పండక్కి గ్యాస్ కొరత

 

రాష్ట్రంలో గ్యాస్ కొరత చాలా కుటుంబాల్ని వేధిస్తోంది. పండగ రోజునకూడా దాదాపుగా 15 లక్షల కుటుంబాలకు గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేకుండా పోతున్నాయ్. కట్టెల పొయ్యి వెలిగించుకుని కన్నీళ్లను తుడుచుకుంటూ పిండివంటలు చేసుకోవడంతప్ప వీళ్లందరికీ మరో మార్గం లేదు. రాష్ట్రంలో గ్యాస్ కనెక్షన్లు విపరీంతగా పెరిగిపోతున్నాయ్. ప్రస్తుతం దాదాపు కోటిన్నరకు పైగా కనెక్షన్లున్నాయ్. వీళ్లందరికీ గ్యాస్ సరఫరా చేయాలంటే కనీసం 90 లక్షల సిలిండర్లు అవసరం పడతాయ్.. కానీ.. ప్రస్తుతం సరఫరాలోఉన్న సిలిండర్లు కేవలం 55 లక్షలు మాత్రమే.. ఎనిమిదేళ్ల క్రితం ఏ పరిస్థితి ఉందో ఇప్పటికీ అదే పరిస్థితి గ్యాస్ సరఫరా విషయంలో రాష్ట్రంలో కొనసాగుతోంది. పెరిగిన కనెక్షన్లకు అనుగుణంగా సిలిండర్లనుకూడా పెంచాల్సిన చమురు సంస్థలు వినియోగదారుల కష్టాలుచూస్తూ ఆటలాడుకుంటున్నాయ్. ఏమన్నా అంటే కొరత అనే తిరుగలేని అస్త్రం ఉండనే ఉంది కదా మరి.. ఇప్పటికే నానారకాలుగా తిప్పలు పెట్టి, రకరకాలుగా ఇబ్బందులు పెట్టి సబ్సిడీ మా కొద్దూ బాబూ కేవలం గ్యాస్ సిలిండర్లు ఇస్తే చాలు అనిపించే దిశగా చమురుసంస్థలు చేస్తున్న ప్రయాత్నాలు కాస్తోకూస్తో వినియోగదారులమీద పనిచేస్తున్నట్టే కనిపిస్తున్నాయ్.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.