ట్వంటీ20 ప్రపంచ కప్ కు యువరాజ్ సింగ్ ఎంపిక
క్యాన్సర్ వ్యాధి చికిత్స తరువాత యువరాజ్ సింగ్ భారత జట్టులోకి తిరిగి వచ్చాడు. శ్రీలంకలో జరిగే ఐసిసి ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీలకు యువరాజ్ సింగ్ ఎంపికయ్యాడు. ఐసిసి ట్వంటీ20 ప్రపంచ కప్ కు 15 మందితో కూడిన భారత జట్టుకు యువరాజ్ సింగ్ను బిసిసిఐ సెలెక్టర్లు ఎంపిక చేశారు. యువరాజ్ సింగ్ గత సంవత్సరం నవంబర్లో వెస్టిండీస్తో జరిగిన టెస్టు మ్యాచులో చివరిసారి ఆడాడు. అప్పటి నుంచి అతను క్రికెట్ క్రీడకు దూరంగానే ఉన్నాడు. హర్భజన్ సింగ్తో పాటు లక్ష్మీపతి బాలాజీ, పియూష్ చావ్లాలకు ట్వంటీ20 జట్టులో తిరిగి స్థానం లభించింది.
భారత జట్టు వివరాలు : ఎంఎస్ ధోనీ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్, సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, మనోజ్ తివారీ, జహీర్ ఖాన్, అశోక్ దిండా, ఆర్ అశ్విన్, పియూష్ చావ్లా, లక్ష్మీపతి బాలాజీ, హర్భజన్ సింగ్, రోహిత్ శర్మ