కేజ్రీవాల్ పై షీలా దీక్షిత్ పరువునష్టం దావా
posted on Oct 23, 2012 9:23AM
ఓ టీవీ షోలో దలాల్ అంటూ షీలాదీక్షిత్ ని సంబోధించినందుకు ఆమె కేజ్రీవాల్ పై పరువునష్టం దావా వేశారు. బ్రోకర్ అన్న పదాన్ని ఉపయోగించడం తప్పన్న విషయంకూడా తెలీని స్థితిలోకి కేజ్రీవాల్ జారిపోవడం శోచనీయమని ఆమె అన్నారు. వ్యక్తిగత ఛరిష్మాని పెంచుకునేందుకు, రాజకీయ లబ్ధి పొందేందుకు రాజకీయనేతలమీద ఆరోపణలు గుప్పించడం ఓ ఫ్యాషనైపోయిందని షీలా వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ సామాజిక కార్యకర్త స్థాయినుంచి స్వలాభంకోసం పాకులాడే స్థాయికి దిగజారిపోయారన్న విషయాన్ని జనం స్పష్టంగా గమనిస్తున్నారన్నారు. షీలా రాజకీయ సలహాదారు పవన్ ఖేరా.. కేజ్రీవాల్ కి పరువునష్టం దావా నోటీసులు పంపించారు.