మంత్రి దానం పై కేసు బుక్ చేసిన పోలీసులు
బంజారాహిల్స్ లోని లక్ష్మీనరసింహ ఆలయాన్ని ఇస్కాన్ సంస్థకు లీజు ఇచ్చే విషయంలో మంత్రి దానం నాగేంద్ర తన అనుచరులతో అక్కడికి చేరుకొని దేవాలయం గేటుకి తాళం వేశారు. పోలీసులు దానం నాగేందర్ ను అడ్డుకోబోతే ఆయన పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. ఈ వివాదంలో జూబ్లీజిల్స్ పోలీస్ స్టేషన్ లో దానం నాగేందర్, అతని అనుచరులపై పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని వారిపై 143, 353, 341, 504, 506, 427 రెడ్ డెత్, 34సెక్షన్ ల కింద కేసును నమోదు చేశారు.