తెలుగు తల్లిని దేయ్యమంటున్న కేసిఆర్

సీమాంధ్రులపై టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు మరోసారి విరుచుకుపడ్డారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సభలోఆయన ప్రసంగించారు. తెలుగుతల్లి మా పాలిట దెయ్యమని, తెలుగుతల్లి మాకెలా తల్లి అవుతుందని అన్నారు. మా తెలంగాణ తల్లి మాకుందని అన్నారు. నన్నయ్య ఆదికవి కానేకాదని తేల్చిచెప్పారు. 'నన్నయ్య కవిత్వం రాయలేదు. సంస్కృతం లో ఉన్న మహాభారతాన్ని తెలుగులోకి అనువదించారు. ఆయన అనువాద కవి మాత్రమే. బసవ పురాణం రాసిన పాల్కురికి సోమనాథుడే ఆదికవి అని చెప్పారు.   జిల్లాలు, జనాభా ఎక్కువగా ఉన్న ఆంధ్రా ప్రాంతం కన్నా తెలంగాణ నుంచి ఎక్కువ ఆదాయం రావడం ఏమిటని నేను ప్రశ్నించాను. దీన్ని పరిశోధించమని చెప్పాను. చివరికి తేలింది ఏమంటే ఆంధ్రాలో పన్నుల ఎగవేత ఎక్కువ. వాళ్లు చట్టాలను ఉల్లంఘిస్తారు. అదే తెలంగాణ వాళ్లు నిజాయతీగా పన్నులు చెల్లిస్తారు. చట్టాలను గౌరవిస్తారు. తక్కువ జనాభా ఉన్నా తెలంగాణ నుంచే ఆదాయం ఎక్కువ అని వ్యాఖ్యానించారు.

నీలిమ మృతి దర్యాప్తుపై పోలీసుల నిర్లక్ష్యం

రోజులు గడుస్తున్నా ఇన్పోసిస్‌ ఉద్యోగిని నీలిమ మృతిపై మిస్టరీని మాత్రం పోలీసులు చేధించలేకపోతున్నారు.  పోలీసులు ఆమె మరణానికి బాధ్యుల ఎరన్నది తేల్చలేకపోతున్నారు. ఎంతవరకు బాధితురాలి కుటుంబసభ్యులను, స్నేహితులను మాత్రమే విచారించటానికి సమయం తీసుకుంటున్న పోలీసులు చిన్న చిన్న ఘటనలకే జాగిలాలను రప్పిస్తారు అలాంటిది  నీలిమ హత్యా జరిగిన వెంటనే పోలీసు జాగిలాలను ఘటనా స్ధలానికి ఎందుకు పంపలేదు?కేవలం ఆసుపత్రికి వెళ్లటానికి మాత్రమే ఎందుకు పరిమితమయ్యారు...డాగ్‌స్కాడ్‌ గాని క్లూస్‌ టీం గాని ఎందుకు అదే రోజు పరిశీలించలేదనేది ప్రజలను వేధిస్తున్న ప్రశ్న.   ఇన్పోసిస్‌ సంస్ధ ఇచ్చిన సమాచారం పైన,  ఆ అమ్మాయి లాప్‌ట్యాప్‌, సెల్‌ఫోన్‌ మీద  మాత్రమే ఎందుకు పోలీసులు ఆధారపడుతున్నట్లు...అలాగే ఏడవ అంతస్తులో నీలిమ చని పోతే పదవ అంతస్తులో హ్యాండ్‌ బ్యాగ్‌ ఎందుకు పడి వున్నట్లు ? ఈ ప్రశ్నలన్నిటికీ పోలీసులు సమాదానం చెప్పవలసి ఉంది. ఈ రోజుల్లో ఎవరైనా చీటీలో ఫోన్‌ నెంబర్లు పెట్టుకుంటున్నారా...  అది నిజంగానే నీలిమా హ్యాండ్‌ రైటింగేనా అనే అను మానం ఎవరికైనా రాకతప్పదు. 9 గంటలకు భర్తతో మాట్లాడిన నీలిమ నీరసంగా ఉన్నదని రేపు ఉదయాన్నే ఇంటికి వచ్చి తీసుకెళ్లమని చెప్పినట్లు తెలుస్తుంది అంతలోనే ఎందుకు ఆత్మహత్యచేసుకుంటుంది..... ఇన్పోసిస్‌ 8.40 గంటల నుండి 9.40 గంటల వరకు మాత్రమే వీడియో క్లిప్పింగ్‌లను ఇచ్చి చేతులు దులుపుకోవటంలో ఆంతర్యమేమిటి  పోలీసులకు ఎవరినుండి వత్తిళ్లు ఎదుర్కొంటున్నారు. మంచి సంస్ధగా పేరున్న ఇన్పోసిస్‌ తన నిర్ధోషకత్యాన్ని  నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమయ్యింది.

వీడుతున్న నీలిమ మృతి మిస్టరీ

ఇన్ఫోసిస్ కార్యాలయంపై నుంచి దూకి మరణించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నీలిమ మృతి మిస్టరీని ఛేదించే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మృతికి ముందు ఇన్ఫోసిస్ మాజీ ఉద్యోగి ప్రశాంత్, సంస్థలోని ఇతర స్నేహితులకు పంపిన ఈ మెయిళ్లను పోలీసులు తెరిచి చూశారు. ఈ మెయిల్స్‌ను, మెసేజ్‌లను, ఫోన్ కాల్స్‌ను పోలీసులు పరిశీలించారు. వీటి ఆధారంగా ఆమె తీవ్ర మానసిక ఒత్తిడితో మృతి చెంది ఉంటుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. వీటి ఆధారంగా పోలీసులు ఒక అభిప్రాయానికి వచ్చారు. నీలిమది ఆత్మహత్యే అయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని వారు భావిస్తున్నారు. ఆ కోణంలోనే దర్యాఫ్తును ముమ్మరం చేశారు. నీలిమ నుంచి చివరి కాల్ అందుకున్న వ్యక్తి ప్రశాంత్ విశాఖపట్నంలో ఉన్నట్లుగా ఇప్పటికే సెల్ ఫోన్ టవర్ ఆధారంగా గుర్తించారు. ఆమె భర్త సురేష్‌ని విచారించారు. ఈ కేసును వీలైనంత త్వరగా ఛేదించే ప్రయత్నాల్లో పోలీసులు నిమగ్నమయ్యారు.  

గుంటూరు, కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు

ఉభయగోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నారు. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వేలాది ఎకరాల్లో పంటపొలాలు నీట మునిగాయి. * కృష్ణా జిల్లాలోని కంచికర్ల -మోగులూరు దగ్గర సుద్దవగు పొంగిపొర్లుతుండటంతో అక్కడి పంటపొలాలు నీటమునిగాయి. * రాజమండ్రి ధవళేశ్వరం దగ్గర వరద ఉదృతి అధికంగా ఉండటంతో అధికారులు 4లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. * సాంకేతిక లోపం కారణంగా శ్రీకాకుళం జిల్లా సముద్రతీరంలో గల్లంతైన తండంగి మండలం హుకుంపేటకు చెందిన ఆరుగురు మత్స్యకారుల ఆచూకి కళింగపట్నం సమీపంలో లభ్యమైంది. వారిని వేరే బోటు సహాయంతో ఒడ్డుకు చేర్చేందుకు అధికారులు యత్నిస్తున్నారు. * ప.గో జిల్లాలో భారీ వర్షాల కారణంగా 400 హెక్టార్లలో వరినాళ్లు 1600 హెక్టార్లలో నారుమళ్లు నీటమునిగాయి. జీలుగుమిల్లి మండలంలో జిల్లేరు, బైనేరు వాగు పొంగిపొర్లుతుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి.  

కాశీ యాత్రకు వెళ్లి వరదల్లో చిక్కుకున్న ఆంధ్రులు

భారీ వర్షాల కారణంగా వరదలు ఉత్తర భారత దేశాన్ని ముంచెత్తుతున్నాయి. ఈ వరదలలో ఆంద్రప్రదేశ్ కి చెందిన యాత్రికులు కూడా చిక్కుకున్నారు. కాశీ యాత్రకు వెళ్లిన ఇరవై మంది గుంటూరు, కృష్ణా జిల్లా వాసులు అక్కడి వరదల్లో చిక్కుకున్నారు. ఉత్తర కాశీ వద్ద రెండు జిల్లాలకు చెందిన ఇరవై మంది భక్తులు గంగోత్రి వెళ్లేందుకు మూడు రోజుల నుంచి పడిగాపులు కాస్తున్నారు. పోలీసులను ఆశ్రయించినా ఫలితం దక్కడం లేదని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. వెంటనే తమకు సహాయ చర్యల అందించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

నేను జగన్ పార్టీలో చేరలేదు: లక్ష్మీ పార్వతి

ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి ఆదివారం నెల్లూరు జిల్లా కావలిలోస్థానిక కలుగోళశాంభవి ఆలయంలో జగన్ జైలు నుంచి విడుదల కావాలని పూజలు చేశారు. అ తరువాత మీడియాతో మాట్లాడుతూ తను జగన్ పార్టీలో చేరలేదు అని అన్నారు. జగన్ కష్టాల్లో ఉన్నాడని ఉపఎన్నికల్లో ఆయన పార్టికి మద్దతు ఇచ్చానని అన్నారు. స్వర్గీయ ఎన్‌టిఆర్ తర్వాత సమర్థుడైన నాయకుడు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డియే అన్నారు. జూనియర్ ఎన్టీఆర్‌లో ఎన్టీఆర్ లక్షణాలు, చరిష్మా మెండుగా ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలలో ఘోరంగా విఫలమైందన్నారు.

అమెరికాలో గురుద్వార్ వద్ద కాల్పులు, 7మృతి

అమెరికాలో కాల్పుల సంస్కృతి మరోసారి జడలు విప్పింది ఇక్కడి విస్కాన్సిన్‌లోని, ఓక్ క్రీక్ ప్రాంతంలో ఉన్న గురుద్వారా (సిక్కుల ప్రార్థనామందిరం) వద్ద గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా 20-30 మంది తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. చనిపోయినవారిలో కాల్పులు జరిపిన వ్యక్తి, ఒక పోలీసు అధికారి ఉన్నట్టు తెలుస్తోంది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం పదకొండుగంటల సమయంలో ఈ దారుణం జరిగినట్టు స్థానిక పత్రిక మిల్వాకీ సెంటినల్ తెలిపింది. స్లీవ్‌లెస్ టీషర్టు ధరించి, బట్టతలతో ఉన్న భారీకాయుడు ఒకడు రెండు హ్యాండ్‌గన్స్‌తో ఈ కాల్పులు జరిపాడని ప్రత్యక్షసాక్షులు తెలిపినట్టు తన కథనంలో పేర్కొంది. విషయం తెలిసిన వెంటనే ఒక పోలీసు అక్కడికి చేరుకుని.. కాల్పులు జరుపుతున్న అగంతుకుడితో తలపడ్డారని.. పలు బుల్లెట్ గాయాలైనా లెక్కచేయక ముష్కరుణ్ని మట్టికరిపించగలిగారని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.

బెటాలియన్ లో పోలీసుల భార్యలు ధర్నా

ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ (ఎపిఎస్పి) కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు రాష్ట్రవ్యాప్తంగా తిరుగుబాటు చేస్తున్నారు. ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. వారి ఆందోళన ఉధృతమైంది. ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న కానిస్టేబుళ్ల భార్యలను అదుపు చేయడం ఎవరి వల్లా కావడంలేదు. కానిస్టేబుళ్ల చేత పోలీస్ ఉన్నతాధికారులు ఇళ్లలో పనులు చేయిస్తున్నారని, ఆర్డర్లీ వ్యవస్థని కొనసాగిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. అలాగే తమ భర్తలకు సెలవులు ఇవ్వడంలేదని, వారిని దూర ప్రాంతాలలో ఎక్కువ కాలం ఉంచి తమ కుటుంబాలకు దూరం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   కానిస్టేబుళ్ల భార్యలు, ఇతర కుటుంబ సభ్యులు నిన్న హైదరాబాద్ కొండాపూర్లోని ఎపిఎస్పి 8వ బెటాలియన్ మెయిన్ గేట్ వద్ద ధర్నా చేశారు. ఈ రోజు కూడా వారు ధర్నా చేస్తున్నారు. హాం మంత్రి సబిత వచ్చి హామీ ఇస్తేనే తాము ఆందోళన విరమిస్తామని వారు చెబుతున్నారు. ఈ రోజు ఉదయం విజయనగరం జిల్లా చింతవలసలోని ఎపిఎస్పి 5వ బెటాలియన్ మెయిన్ గేటు వద్ద పోలీసుల భార్యలు, కుటుంబ సభ్యులు ధర్నా చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం గుడిపేటలోని ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ (ఎపిఎస్పి) 13వ బెటాలియన్ వద్ద కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు ధర్నా, రాస్తారోకో చేస్తున్నారు. సిఐ వెంకటేశ్వర రావు అనుచితంగా మాట్లాడారని వారు ఆరోపిస్తున్నారు. డ్యూటీల పేరిట అధికారులు తమ భర్తలను వేధిస్తున్నారని వారు వాపోతున్నారు. ఆగ్రహంతో వారు జాతీయ రహదారిని దిగ్బంధించారు. 43వ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. డిజిపి వచ్చి హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని వారు భీహ్మించుకు కూర్చున్నారు.