పిల్ల సజ్జలకు జైలేనా?

వైసీపీ హయాంలో సకల శాఖల మంత్రిగా సజ్జల రామకృష్ణారెడ్డి ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగింది. ఒక విధంగా చెప్పాలంటే ఆయనే డిఫాక్టో సీఎంగా రాజ్యమేలారు. జగన్ మాటలను ఆయన తన నోటితో వినిపించారు. ఆయన ఆదేశాలను తన చేతులతో అమలు చేశారు. జగన్ హయాంలో కేబినెట్ అన్నది నామమాత్రమే అయిపోయింది. మంత్రివర్గ శాఖల సమీక్షలు కూడా సజ్జలే చేశారు. మంత్రులకు బదులుగా మీడియా ముందుకూ ఆయనే వచ్చే వారు. ఆ అధికారాన్ని అడ్డు పెట్టుకునే సజ్జల రామకృష్ణారెడ్డి తన కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డికి వైసీపీ సోషల్ మీడియా వింగ్ బాధ్యతలను అప్పగించారు.  పిల్ల సజ్జల చేతికి వైసీపీ సోషల్ మీడియా వింగ్ పగ్గాలు వచ్చిన క్షణం నుంచి ఆయన పేనుకు పెత్తనం ఇస్తే.. అన్నట్లుగా చెలరేగిపోయారు. పేనుకు పెత్తనం ఇస్తే.. అన్న సామెత చందంగా వ్యవహ రించారు.  తెలుగుదేశం పార్టీ,   ఆ పార్టీ నాయకులు, ఆ పార్టీలోని మహిళా నేతలు, ఆ పార్టీ అధినేత చంద్రబాబు కుటుంబ సభ్యులపై అత్యంత దారుణమైన, అసభ్యకరమైన పోస్లులతో రెచ్చిపోయారు. సజ్జల భార్గవ రెడ్డి హయాంలో వైసీపీ సోషల్ మీడియా వెర్రి పుంతలు తొక్కింది. సరే వైసీపీ ఘోర పరాజయంలో ఆ పార్టీ సోషల్ మీడియా పాత్ర కూడా గణనీయంగానే ఉందనడంలో సందేహం లేదు. వైసీపీ పరాజయం తరువాత సజ్జల భార్గవ్ రెడ్డిని కేసుల నుంచి తప్పించేందుకు ఆయన తండ్రి సజ్జల రామకృష్ణారెడ్డి చేయగలిగినంతా చేశారు. పార్టీ ఓటమి పాలు కాగానే చడీ చప్పుడూ లేకుండా ఆయనను సోషల్ మీడియా పదవి నుంచి తప్పించి.. రాష్ట్రం దాటించేశారు. ఫోన్ లో కూడా అందుబాటులో లేకుండా చేశారు.  ఎన్ని చేసినా చేసినా కర్మ ఫలం అనుభవించాల్సిందేగా?    సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల వ్యవహారంలో  తనపై నమోదైన కేసులో అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు కోసం పిల్ల సజ్జల ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  సజ్జల భార్గవ్ రెడ్డి యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ పై హైకోర్టు శుక్రవారం ( ఫిబ్రవరి 21) విచారించింది. ఆ సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యలను గమనిస్తే పిల్ల సజ్జలకు యాంటిసిపేటరీ బెయిలు లభించడం అనేమానమే అని న్యాయనిపుణులు చెబుతున్నారు.  పిల్ల సజ్జల కటకటాలు లెక్కించక తప్పదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. నెటిజనులు సైతం పిల్ల సజ్జలకు బెయిలా? జైలా అంటూ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.  పిల్ల సజ్జల యాంటిసిపేటరీ బెయిలు విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.  సోషల్ మీడియా వేదికగా వస్తున్న అసభ్యకర పోస్టులను కట్టడి చేయాల్సిందేనని కుండబద్దలు కొట్టింది.  వ్యక్తుల ప్రతిష్ఠకు భంగం కలిగేలా అసభ్య పోస్టులు పెట్టడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అలాగే  సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల నిరోధానికి చర్యల వివరాలను తమకు నివేదించాలని ఆదేశించింది.  పిల్ల సజ్జల యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ ను వ్యతిరేకిస్తూ పోలీసుల తరఫున వాదనలు వినిపించిన పీపీ లక్ష్మీనారాయణ  తప్పుడు పోస్టులు పెట్టేందుకు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ సోషల్‌ మీడియా కార్యాలయంలో 400 మందికి పైగా పని చేశారని తెలిపారు. ప్రధాన కార్యాలయం నుంచి వచ్చిన పోస్టులు, ఫొటోలను వివిధ గ్రూపుల్లో పోస్టు చేసేవారని దానికి డబ్బులు చెల్లించేవారని నివేదించారు. అలాగే  నచ్చని   వ్యక్తిని, వర్గాన్ని వదిలిపెట్టకుండా ఇష్టారీతిగా చెలరేగిపోయారని,  న్యాయమూర్తులను, చివరికి దేవుడిని సైతం వదిలిపెట్టలేదని పేర్కొన్నారు. పిటిషనర్లు నిరక్షరాస్యులు కాదని, బాగా చదువుకున్న వారేనని పేర్కొన్నారు. వ్యక్తిత్వ హననం, ప్రతిష్ఠలను దెబ్బతీయడం, అపకీర్తి పాలు చేయడం, బెదిరించడంలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారని తెలిపారు. వాదనల తరువాత హైకోర్టు ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.  

సిర్పూర్ కాంగ్రెస్ కు బిగ్ షాక్... ఏడాది కాకముందే  కోనేరు కోనప్ప రాజీనామా 

బిఆర్ఎస్  నుంచి కాంగ్రెస్ లో చేరిర  సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఏడాది తిరక్కుండానే ఆ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీతో విభేధాలు తలెత్తడం వల్ల కోనేరు కోనప్ప రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంజూరైన ప్లై  ఓవర్ బ్రిడ్జిని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడంతో కోనేరు కోనప్ప రాజీనామా చేశారు. 2014లో కోనేరు కోనప్ప బిఎస్పీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత పార్టీ ఫిరాయించి కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ లో  చేరారు. 2023 ఎన్నికల్లో బిఆర్ ఎస్ నుంచి సిర్పూర్ ఎమ్మెల్యేగా పోటీచేసి బిజెపి చేతిలో ఓడిపోయారు. ఓటమి తర్వాత ఆయన కాంగ్రెస్ లో చేరారు. ఏడాది తిరక్కుండానే కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. 

ఆ వ్యక్తి జీవితం స్పూర్తి దాయకం: చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టును షేర్ చేశారు.  . ఓ వ్యక్తి శ్రీకాకుళం జిల్లా నుంచి ఎన్నో దశాబ్దాల  కిందట హైదరాబాద్ కు వలసవెళ్లి అక్కడే వెదురు బుట్టలు, విసనకర్రలు, కొబ్బరి ఆకులతో పలు ఉత్పత్తులు తయారు చేస్తూ జీవించేవాడు. దీన్ని  హ్యూమన్స్ ఆఫ్ హైదరాబాద్ అనే సోషల్ మీడియా హ్యాండిల్ పోస్టు చేసింది.కష్టించి పనిచేసే స్వభావం, ఏపీ వాణిజ్య స్ఫూర్తిని ప్రతిబింబిస్తోందని తెలిపారు. కానీ, అతడు సొంతగడ్డను వదిలి అవకాశాలను వెతుక్కుంటూ వేరే ప్రాంతానికి వెళ్లడం తనను విచారానికి గురిచేసిందని చంద్రబాబు పేర్కొన్నారు ప్రస్తుతం ఈ వ్యక్తి హైద్రాబాద్  నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద ఈ ఉత్పత్తులు విక్రయిస్తున్నాడు

శ్రీవారి ఆలయంలో లీకేజీల నివారణకు మరమ్మతులు

తిరుమల శ్రీవారి ఆలయంలో మరమ్మతు పనులు చేపట్టారు. లీకేజీల నివారణ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఆదేశాల మేరకు మరమ్మతు పనులు మొదలయ్యాయి.   గతేడాది నవంబరు 18వ తేదీన జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో ఈ సమస్యపై చర్చించి మరమ్మతులు చేపట్టాలని తీర్మానించారు. లీకేజీల నివారణ అంశంలో అనుభవం కలిగిన టీవీఎస్ సంస్థతో ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఈ పనులన్నీ ఉచితగా చేసేందుకు ఆ సంస్థ అంగీకారం తెలిపింది. ఇందులో భాగంగా ఆ సంస్థకు చెందిన సిబ్బంది లీకేజీ నివారణ పనులు ప్రారంభించారు. ప్రస్తుతం పగుళ్లను గుర్తించి పూడ్చడంతో పాటు పెయింటింగ్ వేస్తున్నారు

ప్రతి కుటుంబానికీ పాతిక లక్షలు ఆరోగ్య బీమా.. దటీజ్ బాబు!

తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు  నిజమైన అభివృద్ధి, ప్రజా ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తారు. ముందు తరాల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని పథకాలకు రూపకల్పన చేస్తారు. ఇదే ఆయనను  మేధావులూ, ప్రగతి కాముకులు, ప్రజా ప్రయోజనాలే పరమార్ధంగా తమతమ రంగాలలో నిష్ణాతులైన వారిని సైతం ఆయన అభిమానులుగా మార్చేసింది. ఒక అబ్దుల్ కలామ్, ఒక బిల్ గేట్స్ వంటి వారు తాము చంద్రబాబు అభిమానులమని బాహాటంగా ప్రకటించడం వెనుక కారణం కూడా ఇదే. అటువంటి చంద్రబాబు ఇప్పడు ప్రజా ప్రయోజనాలు, ప్రజల ఆరోగ్య సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మరో బృహత్తర పథకంతో ముందుకు వస్తున్నారు. అనారోగ్యం కారణంగా ఎవరూ ఆర్థిక ఇబ్బందులకు లోను కాకూడదన్న ఉద్దేశంతో ఆయన విప్లవాత్మక పథకానికి రూపకల్పన చేస్తున్నారు.  ఔను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మరో విప్లవాత్మక పథకాన్ని అమలు చేసే యోచనలో ఉన్నారు. అందుతున్న సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి కుటుంబానికీ పాతిక లక్షల ఆరోగ్య బీమా కల్పించే పథకానికి రూపకల్పన చేస్తున్నారు. ఇదే కనుక నిజమైతే దేశంలోనే ఇదొక ఆరోగ్య విప్లవంగా నిలుస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ  పథకం అమలులో ఉంది.  అయితే ఆ పథకం కొన్ని వర్గాల వారికి మాత్రమే పరిమితం. ఉదాహరణకు ఈ పథకం కిందకు తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు మాత్రమే అర్హులు. అంతే కాకుండా ఈ పథకం పూర్తిగా అసంఘటితంగా ఉంది. ఈ పథకం కింద వైద్య సేవలు అందించే ప్యానల్ ఆస్పత్రుల సంఖ్య చాలా చాలా స్వల్పం. ఆ ఆస్పత్రులు కూడా తరచూ పెండింగ్ బిల్లులంటూ సేవలు నిలిపివేస్తామని బెదరిస్తాయి. పలు ఆస్పత్రులైతే ఈ పథకం కింద చికిత్స అందించడానికి పెండింగ్ బిల్లులు సాకు చూపుతూ నిరాకరిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకూ ఆరోగ్యబీమా కల్పించే దిశగా కసరత్తు చేస్తున్నారు.  ఈ పథకం అమలులోకి వస్తే దేశంలోనే ఇది ఒక ఆరోగ్య విప్లవంగా అభివర్ణించవచ్చు.  ఒక అంచనా ప్రకారం ప్రతికుటుంబానికి ఆరోగ్య బీమా వర్తింప చేయడానికి కుటుంబానికి పాతిక వందల చొప్పున ప్రీమియం పడుతుంది. ఇటీవల కేంద్రం ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ లో బీమా రంగంలో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి ఇచ్చింది. దీంతో త్వరలోనే పలు అంతర్జాతీయ బీమా సంస్థలు ముందుకు వచ్చే అవకాశం ఉంది. బీమా కంపెనీల మధ్య పోటీ కారణంగా ప్రీమియం మరింత తగ్గే అవకాశాలను కూడా కొట్టి పారేయలేము. దివంగత వైఎస్సార్ తొలి సారిగా ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఈ పథకానికి ప్రజల నుంచి గొప్ప స్పందన వచ్చింది. ఈ తరువాత వచ్చిన ప్రభుత్వాలు కూడా పేరు మార్పు వినా ఈ పథకాన్ని యథాతధంగా కొనసాగించాయి. ఆంధ్రప్రదేశ్ లో ఈ పథకం ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో అమలు అవుతోంది. అయినప్పటికీ ప్రజలు దీనిని ఆరోగ్య శ్రీ పథకం అనే అంటున్నారు.  ఆ క్రెడిట్   వైఎస్సార్ ఖాతాలోనే పడుతోంది. దానిని అలా ఉంచితే.. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి పరిమితులూ లేకుండా ప్రతి కుటుంబానికి పాతిక లక్షల రూపాయల ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టాలని చంద్రబాబు యోచిస్తున్నారు. ఈ పథకం ద్వారా ఆరు గంటల్లో చికిత్సకు అనుమతి లభించడమే కాకుండా చెల్లింపులు సైతం వేగంగా జరుగుతాయి.  ఇది అమలులోకి వస్తే చంద్రబాబు పేరు చిరస్థాయిగా ప్రజల గుండెలలలో నిలిచిపోతుందని, అన్నిటికీ మించి ఇది చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి అతి పెద్ద రాజకీయ పెట్టుబడి అవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఒక సారి ఈ పథకం ఏపీలో అమలులోకి వస్తూ ఆ వెంటనే పలు రాష్ట్రాలు కూడా దీనిని తమ తమ రాష్ట్రాలలో అమలు చేస్తాయి. ఇందుకు రాజకీయ ప్రయోజనాలు ఒక కారణమైతే.. బీమా రంగంలో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం ఉండటం మరో కారణం. ఈ పథకాన్ని కనుక చంద్రబాబు రాష్ట్రంలో ముందుగా అమలులోకి తీసుకు వస్తే ఆయన పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పరిశీలకులు అంటున్నారు.  కేంద్రం ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన పథకాన్ని అమలు చేస్తున్నది. అయితే ఆ పథకం కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమా మాత్రమే కల్పిస్తున్నది.  అయితే ఇప్పుడు చంద్రబాబు ప్రతిపాదిస్తున్న బీమా పథకం మాత్రం  అంతకు ఐదింతలు ఎక్కువగా  పాతిక లక్షల రూపాయల ఆరోగ్య బీమా కల్పిస్తుంది.  

గుండెపోటుతో కుప్పకూలిన టెన్త్ విద్యార్థిని

14 ఏళ్ల బాలిక గుండెపోటుతో కుప్పకూలింది. ఈ ఘటన కామారెడ్డిలో శుక్రవారం (ఫిబ్రవరి 20) జరిగింది. టెన్త్ విద్యార్థిని అయిన శ్రీనిథి కామారెడ్డి లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతోంది.  రామారెడ్డి మండలం సింగరాయిపల్లి గ్రామానికి చెందిన శ్రీనిధి  పెద్ద నాన్న కామారెడ్డి పట్టణంలోని కల్కినగర్ కాలనిలో నివాసం ఉండగా అప్పుడప్పుడు పెద్దనాన్న ఇంటి వద్దే ఉండి పాఠశాలకు వస్తుంటుంది. ఎప్పటిలాగే కల్కినగర్ నుంచి నడుచుకుంటూ పాఠశాలకు వస్తుండగా   స్కూల్ వద్ద ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయింది. పాఠశాల యాజమాన్యం, కుటుంబ సభ్యులు వెంటనే  ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే  శ్రీనిథి హార్ట్ బీట్  ఆగిపోయింది. అయినా వైద్యులు సీపీఆర్ చేసి కాపాడే ప్రయత్నం చేశారు. అయినా  ఫలితం లేకపోయింది. శ్రీనిధి మృతితో కామారెడ్డి పట్టణంలో పాఠశాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. చదువు విషయంలో శ్రీనిధి ముందంజలో ఉండేదని, మంచి విద్యార్థినిని   కోల్పోయామని పాఠశాల ప్రిన్సిపాల్ ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారం బాబుదే.. అధికారులు భయపడేది మాత్రం జగన్ కే

క్ర‌మశిక్ష‌ణ క‌లిగిన రాజ‌కీయాల‌కు తెలుగుదేశం పార్టీ పెట్టింది పేరు. ఆ పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సొంత పార్టీలో గీత‌ దాటి వ్య‌హ‌రించిన నేత‌లను ఇసుమంతైనా ఉపేక్షించ‌రు. ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ను విమ‌ర్శించే స‌మ‌యంలోనూ అస‌భ్యప‌ద‌జాలం వాడితే ఎట్టిప‌రిస్థితుల్లో ఊరుకోరు. అధికారంలో ఉన్నా.. ప్రతిప‌క్షంలో ఉన్నా ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార‌మే చంద్ర‌బాబు ధ్యేయం. తెలుగుదేశం పార్టీ నేతల లక్ష్యం కూడా అలాగే ఉండాలని ఆశిస్తారు. అలాగే ఉండమని ఆదేశిస్తారు.  చంద్రబాబు నాలుగు దశాబ్దాలు పైబడిన రాజకీయ జీవితమంతా ఇలాగే కొనసాగింది. చంద్రబాబు తన నిబద్ధతతో తెలుగుదేశం పార్టీని దేశంలోని ఇత‌ర రాజకీయ పార్టీల‌కు ఆద‌ర్శంగా నిలిపారనడంలో సందేహం లేదు. అయితే గత  ఐదేళ్ల కాలంలో చంద్ర‌బాబు నాయుడు త‌న రాజ‌కీయ జీవితంలో ఎన్నడూ ఎదుర్కోన‌న్ని ఇబ్బందుల‌ను చ‌విచూశాడు. ఒక్క‌చాన్స్ ప్లీజ్ అంటూ  అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. ముఖ్య‌మంత్రి పీఠం ఎక్కిన త‌రువాత త‌న నిజ‌స్వ‌రూపాన్ని బ‌య‌ట‌పెట్టాడు. టీడీపీ నేత‌ల‌ను తీవ్ర ఇబ్బందుల‌కు గురిచేశాడు. దాడుల చేయ‌డంతోపాటు అక్ర‌మ కేసుల‌తో జైళ్ల‌కు పంపించాడు. దీంతో చాలామంది టీడీపీ నేత‌లు వైసీపీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో జైళ్ల‌కే ప‌రిమితం అయిన ప‌రిస్థితి. చివ‌రికి చంద్ర‌బాబు నాయుడుపైనా అక్ర‌మ కేసు పెట్టి జైలుకు పంపించారు.  జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన చంద్ర‌బాబు నాయుడు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, వైసీపీ నేత‌ల తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చేది మేమే.. నాలో మ‌రో చంద్ర‌బాబును చూస్తారంటూ వైసీపీ నేత‌ల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. కొంద‌రు అధికారుల, పోలీసుల తీరుపైనా చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మ‌ళ్లీ ముఖ్య‌మంత్రిని అవుతున్నా.. హ‌ద్దులు మీరి ప్ర‌వ‌ర్తించిన వారికి త‌గిన శాస్త్రి జ‌రుగుతుంద‌ని హెచ్చ‌రించారు.  స్వతహాగా  చంద్ర‌బాబు క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌కు దూరం. అయితే, గ‌త ఐదేళ్ల వైసీపీ హ‌యాంలో టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ప‌డిన ఇబ్బందుల‌ను చూసి చంద్ర‌బాబు ఆవేశం క‌ట్ట‌లుతెంచుకుంది. అందుకే వైసీపీ నేతలకు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు.  గ‌త ఎన్నిక‌ల్లో ఐదేళ్లు జ‌గ‌న్ పాల‌న‌తో విసిగిపోయిన ప్ర‌జ‌లు కూట‌మి ప్ర‌భుత్వానికి అధికారాన్ని క‌ట్ట‌బెట్టారు. ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు బాధ్య‌త‌లు చేప‌ట్టి ఎనిమిది నెల‌లు అయ్యింది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచీ ఆయన రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమంపైనే దృష్టి పెట్టారు. తనకు ప్రజా సంక్షేమం, రాష్ట్ర ప్రగతే ముఖ్యం అని గట్టిగా చెబుతున్నారు.  ఇది తెలుగుదేశం క్యాడర్ లో ఒకింత అసంతృప్తికి కారణమౌతోంది. వైసీపీ హ‌యాంలో రెచ్చిపోయిన నేత‌ల‌పై పార్టీ శ్రేణులు ఆశించిన స్థాయిలో చంద్రబాబు కొర‌డా ఝుళిపించ‌డం లేద‌న్న ఆగ్రహం పార్టీ క్యాడర్ లో వ్యక్తం అవుతోంది.  చంద్ర‌బాబు మంచిత‌నాన్ని ఆస‌రాగా చేసుకుంటున్న వైసీపీ నేత‌లు.. ఇంకా తామే అధికారంలో ఉన్నామ‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మాజీ ముఖ్య‌మంత్రి, పులివెందుల ఎమ్మెల్యే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అయితే.. తానకు తానే తనకు లేని ప్రతిపక్ష హోదా ప్రకటించేసుకుని నేను ఎటుపోయినా గ‌ట్టి భ‌ద్ర‌త ఇవ్వాలి అంటూ దాదాపు హెచ్చ‌రిక‌లు చేస్తున్నాడు. తాజాగా గుంటూరు మార్కెట్ యార్డులో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, వైసీపీ నేత‌లు చేసిన ర‌చ్చ మామూలుగా లేదు.  ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ ఉంది. పర్యటనకు అనుమతి లేదు అని అధికారులు స్పష్టంగా చెప్పినా జగన్ లెక్క చేయలేదు.   మిర్చి రైతుల‌కు సంఘీభావం తెలిపేందుకు జ‌గ‌న్ యార్డులోకి వెళ్లాడు. త‌న వెంట వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌ను పెద్ద‌సంఖ్య‌లో స‌భ‌కు తీసుకెళ్లిన‌ట్లు తీసుకెళ్లాడు. దీంతో మార్కెట్ యార్డులో వైసీపీ నేత‌ల అరాచ‌కానికి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొంద‌రు వైసీపీ నేత‌లు రైతుల మిర్చి బ‌స్తాల‌ను దొంగిలించుకు పోయారు. అంత‌కుముందు జైల్లో ఉన్న‌ వ‌ల్ల‌భ‌నేని వంశీని ప‌రామ‌ర్శించేందుకు వెళ్లిన స‌మ‌యంలోనూ జ‌గ‌న్, వైసీపీ నేత‌లు హ‌ద్దులు మీరి ప్ర‌వ‌ర్తించారు. వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు వ‌ల్ల‌భ‌నేని వంశీ అస‌భ్య‌క‌ర భాష‌తో చంద్ర‌బాబు కుటుంబ స‌భ్యుల‌ను విమ‌ర్శించిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. దీనికితోడు గ‌న్న‌వ‌రం టీడీపీ కార్యాల‌యంపై దాడి కేసులో వంశీ కీల‌క సూత్ర‌దారి. అంతేకాక‌.. టీడీపీ కార్యాల‌యం ద‌గ్గ కేసులో ఫిర్యాదు దారుడిని కిడ్నాప్ చేసి వంశీ అడ్డంగా దొరికిపోయాడు. కానీ, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాత్రం వంశీ అమాయ‌కుడు, అక్ర‌మంగా కూట‌మి ప్ర‌భుత్వం కేసులు పెట్టింద‌ని అబ‌ద్ధాల‌ను తేలిగ్గా చెప్పేశారు. దీనికితోడు అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు.  మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చేది మేమే.. వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల జోలికి వ‌స్తే బ‌ట్ట‌లు ఊడ‌దీసి నిలబెడతా అంటూ అధికారులకు హెచ్చరికలు సైతం జారీ చేశారు.   జ‌గ‌న్ హెచ్చ‌రిక‌ల‌తో అధికారులు, పోలీసులుసైతం భ‌య‌ప‌డుతున్నారు. దీంతో అధికారంలో ఉన్నది తెలుగుదేశం కూటమి ప్రభుత్వమే అయినా, అధికార యంత్రాంగం మాత్రం ఇప్పటికీ జగన్ చెప్పినట్లే నడుస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వ ఆదేశాలను పాటించకపోతే చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. జగన్ లా కక్ష సాధింపు చర్యలకు పాల్పడరన్న ధీమాయే అధికారుల తీరుకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  జగన్ ఎన్నికల నియమావళికి ఉల్లంఘించి మరీ గుంటూరు మిర్చియార్డుకు వెళ్లారు. అక్కడ రాజకీయ ప్రసంగాలు చేశారు. మళ్లీ ఎదురు తనకు సరైన భద్రత కల్పించలేదని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అసలు ఎలక్షన్ కోడ్ అమలులో ఉండగా జగన్ ను మార్కెట్ యార్డులోకి అధికారులు ఎలా వెళ్ల నిచ్చారు? అంటే ఆపితే జగన్ ఆగ్రహానికి గురి కావలసి వస్తుందన్న భయమే అధికారులు తమ విధులను పక్కన పెట్టేయడానికి కారణమని భావించాల్సి వస్తుంది. ఇదే పరిస్థితి కొనసాగితే.. ఆ ఫలితాన్ని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుభవించాల్సి ఉంటుంది. ఇప్పటికే తెలుగుదేశం క్యాడర్ లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. జగన్ అరాచకపాలనలో ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకుని పార్టీ కోసం నిలబడిన తమకు, పార్టీ అధికారంలో ఉన్నా.. అధికార యంత్రాంగం ఇంకా జగన్ కే వత్తాసు పలుకుతున్న పరిస్థితి శ్రేణులకు మింగుడు పడటం లేదు. దీంతో వారు చంద్రబాబు మరీ ఇంత మెతకా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు తిలోదకాలిచ్చి, అధికారులపై బెదరింపులకు పాల్పడుతున్న వారిని చట్ట ప్రకారం శిక్షించే విషయంలో చంద్రబాబు ఉదాశీనత వీడకుంటే.. పార్టీ క్యాడర్ దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.  

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సోషల్ మీడియా ఖాతాలపై నిషేధం!?

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. రాజకీయాలతో ఏ మాత్రం పరిచయం ఉన్నవారికైనా ఈ పేరు సుపరిచితం. బీజేపీని మించిన కరుడుగట్టిన హిందూ వాదిగా,  తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఆయన నిత్యం ప్రయత్నిస్తుంటారు. గోషామహల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా వరుసగా ఎన్నికౌతూ వస్తున్నారు. అటువంటి రాజాసింగ్ ను గతంలో బీజేపీ ఒక సారి సస్పెండ్ చేసింది కూడా. అయితే గత ఎన్నికలకు ముందు అనివార్యంగా ఆయనపై సస్పెన్షన్ ను ఎత్తివేసి గోషామహల్ నుంచి పార్టీ టికెట్ ఇచ్చి మరీ పోటీకి దింపింది. ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే.. ఆయన వివాదాలతో సహవాసం చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటారని చెప్పడానికే.  తాజాగా రాజాసింగ్ సోషల్ మీడియా ఖాతాపై మెటా నిషేధం విధించింది. ద్వేషపూరిత ప్రసంగాలు, మతపరమైన ప్రదర్శనలకు సంబంధించి ఆయన పోస్టు చేసిన వీడియోలను తొలగించింది. రాజాసింగ్ 2024వ సంవత్సరంలో ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో విద్వేష పూరిత ప్రసంగాలు చేశారని ఇండియా హేట్ ల్యాబ్ నివేదిక వెల్లడించింది రాజాసింగ్ పాల్గొన్న రాజకీయ ర్యాలీలు, ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, మతపరమైన ఊరేగింపులు, నిరసన ప్రదర్శనలు, జాతీయ వాద ర్యాలీల వీడియోలను అధ్యయనం చేసి అవి ద్వేషపూరితమైనవని నిర్ధారించింది. దీంతో బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌కు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలను ఐటీ దిగ్గజ సంస్థ మెటా తొలగించింది. ప్రమాదకరమైన వ్యక్తులు, సంస్థల ఖాతాలను మెటా స్తంభింప చేసి, వారి పోస్టులను తొలగిస్తుంటుంది.   ఫేస్‌బుక్ లో రాజాసింగ్ కు చెందిన 495 ద్వేషపూరిత ప్రసంగ వీడియోలు, యూట్యూబ్ 211 వీడియోలను మెటా తొలగించింది.   '

ఆందోళనకరంగా మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి!?

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. కిడ్నీ ఫెయిల్యూర్ తో బాధపడుతున్న మాగంటి గోపీనాథ్ గత కొద్ది రోజులుగా ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం (ఫిబ్రవరి 21) ఆయన ఆరోగ్యం క్షీణించిందని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. బంధువుల కథనం ప్రకారం మాగంట గోపీనాథ్ ఆరోగ్య పరిస్థతి గత నాలుగు రోజుల నుంచీ ఆందోళనకరంగా ఉంది. అయితే ఆస్పత్రి వర్గాల నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు. గాగా గురువారం (ఫిబ్రవరి 20) మధ్యాహ్రం కేసీఆర్ ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. దీంతో అంతా మాగంటి గోపానాథ్ ను పరామర్శించడానికే కేసీఆర్ ఆస్పత్రికి వెళ్లారని భావించారు. అయితే కేసీఆర్ తన జనరల్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లారు తప్ప మాగంటను పరామర్శించడానికి కాదని ఈ తరువాత తెలిసింది.  

దత్తపుత్రుడు జగన్.. హవ్వ షర్మిల అంత మాటనేశారేంటి?

మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుందన్నది నానుడి. ఎవరైనా సరే కర్మ ఫలం అనుభవించ కతప్పదంటారు. ఇప్పుడు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూస్తుంటే సరిగ్గా అదే జరుగుతోందనిపించక మానదు. గతంలో అంటే జగన్ తాను అధికారంలో ఉన్న సమయంలో తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్నట్లు వ్యవహరించే వారు. నోటికి హద్దూ పద్దూ లేదన్నట్లుగా ప్రత్యర్థి పార్టీల నేతలను ఇష్టారీతిగా విమర్శలు గుప్పించే వారు. భాషను ఉపయోగించే విషయంలో  జగన్ ఇసుమంతైనా మర్యాద పాటించిన  దాఖలాలు లేవు. ఆ క్రమంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ లపై అనుచిత భాషాప్రయోగం చేశారు. ఇక జనసేనాని వపన్ కల్యాణ్ విషయంలో అయితే చెప్పనే అవసరం లేదు. పవన్ కల్యాణ్ వివాహాలపైన ఆయన చేసిన వ్యాఖ్యలు అనుచితంగా ఉండేవి. సరే ఇక పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి ఆయన ఎప్పుడూ దత్తపుత్రుడు అని సంబోధిస్తూ ఉండేవారు. చంద్రబాబు నాయుడికి మద్దతు పలుకుతున్నారు కనుక ఆయన చంద్రబాబు దత్తపుత్రులు అన్నది ఆయన భావన.  ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా జగన్ ప్రత్యర్థులను కించపరిచే వ్యాఖ్యలు చేయడానికి ఇసుమంతైనా వెనుకాడే వారు కాదు.  ఇప్పుడు ఆయన దత్తపుత్రుడు వ్యాఖ్య అయనకే ఎదురువచ్చి తగిలింది. సొంత సోదరి, ఏపీసీసీ చీఫ్ షర్మిల జగన్ ను దత్తపుత్రుడు అని సంబోధించింది. కౌపీన సంరక్షార్థం.. అంటే కేసుల నుంచి రక్షణ కోసం జగన్ బీజేపీకి, ప్రధాని మోడీకి దత్తపుత్రుడుగా మారిపోయారని షర్మిల విమర్శించారు. అధికారంలో ఉన్నంత కాలమూ జగన్ మోడీ దత్తపుత్రుడుగానే ఉన్నారన్న షర్మిల, ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత కూడా అలాగే వ్యవహరిస్తున్నారని విమర్శించారు.  పవన్ కళ్యాణ్‌ను కించపరిచేందుకు జగన్ చాలా తరచుగా ఉపయోగించిన  దత్తపుత్రుడు  అనే పదాన్నే ఇప్పుడు  సొంత సోదరి షర్మిల జగన్ ను ఉద్దేశించి వాడారు. అందుకే అంటారు కర్మ ఎవరినీ వదలదని. 

అసెంబ్లీకి ముఖం చాటేసిన  కేసీఆర్ పై హైకోర్టులో పిటిషన్ 

గజ్వేల్ నియోజకవర్గం నుంచి గెలుపొంది అసెంబ్లీకి రాని  మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన కేసీఆర్... అసెంబ్లీకి గైర్హాజరు అవుతున్నారు.  కేసీఆర్ పై  చట్టపరంగా  చర్యలు తీసుకోవాలని ఫార్మర్స్ ఫెడరేషన్ కు చెందిన విజయ్ పాల్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు.  ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ప్రజల పక్షాన అసెంబ్లీలో అడుగుపెట్టాలని, అసెంబ్లీకి గైర్హాజరైతే  ఎమ్మెల్యే సభ్యత్వంపై వేటు వేయాలని విజయ్ పాల్ రెడ్డి కోరారు. కేసీఆర్ నియోజకవర్గంలో  ఉప ఎన్నిక నిర్వహించాలని , ఆయన స్థానంలో వేరే అభ్యర్థిని  పోటీ చేయించాలని పిటిషనర్ కోరారు.  కెసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొట్టడంపై గజ్వేల్ నియోజకవర్గ ప్రజల్లో ఆయనపై వ్యతిరేకత ప్రారంభమైంది. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ నిర్ణయం తీసుకోవాలన్న అభిప్రాయం వ్యక్తమౌతుంది.  2023 డిసెంబర్ 16న ప్రతిపక్ష నేతగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టారు. అప్పట్నుంచి  కెసీఆర్  అసెంబ్లీకి రాలేదు.   స్పీకర్  కార్యాలయం నుంచి కానీ, ఆయన కార్యాలయం కానీ ఎలాంటి ప్రొసీడింగ్స్ చేపట్టలేదు.  ప్రజల గొంతుకను అసెంబ్లీలో వినిపించేందుకు ఎమ్మెల్యేల జీతాలు  ఇస్తున్నారు. ఈ జీతాలు కూడా ఇటీవల  పెంచారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ బాధ్యతలను నిర్వహించలేకపోతే ఆయనను ఆ బాధ్యతల నుంచి తొలగించాలని అనే వాదన వినిపిస్తుంది. శాసన వ్యవస్థ, అధికారులు తీసుకునే రాజకీయ, ఆర్థిక నిర్ణయాలను సమీక్షించే అధికారం న్యాయ వ్యవస్థకు ఉంది.    

ఊహాగాన సభలకు తెర.. కూటమి ఐక్యతపై క్లారిటీ ఇచ్చిన పవన్

తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చిక్కుల్లో పడిందనీ, కూటమి పార్టీల మధ్య అగాధం ఏర్పడిందనీ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెట్టేస్తూ.. చెలరేగిపోతున్న వైసీపీయుల ఊహాగాన సభలకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెర దించేశారు. తాను ఇటీవలి కాలంలో కొన్ని కార్యక్రమాలకు హాజరు కాకపోవడానికి కారణం తన అనారోగ్యమే తప్ప మరో కారణం లేదని కుండబద్దలు కొట్టేశారు. చంద్రబాబు ఫోన్ చేసినా పవన్ రెస్పాండ్ కాలేదనీ, కేబినెట్ భేటీకి సైతం డుమ్మా కొట్టేశారనీ వైసీపీ సోషల్ మీడియాలో ఇటీవలి కాలంలో పలు కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే.  రాష్ట్ర మంత్రి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ ఇవ్వాలంటూ తెలుగుదేశం శ్రేణుల నుంచి డిమాండ్ వచ్చిన క్షణం నుంచీ వైసీపీలో కూటమి పార్టీల మధ్య విభేదాలు అంటూ పుంఖాను పుంఖాలుగా కథనాలు వెలువడ్డాయి. జనసేన, తెలుగుదేశం మధ్య మైత్రికి బీటలు వారాయన్న విశ్లేషణలూ వెలువడ్డాయి. అయితే ఇరు పార్టీల అధినేతలూ కూడా లోకేష్ ప్రమేష్ విషయంలో నోరెత్తద్దంటూ తమతమ పార్టీల నేతలు, క్యాడర్ ను స్పష్టం చేశారు.  అలాగే తన కేబినెట్ సహచరులకు చంద్రబాబు ఇచ్చిన ర్యాంకింగ్ లలో పవన్ కల్యాణ్ నంబర్ 1గా లేకపోవడాన్ని ఎత్తి చూపుతూ వైసీపీ సోషల్ మీడియా వింగ్ నానా హంగామా చేసింది. పవన్ ను తొక్కేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారనీ, అందుకే పవన్ కల్యాణ్ బాబు ఫోన్ కు రెస్పాండ్ కాలేదనీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ఇరువురూ కలిసి వెళ్లడం, అక్కడ ఇద్దరూ కలిసే పలువురు మంత్రులతో భేటీ కావడంతో వైసీపీ చేస్తున్నదంతా దుష్ప్రచారమేనని తేటతెల్లమైంది. ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా స్వయంగా కూటమి పార్టీలన్నీ సమన్వయంతోనే పని చేస్తున్నాయని విస్పష్టంగా ప్రకటించారు. జగన్ పాలన కారణంగా అప్పుల కుప్పలా మారిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఇటీవల తాను కొన్ని సమావేశాలకు హాజరు కాకపోవడానికి కారణం వెనునొప్పేనని, మరో కారణం లేదనీ క్లారిటీగా చెప్పారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి పని చేస్తోందనీ, అప్పులు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, వాటిని అధిగమించి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు. 

డాక్టర్ సునీతపై కృష్ణారెడ్డిది తప్పుడు ఫిర్యాదు.. దర్యాప్తులో నిగ్గు తేల్చిన పోలీసులు!

2019 ఎన్నికలకు ముందు జరిగిన వైఎస్ వివేకానందరరెడ్డి హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతున్న ఆయన కుమార్తె డాక్టర్ సునీతకు అడుగడుగునా అడ్డంకులే ఎదురయ్యాయి. స్వయంగా జగన్ కూడా ఆమెను ఆ కేసు విషయం వదిలేయాలని స్పష్టంగా చెప్పారు.  కన్న తండ్రి హత్య వెనుక ఉన్నది సొంత కుమార్తె అంటూ అభాండాలు వేశారు. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. అయితే సునీత మాత్రం తన తండ్రి హంతకులను చట్టం ప్రకారం శిక్షించాలంటూ అలుపెరుగని న్యాయపోరాటం నెరిపారు. ఇంకా పోరు సాగిస్తున్నారు.  గత ఐదేళ్లుగా వైఎస్ వివేకా హత్య కేసు మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. వివేకా గొడ్డలి పోటుతో చనిపోతే.. గుండే పోటు అంటూ ప్రకటనలు గుప్పించిన వాళ్లు, ఆ తరువాత నరాసుర రక్త చరిత్ర అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై ఆరోపణలు చేశారు. అయితే   ఎవరైతే హత్య వెనుక ఉన్నది చంద్రబాబు అంటూ ఆరోపణలు చేశారో వాళ్లే ఇప్పుడు వివేకా హత్య కేసులో నిందితులుగా, అనుమానితులుగా ఉన్నారు. అప్పట్లో నారాసుర రక్త చరిత్ర అంటూ ఆరోపణలు గుప్పించిన వారే ఇప్పుడు వివేకా హత్య కేసులో అభియోగాలను ఎదుర్కొంటున్నారు. నిందితులుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అరెస్టయ్యారు. బెయిలుపై తిరుగుతున్న వారూ ఉన్నారు. ముందస్తు బెయిలుతో అరెస్టులను తప్పించుకుంటున్నారు.  అసలు వివేకా హత్య కేసు దర్యాప్తు ఇంత కాలంగా ఎందుకు సాగుతోంది? అన్న విషయంలో కూడా సందేహాలు నివృత్తి అయిపోయాయి.  హత్య లో పాత్రధారులు, సూత్రధారులు ఎవరు అన్న విషయం కోర్టులో ఇంకా పూర్తిగా తేలకపోయినా.. ప్రజలలో మాత్రం ఒక క్లారిటీ  వచ్చేసింది.   రాష్ట్రంలో అందరికీ వివేకా హత్య మోటో ఏమిటి? చేసిందెవరు? చేయించిందెవరు? అన్నవిషయంలో  ఇప్పుడిక ఎలాంటి సందేహాలూ లేవు.  అసలీ కేసు ఇంత వరకూ రావడానికీ.. ఒక లాజికల్ ఎండ్ దిశగా సాగడానికి మాత్రం నిస్సందేహంగా వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీతే కారణమని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు.   తన తండ్రి  హంతకులు, వారి వెనుకనున్న ముసుగువీరుల సంగతి తేల్చాలంటూ డాక్టర్ సునీత చేసిన, చేస్తున్న న్యాయ పోరాటం   చారిత్రాత్మకం.  వ్యవస్థలను మేనేజ్ చేయడంలోనూ, నిర్వీర్యం చేయడంలోనూ  అధికార వైసీపీ చేయగలిగినంతా చేసింది.  కేసు దర్యాప్తు వేగాన్ని మందగించేలా చేయడానికి చేయగలిగినంతా చేసింది. విపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ దర్యాప్తును డిమాండ్ చేసిన జగన్.. అధికారంలోకి రాగానే  కేంద్రదర్యాప్తు సంస్థ అవసరం లేదన్నారు. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు.. కేసును నిర్వీర్యం చేయడానికి తన అధికారాన్ని జగన్ ఎంతగా దుర్వినియోగం చేశారో అర్ధమౌతుంది.    చివరాఖరికి దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి పీఏ చేతే సునీతపై ఆరోపణలు చేయించారు. హత్య వెనుక డాక్టర్ సునీత, ఆమె భర్త ఉన్నారని ఫిర్యాదులు చేయించారు. ఇప్పుడు ఆ ఆరోపణలన్నీ అవాస్తవాలని తేటతెల్లమైపోయింది. వైఎస్ వివేకానంద పీఏ కృష్ణారెడ్డి డాక్టర్ సునీతపై చేసిన ఆరోపణలన్నీ తప్పుడు ఆరోపణలేనని పోలీసులు నిర్ధారించారు.  వివేకా హత్య కేసులో వైసీపీ నేతల పేర్లు చెప్పాలనీ తనను డాక్టర్ సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి తనను బెదరించారనీ, అప్పటి సీబీఐ ఎస్పీ రాంసింగ్ కొట్టారంటూ కృష్ణారెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు అప్పట్లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. దానిపై దర్యాప్తు చేసిన పోలీసులు కృష్ణారెడ్డి చేసిన ఫిర్యాదు తప్పుడుదని తేల్చారు. దీంతో కృష్ణారెడ్డి తప్పుడు ఫిర్యాదు చేశారంటూ పోలీసులు పులివెందుల కోర్టకు నివేదిక సమర్పించారు. అలాగే తప్పుడు ఫిర్యాదు చేసిన కృష్ణారెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.  

చాంపియన్స్ ట్రోఫీలో టీమ్ ఇండియా శుభారంభం.. తొలి మ్యాచ్ లో సెంచరీతో చెలరేగిన శుభమన్ గిల్

చాంపియన్స్ ట్రోఫీలో టీమ్ ఇండియా శుభారంభం చేసింది. బంగ్లాదేశ్ లో గురువారం జరిగిన మ్యాచ్ లో టీమ్ ఇండియా సునాయాస విజయం సాధించింది. చాంపియన్స్ ట్రోఫీలో తొలి మ్యాచ్ లోనే అలవోక విజయాన్ని అందిపుచ్చుని టీమ్ ఇండియా ఆత్మ విశ్వాసాన్ని ప్రోది చేసుకుని ఆదివారం (ఫిబ్రవరి 23) పాకిస్థాన్ తో మ్యాచ్ కు రెడీ అయిపోయింది.  ఇక బంగ్లాదేశ్ తో జరిగి మ్యాచ్ లో టీమ్ ఇండియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. బాల్ తో మహ్మద్ షమీ అమోఘంగా రాణిస్తే, బ్యాటింగ్ లో శుభమన్ గిల్ అజేయ సెంచరీ సాధించి టీమ్ ఇండియాను గెలిపించాడు. శుభమన్ గిల్ కే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.  ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ గురించి చెప్పుకోవలసిందేమైనా ఉంటే అది హిద్రోయ్ బ్యాటింగ్ గురించి మాత్రమే. కేవలం 35 పరుగులకే సగం జట్టు పెవిలియన్ కు చేరిన తరుణంలో హిద్రోయ్ అద్భుతంగా ఆడి జట్టుకు గౌరవ ప్రదమైన స్కోర్ అందించాడు. 35 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన స్థితి నుంచి బంగ్లాదేశ్ 228 పరుగుల స్కోరు చేయగలిగిందంటే అది హ్రిదోయ్ పుణ్యమే. తొలుత ఆచి తూచి ఆడిన హ్రిదోయ్ సింగిల్స్ తో స్కోరు బోర్డును నెమ్మదిగా కదిలిస్తూ, అవకాశం వచ్చినప్పుడు బౌండరీలతో చెలరేగుతూ ఇన్నింగ్స్ ను నిర్మించాడు. హ్రిదోయ్ 118 బంతుల్లో వంద పరుగులు చేశాడు. అతడికి జకీర్ అలీ సహకారం అందించాడు. జకీర్ అలీ 114 బంతుల్లో 68 పరుగులు చేశాడు. చివరికి బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ ఐదు వికెట్లతో బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఆర్డర్ వెన్ను విరిచాడు. హర్షిత్ రాణా మూడు వికెట్లు, అక్షర్ పటేల్ 2 వికెట్లు పడగొట్టారు.  ఇక 229 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన టీమ్ ఇండియా  46.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.  భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలు చెరో 41 పరుగులు చేశారు. శుభమన్ గిల్ అజేయ సెంచరీ సాధించాడు. కోహ్లీ మరో సారి విఫలమయ్యాడు.   

వంశీ కస్టడీ పిటిషన్ పై విచారణ వాయిదా

గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో  ఫిర్యాదు దారుడిని కిడ్నాప్ చేసి బెదరించిన కేసులో అరెస్టై విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కస్టడీకి కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను కోర్టు శుక్రవారానికి (ఫిబ్రవరి 21)  వాయిదా వేసింది.   వల్లభనేని వంశీ ప్రస్తుతం విజయవాడ జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్న వంశీని పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై   పోలీసుల తరపున రాజేంద్రప్రసాద్, నిందితుడు వంశీ తరపున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. నిందితుడు వంశీ ఫోన్‌ను స్వాధీనం చేసుకోవాలని, అందులో కీలకమైన ఆధారాలు ఉన్నాయని, దీంతో పాటుగా కిడ్నాప్‌కు ఉపయోగించిన కార్‌ను కూడా సీజ్‌ చేయాలని, ఈ నేపథ్యంలో విచారణ చేపట్టేందుకు నిందితుడు వంశీని పోలీసుల కస్టడీకి ఇవ్వాలని,  రాజేంద్రప్రసాద్‌ వాదించారు. మరోవైపు నిందితుడు వల్లభనేని వంశీ తరఫు న్యాయవాది పొన్నవోలు తన వాదన వినిపిస్తూ వంశీని పోలీసు కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని వాదించారు. ఇరు పక్షాల వాదనలూ విన్న న్యాయమూర్తి విచారణకు శుక్రవారానికి వాయిదా వేశారు.