ycp case on postel ballets

పోస్టల్ బ్యాలెట్లపై వైసీపీకి షాక్: కేసు కొట్టేసిన కోర్టు

ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ మొత్తం వైసీపీకి వ్యతిరేకంగా వచ్చాయి. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా పోస్టల్ బ్యాలెట్ల విషయంలో కూడా జగన్ పార్టీకి షాక్ తగిలింది. పోస్టల్ బ్యాలెట్ల అంశంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసింది. సీఈసీ ఉత్తర్వులలో జోక్యం చేసుకోలేమని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. ఏపీలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు సమయంలో ఓటరు డిక్లరేషన్‌కి సంబంధించిన ‘ఫారం - 13’ మీద అటెస్టింగ్ అధికారి పేరు, హోదా, సీల్ లేకపోయినా పర్లేదు. ఆ అధికారం సంతకం వుంటే చాలు వాటిని పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేస్తూ ఈసీ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ వైసీపీ ఏపీ హైకోర్టులో దావా వేసింది. పిటిషనర్ వాదనలు విన్న హైకోర్టు గతంలో పలు సందర్భాల్లో ఇచ్చిన కోర్టు తీర్పులను ఉదహరిస్తూ, వైసీపీ పిటిషన్‌ని కొట్టేసింది.

modi sarkar again

మళ్లీ మోడీ సర్కారే.. తేల్చి చెప్పేసిన ఎగ్జిట్ పోల్స్

సార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. జూన్ 4న ఫలితాలు అధికారికంగా వెలువడతాయి. అయితే ప్రజా నాడి ఎలా ఉంది అనేది తెలుసుకునేందుకు ఎగ్జిట్ పోల్స్ చాలా వరకూ దోహదం చేస్తాయి. సో..  మొత్తం లోక్ సభ స్థానాలు 543 స్థానాలకు గాను ఏ కూటమి ఎన్ని సీట్లు గెలుచుకుంటుందన్న దానిపై వివిధ సంస్థలు వెలువరించిన ఎగ్జిట్ పోల్స్ ను బట్టి చూస్తే  మోడీ సర్కార్ మరో సారి అధికారంలోకి రావడం ఖాయమని తోచక మానదు. వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి గెలుచుకునే స్థానాల వివరాలు ఇలా ఉన్నాయి.  జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్ బీజేపీ కూటమి 362-392 కాంగ్రెస్ కూటమి 141-161 ఇతరులు 10-20 న్యూస్ నేషన్... బీజేపీ కూటమి 340-378 కాంగ్రెస్ కూటమి 153-169 ఇతరులు 21-23 టైమ్స్ నౌ... బీజేపీ కూటమి 353-368 కాంగ్రెస్ కూటమి 118-133 ఇతరులు 43-48 ఇండియా న్యూస్- డీ డైనమిక్స్... బీజేపీ కూటమి- 371 కాంగ్రెస్ కూటమి- 125 ఇతరులు- 47 రిపబ్లిక్-పీ మార్క్... బీజేపీ కూటమి- 359 కాంగ్రెస్ కూటమి- 154 ఇతరులు- 30 రిపబ్లిక్ భారత్-మ్యాట్రిజ్... బీజేపీ కూటమి 353-368 కాంగ్రెస్ కూటమి 118-133 ఇతరులు 43-48 దైనిక్ భాస్కర్... బీజేపీ కూటమి 281-350 కాంగ్రెస్ కూటమి 145-201 ఇతరులు 33-49

peoples pulse exit poll result

కూటమికే జై కొట్టిన పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్

ఆంధ్రప్రదేశ్‌లో  తెలుగుదేశం కూటమిదే అధికారం అని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ తేల్చేసింది. ఈ ఎగ్జిట్ పోల్ ప్రకారం తెలుగుదేశం పార్టీ సొంతంగా 95 నుంచి 100 స్థానాలు గెలుచుకుంటుందని పేర్కొంది. ఇక కూటమి భాగస్వామ్య పక్షాలలో జనసేన 14 నుంచి 20 స్థానాలు, బీజేపీ 2 నుంచి5 స్థానాలలో విజయం సాధించే అవకాశాలున్నాయని పీపుల్స్ పల్స్ పేర్కొంది. అంటే మొత్తంగా కూటమి  111 నుంచి 135 స్థానాలలో విజయం సాధించే అవకాశాలున్నాయని పీపుల్స్ పల్స్ సర్వే తేల్చింది. ఇక వైసీపీ   45 నుంచి 60 స్థానాలకు పరిమితం అవుతుందని పేర్కొంది. ఇక ఓట్ల శాతం విషయానికి వస్తే తెలుగుదేశం కూటమికి 52 శాతం, వైసీపీకి  44 శాతం ఓట్లు వస్తాయని పీపుల్స్ సర్వే పేర్కొంది. 

ap parliment Exit polls

ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ ఎగ్జిట్ పోల్స్

ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ స్థానాల్లోనూ టీడీపీ కూటమి ముందంజలో వుంది. పీపుల్స్ పల్స్ సంస్థ చేసిన సర్వేలో తెలుగుదేశం పార్టీకి 13 నుంచి 15 స్థానాలు, వైసీపీకి 3 నుంచి 5 స్థానాలు, జనసేనకు 2 స్థానాలు వస్తాయని తేల్చింది.  అలాగే కేకే సర్వేస్ సంస్థ తెలుగుదేశం పార్టీకి 17 స్థానాలు వైసీపీకి సున్నా స్థానాలు, జనసేనకు  2 స్థానాలు, బీజేపీకి 6 స్థానాలు వస్తాయని చెప్పింది. ఇండియా టీవీ తెలుగుదేశం పార్టీకి 13  నుంచి 15 స్థానాలు, వైసీపీకి 3 నుంచి 5 స్థానాలు, బీజేపీకి 4 నుంచి 6 స్థానాలు వస్తాయని తెలిపింది. రైజ్ సంస్థ తెలుగుదేశం పార్టీ కూటమికి  17 నుంచి 20 స్థానాలు, వైసీపీకి 7 నుంచి 10 స్థానాలు వస్తాయని ప్రకటించింది.  

pioneer wxitpoll predict tdp alliance win

టీడీపీ కూట‌మికే జైకొట్టిన ప‌య‌నీర్ ఎగ్జిట్ పోల్

ఏపీలో ఎవ‌రు గెల‌వ‌బోతున్నారు.  తెలుగుదేశం  కూట‌మి అధికారంలోకి రాబోతోందా?  మ‌రో సారి వైసీపీ అధికార పీఠాన్ని ద‌క్కించుకోబోతుందా? ఒక‌వేళ తెలుగుదేశం కూట‌మి గెలిస్తే ఎన్ని స్థానాలు గెలుచుకుంటుంది. ప్ర‌ముఖ‌ రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్న‌ట్లు వైసీపీకి ఘోర ప‌రాభ‌వం త‌ప్ప‌దా?  రాజ‌కీయాల‌పై అవ‌గాహ‌న ఉన్న ప్ర‌తిఒక్క‌రి మ‌దిలో ప్ర‌స్తుతం మెదులుతున్న ప్ర‌శ్న‌లివి. ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌రియైన స‌మాధానం దొర‌కాలంటే జూన్ 4వ తేదీ వ‌ర‌కు ఆగాల్సిందే. అయితే,  ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌నే విష‌యాన్ని కాస్త ముందుగానే అంచ‌నా వేయడానికి తాజాగా వెల్ల‌డైన ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాలను దోహదం చేస్తాయి. ప్ర‌ముఖ సంస్థల ఎగ్జిట్ పోల్స్ అన్నీ దాదాపు ఏపీలో కూట‌మి అధికారంలోకి వ‌స్తుంద‌ని స్ప‌ష్టం చేశాయి. తాజాగా ప్ర‌ముఖ  సంస్థ  ప‌య‌నీర్ ఎగ్జిట్ పోల్ కూడా ఆంధ్రప్రదేశ్ లో అధకారం తెలుగుదేశం కూటమిదేనని విస్పష్టంగా తేల్చేసింది.  ఆ సంస్థ ఎన్నిక‌ల ముందు చేసిన సర్వేలో కూటమిదే అధికారం అని పేర్కొంది.  ఎన్నిక‌ల త‌రువాత నిర్వహించిన  పోస్ట్ పోల్ స‌ర్వేలో కూటమిదే అధికారం అని తేలినట్లు పేర్కొంది.    ఏపీలో  మొత్తం 175 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కుగాను 144 నియోజ‌క‌వ‌ర్గాల్లో కూట‌మి అభ్య‌ర్థులు విజ‌య‌దుంద‌భి  మోగించ‌బోతున్నార‌ని ప‌య‌నీర్ సంస్థ పేర్కొంది. ఇక అధికార వైసీపీ కేవ‌లం 31 నియోజ‌క‌వ‌ర్గాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌వుతుంద‌ని తేల్చింది. ఓటింగ్ శాతం విష‌యానికి వ‌చ్చేస‌రికి  తెలుగుదేశం కూట‌మి 52శాతం, వైసీపీ 41శాతం, కాంగ్రెస్ 4శాతం, ఇత‌రులు మూడు శాతం ఓట్లు ద‌క్కించున్నట్లు ప‌య‌నీర్  ఎగ్జిట్ పోల్ లో వెల్లడైంది. ఇక లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల విష‌యానికొస్తే.. ఏపీలో మొత్తం 25 లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. గ‌తంలో వైసీపీ అభ్య‌ర్థులు 22 నియోజ‌క‌వ‌ర్గాల్లో విజ‌యం సాధించారు. అయితే, ప్ర‌స్తుతం ఎన్నిక‌ల్లో వైసీపీకి లోక్ సభ ఎన్నికలలోనూ ఘోర ప‌రాభ‌వం ఎదురుకాబోతుంద‌ని ప‌య‌నీర్ స‌ర్వే సంస్థ పేర్కొంది. రాష్ట్రంలోని పాతిక లోక్ సభ నియోజకవర్గాలకు గాను తెలుగుదేశం  కూట‌మి అభ్య‌ర్థులు 20 లోక్‌స‌భ‌ నియోజ‌క‌వ‌ర్గాల్లో విజ‌యం సాధిస్తార‌ని, మిగిలిన ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ అభ్య‌ర్థులు విజ‌యం సాధించే అవకాశాలున్నాయని పేర్కొంది.  

ycp defeat sure says pulse today exit poll

వైసీపీకి ఘోర పరాజయమే.. తేల్చేసిన పల్స్ టుడే ఎగ్జిట్ పోల్

 ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై  సర్వే సంస్థలు విడుదల చేస్తున్న ఎగ్జిట్ పోల్స్ లో తెలుగుదేశం హవానే సూచిస్తున్నాయి.  దాదాపు వందకు పైగా స్థానాల్లో టీడీపీ కూటమి విజయం సాధిస్తుందని పలు సంస్థల ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. ముందుగా పల్స్ టుడే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం తెలుగుదేశం కూటమికి 125 స్థానాలు, వైసీపీకి 50 స్థానాలు వస్తాయి. ఇక లోక్ సభ ఎన్నికల విషయానికి వస్తే తెలుగుదేశం కూటమికి 19 నుంచి 20 స్థానాలలో విజయం దక్కుతుంది. ఇక వైసీపీ విషయానికి వస్తే 5 నుంచి ఆరు స్థానాలలో విజయం సాధించే అవకాశాలున్నాయి. రాయలసీమ జిల్లాలోని 62 స్థానాలలో తెలుగుదేశం కూటమి 29 స్థానాలలో, వైసీపీ 23 స్థానాలలో గెలిచే అవకాశాలున్నాయని పల్స్ టుడే ఎగ్జిట్ పోల్ తేల్చింది.   అలాగే ఉత్తరాంధ్రలోని  34 శాసనసభ స్థానాలలో తెలుగుదేశం కూటమికి 23, వైసీపీకి  11 స్థానాల్లో విజయం సాధిస్తుందని పేర్కొంది. అదే విధంగా ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా వాటిలో తెలుగుదేశం కూటమి 28, వైసీపీ 6 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలున్నాయని పల్స్‌టుడే ఎగ్జిట్ పోల్ పేర్కొంది.  కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 33 స్థానాలు ఉండగా తెలుగుదేశం కూటమి 27, వైసీపీ 6 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని పేర్కొంది.  ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూటమి 18, వైసీపీ 4 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలున్నాయని పల్స్‌టుడే పేర్కొంది.  

chanakya strategies exit poll

కూటమిదే అధికారం: చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్ సర్వే!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఎన్డీయే కూటమిదే పైచేయి అని చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్ సర్వే స్పష్టం చేసింది. 25 పార్లమెంట్ స్థానాల్లో కూటమికి 17 నుంచి 18 స్థానాలు, వైసీపీకి 6 నుంచి 7 స్థానాలు దక్కుతాయని, 175 ఎమ్మెల్యే స్థానాల్లో కూటమికి 114 నుంచి 125 స్థానాలు, వైసీపీకి 39 నుంచి 49స్థానాలు దక్కుతాయని చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్ స్పష్టం చేసింది.  పార్లమెంట్ నియోజకవర్గాలు శ్రీకాకుళం (కూటమి), విజయనగరం (హోరాహోరీ), అరకు (వైసీపీ), విశాఖపట్నం (కూటమి), అనకాపల్లి (కూటమి), కాకినాడ (కూటమి), రాజమండ్రి (కూటమి), అమలాపురం (కూటమి), నర్సాపూర్ (కూటమి), ఏలూరు (కూటమి), మచిలీపట్నం (కూటమి), విజయవాడ (హోరాహోరీ), గుంటూరు (కూటమి), నర్సరావుపేట (కూటమి), బాపట్ల (కూటమి), ఒంగోలు (కూటమి), నెల్లూరు (కూటమి), తిరుపతి (వైసీపీ), చిత్తూరు (వైసీపీ), రాజంపేట (వైసీపీ), కడప (వైసీపీ), నంద్యాల (వైసీపీ), కర్నూలు (కూటమి), అనంతపురం (కూటమి), హిందూపూర్ (కూటమి),  అసెంబ్లీ నియోజకవర్గాలు ఇచ్ఛాపురం (కూటమి), టెక్కలి (కూటమి), పలాస (కూటమి), పాతపట్నం (కూటమి), ఆమదాలవలస (కూటమి), శ్రీకాకుళం (కూటమి), నరసన్నపేట (హోరాహోరీ). ఎచ్చెర్ల (వైసీపీ), రాజాం (ఎస్సీ) (కూటమి), బొబ్బిలి (కూటమి), చీపురుపల్లి (వైసీపీ), గజపతినగరం (హోరాహోరీ), నెల్లిమర్ల (హోరాహోరీ), విజయనగరం (కూటమి). పాలకొండ (ఎస్టీ) (కూటమి), కురుపాం (ఎస్టీ) (వైసీపీ), పార్వతీపురం (ఎస్సీ) (కూటమి), సాలూరు (ఎస్టీ) (వైసీపీ), అరకులోయ (ఎస్టీ) (కూటమి), పాడేరు (ఎస్టీ) (వైసీపీ), రంపచోడవరం (ఎస్టీ) (వైసీపీ). శృంగవరపుకోట (కూటమి), భీమిలి (కూటమి), విశాఖ తూర్పు (కూటమి), విశాఖ దక్షిణం (కూటమి), విశాఖ ఉత్తరం (హోరాహోరీ), విశాఖ పశ్చిమం (కూటమి), గాజువాక (కూటమి). చోడవరం (కూటమి), మాడుగుల (కూటమి), అనకాపల్లి (కూటమి), పెందుర్తి (కూటమి), ఎలమంచిలి (కూటమి), పాయకరావుపేట (కూటమి), నర్సీపట్నం (హోరాహోరీ). తుని (కూటమి), ప్రత్తిపాడు (కూటమి), పిఠాపురం (కూటమి), కాకినాడ రూరల్ (కూటమి), పెద్దాపురం (కూటమి), కాకినాడ సిటీ (కూటమి), జగ్గంపేట (కూటమి). అనపర్తి (కూటమి), రాజానగరం (కూటమి), రాజమహేంద్రవరం సిటీ (కూటమి), రాజమహేంద్రవరం రూరల్ (కూటమి), కొవ్వూరు (ఎస్సీ) (కూటమి), నిడదవోలు (కూటమి), గోపాలపురం (ఎస్సీ) (వైసీపీ). రామచంద్రపురం (వైసీపీ), ముమ్మిడివరం (కూటమి), అమలాపురం (ఎస్సీ) (కూటమి), రాజోలు (ఎస్సీ) (వైసీపీ), పి.గన్నవరం (ఎస్సీ) (వైసీపీ), కొత్తపేట (కూటమి), మండపేట (కూటమి). ఆచంట (హోరాహోరీ), పాలకొల్లు (కూటమి), నరసాపురం (కూటమి), భీమవరం (కూటమి), ఉండి (కూటమి), తణుకు (కూటమి), తాడేపల్లిగూడెం (కూటమి). ఉంగుటూరు (కూటమి), దెందులూరు (హోరాహోరీ), ఏలూరు (కూటమి), పోలవరం (వైసీపీ), చింతలపూడి (ఎస్సీ) (కూటమి), నూజివీడు (కూటమి), కైకలూరు (కూటమి). గన్నవరం (కూటమి), గుడివాడ (కూటమి), పెడన (కూటమి), మచిలీపట్నం (కూటమి), అవనిగడ్డ (కూటమి), పెనమలూరు (కూటమి), పామర్రు (వైసీపీ). తిరువూరు (ఎస్సీ) (వైసీపీ), విజయవాడ పశ్చిమ (కూటమి), విజయవాడ సెంట్రల్ (కూటమి), విజయవాడ తూర్పు (కూటమి), మైలవరం (కూటమి), నందిగామ (కూటమి), జగ్గయ్యపేట (కూటమి). తాడికొండ (ఎస్సీ) (కూటమి), మంగళగిరి (కూటమి), పొన్నూరు (కూటమి), తెనాలి (కూటమి), ప్రత్తిపాడు (ఎస్సీ) (వైసీపీ), గుంటూరు పశ్చిమ (కూటమి), గుంటూరు తూర్పు (వైసీపీ). పెదకూరపాడు (హోరాహోరీ), చిలకలూరిపేట (కూటమి), నరసరావుపేట (వైసీపీ), సత్తెనపల్లి (కూటమి), వినుకొండ (కూటమి), గురజాల (కూటమి), మాచర్ల (కూటమి). వేమూరు (కూటమి), రేపల్లె (కూటమి), బాపట్ల (వైసీపీ), పర్చూరు (కూటమి), అద్దంకి (కూటమి), చీరాల (హోరాహోరీ), సంతనూతలపాడు (కూటమి). యర్రగొండపాలెం (వైసీపీ), దర్శి (కూటమి), ఒంగోలు (కూటమి), కొండపి (కూటమి), మార్కాపురం (వైసీపీ), గిద్దలూరు (వైసీపీ), కనిగిరి (కూటమి). కందుకూరు (కూటమి), కావలి (హోరాహోరీ), ఆత్మకూర్ (వైసీపీ), కోవూరు (కూటమి), నెల్లూరు సిటీ (కూటమి), నెల్లూరు రూరల్ (కూటమి), ఉదయగిరి (కూటమి). సర్వేపల్లి (కూటమి), గూడూరు (ఎస్సీ) (కూటమి), సూళ్ళూరుపేట (ఎస్సీ ) (వైసీపీ), వెంకటగిరి (కూటమి), తిరుపతి (కూటమి), శ్రీకాళహస్తి (కూటమి), సత్యవేడు (ఎస్సీ) (వైసీపీ). చంద్రగిరి (కూటమి), నగరి (కూటమి), గంగాధర నెల్లూరు (ఎస్సీ) (వైసీపీ), చిత్తూరు (కూటమి), పూతలపట్టు (ఎస్సీ) (కూటమి), పలమనేరు (కూటమి), కుప్పం (కూటమి). రాజంపేట (వైసీపీ), కోడూరు (ఎస్సీ) (హోరాహోరీ), రాయచోటి (వైసీపీ), తంబళ్ళపల్లె (వైసీపీ), పీలేరు (కూటమి), మదనపల్లె (కూటమి), పుంగనూరు (వైసీపీ). బద్వేల్ (ఎస్సీ) (వైసీపీ), కడప (కూటమి), పులివెందుల (వైసీపీ), కమలాపురం (హోరాహోరీ), జమ్మలమడుగు (హోరాహోరీ), ప్రొద్దుటూరు (కూటమి), మైదుకూరు (కూటమి). ఆళ్ళగడ్డ (కూటమి), శ్రీశైలం (కూటమి), నందికొట్కూరు (ఎస్సీ (హోరాహోరీ), పాణ్యం (వైసీపీ), నంద్యాల (వైసీపీ), బనగానపల్లె (కూటమి), డోన్ (హోరాహోరీ). కర్నూలు (కూటమి), పత్తికొండ (కూటమి), కోడుమూరు (ఎస్సీ) (వైసీపీ), ఎమ్మిగనూరు (కూటమి), మంత్రాలయం (వైసీపీ), ఆదోని (వైసీపీ), ఆలూర్ (వైసీపీ). రాయదుర్గం (కూటమి), ఉరవకొండ (కూటమి), గుంతకల్ (హోరాహోరీ), తాడిపత్రి (కూటమి), సింగనమల (ఎస్సీ) (వైసీపీ), అనంతపురం (కూటమి), కళ్యాణదుర్గం (కూటమి). రాప్తాడు (కూటమి), మడకశిర (ఎస్సీ) (వైసీపీ), హిందూపూర్ (కూటమి), పెనుకొండ (కూటమి), పుట్టపర్తి (వైసీపీ), ధర్మవరం (హోరాహోరీ), కదిరి (కూటమి). ఓట్ల శాతం ఎన్డీయే కూటమి = 52 శాతం వైసీపీ = 43 శాతం ఇండియా కూటమి= 2.5 శాతం ఇతరులు = 2.5 శాతం

chanikya exit poll say people mandate to tdp alliance

తెలుగుదేశం కూట‌మికే ప్ర‌జ‌లు ప‌ట్టం.. చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్

ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ ముగిసి దాదాపు ఇర‌వై రోజులు కావొస్తున్నది. ఎన్నిక‌లు ముగిసిన నాటి నుంచి మేమే అధికారంలోకి వ‌స్తున్నామ‌ని తెలుగుదేశం, వైసీపీ నేత‌లు చెబుతున్నారు. మ‌రోసారి జ‌గ‌న్ సీఎం అవుతార‌ని వైసీపీ నేత‌లు చెబుతున్న‌ప్ప‌టికీ.. పోలింగ్ స‌ర‌ళిని చూస్తే అలాంటి ప‌రిస్థితి ఎక్క‌డా క‌నిపించ‌లేదు. జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌లో అభివృద్ధిని మ‌రిచి కేవ‌లం క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌కే ప‌రిమితం కావ‌టంతో ప్ర‌జ‌లు విసిగిపోయారు. దీంతో గ‌తంలో ఎప్పుడూ లేని స్థాయిలో ఓట‌ర్లు భారీగా తరలి వచ్చిత‌మ ఓటు హ‌క్కును వినియోగించుకొని ప్ర‌భుత్వంపై త‌మ వ్య‌తిరేక‌త‌ను స్ప‌ష్టం చేశారు. అర్ధ‌రాత్రి 2గంట‌ల వ‌ర‌కు దాదాపు 300 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కొన‌సాగిందంటే వైసీపీ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో ఎంత వ్య‌తిరేక‌త ఉందో స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతుంది. స‌ర్వే సంస్థ‌లు సైతం అదే విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో చాణ‌క్య స్ట్రాట‌జీస్ స‌ర్వే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసింది. ఆ ఎగ్జిట్ పోల్ సర్వే   స్ప‌ష్ట‌మైన మెజార్టీతో  తెలుగుదేశం కూట‌మి అధికారంలోకి వ‌స్తుంద‌ని తేల్చింది. ఏపీలోని 175 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ నిర్వ‌హించిన ఎగ్జిట్ పోల్ ను  చాణ‌క్య స్ట్రాట‌జీస్ స‌ర్వే సంస్థ శనివారం సాయంత్రం విడుదల చేసింది. ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధిస్తుంది. తెలుగుదేశం కూటమికి  కూట‌మికి 52శాతం ఓట్లు,  వైసీపీకి 43శాతం ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 2.50శాతం, ఇత‌రుల‌కు 2.50 శాతం ఓట్లు వ‌స్తాయ‌ని  చాణక్య స్ట్రటజీస్ ఎగ్జిట్ పోల్ తేల్చింది. ఏపీలోని 13 ఉమ్మ‌డి జిల్లాల్లో  తెలుగుదేశం కూట‌మికే అత్య‌ధిక సీట్లు వ‌స్తాయ‌ని తేలింది. మొత్తం 175 స్థానాల్లో తెలుగుదేశం కూట‌మికి 114 నుంచి 125 సీట్లు,  వైసీపీకి 39 నుంచి 49 స్థానాలు, ఇత‌రుల‌కు ఒక స్థానం వ‌స్తుంద‌ని పేర్కొంది.  లోక్‌స‌భ స్థానాల్లో  తెలుగుదేశం కూట‌మికి 17 నుంచి 18 , వైసీపీకి 6 నుంచి 7 స్థానాలు  వ‌స్తాయ‌ని తేల్చింది.  అర‌కు, నంద్యాల‌, క‌డ‌ప‌, తిరుప‌తి, రాజంపేట‌, చిత్తూరు నియోజ‌క‌వ‌ర్గాలు మిన‌హా మిగిలిన అన్ని పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో కూట‌మి అభ్య‌ర్థులే విజ‌యం సాధిస్తార‌ని, విజ‌య‌న‌గ‌రం పార్ల‌మెంట్ స్థానంలో ఇరు పార్టీల మ‌ధ్య హోరాహరీ పోరు జరిగిందనీ   చాణ‌క్య స్ట్రాట‌జీస్‌ ఎగ్జిట్ పోల్ తేల్చింది.  రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ అభ్య‌ర్థులు పోటీ చేసిన‌ప్ప‌టికీ వారి ఓటు బ్యాంకు కేవ‌లం 3శాతంలోపే ఉంటుంద‌ని, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైఎస్ ష‌ర్మిల ప్ర‌భావం పెద్ద‌గా లేన‌ప్ప‌టికీ.. క‌డ‌ప పార్ల‌మెంట్ స్థానంలో మాత్రం గ‌ట్టి పోటీ ఇచ్చార‌ని చాణ‌క్య స్ట్రాట‌జీస్ పేర్కొంది. 2019 ఎన్నిక‌ల్లో టీడీపీకి 40శాతం ఓట్లు పోల‌య్యాయి. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో టీడీపీకి 47శాతం ఓట్లు పోల‌య్యాయి.  2019 ఎన్నిక‌ల్లో వైసీపీకి 50శాతం ఓట్లు పోల‌వ‌గా.. ప్ర‌స్తుతం 43శాతం మాత్ర‌మే ఓట్లు పోల‌య్యాయి. తెలుగుదేశం పార్టీకి జ‌న‌సేన‌, బీజేపీకూడా తోడుకావ‌డంతో   కూట‌మికి 52శాతం పోల‌యిన‌ట్లు చాణ‌క్య స్ట్రాట‌జీస్ ఎగ్జిట్ పోల్ పేర్కొంది. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో కీల‌కంగా భావిస్తున్న కుప్పం, పిఠాపురం, హింద‌పూరం, మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గాల్లో చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాన్‌, బాల‌కృష్ణ‌, నారా లోకేశ్  భారీ మెజారిటీతో విజయం సాధించడం తధ్యమని ఈ ఎగ్జిట్ పోల్ తేల్చి చెప్పింది.   ఉమ్మ‌డి జిల్లాల వారిగా తెలుగుదేశం, వైసీపీ లు గెలుచుకునే సీట్ల చాణక్య ఎగ్జిట్ పోల్ ప్రకారం ఇలా ఉన్నాయి. శ్రీ‌కాకుళం జిల్లాలో తెలుగుదేశం కూట‌మి -7, వైసీపీ -2, ట‌ఫ్ ఫైట్ -1 విజ‌య‌న‌గ‌రం జిల్లాలో   కూట‌మి-4, వైసీపీ-3, ట‌ఫ్ ఫైట్ - 2 విశాఖ‌ప‌ట్ట‌ణం జిల్లాలో  కూట‌మి- -11, వైసీపీ -2, ట‌ఫ్ ఫైట్ -2  పశ్చిమ గోదావ‌రి జిల్లాలో   కూట‌మి -11, వైసీపీ - 2, ట‌ఫ్ ఫైట్ - 2 ఈస్ట్ గోదావ‌రి జిల్లాలో   కూట‌మి - 15, వైసీపీ - 3, ట‌ఫ్ ఫైట్ -1 కృష్ణా జిల్లాలో   కూట‌మి - 13, వైసీపీ - 2, ట‌ఫ్ ఫైట్ -1 గుంటూరు జిల్లాలో   కూట‌మి - 13, వైసీపీ -3, ట‌ప్ ఫైట్-1 నెల్లూరు జిల్లాలో   కూట‌మి - 07,  వైసీపీ - 2, ట‌ఫ్ ఫైట్ -1 క‌డ‌ప జిల్లాలో   కూట‌మి - 2, వైసీపీ - 4, ట‌ఫ్ ఫైట్ - 4 క‌ర్నూల్ జిల్లాలో   కూట‌మి - 6, వైసీపీ - 6, ట‌ఫ్ ఫైట్ - 2. అనంత‌పురం జిల్లాలో కూట‌మి -9, వైసీపీ - 3, ట‌ఫ్ ఫైట్ - 2 చిత్తూరు జిల్లాలో  కూట‌మి - 7, వైసీపీ - 4, ట‌ఫ్ ఫైట్ - 3  వైసీపీ ఓట‌మికి, తెలుగుదేశం కూట‌మి విజయానికి కారణాలేమిటన్నది పరిశీలిస్తే..  - వైసీపీ ఓట‌మికి ప్ర‌ధాన కార‌ణం ఏపీ రాజ‌ధాని లేని రాష్ట్రంగా మార్చేశార‌నే అప‌వాదు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో అమ‌రావ‌తిని రాజ‌ధానిగా కొన‌సాగిస్తాన‌ని ప్ర‌తిప‌క్షం నేత హోదాలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చారు. కానీ, అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత అమ‌రాతి రాజ‌ధానిని విస్మ‌రించి మూడు రాజ‌ధానుల పేరుతో ఐదేళ్లు కాలం గ‌డిపేశారు. విశాఖ కేంద్రంగా రాజ‌ధాని ఏర్పాటు చేస్తామ‌ని చెప్పిన‌ప్ప‌టికీ.. విశాఖ న‌గ‌రంతో పాటు జిల్లాలో భూ క‌బ్జాలు పెరిగిపోయాయి. దీంతో ప్ర‌జ‌లు వైసీపీ ప్ర‌భుత్వంపై కొంత‌ వ్య‌తిరేక‌తతో ఉన్నారు. - ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో మెజార్టీ ఓట‌ర్లు తెలుగుదేశం కూట‌మికి, గ్రామీణ ప్రాంతాల్లో మెజార్టీ ఓట‌ర్లు  వైసీపీకి ఓట్లు వేసిన‌ట్లు స‌ర్వేలో తేలింది.  - ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ప్ర‌జ‌లు తెలుగుదేశం కూట‌మికి అనుకూలంగా మారడానికి జ‌గ‌న్ హ‌యాంలో జీరో అభివృద్ధి ఒక‌టి. ఏపీలో ఎలాంటి ప‌రిశ్ర‌మ‌లు రాక‌పోవ‌టంతో ఉపాధికోసం ప్ర‌జ‌లు ఇత‌ర రాష్ట్రాల‌కు వ‌ల‌స వెళ్లారు.  -  పోలింగ్ కు రెండు రోజుల ముందే హైద‌రాబాద్‌, చెన్నై, బెంగ‌ళూరు స‌హా ఇత‌ర రాష్ట్రాలు, విదేశాల నుంచి పెద్ద సంఖ్య‌లో ఓట‌ర్లు ఏపీకి వ‌చ్చి ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. వీరిలో 80శాతంకుపైగా తెలుగుదేశం  అనుకూల ఓటర్లే. - వైసీపీ ప్ర‌భుత్వం అమ‌లు చేసిన సంక్షేమ ప‌థ‌కాలు కేవ‌లం దిగువ మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌పై మాత్ర‌మే ప్ర‌భావితం చూపిస్తున్నాయి. ఈ వ‌ర్గం ఓట్లు ఎక్కువ‌గా రూర‌ల్ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ప‌ల్లెల్లో వృద్ధులు, పెన్ష‌న్ దారులు ఎక్కువ‌గా వైసీపీ వైపు మొగ్గుచూప‌గా.. ప‌ల్లెల్లో విద్యావంతులు, ప‌ట్ట‌ణ ప్రాంతాల ఓట‌ర్లు అధికంగా  తెలుగుదేశం కూట‌మికి మ‌ద్ద‌తుగా నిలిచారు. - నిరుద్యోగులు సైతం కూట‌మి వైపు మొగ్గుచూపారు. దీనికి కార‌ణం.. ప్ర‌తీయేటా జాబ్ క్యాలెండ‌ర్ ఇస్తామంటూ గ‌త ఎన్నిక‌ల్లో ఇచ్చిన మాట అమ‌లు కాలేద‌ని నిరుద్యోగులు ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హంతో ఉన్నారు. ఇదేస‌మ‌యంలో   కూట‌మి అధికారంలోకి వ‌స్తే నిరుద్యోగ భృతి వ‌స్తుంద‌ని బ‌లంగా న‌మ్ముతున్నారు. దీంతో 90శాతం మంది నిరుద్యోగులు కూట‌మివైపే మొగ్గుచూపారు. కూట‌మి అధికారంలోకి వ‌స్తే ఉపాధి దొరుకుతుంద‌ని నిరుద్యోగులు న‌మ్ముతున్నారు.  - తెలుగుదేశం సూప‌ర్ సిక్స్ మేనిఫెస్టోకు క్షేత్ర స్థాయిలో మంచి ఫ‌లిత‌మే వ‌చ్చింది. మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం, మూడు గ్యాస్ సిలిండ‌ర్లు ఉచితం, ప్ర‌తి మ‌హిళ‌కు నెల‌కు రూ. 1500 ఇస్తామ‌ని చంద్ర‌బాబు ఇచ్చిన హామీని క్షేత్ర‌స్థాయిలోకి తీసుకెళ్ల‌డంలో తెలుగుదేశం నేత‌లు విజ‌య‌వంతం అయ్యారు.  - వైసీపీ ప్ర‌భుత్వం ఓట‌మికి మ‌రో ప్ర‌ధాన కార‌ణం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.  దీనికితోడు ప‌ట్టాదారు పాసు పుస్త‌కాల‌పై జ‌గ‌న్ ఫొటోలు ఉండ‌టాన్ని వైసీపీ నేత‌లు కూడా త‌ప్పుబ‌ట్టారు. ఈ అంశంపై ప్ర‌జ‌లు బ‌హిరంగంగానే ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మా భూమిపై మీ హ‌క్కు ఏమిట‌ని నిల‌దీశారు. దీనికితోడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు నేనుకూడా బాధితుడినే అంటూ కొంద‌రు ప్ర‌ముఖలు బ‌హిరంగంగా చెప్ప‌డంతో ప్ర‌జ‌ల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై భ‌యాందోళ‌నలు నెల‌కొన్నాయి.  - ప‌ట్టాదారు పాసు పుస్త‌కంపై జ‌గ‌న్ ఫొటో ఉండ‌టం ఏమిట‌ని  తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. నంద్యాల స‌భ‌లో పాసు పుస్త‌కాన్ని చింపేశారు. ఇది ఓట‌ర్ల‌ను, ముఖ్యంగా రైతుల‌ను బాగా ఆక‌ర్షించింది. అధికారంలోకిరాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ర‌ద్దుపైనే రెండో సంత‌కం అని చంద్ర‌బాబు చెప్ప‌డంతో రైతులు అధిక‌శాతం మంది కూట‌మివైపు మొగ్గుచూపారు.  - కొత్త‌గా ఓటుహ‌క్కు పొందిన యువ‌తుల్లో 70శాతం మంది తెలుగుదేశం కూట‌మికే అనుకూలంగా ఓటు వేశారు. యువ‌కుల్లో  60శాతం మంది కూట‌మికి అనుకూలంగా ఓటు వేశారు.  - ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, వ్యాపారులు ఈ ఎన్నిక‌ల్లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. వీరిలో అధిక‌శాతం  మంది ఓట‌ర్లు కూట‌మివైపు మొగ్గుచూపారు. ఈసారి 4.30ల‌క్ష‌ల‌కుపైగా పోస్ట‌ల్ ఓట్లు పోల‌య్యాయి. మెజార్టీ శాతం పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్లు తెలుగుదేశం కూట‌మికే ప‌డిన‌ట్లు చాణ‌క్య స్ట్రాట‌జీస్  ఎగ్జిట్ పోల్ తేల్చింది.

కూటమిదే విజయం: పయనీర్ పోస్ట్ పోల్ సర్వే!

జగన్ ఎన్ని బటన్లు నొక్కినా, ఆంధ్రప్రదేశ్ ఓటరు ఈవీఎంలలో కూటమి బటన్ నొక్కాడని తెలిసిపోయింది. తెలుగుదేశం కూటమిదే ఘన విజయం అని పయనీర్ పోస్ట్ పోల్ సర్వే స్పష్టం చేసింది. 25 పార్లమెంట్ స్థానాల్లో కూటమికి 20 స్థానాలు, వైసీపీకి 5 స్థానాలు దక్కుతాయని, 175 ఎమ్మెల్యే స్థానాల్లో కూటమికి 144 స్థానాలు, వైసీపీకి 31 స్థానాలు దక్కుతాయని ‘పయనీర్’ స్పష్టం చేసింది. 14 మే నుంచి 29 మే వరకు సేకరించిన అభిప్రాయల ప్రకారం ‘పయనీర్’ ఈ సర్వే ఫలితాలను వెల్లడించింది. పార్లమెంట్ నియోజకవర్గాలు శ్రీకాకుళం (కూటమి), విజయనగరం (కూటమి), అరకు (వైసీపీ), విశాఖపట్నం (కూటమి), అనకాపల్లి (కూటమి), కాకినాడ (కూటమి), రాజమండ్రి (కూటమి), అమలాపురం (కూటమి), నర్సాపూర్ (కూటమి), ఏలూరు (కూటమి), మచిలీపట్నం (కూటమి), విజయవాడ (కూటమి), గుంటూరు (కూటమి), నర్సరావుపేట (కూటమి), బాపట్ల (కూటమి), ఒంగోలు (కూటమి), నెల్లూరు (కూటమి), తిరుపతి (కూటమి), చిత్తూరు (కూటమి), రాజంపేట (వైసీపీ), కడప (వైసీపీ), నంద్యాల (వైసీపీ), కర్నూలు (వైసీపీ), అనంతపురం (కూటమి), హిందూపూర్ (కూటమి). అసెంబ్లీ నియోజకవర్గాలు ఇచ్ఛాపురం (కూటమి), టెక్కలి (కూటమి), పలాస (కూటమి), పాతపట్నం (కూటమి), ఆమదాలవలస (కూటమి), శ్రీకాకుళం (కూటమి), నరసన్నపేట (కూటమి). ఎచ్చెర్ల (కూటమి), రాజాం (ఎస్సీ) (కూటమి), బొబ్బిలి (కూటమి), చీపురుపల్లి (వైసీపీ), గజపతినగరం (కూటమి), నెల్లిమర్ల (కూటమి), విజయనగరం (కూటమి). పాలకొండ (ఎస్టీ) (కూటమి), కురుపాం (ఎస్టీ) (వైసీపీ), పార్వతీపురం (ఎస్సీ) (వైసీపీ), సాలూరు (ఎస్టీ) (కూటమి), అరకులోయ (ఎస్టీ) (కూటమి), పాడేరు (ఎస్టీ) (కూటమి), రంపచోడవరం (ఎస్టీ) (వైసీపీ). శృంగవరపుకోట (కూటమి), భీమిలి (కూటమి), విశాఖ తూర్పు (కూటమి), విశాఖ దక్షిణం (కూటమి), విశాఖ ఉత్తరం (కూటమి), విశాఖ పశ్చిమం (కూటమి), గాజువాక (కూటమి). చోడవరం (కూటమి), మాడుగుల (కూటమి), అనకాపల్లి (కూటమి), పెందుర్తి (కూటమి), ఎలమంచిలి (కూటమి), పాయకరావుపేట (కూటమి), నర్సీపట్నం (కూటమి). తుని (కూటమి), ప్రత్తిపాడు (కూటమి), పిఠాపురం (కూటమి), కాకినాడ రూరల్ (కూటమి), పెద్దాపురం (కూటమి), కాకినాడ సిటీ (కూటమి), జగ్గంపేట (కూటమి). అనపర్తి (కూటమి), రాజానగరం (కూటమి), రాజమహేంద్రవరం సిటీ (కూటమి), రాజమహేంద్రవరం రూరల్ (కూటమి), కొవ్వూరు (ఎస్సీ) (కూటమి), నిడదవోలు (కూటమి), గోపాలపురం (ఎస్సీ) (కూటమి). రామచంద్రపురం (కూటమి), ముమ్మిడివరం (కూటమి), అమలాపురం (ఎస్సీ) (కూటమి), రాజోలు (ఎస్సీ) (కూటమి), పి.గన్నవరం (ఎస్సీ) (కూటమి), కొత్తపేట (కూటమి), మండపేట (కూటమి). ఆచంట (కూటమి), పాలకొల్లు (కూటమి), నరసాపురం (కూటమి), భీమవరం (కూటమి), ఉండి (కూటమి), తణుకు (కూటమి), తాడేపల్లిగూడెం (కూటమి). ఉంగుటూరు (కూటమి), దెందులూరు (కూటమి), ఏలూరు (కూటమి), పోలవరం (వైసీపీ), చింతలపూడి (ఎస్సీ) (కూటమి), నూజివీడు (కూటమి), కైకలూరు (కూటమి). గన్నవరం (కూటమి), గుడివాడ (కూటమి), పెడన (కూటమి), మచిలీపట్నం (కూటమి), అవనిగడ్డ (కూటమి), పెనమలూరు (కూటమి), పామర్రు (కూటమి). తిరువూరు (ఎస్సీ) (వైసీపీ), విజయవాడ పశ్చిమ (కూటమి), విజయవాడ సెంట్రల్ (కూటమి), విజయవాడ తూర్పు (కూటమి), మైలవరం (కూటమి), నందిగామ (కూటమి), జగ్గయ్యపేట (కూటమి). తాడికొండ (ఎస్సీ) (కూటమి), మంగళగిరి (కూటమి), పొన్నూరు (కూటమి), తెనాలి (కూటమి), ప్రత్తిపాడు (ఎస్సీ) (కూటమి), గుంటూరు పశ్చిమ (కూటమి), గుంటూరు తూర్పు (కూటమి). పెదకూరపాడు (కూటమి), చిలకలూరిపేట (కూటమి), నరసరావుపేట (వైసీపీ), సత్తెనపల్లి (కూటమి), వినుకొండ (కూటమి), గురజాల (కూటమి), మాచర్ల (కూటమి). వేమూరు (కూటమి), రేపల్లె (కూటమి), బాపట్ల (వైసీపీ), పర్చూరు (కూటమి), అద్దంకి (కూటమి), చీరాల (వైసీపీ), సంతనూతలపాడు (కూటమి). యర్రగొండపాలెం (వైసీపీ), దర్శి (కూటమి), ఒంగోలు (కూటమి), కొండపి (కూటమి), మార్కాపురం (కూటమి), గిద్దలూరు (కూటమి), కనిగిరి (కూటమి). కందుకూరు (కూటమి), కావలి (కూటమి), ఆత్మకూర్ (కూటమి), కోవూరు (కూటమి), నెల్లూరు సిటీ (కూటమి), నెల్లూరు రూరల్ (కూటమి), ఉదయగిరి (కూటమి). సర్వేపల్లి (కూటమి), గూడూరు (ఎస్సీ) (కూటమి), సూళ్ళూరుపేట (ఎస్సీ ) (వైసీపీ), వెంకటగిరి (కూటమి), తిరుపతి (కూటమి), శ్రీకాళహస్తి (కూటమి), సత్యవేడు (ఎస్సీ) (వైసీపీ). చంద్రగిరి (కూటమి), నగరి (కూటమి), గంగాధర నెల్లూరు (ఎస్సీ) (వైసీపీ), చిత్తూరు (కూటమి), పూతలపట్టు (ఎస్సీ) (కూటమి), పలమనేరు (కూటమి), కుప్పం (కూటమి). రాజంపేట (కూటమి), కోడూరు (ఎస్సీ) (వైసీపీ), రాయచోటి (వైసీపీ), తంబళ్ళపల్లె (వైసీపీ), పీలేరు (కూటమి), మదనపల్లె (కూటమి), పుంగనూరు (వైసీపీ). బద్వేల్ (ఎస్సీ) (వైసీపీ), కడప (కూటమి), పులివెందుల (వైసీపీ), కమలాపురం (వైసీపీ), జమ్మలమడుగు (కూటమి), ప్రొద్దుటూరు (వైసీపీ), మైదుకూరు (కూటమి). ఆళ్ళగడ్డ (కూటమి), శ్రీశైలం (కూటమి), నందికొట్కూరు (ఎస్సీ (వైసీపీ), పాణ్యం (వైసీపీ), నంద్యాల (వైసీపీ), బనగానపల్లె (కూటమి), డోన్ (కూటమి). కర్నూలు (కూటమి), పత్తికొండ (కూటమి), కోడుమూరు (ఎస్సీ) (వైసీపీ), ఎమ్మిగనూరు (కూటమి), మంత్రాలయం (వైసీపీ), ఆదోని (వైసీపీ), ఆలూర్ (వైసీపీ). రాయదుర్గం (కూటమి), ఉరవకొండ (కూటమి), గుంతకల్ (కూటమి), తాడిపత్రి (కూటమి), సింగనమల (ఎస్సీ) (వైసీపీ), అనంతపురం (కూటమి), కళ్యాణదుర్గం (కూటమి). రాప్తాడు (కూటమి), మడకశిర (ఎస్సీ) (వైసీపీ), హిందూపూర్ (కూటమి), పెనుకొండ (కూటమి), పుట్టపర్తి (కూటమి), ధర్మవరం (కూటమి), కదిరి (కూటమి). ఓట్ల శాతం ఎన్డీయే కూటమి = 52 శాతం వైసీపీ = 41 శాతం ఇండియా కూటమి= 4 శాతం ఇతరులు = 3 శాతం

పిఠాపురంలో పవన్ విజయానికి జగన్ బాటలు!

ఎన్నికల ఫలితాలు సరిగ్గా మూడు రోజుల్లో వెలువడతాయి. ఆంధ్రప్రదేశ్ లో ఈ సారి ఎన్నికలు హోరాహోరీగా సాగాయని చెబుతున్నారు. అయితే సర్వేలు, అంచనాలూ తెలుగుదేశం కూటమికి ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఖాయమని చెబుతున్నాయి. పోలింగ్ తరువాత నుంచీ వైసీపీ నేతల భాష, బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే వారికి కూడా రాబోయేది ఓటమే అది కూడా అలాంటి ఇలాంటి ఓటమి కాదు ఘోర పరాజయం అన్న సంగతి తెలిసిపోయినట్లుగా కనిపిస్తోంది. ఇక మరి కొద్ది గంటల్లో  ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. సర్వత్రా ఎగ్జిట్ పోల్స్ పట్ల ఉత్కంఠ, ఉత్సుకత నెలకొంది. తెలిసిపోయిన ఫలితమే అయినా టీవీల్లో చూసి సరిపోల్చుకోవడంలో ఓ కిక్ ఉంటుంది. ఆ కిక్ కోసమే ఇప్పుడు అంతా ఎదురు చూస్తున్నారు. రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలే కాదు, ఈ సారి సామాన్య జనం కూడా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోనే హాట్ సీట్లలో ఒకటిగా చెప్పుకుంటున్న పిఠాపురం నియోజకవర్గం పరిస్థితి తీసుకుంటే.. ఇక్కడ ఎగ్జిట్ పోల్ పై పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు. తుది ఫలితంపై కూడా ఏమంత టెన్షన్ లేదు. ఉన్న టెన్షన్ అంతా ఇక్కడ పవన్ కల్యాణ్ కు వచ్చే మెజారిటీ ఎంత అన్నదే.  2019 ఎన్నికలలో రెండు స్థానాల నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్ రెండింటిలోనూ పరాజయం పాలయ్యారు. దీంతో ఈ సారి ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్నారు. అదే సమయంలో ఆయనను ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టుకున్న జగన్ పిఠాపురంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. రాష్ట్రంలోనే కాపు సామాజిక వర్గ ఓటర్లు అత్యధికంగా ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో జగన్ పవన్ ను ఓడించడానికి వేసిన ఎత్తులు, పన్నిన వ్యూహాలూ అంతిమంగా పవన్ విజయానికి బాటలు వేశాయని చెప్పాలి. పవన్ ను ఓడించడమే లక్ష్యంగా జగన్ మిథున్ రెడ్డికి నియోజకవర్గ ప్రచార బాధ్యతలు అప్పగించారు. పవన్ ను తిట్టడమే లక్ష్యంగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను పార్టీలో చేర్చుకుని మరీ ఆ పని అప్పగించారు. ఇక కాపు సామాజికవర్గానికి చెందిన వంగా గీతను పార్టీ అభ్యర్థిగా నిలబెట్టారు. అంతే కాదు.. ఎన్నికల ప్రచారం ముగింపు రోజున తన చివరి బహిరంగ సభ కూడా జగన్ పిఠాపురంలోనే నిర్వహించారు. అంతే కాదు వంగీ గీతను పిఠాపురం నుంచి గెలిపిస్తే ఆమెను ఉప ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇచ్చారు. అయితే జగన్ వ్యూహాలూ ఎత్తుగడలూ అన్నీ పిఠాపురంలో పవన్ కు అనుకూలంగా మారాయని చెప్పవచ్చు. జగన్ ఒక విధంగా పవన్ పై దండయాత్ర చేస్తున్నారని జనం భావించారు. అదే సమయంలో రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చీలనివ్వను అంటూ ప్రకటించి, అందుకు అనుగుణంగా అడుగులు వేసి, త్యాగాలకు కూడా సిద్ధపడిన పవన్ పల్ల ప్రజాభిమానం వెల్లువెత్తింది. అదే విధంగా పిఠాపురం తెలుగుదేశం ఇన్ చార్జ్  ఎస్వీఎస్ఎన్ వర్మ ఫ్యాక్టర్ తెలుగుదేశం ఓటు సజావుగా సాఫీగా జనసేనకు ట్రాన్స్ ఫర్ అయ్యేలా చేసింది. ఈ అన్ని అంశాలూ కలిసి పిఠాపురంలో జనసేనాని గెలుపును సునాయాసం చేశాయి. ఇక్కడ ఇప్పుడు వైసీపీ క్యాడర్ కూడా పవన్ కల్యాణ్ కు ఎంత మెజారిటీ అన్న అంశంపైనే మాట్లాడుతున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. 

బాధ్యతాయుత ప్రజానాయకుడు చంద్రబాబు!

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిరంతరం ప్రజల మధ్య ఉంటారు. ప్రజా శ్రేయస్సు కోసం అనుక్షణం తపిస్తుంటారు. ఆయన అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా ఈ విషయంలో  ఆయన తీరు ఇసుమంతైనా మారదు. విజయవాడలో డయోరియా మరణాలు రోజు రోజుకూ పెరుగుతూ ఉంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కానీ, అధికార పార్టీ నేతలు కానీ కనీసం అక్కడి పరిస్థితులపై సమీక్షించలేదు. బాధితులను పరామర్శించలేదు. అసలు విజయవాడ నడిబొడ్డులో డయేరియా విజృంభించి అమాయకుల ఉసురు తీస్తోందన్న విషయం తెలియనట్లుగానే వ్యవహరిస్తున్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన విదేశీ పర్యటన ముగించుకుని అమరావతిలో అడుగుపెట్టీపెట్టగానే బెజవాడ డయేరియా బాధితులపై స్పందించారు. వారిని తక్షణమే ఆదుకోవాలని అధికారులను కోరారు. కలుషిత నీరు సరఫరా కారణంగానే ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందన్న చంద్రబాబు బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. డయేరియాతో కాకుండా ఇతర అనారోగ్య కారణాలతో వీరంతా చనిపోయారని అధికారులు చెప్పడం సరికాదని అన్నారు. కలుషిత నీటిపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కోరారు.  ఇంతెందుకు పోలింగ్ పూర్తయిన తరువాత ఆయన ప్రతిక్షణం రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య పరిష్కారం కోసం తన వంతు కృషి చేశారు. అధికారులకు, ఎన్నికల సంఘానికీ లేఖలు రాశారు.  ఈ-ఆఫీస్‌ అప్‌గ్రేడేషన్‌  కూడా చంద్రబాబు ఫిర్యాదుతోనే ఆగింది. వైసీపీ తీసుకొచ్చిన తప్పుడు జీవోలను మాయం చేసేందుకు వైసీపీ సర్కార్ చేసిన ప్రయత్నానికి అడ్డుకట్ట పడింది. రాష్ట్ర బాగోగుల విషయంలో చంద్రబాబు రాజీప డరనడానికి వీటిని ఉదాహరణలుగా పరిశీలకులు చూపుతున్నారు.    

రంకెలు.. పెడబొబ్బలు.. ఎవర్ని బెదిరిద్దామని?

ఓటమి అంచున నిలబడి వైసీపీ నేతలు కొందరు బెదరింపులకు దిగుతున్నారు. హెచ్చరికలు చేస్తున్నారు. ఇంత కాలం తమ వద్ద కుక్కిన పెనుల్లా పడి ఉన్న అధికారులే తమపై కేసులు నమోదు చేస్తుంటే.. ఏమిటీ ధిక్కారం అంటూ పెచ్చులకు పోతున్నారు. రేపు మీ సంగతేమిటో చూస్తాం అంటూ రంకెలు వేస్తున్నారు. ఇంత అన్యాయమా అంటూ పెడబొబ్బలు పెడుతున్నారు. ఔను పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి మరీ రేపు అనేది లేదనుకుంటున్నారా? మీలో ఒక్కర్నీ వదలం తస్మాత్ జాగ్రత్త అంటూ నిన్నమొన్నటి వరకూ తమ అడుగులకు మడుగులొత్తిన అధికారులపై బెదరింపులకు పాల్పడుతున్నారు.  నిజమే.. నిన్నటి దాకా నేరుగా ఎవరి మౌఖికాదేశాలపై అయితే పోలీసులు పని చేశారో.. ఆయనపై ఇప్పుడు అదే పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఔను మామూలుగా అయితే సజ్జలపై క్రిమినల్ కేసు అదీ తాడేపల్లి పోలీసు స్టేషన్ లో నమోదు అయ్యిందంటే.. అర్ధం ఏమిటి?  వైసీపీ హవా ఎత్తిపోయిందనే కాదా? ఎన్నికల ఫలితాలు వెలువడగానే జగన్ మాజీ అయిపోబోతున్నారనే కాదా? అయినా ఆ విషయం పేర్ని నాని లాంటి వారికి ఎందుకు అర్ధం కావడం లేదు? ఒక వేళ అర్ధమైనా చివరి క్షణం వరకూ తమ దబాయింపు సెక్షన్ చెల్లుబాటు అయ్యేలా చేసుకోవాలని భావిస్తున్నారా? తాడేపల్లి పోలీసు స్టేషన్ లో  సజ్జలపై  క్రిమినల్ కేసు, అలాగే వైసీపీకి అందునా ఆ పార్టీ అధినేత జగన్ కు కంచుకోట లాంటి కడపలో కరుడుగట్టిన వైసీపీ కార్యకర్తలు, నేతలకు నగర బహిష్కరణ..దీంతోనే ఇప్పటి దాకా ఏమో ఫలితం ఎలా ఉంటుందో అని ఊగిసలాడుతున్న వారికి కూడా వైసీపీ భవిష్యత్ ఏమిటో అర్ధమైపోయింది. దీంతో రేపు కౌంటింగ్ లో గలాటా చేసే వాళ్లే  ఏజెంట్లుగా కూర్చోవాలి అన్న హుంకరింపుల నుంచి అసలు కౌంటింగ్ సెంటర్ లో కూర్చోడానికి ఏజెంట్ దొరికితే చాలన్న పరిస్థితి ఏర్పడిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఒక వేళ ఏజెంట్లు దొరికినా వారు ఎటూ ఓటమే కదా ఇంతోటి దాని కోసం వాదనలు, గొడవలు ఎందుకు అని ప్రేక్షకపాత్రకే పరిమితమౌతారన్న అనుమానం వైసీపీ నేతలను వేధిస్తోంది. అందుకే అధికారులపై హెచ్చరికలు, బెదరింపులకు పాల్పడటం ద్వారా రాబోయేది మన ప్రభుత్వమే అన్న భరోసా అంతో ఇంతో పార్టీ కేడర్ లో నిలపడానికి ప్రయత్నాలు చేస్తున్నారని భావించవచ్చు.  ఇక అధికారులు, పోలీసుల తీరు ఒక్క సారిగా ఇలా మారిపోవడానికి వారికి గ్రౌండ్ రియాలిటీ స్పష్టంగా 70ఎంఎం స్క్రీన్ మీద కనిపించడమే అంటున్నారు. ఫలితం ఎలా రాబోతోందో స్పష్టంగా తెలిసిపోయిన నేపథ్యంలో చివరి రోజులలోనైనా నిజాయితీగా నిక్కచ్చిగా పని చేస్తే రాబోయే ప్రభుత్వ గుడ్ లుక్స్ లో పడతామన్న ఆశతోనే అధికారులు వ్యవహరిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కౌంటింగ్ రోజుల హింసాకాండకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనీ, ఏ మాత్రం ఉపేక్షించమన్న స్పష్టమైన హెచ్చరికలు పోలీసుల నుంచి వస్తున్నాయని చెబుతున్నారు. ఇప్పటికే విజయంపై నమ్మకాన్ని వదిలేసుకున్న వైసీపీ నేతలు  ఆ ఫ్రస్ట్రేషన్ లో అధికారులను బెదరించి మరింత అభాసుపాలౌతున్నారు.