జ‌గ‌న్‌పై చిరంజీవి తిరుగుబాటు!.. టికెట్ ధ‌ర‌ల‌పై తెగింపు!

సీఎం జ‌గ‌న్‌రెడ్డిపై చిరంజీవి తిరుగుబాటు బావుటా ఎగ‌రేశారు. ఆన్‌లైన్ టికెటింగ్‌ను స‌మ‌ర్థిస్తూనే.. టికెట్ ధ‌ర‌లు త‌గ్గించ‌డాన్ని మాత్రం త‌ప్పుబ‌ట్టారు. దేశ‌మంతా ఓ లెక్క‌.. మీరు మ‌రోలెక్క‌.. వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ విమ‌ర్శించారు. సినీ ప‌రిశ్ర‌మ‌కు మేలు చేయాల‌ని.. థియేట‌ర్ల మ‌నుగ‌డ కాపాడాల‌ని.. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డికి ట్విట్ట‌ర్‌లో చిరంజీవి విజ్ఞ‌ప్తి చేశారు. చాలా జాగ్ర‌త్త‌గా.. బాగా ఆలోచించి.. ఏరికూరి ప‌దాలు వాడుతూ.. సీఎం జ‌గ‌న్‌ను నేరుగా విమ‌ర్శించ‌కుండా.. ప‌రోక్షంగా ఆయ‌న విధానాన్ని తీవ్రంగా త‌ప్పుబ‌ట్టేలా.. మెగాస్టార్ వ్యూహాత్మ‌కంగా ఈ ట్వీట్ చేశార‌ని తెలుస్తోంది. ప‌దాలు పాజిటివ్‌గా ఉన్నా.. మీనింగ్ మాత్రం జ‌గ‌న్‌ను మెయిన్‌గా టార్గెట్ చేస్తోంది. మెగాస్టార్ నుంచి ఇలాంటి ట్వీట్‌.. జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి, వైసీపీకి ఊహించ‌ని షాక్ అనే చెబుతున్నారు. థియేట‌ర్ల‌పై ఇటీవ‌ల దూకుడుగా, టార్గెటెడ్‌గా వెళ్తున్న ఏపీ స‌ర్కారుకు ఇన్నాళ్లూ వంత‌పాడుతూ వ‌చ్చిన మెగాస్టార్‌.. స‌డెన్‌గా ప్ర‌భుత్వ త‌ప్పుల‌ను సుతిమెత్త‌గా, నేరుగా ఎత్తి చూప‌డం సంచ‌ల‌నంగా మారింది. జ‌గ‌న్‌రెడ్డి-చిరంజీవిల మ‌ధ్య ఇటీవ‌ల స‌త్సంబంధాలు ఏర్ప‌డ్డాయి. మెగాస్టార్ దంప‌తులు తాడేప‌ల్లి ప్యాలెస్‌కు వెళ్లి మ‌రీ జ‌గ‌న్ ఫ్యామిలీని క‌లిశారు. విందు భోజ‌నం చేశారు. ఆ త‌ర్వాత చిరంజీవితో స‌హా టాలీవుడ్ పెద్ద‌లంతా ప‌లుమార్లు సీఎం జ‌గ‌న్‌రెడ్డితో స‌మావేశ‌మ‌య్యారు. అంతవ‌ర‌కూ బాగానే ఉంది. ఆ త‌ర్వాతే విష‌యం బెడిసికొట్టింది. బ‌య‌ట‌కు చెప్పుకోలేక‌పోతున్నా.. జ‌గ‌న్ స‌ర్కారు చేస్తున్న టార్చ‌ర్‌కు సినీ ప‌రిశ్ర‌మ విల‌విల్లాడిపోతోంద‌ని అంటున్నారు. అందుకే, ఈమ‌ధ్య ఓ ఫంక్ష‌న్‌లో.. సీఎం జ‌గ‌న్‌ను బ‌హిరంగంగానే వేడుకున్నారు చిరంజీవి. ప్లీజ్‌.. ద‌య‌చేసి.. ప‌రిశ్ర‌మ‌ను కాపాడండి.. మా విన్న‌పాలు నెర‌వేర్చండి అంటూ.. కాళ్ల మీద ప‌డినంత ప‌ని చేశారు. ఓవైపు త‌మ్ముడు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌.. జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి, మంత్రి పేర్ని నానికి త‌లంటుతుంటే.. అన్న‌య్య మాత్రం ఇలా రిక్వెస్ట్ మోడ్‌లో విజ్ఞ‌ప్తులు చేస్తూ.. జ‌గ‌న్‌రెడ్డిపై నాటు-నీటుగా ఒత్తిడి పెంచారు.  ఎన్టీఆర్ తో మాకేం సంబంధం.. కొడాలి నాని హాట్ కామెంట్స్ అయినా.. అన్న‌ద‌మ్ముల ప్ర‌య‌త్నాలు ఏమాత్రం స‌ఫ‌లం కాలేదు. ఏపీలో ఆన్‌లైన్ టికెటింగ్‌తో పాటు బెనిఫిట్స్ షోలు ర‌ద్దు చేయ‌డం.. టికెట్ ధ‌ర‌ల‌ను ప్ర‌భుత్వ‌మే నిర్ణ‌యించేలా.. స‌వ‌ర‌ణ బిల్లు తీసుకురావ‌డంతో.. టాలీవుడ్‌తో పాటు మెగా బ్ర‌ద‌ర్స్ ఉలిక్కిప‌డ్డారు. త్వ‌ర‌లోనే ఇటు భీమ్లా నాయ‌క్‌.. అటు ఆచార్య.. రిలీజ్ కాబోతున్నాయి. స‌ర్కారు నిర్ణ‌యం ఆ సినిమా క‌లెక్ష‌న్ల‌పై తీవ్ర ప్ర‌భావం చూప‌డం ఖాయం. అందుకే, చిరంజీవి మ‌రోసారి జ‌గ‌న్‌కు రిక్వెస్ట్ పంపించారు. మున‌ప‌టిలా బాబ్బాబు.. అనే త‌ర‌హాలో కాకుండా.. ఇది క‌రెక్ట్ కాదు.. టికెట్ ధ‌ర‌లు ప్ర‌భుత్వమే నిర్ణ‌యించ‌డ‌మేంటి? అదెలా కుదురుతుంది? ఇంత న‌ష్టం జ‌రుగుతుంది.. ఇన్ని కుటుంబాలు రోడ్డున ప‌డుతాయి.. అనే ప‌దాలు వాడ‌కుండా.. అదే అర్థం వ‌చ్చాలా.. నీట్‌గా ట్వీట్ చేశారు ఆచార్య‌. ఈ ట్వీట్‌ను బ‌ట్టి.. జ‌గ‌న్‌రెడ్డిని టాలీవుడ్ దోషిగా చూస్తోందని తేలిపోతోంది. అందుకే, చిరంజీవి ట్వీట్‌.. వైసీపీని షేక్ చేస్తోంది. మెగాస్టార్ ర‌ఫ్ఫాడించారంటూ ఇండ‌స్ట్రీ విజిల్స్ వేస్తోంది. మ‌రి, జ‌గ‌న్‌రెడ్డి రియాక్ష‌న్ ఎలా వ‌స్తుందో చూడాలి...  

ఎన్టీఆర్ తో మాకేం సంబంధం.. కొడాలి నాని హాట్ కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు జూనియర్ ఎన్టీఆర్ సెంటర్ గా హాట్ హాట్ గా సాగుతున్నాయి. అసెంబ్లీలో చంద్రబాబు ఫ్యామిలీ టార్గెట్ గా వైసీపీ నేతలు కామెంట్లు, చంద్రబాబు ఏడుపు అంశాలపై జూనియర్ స్పందనపై టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఎన్టీఆర్ తీరు సరిగా లేదంటూ  ఓపెన్ గానే వ్యాఖ్యానించారు టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. మరికొందరు నేతలు కూడా  తన మేనత్తకు అవమానం జరిగినా ఎన్టీఆర్ సరిగా స్పందించలేదని అన్నారు. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వంశీ తన మిత్రులు కావడం వల్లే ఎన్టీఆర్ వైసీపీని టార్గెట్ చేయలేదనే విమర్శలు టీడీపీ నేతల నుంచి వచ్చాయి. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ విషయంలో మాట్లాడారు మంత్రి కొడాలి నాని. జూనియర్ ఎన్టీఆర్‌కు తమకు సంబంధం ఏమిటి? అని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘ఒకప్పుడు కలిసి ఉండొచ్చు. ఇప్పుడు విడిపోయాం. ఆయన చెబితే మేమెందుకు వింటాం? ఇప్పుడు నేను, వంశీ జగన్‌తో ఉన్నాం. ఆయన కోసం పని చేస్తున్నాం’’ అని కొడాలి నాని వెల్లడించారు జ‌గ‌న్‌పై చిరంజీవి తిరుగుబాటు!.. టికెట్ ధ‌ర‌ల‌పై తెగింపు! ఎన్టీఆర్ కుటుంబం మద్దతు కోసం చంద్రబాబు ఆయన భార్యను రోడ్డు మీదకు లాగారని కొడాలి అన్నారు. గొర్రె కసాయిని నమ్మినట్లు నందమూరి కుటుంబం చంద్రబాబును నమ్ముతూనే ఉందని కొడాలి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కుటుంబం మాటలు చూస్తే తనకు జాలేసిందని కొడాలి ఎద్దేవా చేశారు. జగన్‌ను వేధించిన సోనియా నుంచి ఎర్రన్నాయుడు, శంకర్రావు, లోకేష్ పరిస్థితి ఏంటో అందరూ చూశారని చెప్పారు. చంద్రబాబుకు తానెందుకు క్షమాపణ చెప్పాలని కొడాలి నాని ప్రశ్నించారు.   

తాదూర కంత లేదు మెడకో డోలు.. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడున్నర సంవత్సరాలైంది.. అయినా ఇంతవరకు తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల కుటుంబాలకు ఇస్తామన్న ఆర్థిక సహాయం అందరికీ అందలేదు. అలాగే ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే, అసలే లేదు. ఏడున్నరేళ్ళలో అమరులకు ఇచ్చిన హామీలు ఏవీ పూర్తిగా అమలుకు నోచుకోలేదు. నిజానికి, ఇన్నేళ్ళ తర్వాత కూడా అమరులో అర్హులు ఎందరు అన్న లెక్కకూడా ఖచ్చింతంగా తేల లేదు.  తెలంగాణ తొలి ఉద్యమం (1969) ఉద్యమంలో 365 మంది మలి దశ ఉద్యమంలో 1200 మందికి పైగా , మొత్తం కలిపి 1500 మందికి పైగా చనియారు. ఇందులో ఆత్మ బలిదానం చేసుకున్న వారున్నారు. పోలీసు కాల్పులలో చనిపోయిన అమరులున్నారు. ఎలా చనిపోయినా ఈ అందరూ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన, తెలంగాణబిడ్డలు.ఆ కుటుంబాలు అన్నీ,అమరుల కుటుంబాలు, అయినా అందులో కొందరే అర్హులు అంటోంది ప్రభుత్వం. అంటే కాదు, పంచ పాండవులు మంచం కోళ్ళులాగా నలుగురు అని మూడు వేళ్ళు చూపించినట్లు 1500 పైచిలుకు మందికి గానూ కేవలం  479 మందికి, అది కూడా ఆర్ధిక సహాయం వరకు మాత్రమే ఇచ్చి కేసీఆర్ ప్రభుత్వం చేతులు కడిగేసుకుంది. చివరకు, వ్గాదనం చేసిన అమరుల స్థూపానికి కూడా ఇంతవరకు దిక్కులేదు.అమరులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని ప్రభుత్వం సక్రమంగా నిలుపుకోలేక పోయిందనేది ఆరోపణ కాదు ,నిజం.   ఇంతే కాదు, రాష్ట్రంలో ఈ రోజుకు కూడా రైతులు, నిరుద్యోగులు, ఇతర వర్గాలకు చెందినవారు ప్రతి రోజు ఒకరో ఇద్దరో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గడచిన ఏడేళ్ళలో అధికారికంగానే 7000 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని,అనధికార లెక్కల ప్రకారం చూస్తే ఈ సంఖ్య ఇంతకు ఐదారు రెట్లు ఉంటుందని పలు సందర్భాలలో పేర్కొన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి, కేసీఆర్, ‘తాదూర కంత లేదు మెడకో డోలు’ అన్నట్లుగా ఢిల్లీ రైతుల ఆందోళనలో చనిపోయిన 750 రైతుల కుటుంబాలకు మూడు లక్షల రుపాయాల వంతున పరిహారు ప్రకటించారు. మంచిదే, మూడు కాకపోతే, మరో మూడు కలిఫై ఆరు అదీ చాలదనుకుంటే ఇంకొక ఆరు కలిపి ఫ్యామిలీకి 12 లక్షలు ఇస్తామన్నా వద్దనేది లేదు. అయితే, ఈ 750 లెక్క ఎక్కడి నుంచి వచ్చింది. రాష్ట్రంలో చనిపోయిన అమరుల సంఖ్యే ఇంతవరకు పక్కాగా తేలలేదు. ఇప్పడు ఢిల్లీలో 750 మంది చనిపోయారు అని ఏ విధంగా లెక్క తేల్చారు. అందుకోసంగా 23కోట్ల రూపాయలను ఏ విధంగా మూట కట్టారు.  అదీ గాక, సహజంగా ఏదైనా ఒక రాష్ట్రంలో ప్రకృతి విపరీత్యాలు సంభవించి  పెద్ద ఎత్తున ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించి నప్పుడు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ఆరాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక సహాయం అందిస్తాయి. అంతే గానీ, వేరే రాష్ట్ర ప్రభుత్వం  నేరుగా బాధితులకు ఆర్థిక సహాయం గానీ మరో సాయం గానీ, ఇవ్వడం కుదరదు . అలా ఇంతవరకు ఎప్పుడు ఎక్కడా జరగ లేదు. నిజానికి అలా, ఇతర రాష్ట్రాల వ్యవహారాల్లో నేరుగా వేలు పెట్టడం  సమంజసం కాదు. సభ్యతా సంస్కారం అనిపించుకొండు. అంతేకాదు, ఒక రాష్ట్ర ప్రభుత్వ నిధులను, మరో రాష్ట్రంలో ఆ ప్రభుత్వ సమ్మతి లేకుండా పంపిణీ జరగడం సాధ్యం కాదు. కాదు, సాధ్యమే  అనుకుంటే, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అదితి నాథ్, లేదా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గేహ్లోట్ హైదరాబాద్ కి వచ్చి, తమ తమ ప్రభుత్వం తరపున తెరాస ప్రభుత్వం మొండి చెయ్యి చుపించిన తెలంగాణ అమరుల కుటుంబాలకు  తలా పది లక్షలు ఇస్తాను అంటే , తెలంగాణ ప్రభుత్వం సిగ్గువదిలి  ఒప్పుకుంటుందా ?  నిజానికి ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సహాయాన్ని, మరొక ప్రభుత్వం తిరస్కరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2014కు ముందు బీహార్’ లో వరదలు  వచ్చినప్పుడు,   గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. అయితే బీహర ముఖ్యమంత్రి నితీష్ కుమార్, గుజరాత్ సహాయాన్ని తిరస్కరించారు. అదొకటి అలా ఉంటే ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి రాజకీయ ప్రయోజనాల కోసం, ఈ విధంగా అసంబద్ధమైన, అనలోచిత నిర్ణయాలు ప్రకటించి, చివరాకు అవి అమలు చేయ లేక అభాసుపాలు కావడం ... కొంచెం చాలా బావోదు అంటున్నారు.

సింగర్ హరిణి ఇంట్లో విషాదం.. సుజనా ఫౌండేషన్ సీఈవో మృతి కేసులో ట్విస్ట్

సింగర్ హరిణి తండ్రి ఏకే రావు అనుమానస్పద మృతి కేసు కొత్త మలుపు తిరిగింది. బెంగళూరులోని రైల్వే ట్రాక్‌పై ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. మృతదేహం దగ్గర సూసైడ్ నోట్ లభ్యమైంది. ఓ వ్యాపారి తనను మోసం చేశారంటూ సూసైడ్ నోట్‌లో ఉంది. కాగా కుటుంబ సభ్యులు ఇప్పటికే ఏకే రావు పార్థివదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు.  ఏకే రావు వారం రోజులుగా కనిపించకుండా పోయారు. సుజనా ఫౌండేషన్ సీఈవోగా పనిచేస్తున్న ఏకే రావు కుటుంబం శ్రీనగర్‌ కాలనీలో నివాసముంటుంది. ఏకే రావు తన కుటుంబంతో కలిసి హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు.  గత వారం రోజులుగా ఏకే రావు కుటుంబ సభ్యులతో సహా అదృశ్యమయ్యారు. ఎక్కడికి వెళ్లారో స్పష్టత లేదు. ఈనెల 22న బెంగళూరు పోలీస్ స్టేషన్‌లో ఆయన కనిపించడంలేదంటూ కేసు నమోదైంది. బెంగళూర్ పోలీసులు కుటుంబ సభ్యుల నుంచి స్టేట్‌మెంట్‌లు రికార్డ్ చేస్తున్నారు. అయితే ఆయన మృతదేహం బెంగళూరులోని ఓ రైల్వే ట్రాక్‌పై గుర్తించారు.  తన తండ్రికి ఖచ్చితంగా హత్యేనని సింగర్ హరిణి అనుమానిస్తున్నారు. ఈ మేరకు బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పోస్ట్ మార్టం కూడా నిర్వహించారు. ఆ రిపోర్టులు రావాల్సి ఉంది. ఏకే రావు మృతదేహం రైల్వే ట్రాక్‌పై దొరికిన తర్వాత అప్పటి వరకూ ఆచూకీ లేని కుటుంబసభ్యులు బెంగళూరులోని మార్చురీ వద్దకు వెళ్లారు. తమ ఫిర్యాదు కూడా పోలీసులకు ఇచ్చారు.  ఏకే రావు కుటుంబసభ్యుల మధ్య మధ్య ఏమైనా కుటుంబ గొడవలు ఉన్నాయా అనే దిశగా బెంగళూరు పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏకే రావు ఆత్మహత్య చేసుకున్నారా లేకపోతే ఎవరైనా హత్య చేశారా అన్నది పోస్ట్ మార్టంలో తేలే అవకాశం ఉంది. ఏకే రావు కుమార్తె సింగర్ హరిణి మాత్రం ఖచ్చితంగా హత్యేనని నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.  బీజేపీ ఎంపీ సుజనా చౌదరికి చెందిన సుజనా ఫౌండేషన్‌కు ఏకే రావు చాల కాలంగా సీఈవోగా పని చేస్తున్నారు. ఆ సంస్థకు చెందిన ఏదైనా వివాదాలు ఉన్నాయా అనే దిశగానూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

వరదల్లో ముంచేశారు.. ఎన్టీఆర్ ప్రవచనాలు.. తెలుగు సీఎంలకు టెన్షన్.. టాప్ న్యూస్@1PM

వైసీపీ ప్ర‌భుత్వంపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం ప్ర‌జ‌ల‌కు శాపంగా మారిందని మండిప‌డ్డారు. రెండు రోజులుగా తాను వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తున్నాన‌ని చంద్ర‌బాబు చెప్పారు. ప్ర‌జ‌లు ప‌డుతోన్న క‌ష్టాల గురించి తెలుసుకున్నాన‌ని తెలిపారు. వ‌ర్షాలు ఈ ఏడాది ఎక్కువ‌గా ప‌డ‌తాయ‌ని ముందుగానే ప్ర‌భుత్వానికి తెలుస‌ని చంద్ర‌బాబు నాయుడు చెప్పారు. ముందే తెలిసినా ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తంగా ఉండ‌కుండా, పూర్తిగా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించింద‌ని చంద్రబాబు చెప్పారు. ----- మాజీ సీఎం చంద్రబాబు పర్యటించబోయే ప్రాంతాల్లో హడావుడిగా నిత్యవసరాలు, రూ.2వేలు పరిహారాన్ని అధికార పార్టీ పంపిణీ చేసింది. పరిహారం పంపిణీలోనూ పార్టీల వివక్షత చూపించడం గమనార్హం. ఇతర పార్టీల వారికి పరిహారం సక్రమంగా అందలేదు. వరదల్లో ఆధార్, రేషన్ కార్డులు పోయిన వారికి పరిహారం, నిత్యవసరాలు అందలేదని తెలుస్తోంది. రూ.లక్షలు నష్టపోతే రూ.2వేలు ఎందుకని కొందరు నిరాకరించారు. చంద్రబాబు పర్యటన ప్రాంతాల్లో హడావిడిగా పారిశుద్ద్య పనులు చేపట్టారు. ----- చంద్రబాబు నాయుడు సతీమణిపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యల్ని ఖండించిన అనంతపురం తెలుగు బీసీ మహిళా నేతల్ని పోలీసులు వేధించటం దుర్మార్గమని టీడీపీ రాష్ట్ర అధ్యక్ష్యులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. బూతులు మాట్లాడిన  వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలను వదిలేసి బూతులు మాట్లాడొద్దన్నందుకు తెలుగు మహిళలను వేధిస్తారా అని ప్రశ్నించారు.  వారు చేసిన తప్పేంటి?... వైసీపీ నేతలు మహిళలను అసభ్యంగా మాట్లాడుతుంటే సాటి మహిళలుగా స్పందించటం తప్పా అని నిలదీశారు -------- నందమూరి హీరో జూనియర్ ఎన్టీయార్‌పై టీడీపీ నేత వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. నారా భువనేశ్వరిపై కొడాలి నాని, వల్లభనేని వంశీ విమర్శలు చేస్తే ఎన్టీయార్ స్పందించిన తీరు సరిగా లేదని వర్ల రామయ్య అభిప్రాయపడ్డారు. భువనేశ్వరి మేనల్లుడిగా ఎన్టీయార్ విఫలమయ్యారని విమర్శించారు. మేనత్తను నోటికొచ్చినట్లు అంటే మేనల్లుడిగా ఆయన సరిగ్గా స్పందించలేదని రాష్ట్రం మొత్తం అనుకుంటోందని వర్ల రామయ్య తెలిపారు. సినిమాల కోసం కుటుంబాన్ని, నైతిక విలువలలను వదులుకుంటారా? అని వర్ల రామయ్య నిలదీశారు ----- జూనియర్ ఎన్టీఆర్‌పై వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ అని టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, నాగుల్ మీరా అన్నారు. చంద్రబాబు కుటుంబానికి వైసీపీ నేతలు క్షమాపణ చెప్పాలంటూ విజయవాడలో వర్ల రామయ్య చేస్తున్న దీక్షకు టీడీపీ నేతలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బుద్దావెంకన్న, నాగుల్ మీరా మాట్లాడుతూ... జూనియర్‌పై తమ మనసులో ఉందే... వర్ల రామయ్య బయటపెట్టారన్నారు. జూనియర్ వ్యాఖ్యలు చూసి వైసీపీ నాయకులు ఏంటి జూనియర్ ఇలా మాట్లాడారు అని అనుకుంటున్నారని తెలిపారు.  ----- తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రెగ్యులర్ మెడికల్ టెస్ట్‌లో భాగంగా బుధవారం రాత్రి ఆయన పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వెంటనే స్పీకర్ ఓ ప్రకటన విడుదల చేశారు. తనకు ఆరోగ్య సమస్యలు లేనప్పటికీ డాక్టర్ల సూచనల మేరకు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో జాయిన్ అయ్యానని తెలిపారు. గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారు, సన్నిహితులు వెంటనే కోవిడ్ పరీక్షలు చేయించుకుని, హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కోరారు. --------- వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ట్విటర్ వేదికగా సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 3గంటల దీక్ష చేసి ఢిల్లీకి పోయాడని ఎద్దేవా చేశారు. తాడోపేడో తేల్చుకుంటానని చెప్పాడన్నారు. మొత్తానికి KCR కథ 3 ఏళ్లు కర్రసాము నేర్చి మూలన కూర్చొన్న ముసల్దాన్ని కూడా కొట్టలేని తీరు అయిందంటూ షర్మిల  సెటైర్ వేశారు. ఢిల్లీకి పోయి పొడుస్తమ్ అని ప్రెస్ మీట్‌లు పెట్టిన దొర ఉత్తి చేతులతో తిరిగొచ్చాడని కామెంట్ చేశారు. -------- ప్రముఖ సింగర్ హరిణి తండ్రి, సుజనా ఫౌండేషన్ సీఈవోగా ఉన్న ఏ.కే.రావు అనుమానాస్పద స్థితిలో బెంగళూరులో మరణించారు. ఆయన మృతదేహం బెంగళూరులోని ఓ రైల్వే ట్రాక్‌పై గుర్తించారు. ఏకే రావు తన కుటుంబంతో కలిసి హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు.  గత వారం రోజులుగా ఏకే రావు కుటుంబ సభ్యులతో సహా అదృశ్యమయ్యారు. ఎక్కడికి వెళ్లారో స్పష్టత లేదు. కానీ హఠాత్తుగా ఆయన మృతదేహం రైలు పట్టాలపై కనిపించింది.  -- శివ శంక‌ర్ మాస్ట‌ర్ ఆరోగ్య ప‌రిస్థితిపై సినీ న‌టుడు సోనూసూద్ ఆరా తీశారు. శివ శంక‌ర్ మాస్ట‌ర్ కుమారుడు అజ‌య్‌తో ఆయ‌న‌ మాట్లాడారు. ఆరోగ్య ప‌రిస్థితి గురించి తెలుసుకుని ప‌రామ‌ర్శించారు. మ‌రోవైపు,  తాను శివ శంక‌ర్ మాస్ట‌ర్ కుటుంబంతో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నాన‌ని, ఆయ‌న‌ ప్రాణాలు కాపాడడానికి చేతనైన సాయం చేస్తానని సోనూసూద్ ట్వీట్ చేశారు.   --- దేశీయంగా నిర్మించిన ఐఎన్ఎస్ వేలా జలాంతర్గామి ముంబైలోని నావల్ డాక్‌యార్డ్‌లో చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ సమక్షంలో గురువారం భారత నావికాదళంలోకి ప్రవేశించింది.ఈ జలాంతర్గామిని ముంబయికి చెందిన మజాగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ ఫ్రాన్స్‌కు చెందిన నావల్ గ్రూప్‌తో కలిసి నిర్మించింది.గతంలో తయారు చేసిన కల్వరి, ఖండేరి, కరంజ్ జలాంతర్గాములను ఇప్పటికే ప్రారంభించారు.ఐఎన్ఎస్ అవతార్ 1973 ఆగస్టు 31వతేదీన ప్రారంభించిన తర్వాత 37 సంవత్సరాల పాటు దేశానికి గొప్ప సేవలు అందించింది

ఎన్టీఆర్ ప్ర‌వ‌చ‌నాలు.. సీత‌య్య బ‌తికుంటేనా...

చంద్ర‌బాబును అన్నేసి మాట‌లు అన్నారు. భువ‌నేశ్వ‌రిని క్యారెక్ట‌ర్ అసాసినేష‌న్ చేశారు. అంబ‌టి రాంబాబు, కొడాలి నాని, ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, వ‌ల్ల‌భ‌నేని వంశీ.. ఆ న‌లుగురు నీచాతినీతంగా కామెంట్లు చేశార‌ని ప్ర‌జ‌లంతా మండిప‌డుతున్నారు. భార్య‌పై చేసిన ఆరోప‌ణ‌లు త‌ట్టుకోలేక‌.. వెక్కి వెక్కి ఏడ్చిన చంద్ర‌బాబుపై అంతా సానుభూతి వ్య‌క్తం చేస్తున్నారు. నంద‌మూరి కుటుంబం ఆసాంతం బ‌య‌ట‌కు వ‌చ్చి.. ప్రెస్‌మీట్ పెట్టి జ‌గ‌న్‌రెడ్డి అండ్ బ్యాచ్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇదే లాస్ట్ ఛాన్స్‌.. మీ భ‌ర‌తం ప‌డ‌తాం.. ఖ‌బ‌డ్దార్ అంటూ హెచ్చ‌రించారు. కానీ, నంద‌మూరి ఆవేశంలో జూనియ‌ర్ ఎన్టీఆర్ లేరు. ఆ త‌ర్వాత తీరిగ్గా ఓ వీడియో రిలీజ్ చేశారు. అందులో చాలా సౌమ్యంగా, నీతి వ్యాఖ్య‌లు చెప్పారు. మ‌రి, తోలుమందం నేత‌ల‌కు ఇలాంటి సుతిమెత్త‌ని మాట‌లు చెవికి ఎక్కుతాయా? త‌న ప్రియ మిత్రులు, స‌న్నిహితులుగా ఉన్న కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీల‌ను సరిగ్గా మంద‌లించలేదంటూ స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఎన్టీఆర్ ఏది చెప్పినా చేసే కొడాలి, వ‌ల్ల‌భ‌నేనిల‌తో క్ష‌మాప‌ణ‌లు చెప్పించ‌కపోవ‌డంపై అంతా మండిప‌డుతున్నారు.  తాజాగా, నందమూరి హీరో జూనియర్ ఎన్టీయార్‌పై టీడీపీ నేత వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.  జూనియర్ ఎన్టీయార్ స్పందన ప్రవచనాలు చెప్పినట్లు ఉందని, ఆ వీడియో చూసి పిల్లలు కూడా నవ్వారని వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. జూనియర్ ఎన్టీయార్ అంటే కొడాలి నానికి, వల్లభనేని వంశీకి చాలా భయమని చెప్పారు. ఎన్టీయార్ వార్నింగ్ ఇస్తే వాళ్లిద్దరూ తోకలు ముడుచుకుని పోతారని వర్ల అభిప్రాయపడ్డారు. ఎన్టీయార్ స్పందించిన తీరు చూసి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త బాధపడ్డారని తెలిపారు. చంద్రబాబు కుటుంబానికి వైసీపీ నేతలు క్షమాపణ చెప్పాలంటూ విజయవాడలో వర్ల రామయ్య దీక్ష చేశారు.  నారా భువనేశ్వరిపై కొడాలి నాని, వల్లభనేని వంశీ విమర్శలు చేస్తే ఎన్టీయార్ స్పందించిన తీరు సరిగా లేదన్నారు. భువనేశ్వరి మేనల్లుడిగా ఎన్టీయార్ విఫలమయ్యారని విమర్శించారు. మేనత్తను నోటికొచ్చినట్లు అంటే మేనల్లుడిగా ఆయన సరిగ్గా స్పందించలేదని రాష్ట్రం మొత్తం అనుకుంటోందని వర్ల రామయ్య అన్నారు. సినిమాల కోసం కుటుంబాన్ని, నైతిక విలువలను వదులుకుంటారా? అని నిలదీశారు.  సీతయ్య బతికుంటే... ‘‘మీ నాన్న బతికుంటే ఇంకో రకంగా ఉండేది. సీతయ్య (హరికృష్ణ) బతికుంటే నేరుగా రంగంలోకి దిగేవాడు. రచ్చ రచ్చ చేసుండేవాడు. అలా మీరు (ఎన్టీయార్) ఎందుకు చేయలేకపోయారు? మీ నాన్నకు చెల్లెలు అయినప్పుడు మీకు అత్తే కదా? మీ మేనత్తను అంటే ఇలాగేనా స్పందించేది?’’ అంటూ వర్ల రామయ్య నిలదీశారు. అఖండ‌పై జ‌గ‌న్‌రెడ్డి అస్త్రం!.. బాల‌య్య టార్గెట్‌గానే స‌వ‌ర‌ణ‌ బిల్లు?

స్పీకర్ పోచారంకు కరోనా.. కేసీఆర్, జగన్ శిబిరంలో టెన్షన్ 

తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కొన్ని రోజులుగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రెగ్యులర్ మెడికల్ టెస్ట్‌లో భాగంగా బుధవారం రాత్రి ఆయన పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వెంటనే స్పీకర్ ఓ ప్రకటన విడుదల చేశారు. తనకు ఆరోగ్య సమస్యలు లేనప్పటికీ డాక్టర్ల సూచనల మేరకు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో జాయిన్ అయ్యానని తెలిపారు. గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారు, సన్నిహితులు వెంటనే కోవిడ్ పరీక్షలు చేయించుకుని, హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కోరారు. గత ఆదివారం స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మనవరాలు స్నిగ్ధారెడ్డికి, ఏపీ సీఎం ఓఎస్టీ కృష్ణమోహన్‌రెడ్డి కుమారుడు రోహిత్‌రెడ్డితో ఘనంగా వివాహం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వివాహ వేడుకలో ఎంతో ఉత్సాహంగా కనిపించిన పోచారం.. అతిథులందరినీ ఆప్యాయంగా పలకరించి మర్యాదలు చేశారు. స్పీకర్ పోచారంతో సీఎం జగన్, సీఎం కేసీఆర్ లు మాస్కులు లేకుండానే సగుసలాడారు. చాలా సేపు పక్కపక్కనే కూర్చుని మాట్లాడుతున్నారు.  స్పీకర్‌ పోచారంకు కరోనా పాజిటివ్ అని తేలడంతో.. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రుల్లో ఆందోళన నెలకొంది. పోచారంకు కరోనా సోకడంతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. కేసీఆర్‌కు గతంలో కరోనా సోకగా.. జగన్‌ కోవిడ్ విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆయన రెండు డోసుల టీకాలు వేయించుకున్నారు. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద్  ఇటీవల కరోనా బారిన పడి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.

'కేజీఎఫ్' బాబు.. పాత సామాన్లతో 1,740 కోట్లు.. ఎమ్మెల్సీ బ‌రిలో..

'కేజీఎఫ్'.. సిల్వ‌ర్ స్క్రీన్‌పై రాఖీ భాయ్ స్టామినాను చాటిన మూవీ. అది జ‌స్ట్ సినిమా మాత్ర‌మే. మూవీకి మించిన స్టోరీ ఉంది కేజీఎఫ్‌..కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌కి. బంగారు గ‌నుల త‌వ్వ‌కం ఆ కంపెనీకి పెద్ద‌గా లాభాలేమీ తెచ్చిపెట్ట‌లేదు. కొన్నేళ్లు మైనింగ్ చేసి.. త‌వ్వుకున్న కాడికి బంగారం త‌వ్వేసుకొని.. ఇక ఉప‌యోగం లేద‌ని.. కేజీఎఫ్‌ను మూసేశారు. ఇక‌, మైనింగ్ కోసం తెచ్చిన మిష‌న‌రీ, ప‌రిక‌రాలు, వ‌స్తువులు అన్నిటినీ పాత ఇనుప సామాన్ల వ్యాపారికి అమ్మేశారు. ఇక్క‌డే మ‌రో ఇంట్రెస్టింగ్ స్టోరీ మొద‌లైంది. క‌ట్‌చేస్తే.. ఆ పాత ఇనుప సామాన్ల వ్యాపారి.. ఇప్పుడు కాంగ్రెస్ త‌ర‌ఫున ఎమ్మెల్సీగా బ‌రిలో నిలిచారు. 1,740కోట్ల సంప‌ద‌తో సంప‌న్న రాజ‌కీయ నేత‌గా నిలిచారు. ఇంత‌కీ ఆయ‌న ఎవ‌రంటే.. కేజీఎఫ్‌-3 పొలిటిక‌ల్‌ స్టోరీ ఏంటంటే.... యూసుఫ్‌ షరీఫ్‌ అలియాస్‌ కేజీఎఫ్‌ బాబు. కర్ణాట‌క‌లో ఈ పేరు తెలీని వారు ఉండ‌దు. తాజాగా, క‌ర్ణాట‌క శాస‌న మండ‌లికి కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేస్తూ మ‌రోసారి బ్రేకింగ్ న్యూస్‌గా మారారు. నామినేషన్‌ పత్రాల్లో.. తన ద‌గ్గ‌ర‌ రూ.1,643 కోట్ల స్థిరాస్తి, రూ.97 కోట్ల చరాస్తి.. మొత్తం 1,740కోట్ల సంప‌ద‌ ఉందని ఆయ‌నే వెల్లడించారు. 23 బ్యాంకు ఖాతాలతో పాటు... 2.99 కోట్ల విలువైన 3 కార్లు... రూ.1.11 కోట్ల ఖ‌రీదైన‌ చేతి గడియారం... 4.5 కిలోల బంగారం... మూడు చోట్ల 48 కోట్ల విలువైన వ్యవసాయ భూములు... 1593 కోట్ల విలువైన 26 స్థలాలు... 3 కోట్ల విలువైన ఇల్లు... 58 కోట్ల అప్పులు... ఇదీ లెక్క‌. ఇక కేజీఎఫ్ బాబుకు ఇద్దరు భార్యలు.    యూసుఫ్‌ షరీఫ్ అలియాస్ కేజీఎఫ్ బాబు.. కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ కేంద్రంగా చాలాకాలం పాత సామాను వ్యాపారం చేశారు. అంత‌కు ముందు జ‌స్ట్ పాత సామాన్లోడు. ఆ త‌ర్వాత 'కేజీఎఫ్ బాబు'గా మారిపోయారు. కేజీఎఫ్‌లో పాత ట్యాంకులు కొనుగోలు చేయడం, వాటిని అమ్మడం చేసేవారు. ఇది అతనికి బాగా కలిసి వచ్చింది. ఆ తర్వాత తన నివాసాన్ని బెంగళూరుకు మార్చి.. వ్యాపారాన్ని విస్తరించి, రియ‌ల్ ఎస్టేట్ బిజినెస్‌లో అడుగుపెట్టారు. మ‌రింత సంప‌న్నుడు అయ్యారు. ఇప్పుడు వేల కోట్ల ఆస్థితో కాంగ్రెస్ త‌ర‌ఫున ఎమ్మెల్సీ బ‌రిలో నిలిచారు. నామినేష‌న్ ప‌త్రాల్లో దాఖ‌లు చేసిన ఆయ‌న ఆస్తులు చూసి.. క‌న్న‌డిగులకు క‌ళ్లు తిరుగుతున్నాయి. వామ్మో.. కేజీఎఫ్ నుంచి పాత సామాన్లు అమ్ముకొని ఇంత సంపాదించారా? అంటూ జ‌నం చ‌ర్చించుకుంటున్నారు. సినిమా అయినా, బిజినెస్ అయినా.. కేజీఎఫ్ఫా.. మ‌జాకా...  

రాజధాని రైతుల పాదయాత్రలో జనసేన!

ఏపీ రాజధాని అమరావతి రైతుల మహాపాదయాత్రలో జనసేన పార్టీ పాల్గొంటుంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూచనల మేరకు రాజధాని రైతుల పాదయాత్రలో పాల్గొనాలని జనసేన నిర్ణయించింది. పాదయాత్రలో పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో జనసేన జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీల సభ్యులు, జనసైనికులు పాల్గొంటారు. అమరావతి రైతుల మహాపాదయాత్రలో ఈ నెల 26న జనసేన నేతలు, శ్రేణులు పాల్గొంటారని పార్టీ అధికారికంగా ప్రకటించింది. నెల్లూరు జిల్లా నార్త్ రాజుపాలెం వద్ద పాదయాత్రలో నాదెండ్ల మనోహర్ పాల్గొంటారు. జనసేన పార్టీ జిల్లాల అధ్యక్షులతో బుధవారం ఉదయం నాదెండ్ల మనోహర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ముందు నుంచీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అండగా ఉంటున్న విషయం ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపా పాలన మొదలైన తొలి ఏడాది కౌలు డబ్బులు సకాలంలో చెల్లించకపోవడంతో రాజధాని గ్రామాలకు వెళ్లి పవన్ కళ్యాణ్ రైతుల పక్షాన నిలిచారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంతానికి వెళ్లినప్పుడు ప్రభుత్వం ఆటంకాలు కల్పించినా కాలి నడకన వెళ్లి మరీ రైతులకు ధైర్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఒక్కటే ఉండాలని, అది అమరావతే కావాలనే డిమాండ్తో రైతులు 700 రోజులకు పైగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రైతులు ‘న్యాయస్థానం టూ దేవస్థానం’ పేరిట గత 24 రోజులుగా మహాపాదయాత్ర చేస్తున్నారు. రైతుల మహాపాదయాత్రకు ఇప్పటికే ప్రతిపక్షాలు మద్దతు తెలిపాయి. బీజేపీ రాష్ట్ర అగ్రనేతలు కూడా ఇటీవలే పాదయాత్రలో పాల్గొన్నారు.

తండ్రికి తగ్గ తనయుడు.. టీడీపీలో చిచ్చరపిడుగు

'వీడు ఆరడుగుల బుల్లెట్టూ.. ధైర్యం నింపిన రాకెట్టూ' అంటూ అత్తారింటికి దారేది సినిమాలో పవర్స్టార్ పవన్ను వర్ణించిన పాట అభిమానుల్నే కాదు అందరినీ అలరించింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా అలాంటి ఓ బుల్లెట్టే ఉంది. తెలుగుదేశం పార్టీలో బుల్లెట్లా ముందుకు దూసుకొచ్చింది. ఆ బుల్లెట్ మరెవరో కాదు శ్రీకాకుళం టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు. 2014లో 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో రామ్మోహన్నాయుడు వరుసగా శ్రీకాకుళం నుంచి టీడీపీ ఎంపీగా ఎన్నికయ్యారు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం సందర్భంగా రామ్మోహన్నాయుడు హిందీలో అనర్గళంగా మాట్లాడిన తీరుతో సభలో ఉన్న అందరినీ ఆకట్టుకుని ఔరా అనిపించుకున్నారు. ఆంధ్రప్రదేశ్కు జరిగిన అన్యాయాన్ని తీవ్రంగా ఎండగట్టి యావద్దేశం దృష్టినీ ఆకర్షించారు రామ్మోహన్నాయుడు. దివంగత మాజీ లోక్సభ స్పీకర్, నాన్న కింజరాపు ఎర్రంనాయుడి రాజకీయ వారసత్వాన్ని రామ్మోహన్నాయుడు  అక్షరాలా పుణికిపుచ్చుకున్నారు. ఎర్రంనాయుడి రాజకీయ ఒరవడినే కొనసాగిస్తున్నారు. ఎంపీగా ఎన్నికైన నాలుగేళ్లలోనే నాన్న వారసత్వాన్ని రామ్మోహన్నాయుడు  నిలబెట్టారు. చిన్నతనంలో ఎలాంటి రాజకీయ నీడ పడకుండా పెరిగిన రామ్మోహన్నాయుడు.. ఎంపీగా పోటీ చేసే వయస్సు కూడా రాక ముందే అభ్యర్థిగా ఖరారైన యువ నేత రామ్మోహన్నాయుడు. ఎంపీగా విజయాలు సాధించిన ఆయన భయంతో, బాధ్యతతో, క్రమశిక్షణతో ఎదిగారు. పార్లమెంట్లో రామ్మోహన్నాయుడి గుణాత్మక పనితీరు, వ్యక్తిగత కృషి ఆధారంగా 2020లో సంసద్ రత్న 'జ్యూరీ కమిటీ స్పెషల్ అవార్డు’ అందుకున్నారు.  అతి చిన్న వయస్సులోనే సంసద్ రత్న అవార్డు అందుకుని రామ్మోహన్నాయుడు రికార్డులకెక్కారు. తన పనితనంలో, దూసుకుపోయే తత్వంతో పార్లమెంట్‌ పబ్లిక్‌ అండర్‌టేకింగ్స్‌ కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు. బుల్లెట్లా దూసుకుపోయే రామ్మోహన్నాయుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మినిష్టర్‌ కొడాలి నానిని ఆయన ఇలాఖా గుడివాడలోనే విమర్శించగల దమ్మున్నోడు రామ్మోహన్నాయుడు. రాజకీయ భిక్షపెట్టిన టీడీపీకి కొడాలి వెన్నుపోటు పొడిచారని ఆక్షేపించారు. జగన్ పిరికివాడని, వేల కిలోమీటర్లు నడిచినా బెణకని ఆయన కాలు ఢిల్లీ టూర్ అనగానే ఎందుకు బెణికిందంటూ సూటిగా ప్రశ్నించగల సత్తా ఉన్న నేత రామ్మోహన్నాయుడు. టీడీపీ ఏ కార్యక్రమం తలపెట్టినా ముందువరసలో నిలబడే నిబద్ధతగల యువ నేత రామ్మోహన్నాయుడు. పార్టీ నిర్దేశించిన పలు నిరసన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని అరెస్టులు కూడా అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిన ప్రతిసారి పార్లమెంట్‌ ఆవరణలో టీడీపీ ప్రతి నిరసన కార్యక్రమంలోనూ రామ్మోహన్‌ పాత్ర తప్పకుండా ఉండాల్సిందే. విశాఖపట్నంలో రైల్తే జోన్‌ ఎంత అవసరమో స్పష్టంగా వివరిస్తూ 2017లో లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్‌కు లేఖ రాశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రయివేట్‌ పరం విషయంలో ఏపీ పట్ల సవతితల్లి విధానం ప్రదర్శిస్తోందంటూ లోక్‌సభలోనే తూర్పారపట్టారు రామ్మోహన్‌నాయుడు. జగన్‌ సర్కార్‌ గొప్పగా ప్రచారం చేసుకుంటున్న నవరత్నాలను బూడిద రత్నాలని ఆయన అభివర్ణించారు. 22 మంది ఎంపీలు ఉన్నా వైసీపీ ప్రత్యేక హోదా తీసుకురాలేకపోవడాన్ని తప్పుపట్టారు. జగన్‌కు 24 గంటలూ భజనం చేయడంలోనూ, బూతులు తిట్టడంలో వైసీపీ నాయకుడు పోటీపడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. రైతులంటే జగన్ ప్రభుత్వానికి అస్సలు గౌరవం లేదని, నిర్లక్ష్యం చేస్తోందని శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో రైతులతో భారీ ర్యాలీ నిర్వహించి సక్సెస్‌ అయ్యారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు రామ్మోహన్‌నాయుడు స్పందించే తీరు అందరి చేతా ఔరా అనిపించక మానదు. ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ మహమ్మారి నియంత్రణలో ఏపీ సీఎం జగన్ విఫలమయ్యారంటూ రామ్మోహన్నాయుడు లేఖ సంధించారు. కోవిడ్ సమయంలో కొన్ని సంస్థల సహకారంతో శ్రీకాకుళం రిమ్స్లో 50 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, 50 ఆక్సిజన్ సిలిండర్లు అందజేశారు. శ్రీకాకుళంలో కోవిడ్ హెల్ప్లైన్ ఏర్పాటు చేసి, వైద్యులు, హాస్పిటళ్లు, బెడ్ల సమాచారం బాధితులకు అందుబాటులో ఉండేలా చేయడం ఆయన బాధ్యతగల నాయకుడనిపించుకున్నారు. ఎమ్మెల్యే ప్రోగ్రామ్ ఖర్చులకు చందాలిచ్చిన ఉద్యోగులు.. ఏపీలో విడ్డూరం.. డ్రగ్స్ వ్యాపారంతో విజయవాడకు ఉన్న లింకుల్ని ప్రజలకు తెలియకుండా అణచివేసేందుకు వైసీపీ ప్రభుత్వం, పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ రామ్మోహన్నాయుడు విరుచుకుపడ్డ తీరు అకట్టుకుంది. పన్నుల మీద పన్నులు వేసి, ప్రజల్ని వైసీపీ సర్కార్‌ ఇబ్బందులు పెడుతున్న తీరుపై స్పందించడం గమనార్హం. వైసీపీ సర్కార్ కొత్త ఇసుక పాలసీ తెచ్చి 20 లక్షల మంది భవన నిర్మాణ కూలీల దైనందిన జీవనాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేసిందని రామ్మోహన్‌నాయుడు ప్రభుత్వానికి రాసిన లేఖలో ఆరోపించారు. ఇవన్నీ ప్రజలంటే రామ్మోహన్‌నాయుడికి ఉన్న బాధ్యతను గుర్తు చేసే అంశాలే. మూడో క్లాసు దాకా సొంతూరు శ్రీకాకుళంలోనే చదివిన రామ్మోహన్నాయుడు 1994లో తొలిసారిగా హైదరాబాద్ వెళ్లారు. భారతీయ విద్యాభవన్లో 4, 5 క్లాసులు చదివారు. 1996లో ఎర్రన్నాయుడు కేంద్ర మంత్రి అయినప్పుడు మళ్లీ చదువుల కోసం ఢిల్లీ వెళ్లారు. ఆర్కేపురం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చేరిన రామ్మోహన్నాయుడికి హిందీ అర్థంకాక ముందు చాలా ఇబ్బంది పడ్డారు. 12వ తరగతి తర్వాత రామ్మోహన్నాయుడు అమెరికా వెళ్లేందుకు పరీక్ష రాసి పర్డ్యూ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల నిమ్మాడలో పుట్టిన రామ్మోహన్నాయుడికి ఇంజనీరింగ్ అంటే ఇష్టమట. అందుకే అమెరికాలో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్ చేశారు.  తర్వాత ఎంబీఏ పూర్తిచేసి ఇండియా తిరిగివచ్చారు. అమెరికాకు చెందిన ఓ ఇంటీరియర్ కంపెనీతో టై అప్ చేసుకుని ఢిల్లీలో మార్కెటింగ్ చేశారు. రామ్మోహన్‌నాయుడి నాన్న ఎర్రంనాయుడు మరణించినప్పుడు  తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఎంతో ధైర్యం చెప్పారని గుర్తుచేసుకుంటారు. ఏ కెరీర్ ఎంచుకున్నా తాను చూసుకుంటానని చంద్రబాబు తనకు భరోసా ఇచ్చారంటారు. ఎర్రంనాయుడి మరణించిన సమయం 14 రోజుల్లో  లక్షలాది మంది తనను ఓదార్చేందుకు వచ్చారని, వారంతా తాను రాజకీయాల్లోకి రావాలని కోరారని చెబుతారు రామ్మోహన్‌నాయుడు. ఎర్రంనాయుడికి ప్రజల్లో ఉన్న అభిమానం చూసి ఆయన మార్గాన్ని కొనసాగించాలని రాజకీయాల్లోకి రామ్మోహన్నాయుడు వచ్చానంటారు. ట్యూషన్ మాస్టర్నిపెట్టుకుని హిందీ నేర్చుకున్నాను అంటారాయన. పార్లమెంటరీ జీవితంలో రామ్మోహన్నాయుడిపై ప్రభావం చూపిన వారిలో ప్రస్తుత భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఒకరు. లోక్సభలో తన తొలిరోజుల్లో ఓ చిన్న ప్రశ్న హిందీలో అడిగినప్పుడు వెంకయ్యనాయుడు తనను సభలోనే అభినందించారని, అందరితో సభలో చప్పట్లు కొట్టించారని రామ్మోహన్నాయుడు సంతోషంగా చెప్పుకుంటారు.టీడీపీ రాజకీయాల్లో యువనేత రామ్మోహన్‌నాయుడు మరింతగా దూసుకుపోయే బుల్లెట్‌ లాంటి వారనడంలో సందేహం లేదు.

ఎమ్మెల్యే ప్రోగ్రామ్ ఖర్చులకు చందాలిచ్చిన ఉద్యోగులు.. ఏపీలో విడ్డూరం..

ఆంధ్రప్రదేశ్ లో అంతా విచిత్రమే. జగన్ రెడ్డి పాలనంతా అంతా రివర్స్ అన్న టాక్ ఇప్పటికే ఉంది. ఏపీలో జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉంటున్నాయి. యథా రాజా తథా ప్రజా అన్నట్లుగా ప్రజా ప్రతినిధుల తీరు ఉందనే విమర్శలు వస్తున్నాయి. ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో ఇదే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ప్రజప్రతినిధిగా ఉన్న కరణం బలరామకృష్ణమూర్తి ఏదైనా కార్యక్రమం చేస్తే.. ఆయన వచ్చి ఫొటోలకు ఫోజులిచ్చి ప్రసంగాలు చేసి వెళ్లిపోతారట. కానీ కార్యక్రమానికి చేసిన ఏర్పాట్ల గురించి కనీసం పట్టించుకోరట. దానికయ్యే ఖర్చులు మాత్రం అధికారులే భరించాలట. ఎమ్మెల్యే కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులే.. చివరికి డబ్బులు కూడా భరించాల్సి రావడం విచిత్రంగా ఉంది కదూ..  గత నెలలో వైఎస్సార్ ఆసరాచెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. చీరాలలోని మండల పరిషత్ ప్రాంగణంలో ఘనంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దీనికి చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం వచ్చారు. లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఫొటోలకు ఫోజులిచ్చి.. మాట్లాడి వెళ్లిపోయారు. ఇంత వరకు బాగానే ఉంది. కార్యక్రమం ముగిశాకా షామియానా సిబ్బంది డబ్బుల కోసం క్యూ కట్టారు. కానీ ఎవరూ స్పందించలేదు. వాస్తవానికి ఇలాంటి ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రభుత్వమే నిధులు ఇస్తుంది. ఈ కార్యక్రమానికి కూడా సంబంధిత శాఖ జిల్లా అధికారులు నిధులు పంపారు. కానీ షామియానా సిబ్బందికి ఒక్కరూపాయి ఇవ్వలేదు. ఎమ్మెల్యే కూడా పట్టించుకోకుండా వెళ్లిపోయారు.  షామియానా డబ్బుల ఇవ్వకపోతే పరువు పోతుందనే భయంతో ఎంపీడీవో కార్యాలయం సిబ్బంది చందాలు వసూల్ చేశారట, వీఏవోలు, వెలుగు సిబ్బంది నుంచి డబ్బులు వసూల్ చేసి  షామియానా ఖర్చులు చెల్లించారట. అయితే వెలుగు సిబ్బంది తమకు వచ్చేదే అరకొర అయ్యా మాకు వచ్చేది అరకొర వేతనాలే.. ఖర్చులు పెరిగిపోయాయి.. ఇలా వెయ్యంటే.. ఎలా అని ప్రశ్నించారట. దీంతో అప్పటికే ఆగ్రహంతో ఉన్న ఎంపీడీవో.. ఖస్సు మన్నారట.. మీరు వెయ్యే ఇచ్చారు.. నా చేతి చమురు ఇంకా ఎక్కువే వదిలింది ఆయన రుసరుసలాడారట. మొత్తంగా చూస్తే.. ఎంకి పెళ్లి సుబ్బిచావుకు వచ్చినట్టు.. కరణంగారి కార్యక్రమం.. చిరుద్యోగుల చేతి చమురును వదిలించిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. 

జ‌గ‌న్‌రెడ్డి అహంకారం ప్ర‌జ‌ల‌కు శాపం.. ప్ర‌భుత్వ అస‌మ‌ర్థ‌త‌పై చంద్రాగ్ర‌హం

సీఎం జగన్‌రెడ్డి అహంకారం, అనుభ‌వరాహిత్యం ప్రజలకు శాపంగా మారిందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిప‌డ్డారు. భారీ వర్షాలు పడతాయని ముందే తెలిసినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వ బాధ్యతరాహిత్యం వల్లే ప్రాణనష్టం జరిగిందని ఆరోపించారు. ఊరుకు ఊరే తుడిచిపెట్టుకుపోయే ప‌రిస్థితి వ‌చ్చింద‌న్నారు. ఇలాంటి సమంయలోనే ప్రభుత్వ సమర్థత ఏమిటో తెలుస్తుందన్నారు. ప్రకృతి వైపరీత్యాలు చెప్పి రావని.. సమర్థతతో పనిచేయాలని హితవుపలికారు. సమర్థతతో వ్యవహరిస్తే ప్రాణనష్టాన్ని తగ్గించవచ్చని చంద్రబాబు తెలిపారు.  పింఛ, అన్నమయ్య ప్రాజెక్టులపై ప్ర‌జ‌ల‌ను ఎందుకు అప్రమత్తం చేయలేకపోయారని చంద్ర‌బాబు ప్రశ్నించారు. అన్నమయ్య ప్రాజెక్ట్‌కు గేట్లు పెట్టేందుకు కూడా డబ్బులు ఇవ్వలేదని మండిపడ్డారు. అన్నమయ్య, పింఛ ప్రాజెక్టుల్లో నాసిరకం పనులు చేశారన్నారు. మృతదేహం కూడా దొరకలేదంటే ఇంతకంటే దారుణం ఏముంటుందని ఆగ్రహం వ్య‌క్తం చేశారు చంద్ర‌బాబు. 

అమరావతి రైతుల పాదాలకు బొబ్బలు, పుండ్లు.. పాలతో కడిగిన నెల్లూరు ప్రజలు 

అమరావతి రైతుల మహా పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ కు  అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో రాజధాని రైతులు సాగిస్తున్న యాత్రకు అడుగడుగునా జనం ఘన స్వాగతం పలుకుతున్నారు. పాదయాత్ర ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది. బుధవారం సున్నంబట్టి గ్రామం నుంచి మొదలైన పాదయాత్ర.. రాచర్లపాడు, రేగడిచెలిక, పెయ్యలపాళెం, చంద్రశేఖరపురం, పైడేరు, కమ్మపాళెం, బొడ్డువారిపాళెం, నాయుడుపాళెం, గండవరం రోడ్డు మీదుగా 15 కిలోమీటర్ల పాటు సాగి రాజుపాళెం చేరుకుంది. అక్కడ రైతులకు ఘన స్వాగతం లభించింది. వందలాదిమంది ప్రజలు.. అమరావతి రైతులకు ఎదురువెళ్లి స్వాగతం పలికారు. 25 రోజులుగా పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులకు పాదాలకు బొబ్బలు వచ్చాయి. కొందరికి పుండ్ల వచ్చాయి. మహిళా రైతులు నడవలేక ఇబ్బంది పడుతున్నారు. అయినా పాదయాత్ర మాత్రం ఆపడం లేదు. కాళ్లు నొప్పులు పెడుతున్నా, నడవడానికి ఇబ్బంది పడుతున్నా.. ఏ మాత్రం లెక్కచేయకుండా ముందుకు సాగుతున్నారు, పాదయాత్ర చేస్తున్న రైతుల పాదాలకు బొబ్బలు, పుండ్లు చూసి చలించిపోయారు రాజుపాళెం  ప్రజలు, వివిధ పార్టీల నాయకులు. రైతుల   పాదాలను పాలతో కడిగారు. రైతుల మహాపాదయాత్రకు స్థానికులు దారిపొడవునా బంతిపూలతో స్వాగతం పలికారు. గ్రామ పొలిమేర్లలో రంగువల్లులు తీర్చిదిద్దారు. పలువురు నేతలు, ప్రవాసాంధ్రులు రైతులకు మద్దతు తెలిపారు.  పాదయాత్ర చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపేందుకు వస్తున్న వారిపై కేసులు పెట్టడంపై ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. రైతుల మహాపాదయాత్రకు గురువారం విరామం ప్రకటించారు. శుక్రవారం యథావిధిగా మహా పాదయాత్ర కొనసాగుతుందని  అమరావతి జేఏసీ తెలిపింది. 

ఏపీని వీడని వాన గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు రోజుల వార్నింగ్

కుండపోత వానలు, భారీ వరదలతో అల్లాడిపోయిన ఆంధ్రప్రదేశ్ కు వరుణ గండం వీడటం లేదు. మరో రెండు రోజుల పాటు ఆంద్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇటీవలే కుండపోత వానలతో అతలాకుతలం అయిన రాయలసీమతో పాటు కోస్తాలో అతివృష్టి కురిసే అవకాశం ఉందని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.  నైరుతి బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి శ్రీలంక-దక్షిణ తమిళనాడు తీరానికి చేరే అవకాశముందని తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. దానికి అనుబంధంగా ఉన్న ద్రోణి ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించింది. వీటి ప్రభావంతో గురువారం కల్లా నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి శ్రీలంక, దక్షిణ తమిళనాడు తీరానికి చేరుకుంటుందని పేర్కొంది. వీటి ప్రభావంతో బుధవారం రాయలసీమ, దక్షిణకోస్తాలో అక్కడక్కడ మోస్తరు వానలు, ఉత్తరాంధ్రలో చెదురుమదురు జల్లులు పడ్డాయి.  రానున్న 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, శుక్రవారం దక్షిణకోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం నుంచి రెండు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

డ్రైనేజీ పైప్ లైన్ లో నోట్ల కట్టలు.. అవినితీ అధికారి బండారం బయటపెట్టిన ఏసీబీ

ఇంటి బయట ఉన్న డ్రైనేజీ పైపులో నుంచి కట్టలు కట్టలుగా డబ్బులు పడటం ఎప్పుడైనా చూశారా? లేదు కదూ. అయితే ఇలా డ్రైనేజీ పైపు నుంచి డబ్బుల కట్టలు, నగలు పడిన ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. కష్టపడి సంపాదించిన సొమ్మును భద్రంగా లక్ష్మీ దేవిలా భావించి పవిత్రంగా దాచుకుంటారు. కష్టపడకుండా వచ్చిన అవినీతి సొమ్మును సొమ్ములాగే చూస్తారు కానీ లక్ష్మీ దేవిలా చూడరని నిరూపించాడు ఓ అవినీతిపరుడు. అందుకే అప్పనంగా వచ్చిన అవినీతి ధనాన్ని డ్రైనేజీ పైపులో దాచిపెట్టాడు ఓ అవినీతిపరుడు. కర్ణాటకలోని కాలబుర్గిలో బుధవారం జరిగిని అవినీతి నిరోధక శాఖ సోదాల్లో ఈ ఘటన వెలుగుచూసింది. కర్ణాటక ఈశాన్య రేంజ్ ఏసీబీ ఎస్పీ మహేష్ మేఘన్ననవర్ ఈ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. కలబుర్గి ప్రాంతానికి చెందిన శాంత గౌడ బిరాదర్‌ అనే వ్యక్తి.. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంటులో జాయింట్‌ ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. అతని ఇంటిపై అవినీతి నిరోధక శాఖ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఆ సమయంలోనే డ్రైనేజీ పైపులో కట్టలు కట్టల డబ్బులు బయటపడ్డాయి. ఆ పైపులో డబ్బు ఉన్నట్లు గుర్తించిన అధికారులు.. ఒక ప్లంబర్‌ను పిలిపించి పైపులోని డబ్బును బయటకు తీశారు. ఈ పైపులో రూ.25 లక్షల నగదు, బంగారం దొరికినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఏసీబీ ఎస్పీ మహేష్ వెల్లడించిన వివరాల ప్రకారం పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న శాంత గౌడ్ ఇంటితో పాటు రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల జరిగిన సోదాల్లో రూ. 54 లక్షల నగదు, భారీ మొత్తంలో బంగారు ఆభరణాలు, ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ లభ్యమయ్యాయి. కమిషన్ల కోసం కక్కుర్తిపడే శాంత గౌడ్ వేధింపులు తాళలేకపోయిన సివిల్ వర్క్స్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన అవినీతి నిరోధక శాఖ అధికారులు అతడి ఇల్లు, సమీప బంధువుల నివాసాలపై ఆకస్మిక దాడులు జరిపి సోదాలు చేపట్టారు.  కేజీఎఫ్' బాబు.. పాత సామాన్లతో 1,740 కోట్లు.. ఎమ్మెల్సీ బ‌రిలో.. ఏసీబీ అధికారులు సోదాల కోసం  వచ్చి తలుపులు కొడుతున్నప్పటికీ.. శాంత గౌడ్ అతడి కొడుకు మాత్రం 15 నిమిషాల పాటు తలుపులు తీయకుండా లోపల ఉన్న ధనాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేశారు. వాషింగ్ బేషన్ నుంచి వెళ్లే డ్రైనేజ్ పైపులో వాళ్లు కుక్కిన రూ. 13 లక్షల నోట్ల కట్టలను ఏసీబీ అధికారులు తవ్వితీశారు. ఇంటిపై కప్పు సీలింగ్‌లోనూ నోట్ల కట్టలు  దాచిపెట్టినట్టు సందేహించిన అధికారులు సీలింగ్ పగలగొట్టి అందులోంచి 6 లక్షల రూపాయలు వెలికితీశారు.

రోజుకు రూ. 5 కోట్ల నష్టం.. హైదరాబాద్ మెట్రో మూతపడనుందా? 

హైదరాబాద్ అనగానే ఒకప్పుడు చార్మీనార్, గోల్కొండ, ట్యాంక్ బండ్ గుర్తుకు వచ్చేవి. తర్వాత ఆ జాబితాలో సైబర్ టవర్స్ చేరింది. ఇప్పుడు హైదరాబాద్ అనగానే గుర్తుకు వచ్చే లిస్టులో మెట్రో రైలు కూడా చేరింది. నగరవాసుల ట్రాఫిక్ కష్టాలు చెక్ పెడుతూ మూడు కారిడార్లలో పరుగులు పెడుతుంది ఎల్ఎండ్ సంస్థ నిర్మించిన హైదరాబాద్ మెట్రో. అత్యాధునిక హంగులతో నిర్మితమైన హైదరాబాద్ మెట్రోకు అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చాయి. హైదరాబాద్ కు తలమానికంగా నిలిచిన మెట్రో.. కొన్ని రోజుల్లోనే నగరవాసుల మనసు దోచుకుంది. రోజూ లక్షలాది మంది ప్రయాణికులను గమ్యం చేర్చింది.   అయితే సాఫీగా సాగుతున్న హైదరాబాద్ మెట్రోకు కరోనా మహమ్మారి గండంగా మారింది. కరోనా మహమ్మారి ప్రభావం తీవ్రంగా పడింది మెట్రో రైళ్ల పైనే. కొవిడ్ కారణంగా ఎక్కువ రోజులు షట్ డౌన్ అయింది మెట్రో రైళ్లే. ఫస్ట్ వేవ్ లో దాదాపు రెండు నెలల పాటు మెట్రో మూత పడింది. సెకండ్ వేవ్ లో అయితే దాదాపు మూడు నెలల పాటు రైళ్లు పట్టాలెక్కలేదు. తర్వాత రైళ్లను నడుపుతున్నా.. జనాలు మాత్రం ముందులా ఎక్కడం లేదు. మెట్రో పూర్తిగా  ఏసీమయం. దీంతో  ఏసీతో వైరస్ ఈజీగా వ్యాప్తి చెందుతున్న భయంతో జనాలు ప్రయాణించేందుకు జంకారు. ఇప్పటికే మెట్రో ఎక్కేందుకు జనాలు భయపడిపోతున్నారు. అందుకే ఒకప్పుడు ప్రయాణికులతో కిక్కిరిసిపోయిన మెట్రో రైళ్లు.. ఇప్పుడు బోసిపోయి కనిపిస్తున్నాయి. మెట్రో ప్రయాణికులు తగ్గడమే కాదు.. మెట్రో సంస్థ నిర్వహిచే మాల్స్ , షాపింగ్ సెంటర్లలో కూడా బిజినెస్ తగ్గిపోయింది. దీంతో మెట్రోకు భారీగా నష్టాలు వస్తున్నాయి.  ఎల్ అండ్ టీ మెట్రోకు ప్రస్తుతం రోజుకు 5 కోట్ల రూపాయల నష్టం వస్తుంది. ఈ విషయాన్ని హైదరాబాద్‌ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డినే అధికారికంగా తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. హైదరాబాద్‌ మెట్రోకు భారీ నష్టాలు వస్తున్నాయని చెప్పారు.  సీఎం కేసీఆర్‌తో ఇటీవల జరిగిన సమావేశంలో మెట్రో ఆర్థిక ఇబ్బందులను వివరించామని తెలిపారు. ప్రభుత్వం నుంచి అండగా ఉండాలని కోరామన్నారు. మెట్రో బెయిల్ ఔట్‌కు కమిటీ ఏర్పాటు చేశామని, నాలుగు రోజుల్లో నివేదిక ఇస్తామన్నారని ముఖ్యమంత్రి చెప్పారని... కాని ఆరు వారాలు గడిచినా ఎలాంటి పురోగతి కనిపంచడంలేదన్నారు కేవీబీ రెడ్డి.  మెట్రోకు రోజుకు రూ. 5 కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని, గత త్రైమాసికంలో మెట్రోకు రూ.445 కోట్ల నష్టం వచ్చిందని మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌ మెట్రోను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.  లేదంటే రైళ్లను నడిపే పరిస్థితి కష్టంగా ఉంటుందన్నారు. మెట్రోను కాపాడుకోవాలంటే తెలంగాణ సర్కార్ వెంటనే సాయం ప్రకటించాలని  కేవీబీ రెడ్డి అన్నారు. దీనిపై సీఎం కేసీఆర్ తొందరగా నిర్ణయం తీసుకోవాలన్నారు. 

చెరువులను మింగేశారు.. వైసీపీ వీరంగం.. కేటీఆర్ కంప్లైంట్.. మెట్రో కష్టాలు.. టాప్ న్యూస్@8PM

టీడీపీ అధినేత చంద్రబాబు  చిత్తూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. తిరుచానూరులో పర్యటించిన సందర్భంగా సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ ఒక వృద్ధుడని, ప్రజల్లో తిరగలేక వీడియో కాన్ఫరెన్స్ లు పెడుతుంటాడని ఎద్దేవా చేశారు. వైసీపీ పతనం ప్రారంభమైందని అన్నారు. తాగునీటి సంఘాలు పనిచేసి ఉంటే ఇవాళ చెరువులు తెగేవా? అని ప్రశ్నించారు. తాము చెరువులను ఆధునికీకరించామని, వైసీపీ నేతల్లా ఆక్రమించుకోలేదని స్పష్టం చేశారు ------- గుంటూరు జిల్లాలో ఓ టీడీపీ కార్యకర్తపై వైసీపీ రౌడీమూకలు అత్యంత దారుణంగా దాడికి పాల్పడ్డారంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను పంచుకున్నారు. ఓ వ్యక్తిని రోడ్డు డివైడర్ పై పడేసి కొందరు తీవ్రంగా కొట్టడం ఆ వీడియోలో కనిపించింది. దీనిపై లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అరాచకాలలో ఆఫ్ఘనిస్థాన్ ను మించిపోయిందని మండిపడ్డారు. ------- రాష్ట్రంలోని బీసీల అభివృద్ధికి ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు తీసుకుంటుందని సీఎం జగన్ అన్నారు. శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం జగన్‌ను డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, సీదిరి అప్పలరాజు, బీసీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కలిశారు. బీసీ జనగణన చేయాలని కేంద్రాన్ని కోరుతూ శాసనసభలో తీర్మానం చేయడంపై జగన్‌ను బీసీ నేతలు కలిసి సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.  -------- ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సినిమాటోగ్రఫీ చట్టానికి సవరణ బిల్లును రాష్ట్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి పేర్ని నాని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సవరణ బిల్లు తీరుతెన్నులను వివరించారు. ప్రభుత్వం నిర్దేశించిన మేరకే షోలు ప్రదర్శించాల్సి ఉంటుందని, టికెట్ల ధరలు కూడా ప్రభుత్వ నియమనిబంధనలకు లోబడి ఉంటాయని స్పష్టం చేశారు. సినిమా టికెట్లను ఆన్ లైన్ లో కొనుగోలు చేయవచ్చని వెల్లడించారు. ---- ఇటీవలి భారీ వర్షాలకు తిరుమల ఘాట్‌రోడ్డులో విరిగిపడిన కొండచరియలను చెన్నై ఐఐటీ నిపుణుల బృందం బుధవారం పరిశీలించింది. అలిపిరి, తిరుమలలోని పలు ప్రాంతాలను, రెండు ఘాట్‌రోడ్లలోని కొండచరియలను ఐఐటీ నిపుణులకు టీటీడీ అధికారులు చూపించారు. కొండ చరియలు విరిగిపడకుండా పటిష్టమైన చర్యలకు సంబంధించి ఐఐటీ నిపుణులు త్వరలో సమగ్ర నివేదికను టీటీడీ ఉన్నతాధికారులకు అందించనున్నారు. ---------- జీహెచ్ఎంసీ కార్యాల‌యంపై బీజేపీ కార్పొరేట‌ర్ల దాడిని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పందించారు. బీజేపీకి చెందిన కొందరు పోకిరీలు, దుండగులు.. జీహెచ్ఎంసీ కార్యాలయపై దాడికి పాల్పడ్డారని కేటీఆర్ ఆరోపించారు. బీజేపీ కార్పొరేట‌ర్లు రౌడీలు, గుండాల్లా వ్య‌వ‌హ‌రించారని ఆయన ట్వీట్ చేశారు. గాడ్సే భ‌క్తులు గాంధీ మార్గాన్ని అనుస‌రిస్తార‌ని ఎలా అనుకుంటారని ట్వీట్టర్ ద్వారా విమర్శించారు కేటీఆర్.  ----------- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ నేత విజయశాంతి విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లో పురాణకాలపు మూసీనది, హుస్సేన్ సాగర్ నిర్వహణ తీరు తెన్నులపై హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్రశర్మ చేసిన వ్యాఖ్యలు విని రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుతో తలవంచుకోవాలని ఆమె అన్నారు. మూసీని చూసి మురుగునీటి నాలా అనుకున్నానని... ఆయన అన్న మాటలు తెలంగాణ సర్కారుకు ప్రజారోగ్యం పట్ల ఉన్న శ్రద్ధ ఏమిటన్నది అర్థమవుతుందని విజయశాంతి మండిపడ్డారు ---- హైదరాబాద్‌ మెట్రోకు భారీ నష్టాలు వస్తున్నాయని హైదరాబాద్‌ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి తెలిపారు.  సీఎం కేసీఆర్‌తో ఇటీవల జరిగిన సమావేశంలో మెట్రో ఆర్థిక ఇబ్బందులను వివరించామని తెలిపారు. మెట్రో బెయిల్ ఔట్‌కు కమిటీ ఏర్పాటు చేశామని, నాలుగు రోజుల్లో నివేదిక ఇస్తామన్నారని చెప్పారు. ఆరు వారాలు గడిచినా ఎలాంటి పురోగతి కనిపంచడంలేదన్నారు. మెట్రోకు రోజుకు రూ. 5 కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని, గత త్రైమాసికంలో మెట్రోకు రూ.445 కోట్ల నష్టం వచ్చిందని వెల్లడించారు.  ------- ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ కాన్వాయ్‌పై బీజేవైఎం కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేశారు. పూరీ నగరంలోని దర్జీపోఖారీ ఛక్‌ వద్ద ఈ దాడి జరిగింది. శ్రీ జగన్నాథ్‌ పరికర్మ ప్రాజెక్టు శంకుస్థాపనకు సీఎం పట్నాయక్‌ వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దాడికి పాల్పడ్డారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఛేదించుకుని బీజేవైఎం కార్యకర్తలు అత్యంత సమీపం నుంచి సీఎం కాన్యాయ్‌పైకి కోడిగుడ్లు విసిరారు. ఇవి నేరుగా ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న కారు అద్దాలకు తగిలాయి. --- భారత మాజీ క్రికెటర్, ఢిల్లీ పార్లమెంటు సభ్యుడు గౌతమ్ గంభీర్‌కు కశ్మీర్ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు వచ్చాయి.రాజకీయ నాయకుడిగా మారిన క్రికెటర్‌కు ఈమెయిళ్ల రూపంలో బెదిరింపులు వచ్చాయి.దీంతో కశ్మీర్ ఐసిస్ ఉగ్రవాదుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.గంభీర్‌కు బెదిరింపు లేఖ పంపిన ఈ-మెయిల్ అడ్రస్‌ను గుర్తించేందుకు పోలీసులు విచారణ జరుపుతున్నారు.

డీజే మ్యూజిక్‌.. 63 కోళ్లు ఫ‌స‌క్‌.. పోలీసుల‌కు కంప్లైంట్‌..

ధూంధాంగా పెళ్లి. రాత్రికి ఊరేగింపు. వారంతా ఫుల్‌గా తాగున్నారు. పెద్ద సౌండ్‌తో డీజే పెట్టారు. డ్యాన్సులతో జోష్ మీదున్నారు. మ‌ధ్య మ‌ధ్య‌లో ట‌పాసులు పేల్చారు. రాకెట్లు, బాంబుల‌తో సంబ‌రాలు చేసుకున్నారు. అర్థ‌రాత్రంగా హంగామా చేశారు. క‌ట్ చేస్తే.. ఆ డీజే సౌండ్‌కు, ట‌పాసుల మోత‌కు ఆ ప‌క్క‌నే ఉన్న కోళ్ల ఫామ్‌లో 63 బ్రాయిల‌ర్ కోళ్లు చ‌నిపోయాయి. ఆ ఓనర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఖాకీలు పిలిపించి అడిగితే త‌మ‌కేం సంబంధం లేద‌న్నారు పెళ్లి వారు. కోళ్ల ఫాం య‌జ‌మాని మాత్రం డీజే వ‌ల్లే త‌న కోళ్లు చ‌నిపోయాయ‌ని కేసు పెట్టాడు.  రంజిత్‌కు చెందిన కోళ్ల ఫాంలో 2వేల వ‌ర‌కూ కోళ్లు ఉన్నాయి. కోళ్ల ఫాం ముందున్న‌ రోడ్డుపై పెళ్లి ఊరేగింపు జ‌రుగుతోంది. పెద్ద‌ సౌండ్‌తో డీజే పెట్ట‌డంతో.. ఆ శ‌బ్దాలకు కోళ్లు త‌ట్టుకోలేక‌పోయాయి. బాధ‌తో కూత పెట్టాయి. అది చూసి.. రంజిత్ కాస్త సౌండ్ త‌గ్గించ‌మంటూ పెళ్లి వారిని వేడుకున్నాడు. మ‌ద్యం మ‌త్తులో ఉన్న వారంతా.. రంజిత్‌ను తిట్టి, బెదిరించి వెళ్ల‌గొట్టారు. ఇదంతా మిడ్‌నైట్ జ‌రిగింది. తెల్లారి చూసే స‌రికి.. 63 కోళ్లు చ‌నిపోయి ఉన్నాయి. నేరుగా పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి జ‌రిగిందంతా చెప్పి.. పెళ్లి వారి నుంచి నష్ట పరిహారం ఇప్పించాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, నష్టపరిహారం ఇచ్చేందుకు పెళ్లి బృందం నిరాకరించింది. పోలీసులు వెటర్నరీ డాక్టర్‌ను పిలిపించి.. పెద్ద సౌండ్‌కు కోళ్లు చ‌నిపోతాయా? అని వైద్యుడి ఒపీనియ‌న్ తీసుకున్నారు. తీవ్రమైన శబ్దాలు, బాణాసంచా కారణంగా గుండెపోటుతో ఆ కోళ్లు చనిపోయినట్టు వెటర్నరీ డాక్టర్ ధృవీక‌రించారు. కేసు విచార‌ణ కొన‌సాగుతోంది. ఈ ఘ‌ట‌న ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగింది. 

అఖండ‌పై జ‌గ‌న్‌రెడ్డి అస్త్రం!.. బాల‌య్య టార్గెట్‌గానే స‌వ‌ర‌ణ‌ బిల్లు?

అఖండ. బాల‌కృష్ణ‌-బోయ‌పాటి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న‌ మోస్ట్ అవేటెడ్ మూవీ. డిసెంబ‌ర్ 2న రిలీజ్ డేట్‌. క‌ట్ చేస్తే.. అఖండ రిలీజ్‌కు స‌రిగ్గా వారం రోజుల ముందు.. న‌వంబ‌ర్ 24న ఏపీ అసెంబ్లీలో సినిమాటోగ్ర‌ఫీ స‌వ‌ర‌ణ బిల్లు. థియేట‌ర్ల‌లో రోజుకు 4 ఆట‌లు మాత్ర‌మేన‌ని.. ఇక‌పై బెనిఫిట్ షోలు ఉండ‌వ‌ని.. ఆన్‌లైన్లోనే టికెట్ల అమ్మ‌కం.. టికెట్ రేట్ల‌ను ప్ర‌భుత్వం నిర్ణ‌యించడం.. ఇలా అనేక నిబంధ‌న‌లు ఉన్నాయి ఆ బిల్లులో. ఈ బిల్లు తీసుకొచ్చిన స‌మ‌యం, సంద‌ర్భం చూస్తుంటే.. బాల‌కృష్ణ-అఖండ‌ టార్గెట్‌గానే ప్ర‌భుత్వం దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని అంటున్నారు.  గ‌తంలో తిరుప‌తి ఎంపీ ఉప ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌-వ‌కీల్‌సాబ్ టార్గెట్‌గా ఇలానే చేసింది జ‌గ‌న్ స‌ర్కారు. బెనిఫిట్ షోస్‌కి ప‌ర్మిష‌న్ ఇవ్వ‌లేదు. టికెట్ ధ‌ర‌ల‌ను పెంచ‌నివ్వ‌లేదు. ఇదే విష‌యంపై ఆ త‌ర్వాత జ‌న‌సేనాని జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వంపై, మంత్రి పేర్ని నానిపై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. త‌న‌పై కోపం, క‌క్ష్య ఉంటే త‌న‌ను ఇబ్బంది పెట్ట‌డం.. అంతేకానీ సినిమాను, సినిమా వాళ్ల‌ను కాదంటూ స్ట్రాంగ్‌గా అటాక్ చేశారు. వ‌కీల్‌సాబ్‌ ఎపిసోడ్ ముగిసింది. ఇప్పుడు బాల‌య్య‌ వంతు వ‌చ్చింది. మ‌రోవారంలో అఖండ రిలీజ్ అవనుండ‌గా.. ఇప్పుడు మ‌రోసారి సేమ్ స్ట్రాట‌జీ అప్లై చేస్తోంది. అఖండ క‌లెక్ష‌న్ల‌ను ఆగ‌మాగం చేసేలా.. బాల‌కృష్ణ సినిమాను ఇబ్బందిపాలు చేసేలా.. సినిమాటోగ్ర‌ఫీ చ‌ట్టానికి స‌వ‌ర‌ణ చేసేలా బిల్లు ప్ర‌వేశ‌పెట్టింది వైసీపీ ప్ర‌భుత్వం.  ఇటీవ‌ల అసెంబ్లీలో చంద్ర‌బాబు-భువ‌నేశ్వ‌రీల గురించి వైసీపీ స‌భ్యులు అభ్యంత‌క‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం.. చంద్ర‌బాబు వెక్కి వెక్కి ఏడ్వ‌డం.. వైసీపీ ఎమ్మెల్యేల‌పై నంద‌మూరి కుటుంబం తీవ్ర స్థాయిలో మండిప‌డ‌టంతో ఏపీలో రాజ‌కీయ ఉద్రిక్త‌త నెల‌కొంది. ఆ ప‌రిణామంపై భువ‌నేశ్వ‌రి సోద‌రుడు నంద‌మూరి బాల‌కృష్ణ జ‌గ‌న్‌రెడ్డి అండ్ బ్యాచ్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మ‌రోసారి రిపీట్ అయితే మీ భ‌ర‌తం ప‌డ‌తాం.. ఖ‌బ‌డ్దార్ అంటూ గ‌ట్టిగా హెచ్చ‌రించారు. చేయ‌కూడ‌ని త‌ప్పుచేశారు కాబ‌ట్టి.. జ‌న‌మంతా చీద‌రించుకుంటున్నారు కాబ‌ట్టి.. ఆ త‌ర్వాత‌ తేలుకుట్టిన దొంగ‌ల్లా.. నోరేసుకుప‌డే ఆ నేత‌ల నోళ్లకు తాళాలు ప‌డ్డాయని అంటున్నారు. త‌మ‌కు అంత‌గా వార్నింగ్ ఇచ్చిన బాల‌కృష్ణ‌ను ప‌రోక్షంగా దెబ్బ‌కొట్టేందుకే.. ఇప్పుడు హ‌డావుడిగా ఆ బిల్లు తీసుకొచ్చార‌ని భావిస్తున్నారు.  ఈ బిల్లుకు చాలా ప‌వ‌ర్ ఉంది. బెనిఫిట్ షోల భ‌ర‌తం ప‌డుతుంది. క‌లెక్ష‌న్ల‌కు బాగా డ్యామేజ్ జ‌రుగుతుంది. మొద‌ట ప‌వ‌న్ క‌ల్యాణ్ కోస‌మే ఈ రూల్స్ తీసుకొచ్చారు. ఇదేదో బాగుంద‌నుకొని.. ఇప్పుడు అఖండ మీదా ప్ర‌యోగించ‌బోతున్నారు. దారికి రాని టాలీవుడ్‌ను ఈ బిల్లుతో దారికి తెచ్చుకునే ఎదురుదాడి ఇది అంటున్నారు. తెలుగు సినిమా పెద్ద‌ల‌ను త‌మ చెప్పుచేత‌ల్లో పెట్టుకునేందుకే.. త‌మ‌కు గిట్ట‌ని, రాజ‌కీయ రంగు ఉన్న‌ సినిమాల‌ను, హీరోల‌ను తొక్కేసేందుకే ఇలాంటి రూల్స్ తీసుకొస్తున్నార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి.  మొద‌టి దెబ్బ ఇప్ప‌టికే వ‌కీల్‌సాబ్‌కు త‌గిలింది. సెకండ్ ఎఫెక్ట్ అఖండ‌పై ప‌డ‌నుంది. ఇక అస‌లు దిమ్మ‌తిరిగే షాక్ సంక్రాంతికి చూపించ‌నుంది. పొంగ‌ల్ బ‌రిలో నిలిచే.. RRR, భీమ్లా నాయ‌క్‌, రాధేశ్యామ్‌ల ప‌రిస్థితి మ‌రింత దారుణంగా మార‌నుంది. మ‌రి.. ఇంత మందిని, అంత పెద్ద సినిమాల‌ను దెబ్బ‌కొట్టి.. జ‌గ‌న్‌రెడ్డి ఏం సాధించాల‌నో? రాజ‌కీయంగా, అప్పుల రూపంలో ఆర్థికంగా ఎంత లాభ‌ప‌డాల‌నో? ఆ న‌లుగురికీ మ‌రింత‌ భ‌ద్ర‌త.. అంటే, మ‌రింత రెచ్చిపొమ్మ‌నేనా?