భారత్ అదుపులో టెర్రరిస్ట్ ఫసీ అహ్మద్
posted on Oct 23, 2012 @ 10:06AM
మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, ఇండియన్ ముజాహిదీన్ సంస్థ సభ్యుడు ఫసీ అహ్మద్ పట్టుబడ్డాడు. భారత్ లో జరిగిన అనేక ఉగ్రవాద కార్యకలాపాల్లో అహ్మద్ కీలక నిందితుడు. భారత ప్రభుత్వ అభ్యర్ధనపై సౌదీ సర్కారు ఫసీని ఢిల్లీ పోలీసులకు అప్పగించింది. 2010లో ఢిల్లీలో జరిగిన జామా మస్ జిద్ పేలుళ్లు, బెంగళూర్ చిన్నస్వామి స్టేడియంలో జరిగిన పేలుళ్ల కేసుల్లో ఫసీ ప్రథాన నిందితుడు. కరుడుగట్టిన ఉగ్రవాది ఫసీ.. సౌదీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఉద్యోగం చేస్తున్నట్టు సమాచారం. ఇండియన్ ముజాహిదీన్ ఛీప్ రియాత్ కి ఫసీ అత్యంత సన్నిహితుడు. ముంబై పేలుళ్లతో సంబంధం ఉన్న అబూ జిందాల్ ని కూడా సౌదీ ప్రభుత్వం భారత్ కి అప్పగించింది.