తలరాత బాగుండే కిరణ్ సీఎం అయ్యాడు: బొత్స

తలరాత బాగుండి మంత్రి కాకుండానే కిరణ్ నేరుగా ముఖ్యమంత్రి అయ్యారని బొత్సా వ్యాఖ్యానించారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో పెరిగిన ఫీజుల భారంపై పునరాలోచిస్తామని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. గత ప్రభుత్వాల నిర్ణయాలు తమకు గుదిబండగా మారాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఫెయిలైన విద్యార్థుల ఫీజులు చెల్లించాలా వద్ద అనే అంశంపై చర్చ జరగాలని ఆయన అన్నారు. ఇంజనీరింగ్లో కనీసం 35 శాతం ఉత్తీర్ణత కూడా ఉండటం లేదన్నారు. రాష్ట్ర కాంగ్రెస్లో కోవర్టులు ఎవరూ లేరని బొత్స అన్నారు. ధర్మాన కమిటీలో కొత్త విషయాలు ఏమి లేవని ఆయన తేల్చేశారు.

అద్వానీ, తెలంగాణా కాంగ్రెస్ ఎంపీల పైన సోనియా ఫైర్

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ బుధవారం తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుల పైన, బిజెపి పార్టీ అగ్ర నేత ఎల్ కె అద్వానీ పైన తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. విపక్షాలు వివిధ అంశాలు లేవనెత్తుతుండటంతో అసహనానికి గురైన సోనియా తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుల తెలంగాణా కోసం ఆదోళన చేయడంతో సోనియాలో ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. విపక్షాలకు మనకు తేడా ఏమిటని ఆమె సొంత పార్టీ ఎంపీలను ప్రశ్నించారు. సోనియాకు సర్ది చెప్పాలని వారు ప్రయత్నించినప్పటికీ అది కురదలేదు. సభలో గొడవ చేస్తే సహించేది లేదని, అంతగా అనుకుంటే బయటకు వెళ్లి నిరసన తెలియజేసుకోండని ఆమె వారిపై మండిపడ్డారు. సోనియా ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎంపీలు కిమ్మనకుండా సభ నుండి బయటకు వెళ్లి పోయారు. యుపిఐఏ-2 అక్రమమని అద్వాని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై సోనియా, అధికారపక్ష నేతలు మండిపడటంతో అద్వాని తను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు.

విలాస్ రావ్ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యుల్లో ఆందోళన

 ప్రస్తుత కేంద్ర శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన శాఖా మంత్రి విలాస్ రావ్ దేశ్ ముఖ్ పరిస్థితి మరింత విషమంగా మారింది. ఆయన ప్రస్తుతం కాలేయ సంబంధిత వ్యాధితో గత 24 గంటలుగా చెన్నై గ్లోబల్ ఆస్పత్రిలో ఆయ వెంటిలేటర్ సాయంతో శ్వాస తీసుకుంటున్నారు. విలాస్రావ్ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. ఆయన ఆరోగ్యం కాస్త బాగుపడితే కాలేయ మార్పిడి చేస్తారని సమాచారం. సినీనటుడు మరియు విలాస్ రావ్ దేశ్ ముఖ్ కుమారుడు రితేష్ దేశ్ ముఖ్ తన తండ్రికి తన కాలేయంలోని కొంత భాగాన్ని ఇవ్వడానికీ సిద్ధంగా ఉన్నా విలాస్ రావ్ దేశ్ ముఖ్ కు కొడుకు కాలేయం సరిపోతుందా లేదా అన్నది వైద్యులు నిర్వహించే పరీక్షలలో తేలనుంది.

లండన్ ఒలంపిక్స్ లో అభిషేక్ బచ్చన్

ఓమెగా వాచ్‌ కంపెనీ అంబాసిడర్‌గా బాలీవుడ్‌ స్టార్‌ అభిషేక్‌ బచ్చన్‌ లండన్‌ ఒలింపిక్స్‌లో పాల్గొన్నాడు. అథ్లెటిక్స్‌లో ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ ఈవెంట్లతో పాటు ఇండోర్‌ స్టేడియంలో బ్యాడ్మింటన్‌ మ్యాచ్‌లను అభిషేక్‌ ప్రత్యక్షంగా తిలకించాడు. ఒలింపిక్స్‌ లాంటి మెగా ఈవెంట్‌ను ప్రత్యక్షంగా చూడడం ఆనందంగా ఉందన్నాడు. మరీ ముఖ్యంగా 100 మీటర్స్‌ స్ప్రింట్‌ ఈవెంట్‌ను ప్రత్యక్షంగా చూడాలన్న తన కాంక్ష నెరవేరిందని ఫిల్మ్‌ స్టార్‌ తెలిపాడు. ఒలింపిక్స్‌ జ్యోతి ర్యాలీలో తన తండ్రి అమితాబ్‌ పాల్గొనడం అది మరో మరుపురాని సంఘటన అని అభిషేక్‌ గుర్తు చేశాడు.

ప్రియుడు ఆఫీస్‌లో ఆత్మహత్య చేసుకున్న టెక్కీ విశాలిని

ప్రియుడు పెళ్లి చేసుకుంటానని ప్రియుడు పెళ్లి చేసుకుంటానని టెక్కీ విశాలిని ఎస్ఆర్ నగర్‌ బల్కంపేటలోని తన ప్రియుడి ఆఫీస్‌లో ఉరి వేసుకొని మృతి చెందింది .గోషామహల్‌లోని హిందీ నగర్‌లో ఉంటున్న విశాలిని బల్కంపేటలోఉరేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. టెక్కీ విశాలిని సోదరుడి ఫిర్యాదు మేరకు ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆమె ప్రియుడు మణికంట పై ఎట్రాసిటీతో పాటు చీటింగ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.     విశాలిని, మణికంట మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వారిద్దరు కలిసి జెన్‌పాక్ట్ అనే సాఫ్టువేర్ కంపెనీలో సాఫ్టువేర్ ఇంజనీర్లుగా పని చేశారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లి చేసుకుంటానని విశాలినికి అతను ప్రామిస్ చేశాడు. అయితే అతను మాట తప్పడంతో డిప్రెషన్‌కు లోనైన విశాలిని అతని కార్యాలయంలోనే ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెబుతున్నారు.

నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు వేడివేడిగా సాగడానికి రంగం సిద్ధమైంది. అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థికవ్యవస్థ మొదలుకుని అస్సాం హింసాకాండవరకు అనేక అంశాలపై పాలకపక్షాన్ని ఎండగట్టడానికి విపక్షాలు అస్త్రశస్త్రాలతో తయారయ్యాయి. సామాన్యుడి జీవితాన్ని అధ్వానంగా మార్చిన ఆర్థికరంగం తీరుతెన్నులు, రిటైల్‌రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐలకు) అనుమతి, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో దుర్భిక్ష పరిస్థితులు, పవర్‌గ్రిడ్‌ల వైఫల్యంపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని విపక్షాలు కృతనిశ్చయంతో ఉన్నాయి. నేటి నుంచి సెప్టెంబర్ 7వ తేదీవరకు నెలరోజులపాటు జరిగే సమావేశాల్లో సెలవులు మినహాయిస్తే, ఉభయసభలు 20 రోజులపాటు పనిచేస్తాయి. ఈ 20 రోజుల్ని పూర్తిస్థాయిలో సద్వినియోగపర్చుకుని పెండింగ్ బిల్లులన్నింటికీ ఆమోదం సాధించాలని, కొత్తగా కొన్నింటిని ప్రవేశపెట్టాలని, చివర్లో లోక్‌పాల్ బిల్లును కూడా రాజ్యసభ ఆమోదానికి తేవాలని కేంద్రం నిర్ణయించింది.

వెంకన్నసేవకు చేనేత వస్త్రాలు:కె.బాపిరాజు

న్యూఢిల్లీ:ఇకపై శ్రీవారి సేవకు కూడా చేనేత వస్త్రాలనే వినియోగిస్తామని టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు చెప్పారు.ఆప్కో ద్వారా వీటిని కొనుగోలు చేస్తామన్నారు..శ్రీ వెంకటేశ్వరుని పూజకు ఎలాంటి రసాయన కలుషితాలు లేకుండా నేసిన వస్త్రాలను వినియోగించేలా త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో నిర్వహిస్తున్న మన గుడి కార్యక్రమంలో కూడా చేనేత వస్త్రాలే వినియోగిస్తామని చెప్పారు.దీనివల్ల ఇటు పవిత్రతను కాపాడటంతోపాటు చేనేత కార్మికులను ఆదుకున్నట్టు అవుతుందన్నారు. ఇందుకోసం ఏటా అయ్యే రూ.2 కోట్లు నేత కార్మికులకు అందితే భక్తులు ఇచ్చే విరాళాలు సైతం సద్వినియోగమవుతాయని చెప్పారు.

విషమంగానే విలాస్‌రావు దేశ్‌ముఖ్ ఆరోగ్యం

కేంద్రమంత్రి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. లివర్ తో పాటు, రెండు కిడ్నీలు చెడిపోవడంతో పరిస్థితి ఆందోళన మారింది. మొదట ముంబై బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స అందించిన డాక్టర్లు కండీషన్ సీరియస్ అవడంతో చెన్నై గ్లోబల్ ఆస్పత్రకి తరలించారు. సిర్రోసిస్ వ్యాధితో విలాస్ రావ్ దేశ్ ముఖ్ లివర్ పూర్తిగా చెడిపోయింది. కొత్తది అమరిస్తే తప్ప ఆయన ఆరోగ్యం కష్టమని భావిస్తున్నారు డాక్టర్లు. అయితే దీనిపై ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం ఆయన పరిస్థితి క్రిటికల్‌గానే ఉందటున్నారు. బాడీలో ఏమాత్రం కుదటపడ్డ లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయడం సాధ్యమవుతు౦దన్నారు.

బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ కు ఘన స్వాగతం

బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ మంగళవారం హైదరాబాద్ చేరుకుంది. లండన్‌ ఒలింపిక్స్‌లో కాంస్యం అందుకున్న ఆమెకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. తండ్రి హర్‌వీర్‌ సింగ్‌, కోచ్‌ గోపిచంద్‌తో నగరానికి చేరుకున్న సైనాకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌ విమానం ద్వారా ఈరోజు ఉదయం ఢిల్లీకి చేరుకున్న సైనా ఆ తర్వాత హైదరబాద్‌కు వచ్చింది.  20 ఏళ్ల సైనా ఆనందంగా చేతులు ఊపుతూ అభిమానులకు సంకేతాలచ్చింది. ఓపెన్‌ టాప్‌ బస్‌లో కాంస్య పతక విజేత సైనా ర్యాలీ నిర్వహించారు. ఆమెను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. బ్యాడ్మింటన్‌లో పతకం గెలిచిన తొలి భారతీయురాలిగా సైనా రికార్డ్‌ సృష్టించింది. సిడ్నీ ఒలింపిక్స్‌లో కరణం మల్లీశ్వరి వెయిట్‌ లిఫ్టింగ్‌లో కాంస్య పతకం సాధించిన తర్వాత ఒలింపిక్స్‌ పతకం అందుకున్న రెండవ మహిళ సైనా కావటం విశేషం.

14న విజయవాడకు చంద్రబాబు

చంద్రబాబు విజయవాడ పర్యటనకు జిల్లా,అర్బన్ పార్టీ నేతలు రూట్ మ్యాప్ ఖరారు చేశారు. కోస్తా జిల్లాల ముస్లిం మైనారిటీ సోదరులతో నిర్వహించే ముఖాముఖి కార్యక్రమాన్ని ఈ నెల 14వ తేదీన నగరంలోని శేషసాయి కళ్యాణమండపంలో నిర్వహించేందుకు నిర్ణయించారు. ఈ వివరాలను సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నాగుల్‌మీరా అధికారికంగా ప్రకటించారు. ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ సమయంలో మైనారిటీ సోదరులను రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు మూడు ప్రాంతాలలో కలుసుకోవాలని భావించారని చెప్పారు. ఈ మేర విజయవాడకు అవకాశం దక్కిందన్నారు. ఈ ముఖాముఖి కార్యక్రమానికి కోస్తా జిల్లాల మైనారిటీ సోదరులతో పాటు జిల్లా, అర్బన్ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరౌతారని ఆయన చెప్పారు.  

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు సగం సీట్లు: చంద్రబాబు

స్థానిక సంస్థల ఎన్నికలలోనూ, నామినేటెడ్ పదవుల్లోనూ బిసిలకు సగం సీట్లు కేటాయిస్తామని, ప్రతి రెండు జెడ్పీటిసి స్థానాలలో ఒక బిసి ఉండేలా, ప్రతి రెండు నామినేటెడ్ పోస్టుల్లో ఒక బిసి ఉండేలా చూస్తామని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారం చిత్తూరు జిల్లాలో అన్నారు. ఏడాది కాలంగా పక్కన పడేసిన బిసి రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ఆమోదించడం కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తామన్నారు. వెనుకబడిన వర్గాలకు దేశవ్యాప్తంగా చట్టసభలలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించడానికి టిడిపి ప్రయత్నాలు చేస్తోందన్నారు. అసెంబ్లీలో బిసిలకు 100 సీట్లు ఇస్తామని, బిసి వర్కాల ఆర్థికాభివృద్ధికి రూ.10వేల కోట్లతో ఉప ప్రణాళిక ప్రవేశ పెడతామన్నారు. తమ ఈ ప్రకటనతో ఆ వర్గాల్లో చైతన్యం వచ్చిందని, ఇక తమ బతుకులు బాగుపడతాయనే నమ్మకం పెరిగిందన్నారు. టిడిపి తీర్మానాన్ని జీర్ణించుకోలేని పార్టీలు అదెలా సాధ్యమని ప్రశ్నిస్తున్నాయని, వంద సీట్లు బిసిలకు కేటాయించి ఇది సాధ్యమని నిరూపించి నిజాయితీ నిలుపుకుంటామని బాబు అన్నారు.

శ్రీలంకతో భారత్ టి20 మ్యాచ్ నేడు

శ్రీలంకలోనే సెప్టెంబరులో జరిగే టి20 ప్రపంచకప్‌కు సన్నద్ధం కావడానికి, పరిస్థితులను అర్థం చేసుకోవడానికి భారత జట్టుకు ఇది ఆఖరి అవకాశం. ఐదు వన్డేల సిరీస్‌ను విజయవంతంగా ముగించిన ధోనిసేన పర్యటనలో ఆఖరి మ్యాచ్, ఏకైక టి20లో మంగళవారం శ్రీలంకతో తలపడుతుంది. ప్రపంచకప్‌కు జట్టు ఎంపిక చేయడానికి ముందు భారత్ ఆడే చివరి టి20 కూడా ఇదే. కాబట్టి జట్టులో స్థానం ఆశిస్తున్న కుర్రాళ్లందరూ సత్తా నిరూపించుకోవడానికి ఇది ఆఖరి అవకాశం.   గాయం కారణంగా ఆఖరి వన్డేకు దూరమైన సెహ్వాగ్‌తో పాటు జహీర్ ఖాన్ కూడా ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండటంలేదు. ఇద్దరూ గాయాల కారణంగా స్వదేశానికి వచ్చారు. ఫామ్ పరంగా భారత్ అన్ని విభాగాల్లోనూ బలంగానే కనిపిస్తోంది. ముఖ్యంగా కోహ్లి, రైనా, ధోని, గంభీర్ జోరుమీదున్నారు. ఆల్‌రౌండర్ ఇర్ఫాన్‌తో పాటు స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్ విభాగంలో కీలకం. అటు శ్రీలంక జట్టుకు సంగక్కర సేవలు అందుబాటులో లేవు. జయవర్ధనే, దిల్షాన్, మాథ్యూస్, పెరీరా కీలక ఆటగాళ్లు.