాబును జూనియర్‌ ఎన్టీఆర్‌ ఎంతలా పీడించిందీ ఆ పార్టీ శ్రేణులు గుర్తుచేసుకుంటున్నారు. నిజానికి టీడీపీని వాడేసుకుంటున్నదే జూనియర్ ఎన్టీర్‌ అని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు జూనియర్ ఎన్టీఆరే కొందరి చేత మేనత్తను, మేనమామను వెనక ఉండి మరీ తిట్టిస్తున్నారనే అనుమానాలు టీడీపీ కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీలో తన మేనత్తపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఇంత సమయం గడిచే వరకు జూనియర్ ఎన్టీఆర్ స్పందించకుండా జాప్యం చేయడం పైనా టీడీపీ శ్రేణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏపీ అసెంబ్లీలో శుక్రవారం జరిగిన సంఘటనపై అన్ని వర్గాల వారు, ఆడపడుచులు తీవ్రంగా స్పందిస్తుంటే జూనియర్ ఎన్టీఆర్‌ మాత్రం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు ఉండాల్సి వచ్చిందని నిలదీస్తున్నారు. వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలపై నందమూరి కుటుంబంలోని ప్రతి ఒక్కరూ స్పందించినా మీరెందుకు బయటికి రాలేదంటున్నారు. నందమూరి ఫ్యామిలోని ఏనాడూ మీడియాలోకి రాని వ్యక్తులు కూడా తమ ఇంటి ఆడబిడ్డకు జరిగిన అవమానంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తుంటే.. మీరు తక్షణమే స్పందించకపోవడానికి కారణం ఏమిటని అడుగుతున్నారు. చివరికి తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా వైసీపీ నేతలు చేసింది తప్పు అని డైరెక్ట్‌గా ఖండించారు కదా.. మీకేమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. కర్ర విరగకుండా.. పాము చావకుండా అన్న చందంలో జూనియర్ ఎన్టీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా ఎందుకు వీడియో విడుదల చేయాల్సి వచ్చిందని టీడీపీ శ్రేణులు, నేతలు నిలదీస్తున్నారు.

కారు కూతలు.. బడాయి మాటలు! క్రెడిట్ అంతా కేసీఆర్ దేనట..

కేంద్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుందో ఏమో కానీ, ఇక్కడ హైదరబాద్’లో అధికార తెరాస మహా ధర్నా నిర్వహించిన మర్నాడే, ఎంతో కాలంగా వివాదస్పదంగా ఉన్న సాగు చట్టాలను రద్దు చేయాలనే నిర్ణయాన్ని తీసుకుంది. ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ గురునానక్ జయంతి సందేశంతో పాటుగా సిక్కులకు ఈ శుభ వార్త కూడా అందించారు. అయితే, హైదరబాద్’లో తెరాస నిర్వహించిన మహా ధర్నాకు, ఈ సందర్భంగా తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ పాసింగ్ కామెంట్స్’గా ఉత్తరాది రైతులు సాగు చట్టాలకు వ్యతిరేకంగా డెల్లి వేదికగా చేస్తున్న ఆందోళనకు సంబంధించి చేసిన వ్యాఖ్యలకు మధ్య గొప్ప సంబంధం ఏదో ఉందని అనుకోలేము. ఇవే వివాదాస్పద చట్టాలకు సంబంధించి, గతంలోనూ తెరాస రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసింది. కేటీఆర్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర కీలక నేతలంతా ధర్నా, రాస్తా రోకో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి వచ్చిన వెంటనే ఇవే వివాదస్పద చట్టాలకు తెరాస మద్దతు పలికింది.ముఖ్యమంత్రి అక్కడ ఫస్ట్ యూ టర్న్ తీసుకున్నారు. అంతేకాదు, పార్లమెంట్ ఉభయసభల్లోనూ తెరాస ఎంపీలు వ్యవసాయ  బిల్లుల (సాగు చట్టాల)కు మద్దతు తెలిపారు. స్వయంగా ముఖ్యమంత్రి చట్టాలను మెచ్చుకున్నారు. ఇదంతా చరిత్ర.  అయితే హుజూరాబాద్’ ఓటమి షాక్ నుంచి బయటపడేందుకు, ఈ సందర్భంగా  ఇచ్చిన దళిత బందు హామీ నుంచి రాజకీయ చర్చను పక్కదారి పట్టించేందుకు  ముఖ్యమంత్రి వరి వివాదాన్ని తెరమీదకు తెచ్చారు. భారీ డైలాగ్స్’ పోగేసి  బ్రహ్మాండం బద్దలు చేస్తున్న భ్రమలను సృష్టించారు, ఈ ‘వరి ఉరి’ పోరాటంలో భాగంగా నిర్వహించిన మహాధర్నాలో మరో మారు కేసీఆర్ మరో యూ టర్న్, తీసుకున్నారు.ఈసారి, చట్టాలను వ్యతిరేకించారు. గతం మొత్తాన్ని పక్కన పెట్టి కొత్త స్వరం ఎత్తుకున్నారు. అదలా ఉంటే, యాదృచ్చికంగా, వచ్చిన చట్టాల రద్దు ప్రకటన తమ ఖాతాలో వేసుకోవాలని, తెరసా మంత్రులు, ఇతర నాయకులు ఆ విధంగా ముఖ్యమంత్రిని పొగడ్తలతో ముంచెత్తే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రులు ఎర్రబెల్లి, నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి ఇలా ఒకరి వెంట ఒకరు, టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన మహాధ‌ర్నాతోనే కేంద్రం రైతు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేసిందని చంకలు గుడ్డుకకున్నారు. తాజాగా  తెరాస అధికార ప్రతినిధి, అరుపుల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అయితే, జాతీయ స్థాయిలో తమకు  పోటీగా కేసీఆర్ నిలుస్తారని భయపడే మోడీ అఘమేఘాల మీద రద్దు నిర్ణయం తీసుకున్నారని, నమ్మించేందుకు చాలా శ్రమ తీసుకున్నారు.  ముఖ్యంత్రి రెండు గంటలు ధర్నాలో కూర్చుంటేనే. మోడీ గజగజ వణికి పోయి చట్టాల రద్దు నిర్ణయం తీసుకున్నారని తెరాస నేతలు చప్పట్లు కొట్టు కున్నారు.  అయితే వాస్తవం అది కాదు. మహా ధర్నాకు మోడీ నిర్ణయానికి మోకాలుకు బోడి గుండుకు ఉన్న సంబంధం కూడా లేదు. అది యాదృచ్చికంగా జరిగిన సంఘటన.   నిజానికి, త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్ననేపధ్యంలో ఢిల్లీ రైతుల సుదీర్ఘ ఆందోళనలో కీలక భూమిక పోషిస్తున్న పంజాబ్ రైతులను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాని గురునానక్ జయంతిని సాగు చట్టాల రద్దు ప్రకటనకు ముహూర్తంగా ఎంచుకున్నారు. అందుకే , గురునానక్ జయంతి సుభాకంశాలతో పాటుగానే చట్టాల రద్దు ప్రకటన చేశారు. మహా ధర్నా , గురునానక్ జయంతి పక్కపక్కన రావడం యాదృచ్చికం .. ఆ యాదృచ్చిక సంఘటన ఆధారంగా తెరాస నాయకులూ ఇంట హడావిడి చేస్తున్నారంటే, గులాబీ పార్టీ  రాజకీయంగా ఎంతగా దివాలా తీసిందో అర్తంచేసుకోవచ్చని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.  అయితే అధికార పార్టీ ఇలా దివాలకోరు రాజకీయ పంథాను ఎంచుకోవడానికి కారణం లేక పోలేదని పరిశీలకులు భావిస్తున్నారు. దళిత బంధును  పక్కన పెట్టినా, రైతుల వద్ద నుంచి కొనవలసిన వడ్లను కొనే పరిస్థితి లేక కేంద్రం ఇచ్చిన వివరణతో తప్పించుకునే మార్గం లేక ... తెరాస నాయకులు సొంత డప్పు కొట్టుకుంరున్నారని అంటున్నారు.