చంద్రబాబు తెలంగాణ యాత్ర

 

తెలుగుదేశం పార్టీ అధినేత చేపట్టిన వస్తున్నా మీకోసం యాత్ర సోమవారం మధ్యాహ్నానికి తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. మహబూబ్ నగర్ జిల్లా రాజోలి దగ్గర చంద్రబాబు తెలంగాణలోకి అడుగుపెడుతున్నారు. బాబుని అడ్డుకుని తీరతామంటూ బీరాలు పలికిన తెలంగాణ వాదులంతా ఇప్పుడు పూర్తిగా చప్పబడిపోయినట్టు కనిపిస్తోంది. చంద్రబాబు యాత్రని అడ్డుకోబోమని, కేవలం నిరసన తెలిపి ఊరుకుంటామని పొలిటికల్ జెఎసి చైర్మన్ కోదండరామ్ తేల్చిపారేశారు. అటు టిఆర్ ఎస్ కూడా చంద్రబాబు తెలంగాణ యాత్ర విషయంలో స్తబ్దుగానే ఉంది. భవిష్యత్తులో ఎలాంటి అవసరాలు వస్తాయో ఎలా నెట్టుకురావాల్సొస్తుందో తెలీదు కనుక చంద్రబాబుతో వైరం పెట్టుకుంటే నష్టమే తప్ప లాభం ఏమీ లేదన్న విషయం ఆ పార్టీకికూడా స్పష్టంగా తెలుస్తూనే ఉంది. హరీష్ రావ్ లాంటి పెద్ద తలకాయలుకూడా ఈ విషయాన్ని బాహాటంగానే అంగీకరిస్తున్నారుకూడా . పైగా ఇక్కడింకో చిక్కుంది. టిఆర్ ఎస్ విరగబడి నిరసన తెలిపినంతమాత్రాన టిడిపికి వచ్చే నష్టం ఏం లేదు. పైగా ఆ ప్రార్టీకి, పాదయాత్ర చేస్తున్న చంద్రబాబుకి అనవసరంగా విస్తృతమైన ప్రచారం కల్పించినట్టువుతుందేమోనన్న మీమాంసకూడా జనంలో గట్టిగానే ఉంది. మరోవైపు చంద్రబాబుకి ఘన స్వాగతం చెప్పేందుకు రాజోలిదగ్గర 30మంది ఎమ్మెల్యేలు, టిడిపి నేతలు కాచుక్కూర్చున్నారు. కొందరు కరుడుగట్టిన తెలంగాణ వాదులు మాత్రం ఆరునూరైనా చంద్రబాబుకి తడాఖా చూపించి తీరాలని గట్టిగానే నిర్ణయించుకున్నారు. అందుకే ఈ తెల్లవారు జామున కరీంనగర్ లోని టిడిపి కార్యాలయాన్ని అగ్గిపాలుజేసి బాబు తెలంగాణ యాత్రపై తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.