యశోచోప్రా కన్నుమూత

 

రొమాన్స్ చిత్రాల రారాజు యశ్ చోప్రా కన్నుమూశారు. హిందీ సినిమాల్లో ప్రేమభావాల్ని పండిచడంలో మాస్టల్ అని ఈయనకు పేరుంది. జబ్ తక్ హై జాన్.. యశ్ చివరి చిత్రం.. ఎనభై ఏళ్ల చోప్రా, డెంగీ జ్వరం కారణంగా మరణించారు. ఈ నెల 13న లీలావతి ఆసుపత్రిలో చేరిన ఆయన చివరికంటా మృత్యువుతో పోరాడారు. సోమవారం ఉదయం 9 గంటలనుంచి 12 గంటలవరకూ అంధేరీలో ఉన్న యశ్ రాజ్ ఫిల్మ్ స్టూడియోలో యశ్ చోప్రా మృతదేహాన్ని అభిమానుల సందర్శనార్ధం ఉంచాలని నిర్ణయించారు. ఇద్దరు కుమారుల్లో ఆదిత్య చోప్రా సినీ దర్శకుడు, ఉదయ్ చోప్రా నటుడు, నిర్మాత. యశో చోప్రాని దాదా సాహెబ్ ఫాల్కే, పద్మభూషణ్ పురస్కారాలు వరించాయి. సిల్ సిలా, త్రిశూల్, చాందిని, దిల్ తో పాగల్ హై, దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే, మొహబ్బతే, వీర్ జారా లాంటి చిత్రాల్లో యశ్ చోప్రా రొమాన్స్ ని పండించిన తీరుని ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారని బాలీవుడ్ సినీ ప్రముఖులు అంటున్నారు. 1932 సెప్టేబర్ 27న లాహోర్ లో ఓ పంజాబీ కుటుంబంలో జన్మించారు యశ్ చోప్రా. దేశ విభజన తర్వాత ఆయన కుటుంబం భారత్ కి వచ్చేసింది. పెద్దన్నయ్య బీఆర్ చోప్రా దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన యశ్.. 1959లో ధూల్ కా పూల్ సినిమాతో దర్శకుడిగా మారారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.