వాన్ పిక్ వ్యవహారంలో సిబీఐ చార్జిషీటు దాఖలు
వాన్ పిక్ వ్యవహారంలో సిబీఐ కొత్తగా మంత్రి ధర్మాన ప్రసాదరావును కూడా చేర్చింది. అప్పటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావును కూడా ముద్దాయిగా తేల్చింది. సిబీఐ ప్రధానంగా వాన్ పిక్ భూముల కేటాయింపుల విషయంలో నాంపల్లి కోర్టులో 14మందిని నిందుతులుగా, 177 పేజీల ఛార్జిషీటును దాఖలు చేసింది. ముద్దాయిలుగా 1-జగన్, 2-విజయసాయి రెడ్డి 3-నిమ్మగడ్డ ప్రసాద్, 4-మోపిదేవి వెంకటరమణ 5-ధర్మాన ప్రసాదరావు, 6-బ్రహ్మానంద రెడ్డి 7-మన్మోహన్ సింగ్ 8-శ్యామ్యూల్ 9- నిమ్మగడ్డ ప్రకాష్ 10-వాన్ పిక్ ప్రాజెక్ట్ 11-జగన్ పబ్లికేషన్స్ 12-రఘురాం సిమెంట్స్, భారతి సిమెంట్స్ 13-కార్మెల్ ఏషియా 14-సిలికాన్ బిల్డర్స్ పై సెక్షన్ 120 బి, 409, 419, 420, 468, 471 మరియు ఐ.పి.సి.9 11 12 12 (2) 13 రెడ్ విత్ సెక్షన్ల కింద కేసు నమోదు.