గ్లామర్ కోసం టీఆర్ఎస్ లీడర్లు డ్రగ్స్ వాడుతున్నారా? 

తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ కేసు ప్రస్తుతం కలకలం రేపుతోంది. 2017లో వెలుగులోనికి వచ్చిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ప్రస్తుతం ఈడీ విచారణ జరుపుతోంది. రోజుకు ఒకరిని ప్రశ్నిస్తోంది. పూరి జగన్నాథ్, చార్మి, నందు, రకుల్ ప్రీత్ సింగ్, దగ్గుబాటి రానాను ప్రశ్నించింది. రవితేజను కూడా ప్రశ్నించబోతోంది. ఈడీ విచారణలో టాలీవుడ్ డ్రగ్స్ లింకులన్ని బయటపడతాయనే చర్చ జరుగుతోంది. అదే సమయంలో కొందరు రాజకీయ నేతలకు డ్రగ్స్ కేసుతో లింకులున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. డ్రగ్స్ కేసుకు సంబంధించి ఇటీవల పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.  తాజాగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కొందరు వారి గ్లామర్ కాపాడుకోవడానికి డ్రగ్స్ వాడుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే వారికి రక్త పరీక్షలను నిర్వహిస్తామని చెప్పారు. డ్రగ్స్ ఎవరెవరు వాడుతున్నారో తనకు తెలుసు కాని పేరు ఇప్పుడు చెప్పనన్నారు సంజయ్. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బ్లడ్ టెస్టులు చేయించి వాళ్ల బండారం బయటపెడుతానని బండి స్పష్టం చేశారు, తన భాషను అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారని... భాష విషయంలో కేసీఆరే తన గురువని అన్నారు. బీజేపీతో తప్ప అన్ని పార్టీలతో కలిసి టీఆర్ఎస్ పార్టీ పోటీ చేసిందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ కెప్టెన్ అయితే, ఒవైసీ వైస్ కెప్టెన్ అని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్స్ ట్రా ప్లేయర్లు అని బండి సంజయ్ అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్తున్నారనే ఇంటెలిజెన్స్ సమాచారం కేసీఆర్ కు వచ్చిందని... అందుకే మంత్రులు, ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి  ఢిల్లీ వెళ్తున్నాడని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే టీఆర్ఎస్ పార్టీకి వేసినట్టేనని ప్రజలు అనుకుంటున్నారని సంజయ్ అన్నారు

ఢిల్లీలో విమానాన్ని ఆపేసిన చీమలు.. భూటాన్ యువ‌రాజు షాక్‌..

చీమ‌లు. చిన్ని చిన్ని చీమ‌లు. దులిపేస్తే పోతాయ్‌. ఉఫ్ మ‌ని ఊదేస్తే ఎగిరిపోతాయ్‌. ల‌క్ష్మ‌ణ‌రేఖ రాసినా చాలు.. చీమ‌ల‌న్నీ మాయం. కానీ.. అక్క‌డ మాత్రం సీన్ అలా లేదు. చీమలే క‌దాని లైట్ తీసుకోలేని ప‌రిస్థితి. వాటిని అలా వ‌దిలేస్తే అస‌లుకే ఎస‌రు వ‌చ్చే అవ‌కాశం. అందుకే, చీమ‌ల దండు ఓ దేశ‌ యువ‌రాజు ప్ర‌యాణాన్నే ఆపేసింది. ఆయ‌న వెళ్లాల్సిన విమానం ర‌ద్దైంది. ఢిల్లీ నుంచి లండ‌న్ వెళ్లాల్సిన ఆ ఫ్లైట్ జ‌స్ట్ చీమ‌ల వ‌ల్ల ర‌ద్దు కావ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ప‌క్షులు, గ‌బ్బిలాల వ‌ల్ల విమానాలు ర‌ద్దు అయిన ఘ‌ట‌న‌లు చూసాం కానీ చీమ‌ల వ‌ల్ల ఫ్లైట్ క్యాన్సిల్ కావ‌డం బ‌హుషా ఇదే మొద‌టిసారి కావొచ్చ‌ని అంటున్నారు.  ఢిల్లీ నుంచి లండన్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానం చీమల కారణంగా కొన్ని గంటలు ఆల‌స్యం కావ‌డం సంచలనంగా మారింది. బిజినెస్ క్లాసులో చీమల గుంపు కనిపించడంతో టేకాఫ్‌ను ఆపేశారు పైలట్‌. చీమ‌ల‌ను దులిపేస్తే స‌రిపోదు. అవి ఎక్క‌డి నుంచి వ‌చ్చాయో తెలుసుకోవ‌డం కూడా ముఖ్యం. సున్నిత‌మైన విమాన భాగాల్లో చీమ‌ల గుంపు ఉండిఉంటే ఎంతో ప్ర‌మాద‌క‌రం. అందుకే, చీమ‌ల రాదారిని క‌నిపెట్టే వ‌ర‌కూ విమానాన్ని న‌డిపే ప‌రిస్థితి లేదు. అప్ప‌టికే బాగా ఆల‌స్యం కావ‌డంతో.. అందులోని ప్రయాణికులను మరో విమానంలోకి  త‌ర‌లించి లండ‌న్ పంపించారు.  విమానం అంటే రిచ్ అండ్ నీట్ మెయిన్టెనెన్స్ ఉంటుంది. అందులోనూ బిజినెస్ క్లాస్ అంటే మ‌రింత క్లీన్‌నెస్ త‌ప్ప‌నిస‌రి. అలాంటిది రిచ్ క్లాస్ పీపుల్ జ‌ర్నీ చేసే బిజినెస్ క్లాస్‌లోనే చీమ‌ల గుంపు వ‌చ్చి చేరిందంటే.. మన ఎయిర్ ఇండియా విమానాల ప‌ని తీరు ఎలా ఉందో అర్థం అవుతుంది. విదేశీ ప్ర‌యాణీకుల ద‌గ్గ‌ర దేశ ప‌రువు పోతోంది. ఇక‌, చీమ‌లు చేరిన ఆ ఢిల్లీ నుంచి లండన్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానంలోనే భూటాన్ యువరాజు జిగ్మే నాంగ్మేల్ వాంగ్ చుక్ కూడా ఉండడం ఆస‌క్తిక‌రం.

ముద్దు..హ‌ద్దు..వ‌ద్దు.. యోగి బాట‌లో బండి.. స‌క్సెస్ అవుతారా?

బండి జోరు మామూలుగా లేదు. ప్ర‌జా సంగ్రామ యాత్ర‌తో దూకుడు మీదున్నారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌పై దండెత్త‌డానికి కాలిన‌డ‌క‌న క‌ద‌లివ‌స్తున్నారు. పాద‌యాత్ర‌తో కాషాయ దండును ఉర‌క‌లెత్తిస్తున్నారు. అనూహ్య స్పంద‌న చూసి క‌మ‌ల‌ద‌ళంలో మ‌రింత ఉత్సాహం నెల‌కొన‌డంతో.. మాట‌ల‌కు మ‌రింత ప‌దును పెట్టారు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు బండి సంజ‌య్‌. తాజాగా, ఆయ‌న చేసిన ప‌లు కామెంట్స్ తెలంగాణ‌లో ప్ర‌కంప‌ణ‌లు సృష్టిస్తున్నాయి. అధికారంలోకి వ‌స్తామ‌నే ధీమా వారిలో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. యూపీలో యోగి పాల‌సీని తెలంగాణ‌లోనూ అమ‌లు చేస్తామ‌ని ప్రజా సంగ్రామ యాత్ర‌లో ప్ర‌క‌టించారు బండి సంజ‌య్‌. ఆ పాల‌సీనే ఇప్పుడు కాంట్ర‌వ‌ర్సీగా మారింది. "ఒక్కరు చాలు.. ఇద్దరు హద్దు.. ముగ్గురు అసలే వద్దు".. అనే నినాదంతో ముందుకెళ్తామన్నారు బండి సంజ‌య్‌. వచ్చే ఎన్నికలో తాము అధికారంలో వస్తే మొదటగా యూపీలో మాదిరిగా తెలంగాణలోనూ జనాభా నియంత్రణ చట్టం తీసుకువస్తామని సంచ‌ల‌నం రేపారు. ఓ వర్గం జనాభా విపరీతంగా పెరిగిపోవడం.. రాజ్యాంగ విరుద్దమైన ముస్లిం రేజర్వేషన్ల వల్ల.. బడుగు, బలహీన, అణగారిన వర్గాలకు సంక్షేమ పథకాలు అందడం లేదని ఆరోపించారు.  యూపీ సీఎం యోగి ఇలానే చేశారు. ఇద్ద‌రు పిల్ల‌ల‌కంటే ఎక్కువ ఉంటే.. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌కు అన‌ర్హులంటూ చ‌ట్టం చేశారు. ముస్లింల‌ను టార్గెట్‌గా చేసుకొనే ఈ చ‌ట్టం చేశార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. అలాంటి వివాదాస్ప‌ద ఎజెండాను బండి సంజ‌య్ సైతం ఎత్తుకోవ‌డం సంచ‌ల‌నంగా మారింది. హిందువుల కంటే ముస్లింలే ఎక్కువ సంతానం క‌లిగి ఉంటారు. వారి టార్గెట్‌గానే "ఒక్కరు చాలు.. ఇద్దరు హద్దు.. ముగ్గురు అసలే వద్దు".. నినాదాన్ని బీజేపీ తెర‌పైకి తీసుకొస్తోంద‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అయితే, అలాంటి చ‌ట్టంతో యూపీలో యోగి స‌క్సెస్ అయ్యారు. అందుకే, తెలంగాణ‌లోనూ వ‌ర్క‌వుట్ చేసేలా బండి సంజ‌య్ అనూహ్యంగా జ‌నాభా నియంత్రణ చ‌ట్టాన్ని త‌న పాద‌యాత్ర స‌మ‌యంలో చ‌ర్చ‌కు ఉంచార‌ని అంటున్నారు. మ‌రి, ఈ పాల‌సీ తెలంగాణ‌లో క‌మ‌ల‌నాథుల‌కు ఏ మేర‌కు క‌లిసొస్తుందో చూడాలి..  

నీళ్లు పోయినంక వచ్చి ఏం చేస్తవ్.. కేటీఆర్ ను నిలదీసిన సిరిసిల్ల మహిళలు..

తెలంగాణలో ఆది, సోమవారాల్లో కుండపోతగా వర్షం కురిసింది. ఉరిమి ఉరిమినట్లుగా పడిన వర్షానికి ఉత్తర తెలంగాణ అతలాకుతలం అయింది. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాలో వరద పోటుతో తల్లడిల్లిపోయాయి. పట్నం, పల్లె తేడా లేకుండా అంతా వరద మయమైంది. వరంగల్ నగరం చిన్నపాటి సముద్రంగా మారిపోయింది. దాదాపు 100 కాలనీలను వరద ముంచెత్తింది. ఇక మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్ల పూర్తిగా జల దిగ్భందంలో చిక్కుపోయింది. రెండు రోజులైనా ఇంకా కొన్ని కాలనీలు వరదలోనే ఉన్నాయంటే సిరిసిల్లలో పరిస్థితి ఎంత దారుణంగా మారిందో ఊహించవచ్చు. సిరిసిల్ల పట్ణణంలోని మెజార్టీ కాలనీలన్ని వరదలో మునిగిపోయాయి. కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ పూర్తిగా నీట మునిగింది. కొన్ని కాలనీల్లో భవంతుల్లోని  రెండో ఫ్లోర్ వరకు నీళ్లు చేరాయి. దీంతో జనాలు పై అంతస్తులకు వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నారు. డ్రైనేజీలో పడి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ నుంచి డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లి సహాయ కార్యక్రమాలు చేపట్టాయి. సిరిసిల్ల జలమయం కావడంతో స్థానిక ఎమ్మెల్యే అయిన మంత్రి కేటీఆర్.. బుధవారం పట్టణంలో పర్యటించారు. ముందుగా కలెక్టరేట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. దాదాపు గంటన్నర సేపు వరద పరిస్థితిపై చర్చించారు. తర్వాత వరద ప్రభావం ఎక్కువగా ఉన్న పలు కాలనీలను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడారు. అయితే సిరిసిల్లలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి కేటీఆర్ కు ఊహించని షాక్ తగిలింది. తమ సమస్యలపై స్థానికులు మంత్రిని నిలదీశారు. శాంతినగర్ లో కేటీఆర్ పై ప్రశ్నల వర్షం కురిపించారు మహిళలు. నీళ్లంతా వెళ్ళిపోయాక వస్తే ఏం లాభం ఉన్నప్పుడు  ఎందుకు రాలేదని  పద్మ అనే మహిళ కేటీఆర్ ను కడిగి పారేసింది. వరద ఉన్నప్పుడు వస్తే మా బాధలు తెలిసేవని మరో మహిళ ప్రశ్నించింది. స్థానిక నాయకులు, అధికారులు వారిస్తున్నా మంత్రి కేటీఆర్ పై ప్రశ్నల వర్షం కురిపించారు బాధిత మహిళలు. నీళ్లలో ఉన్న తమ దగ్గరకు ఎవరూ రాలేదని చెప్పారు. మున్సిపల్ అధికారుల తీరుపైనా కేటీఆర్ ముందు ఆగ్రహం వ్యక్తం చేశారు సిరిసిల్ల శాంతినగర్ మహిళలు. మహిళల ప్రశ్నలతో షాకైన కేటీఆర్.. వాళ్లను కూల్ చేసే ప్రయత్నం చేశారు. కష్టం అనుభవిస్తేనే తెలుస్తుందా?  చూస్తే తెలియదా అంటూ సముదాయించారు. గంటన్నరసేపు అధికారులతో మీటింగ్ పెట్టాను.. మళ్లీ ఈ సమస్య రాకుండా చూస్తానని హామీ ఇచ్చారు. ఎప్పుడూ లేనంతగా వానలు పడటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని వివరించారు కేటీఆర్. మున్సిపాలిటీ అధికారులు సరిగా పనిచేయడం లేదని, పన్నులు మాత్రం వసూలు చేస్తున్నారని కొందరు మహిళలు ఫిర్యాదు చేశారు.  సమస్య శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి హైదరాబాద్ వెళ్లిపోయారు కేటీఆర్.

గ‌ణేశ్ ఉత్స‌వాల‌కు ఏపీ హైకోర్టు గ్రీన్‌సిగ్న‌ల్‌.. కండిష‌న్స్ అప్లై!

ఏపీలో గ‌ణేశ్ ఉత్స‌వాల ర‌చ్చ మామూలుగా లేదు. కొవిడ్ కార‌ణంగా ప్ర‌జ‌లంతా వినాయ‌క చ‌వితి వేడుక‌లకు దూరంగా ఉండాల‌ని సీఎం జ‌గ‌న్ పిలుపిచ్చారు. ముఖ్య‌మంత్రి ప్ర‌క‌ట‌న‌పై ప్ర‌తిప‌క్షం, ప్ర‌జ‌లు భ‌గ్గుమంటున్నారు. ఇటీవ‌లే జ‌రిగిన‌ వైఎస్సార్ జ‌యంతి, వ‌ర్థంతి వేడుక‌ల‌కు లేని క‌రోనా ఆంక్ష‌లు గ‌ణ‌ప‌తి పండుగ‌కే ఎందుకంటూ అంతా విరుచుకుప‌డుతున్నారు. యేసుకు లేని ఆంక్ష‌లు గ‌ణేషుడికి ఎందుకంటూ ప్ర‌శ్నిస్తున్నారు. ఇదంతా హిందుత్వంపై జ‌గ‌న్ స‌ర్కారు చేస్తున్న కుట్ర‌లంటూ తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ప్ర‌భుత్వ ఆంక్ష‌ల‌ను ధిక్క‌రిస్తూ ఈసారి ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వినాయ‌క మండ‌పాలు ఏర్పాటు చేయాల‌ని విప‌క్షాలు, హిందూ సంస్థ‌లు పిలుపునిచ్చాయి. దీంతో, ఏపీలో గ‌ణేష్ న‌వ‌రాత్రుల నిర్వ‌హ‌ణ‌పై ఉత్కంఠ పెరిగింది.  ఇలాంటి ప‌రిస్థితుల్లో విష‌యం ఏపీ హైకోర్టుకు చేరింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌ణేశ్ ఉత్సవాల‌పై దాఖ‌లైన లంచ్ మోష‌న్ పిటిష‌న్‌పై హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది. ప్రైవేటు స్థ‌లాల్లో ఉత్స‌వాలు నిర్వ‌హించుకోవ‌చ్చ‌ని ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేసింది. అయితే, ఒకేసారి ఐదుగురికి మించ‌కుండా, కొవిడ్ నిబంధ‌న‌లు త‌ప్ప‌నిస‌రి పాటిస్తూ పూజ‌లు నిర్వ‌హించుకోవాల‌ని ధ‌ర్మాస‌నం సూచించింది.  ఇక‌, ప‌బ్లిక్ స్థ‌లాల్లో వినాయ‌క చ‌వితి ఉత్స‌వాలు నిర్వ‌హించ‌డంపై మాత్రం హైకోర్టు అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. ప్రైవేటు స్థ‌లాల్లో ఓకే కానీ, ప‌బ్లిక్ ప్లేసెస్‌లో విగ్ర‌హాల ఏర్పాటుకు అనుమ‌తి ఇవ్వ‌ద్ద‌ని స్ప‌ష్టం చేసింది. ఆర్టిక‌ల్ 26తో ప్ర‌జ‌ల‌కు మ‌త కార్య‌క్ర‌మాలు నిర్వ‌హ‌ణ‌కు అధికారం ఉంద‌ని తెలిపింది. దీంతో హైకోర్టు తీర్పును ఎవ‌రికి త‌గ్గ‌ట్టు వారు అన్వ‌యించుకుంటున్నారు.   

చిన్నమ్మకు బిగ్ షాక్.. 100 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్ 

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నిచ్చెలి, అన్నాడీఎంకే మాజీ నేత శశికళకు మరో షాక్ తగిలింది. తమిళనాడు చిన్నమ్మకు చెందిన రూ.100 కోట్ల ఆస్తులను బినామీ చట్టం కింద ఆదాయపన్ను శాఖ జప్తు చేసింది. బినామీ చట్టం కింద శశికళ ఆస్తులను ఐటీ శాఖ సీజ్‌ చేసింది. పనయూర్‌లో శశికళకు చెందిన 49 ఎకరాల భూమి అటాచ్‌మెంట్‌ చేసింది. రూ.100 కోట్ల విలువైన భూమిని అటాచ్‌ చేసినట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులు ప్రకటించారు. శశికళకు ఐటీ శాఖ వరుసగా షాక్‌లు ఇస్తోంది. కొద్దిరోజుల క్రితమే ఆమెకు పన్ను మినహాయింపు వర్తించదని ఝలక్‌ ఇచ్చింది. తాజాగా ఐటీ డిపాజిట్ ఆస్తుల నిరోధక చట్టం కింద శశికళ ఆస్తులను జప్తు చేసింది. ఇప్పటికే శశికళకు చెందిన రూ.2000 కోట్ల విలువైన ఆస్తులను ఐటీ శాఖ ఇప్పటికే జప్తు చేసింది. జైలు శిక్ష పడిన వ్యక్తికి ఐటీ బకాయిల్లో మినహాయింపు వర్తించదని ఐటీ వర్గాలు కోర్టుకు స్పష్టం చేశాయి. 2008లో ఏసీబీ సమర్పించిన నివేదిక మేరకు ఆస్తులకు సంబంధించి రూ. 48 లక్షలు పన్ను చెల్లించాలని ఐటీ వర్గాలు చిన్నమ్మను ఆదేశించాయి. దీనిని వ్యతిరేకిస్తూ ఐటీ ట్రిబ్యునల్‌ను శశికళ ఆశ్రయించారు. ఆ పన్ను చెల్లింపు నుంచి గట్టెక్కారు. అయితే, ట్రిబ్యునల్‌ తీర్పును వ్యతిరేకిస్తూ ఐటీ వర్గాలు హైకోర్టుకు అప్పీలుకు వెళ్లాయి. బినామీ చట్టం కింద శశికళకు చెందిన చాలా ఆస్తులను ఆదాయపు పన్నుశాఖ సీజ్‌ చేసింది.  చెన్నైలో జయలలిత పోయెస్‌ గార్డెన్‌ నివాసం ఎదుట శశికళ నిర్మించిన విలాసవంతమైన భవనాన్ని కూడా ఐటీ శాఖ స్వాధీనం చేసుకుంది. మన్నార్‌గుడితో పాటు పలు ప్రాంతాల్లో ఆమె కొన్న విలువైన ఆస్తులను కూడా స్వాథీనం చేసుకున్నారు. శశికళతో పాటు ఆమె బంధువులు ఇళవరసి, సుధాకరన్‌ ఆస్తులను కూడా ఐటీ శాఖ సీజ్‌ చేసింది. అక్రమ ఆస్తుల కేసులో జైలుశిక్ష అనుభవించిన శశికళ బెంగళూర్‌ జైలు నుంచి విడుదలయ్యారు. తమిళనాడు రాజకీయాల్లో మళ్లీ చక్రం తిప్పాలని ఆమె చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. అన్నాడీఎంకే వర్గాలు శశికళను దగ్గరకు రానివ్వడం లేదు. 

వీలైతే అమ్మేద్దాం.. లేదంటే కూల్చేద్దాం! జగనన్న పాలసీ ఇదేనా? 

ఆంధ్రప్రదేశ్ లోని జగన్ రెడ్డి సర్కార్ ఏ నిర్ణయం తీసుకున్నా వివాదాస్పదమే. అధికారులతో చర్చిస్తున్నారో లేక సొంతగానే నిర్ణయాలు తీసుకుంటున్నారో తెలియదు కాని.. జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్ని జనాల నుంచి వ్యతిరేకత ఎదుర్కుంటున్నాయనే విమర్శలు ఉన్నాయి. జగన్ ఏకపక్ష నిర్ణయాల్లే వల్లే సమస్యలు వస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు అంటన్నాయి. అడ్డగోలు అప్పులతో అసలే పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉన్న ఏపీ ప్రభుత్వం.. అందిన కాడికి ఆస్తులు అమ్మే ప్రయత్నాలు చేస్తోంది. కోర్టులు అడ్డుకోవడంతో కొన్నింటికి బ్రేకులు పడింది. అయినా తమ ప్రయత్నాలు ఆపడం లేదు జగన్ రెడ్డి సర్కార్.  తాజాగా విజయవాడలోని స్టేట్ గెస్ట్ హౌస్‌ను ప్రైవేట్ కార్య‌క‌లాపాల‌కు అనుమ‌తించేలా సంచ‌ల‌న నిర్ణయం తీసుకుంది. ఇప్ప‌టికే విశాఖ‌లో స‌క‌ల సౌక‌ర్యాల‌తో ఉన్న రిషికొండ బీచ్ ను కూల్చేసి అక్క‌డ కొత్త రిసార్ట్ క‌డుతోంది. ఏపీలో జ‌గ‌న్ స‌ర్కారు అవ‌లంభిస్తున్న విధానాలు పెను వివాదాల‌నే సృష్టిస్తున్నాయి. ప్ర‌భుత్వ ఆస్తుల‌పై జ‌గ‌న్ స‌ర్కారు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు వివాదాస్ప‌ద‌మ‌వుతోంది. వీలైతే అమ్మేద్దాం.. లేదంటే కూల్చేద్దాం అన్నట్లుగా జగనన్న పాలసీ ఉందనే ఆరోపణలు వస్తున్నాయి.  తిరుమ‌ల వెంక‌న్న‌కు భ‌క్తులు స‌మ‌ర్పించుకున్న భూముల‌ను అమ్మేందుకు గతంలో ప్రయ‌త్నించింది జ‌గ‌న్ స‌ర్కార్. భ‌క్తుల నుంచి తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త రావ‌డంతో వెన‌క్కు తగ్గింది. ఆ తర్వాత ఆల‌య భూముల‌ను వ‌దిలేసిన జ‌గ‌న్ స‌ర్కారు.. ఏకంగా స‌ర్కారీ భూముల‌నే విక్ర‌యించేందుకు సిద్ధమైంది. దీనిపై ఫిర్యాదులు రావడంతో భూముల అమ్మకాలకుహైకోర్టు  బ్రేకులేసింది. అమ్మకం కుదరకపోవడంతో జ‌గ‌న్ స‌ర్కారు స‌ర్కారు భూములు, ఆస్తుల‌ను కేంద్రంగా చేసుకుని న‌యా దందాకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా ఇప్ప‌టికే విశాఖ‌లోని రిషికొండ‌లో ఉన్న ఏపీటీడీసీ రిస్టార్ట్ ను కూల‌గొట్టి.. దాని స్థానంలో కొత్త రిసార్ట్ క‌ట్టేందుకు సిద్ధ‌మైన జ‌గ‌న్ ప్ర‌భుత్వం.. తాజాగా విజ‌యవాడ న‌డిబొడ్డులోని స్టేట్ గెస్ట్ హౌస్ ను ఏకంగా వాణిజ్య కార్య‌కాల‌పాల‌కు అనుమ‌తిస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ నిర్ణ‌యంపై విపక్షాల‌తో పాటుగా రాష్ట్ర ప్ర‌జ‌లు కూడా విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న‌ 3.26 ఎకరాల్లో ఉన్న ఈ గెస్ట్ హౌస్ విలువ రూ.1,500 వందల కోట్లకుపైగానే ఉంటుంది.స్టేట్ గెస్ట్ హౌస్ ను వాణిజ్య భవనంగా మార్చాలని ప్రతిపాదన చేశారు. ఈ బాధ్యతలు కూడా భూములు అమ్మకాలు చూస్తున్న నేషనల్‌ బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ సంస్థకే ఇచ్చారు. 3.26 ఎకరాల్లో వాణిజ్య భవనంగా అభివృద్ధి చేసి .. లీజుకివ్వడమో.. అమ్మడమో చేయబోతున్నారు. ఇందుకోసం డిజైన్లు అందించేందుకు రుద్రాభిషేక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ అనే సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారు. ఈ దిశ‌గా జ‌గ‌న్ స‌ర్కారు చ‌ర్య‌లు చూస్తుంటే.. మ‌రికొన్ని రోజుల్లో స్టేట్ గెస్ట్ హౌస్ అదృశ్యం కానుంద‌ని, అక్క‌డ కొత్త‌గా క‌మ‌ర్షియ‌ల్ కాంప్లెక్స్ క‌నిపించ‌నుంద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి స్టేట్ గెస్ట్ హౌస్ స్థ‌లంలో భారీ క‌మ‌ర్షియ‌ల్ కాంప్లెక్స్ క‌ట్ట‌డ‌మంటే.. అక్క‌డ ఇక స్టేట్ గెస్ట్ హౌస్ కనుమరుగైనట్లే. స్టేట్ గెస్ట్ హౌస్ అయినా ఉండాలి.. లేదంటే భారీ క‌మ‌ర్షియ‌ల్ కాంప్లెక్స్ అయినా ఉండాలి. రెండూ అక్క‌డ ఉండ‌టం అసాధ్య‌ం. మ‌రి గెస్ట్ హౌస్ స్థ‌లంలో భారీ క‌మ‌ర్షియ‌ల్ కాంప్లెక్స్ నిర్మాణం అంటే.. స్టేట్ గెస్ట్ హౌస్ ను తొల‌గిస్తున్న‌ట్లే. అక్క‌డి స్టేట్ గెస్ట్ హౌస్ ను తొల‌గించి క‌మ‌ర్షియ‌ల్ కాంప్లెక్స్ క‌డితే.. అందులో అంతా ప్రైవేట్ వ్యాపారం జరుగుతుంది క‌దా.. మ‌రి అక్క‌డ ప్ర‌భుత్వ పెత్త‌నం గానీ, ప‌ర్య‌వేక్ష‌ణ గానీ ఉండ‌వు క‌దా. అదే జ‌రిగితే.. స్టేట్ గెస్ట్ హౌస్ స్థ‌లాన్ని జ‌గ‌న్ స‌ర్కారు అమ్మేసిన‌ట్టే క‌దా..నేరుగా అమ్ముతున్నాం అని చెప్ప‌కుండా దొడ్డిదారిన ప్రైవేటుకు క‌ట్ట‌బెట్ట‌డ‌మే క‌దా అన్న చర్చ జనాల్లో సాగుతోంది. 

కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ లేనట్టేనా? కేసీఆర్ నట్టేట ముంచేశారా? 

కాంగ్రెస్ నేతల అనుమానాలే నిజమయ్యాయా.. విపక్షాలు చెబుతున్నటే జరిగిందా.. అంటే పాడి కౌశిక్ రెడ్డి విషయంలో అదే జరిగిందని తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరిన కొన్ని రోజులకే గవర్నర్ కోటాలో కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీ నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించారు సీఎం కేసీఆర్. ఆగస్ట్ 1న జరిగిన కేబినెట్ సమావేశంలో కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో నామినేట్ చేస్తూ తీర్మానం చేశారు. వెనువెంటనే దీనికి సంబంధించిన ఫైల్ ను రాజ్ భవన్ కు పంపించారు.  సీఎంవో నుంచి వచ్చిన ప్రకటనతో పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ అయిపోయారనే అంతా అనుకున్నారు.  ఆయన నియామకానికి గవర్నర్ ఆమోదముద్ర పడిందని కూడా ప్రచారం జరిగింది. కాని తర్వాత అసలు సంగతి తెలిసింది. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ ప్రతిపాదన గవర్నర్ కార్యాలయానికి వెళ్లలేదనే సమాచారం వచ్చింది. ఇక కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వానికి నెల రోజులు గడిచినా ఆమోదముద్ర పడకపోవడంతో.. అతనికి ఎమ్మెల్సీ వస్తుందా రాదా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. కౌశిక్ రెడ్డిని కేసీఆర్ మోసం చేశారనే ఆరోపణలు కొన్ని వర్గాల నుంచి వచ్చాయి. తాజాగా కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై గవర్నర్ తమిళిసై స్పందించారు. కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీ పదవికి నామినేట్ చేయడంపై ఆమె అసంతృప్తిని వ్యక్తం చేశారు. సమాజ సేవ, ఇతర రంగాల్లో విశేష కృషి చేసిన వారినే గవర్నర్ కోటాలో నామినేట్ చేయాలని అన్నారు. ప్రభుత్వం తమకు పంపిన ప్రతిపాదనలపై ఆలోచించాల్సి ఉందని... ఆలోచించిన తర్వాత తుది నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు. గతంలో ప్రజాకవి గోరటి వెంకన్నను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రతిపాదిస్తూ ప్రభుత్వం పంపిన ఫైల్ ను... తమిళిసై ఒక్క రోజు వ్యవధిలోనే ఆమోదించారు. కౌశిక్ విషయంలో మాత్రం ఆమె సమయం తీసుకుంటున్నారు. దీంతో కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీకి ఆమోదముద్ర పడే అవకాశాలు లేవని భావిస్తున్నారు.  తమకు పరీక్షగా మారిన హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎలాగైనా గెలిచేందుకు ఎత్తులు వేస్తున్నారు సీఎం కేసీఆర్. ప్రత్యర్థి పార్టీలకు చెక్ పెట్టేలా అనూహ్యా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డిని కారెక్కించారు. అంతేకాదు ఎవరూ ఊహించని విధంగా కౌశిక్ రెడ్డిని నామినేటెడ్ కోటాలో శాసనమండలికి ఎంపిక చేశారు. అయితే నామినేటెడ్ కోటాలో కౌశిక్ రెడ్డి పేరు ప్రతిపాదించగానే..  ఆయనకు సంబంధించిన కొత్త అంశాలు వెలుగులోనికి వచ్చాయి. ఆయన గతంలో చాలా కేసులు కూడా నమోదయ్యాయి. కొన్ని ఇప్పటికి విచారణలో ఉన్నాయి.  ప్రత్యర్థులు ఆయనపై ఉన్న కేసులను బయటికి తీశారు. పాడి కౌశిక్ రెడ్డిపై తొమ్మిది కేసులు ఇంకా ఉన్నాయని తేలింది.  1. డిసెంబర్ 28 ,2012న ఐపీసీ 506 కింద జమ్మికుంట పీఎస్ లో కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది.  తనను చంపేస్తానని బెదిరించాడని అరుకల వీరశలింగం అనే వ్యక్తి కౌశిక్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసు రికార్డుల ప్రకారం ఆ కేసు విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. 2. డిసెంబర్ 28 ,2012న ఐపీసీ 506 కింద  కరీంనగర్ రూరల్ పీఎస్ లో బెదిరింపుల కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ కేసు లోక్ అదాలత్ పరిధిలో ఉంది.  3.  సెప్టెంబర్ 28, 2017న ఇల్లంతకుండ పోలీస్ స్టేషన్ లో 506, 507 సెక్షన్ల కింద పాడి కౌశిక్ రెడ్డిపై బెదిరింపుల కేసు నమోదైంది.  4. డిసెంబర్ 6, 2017న వరంగల్ సుబేదారి పీఎస్ లో కౌశిక్ రెడ్డిపై 447, 427 సెక్షన్ల కింద కేసు నమోదైంది. భూ వివాదానికి సంబంధించి ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు ఫైల్ చేశారు.  5. నవంబర్ 28, 2018న అనుమతి లేకుండా సమావేశం నిర్వహించినందుకు కౌశిక్ రెడ్డిపై 188, 171 F, 171-H, 127 (A) RP Act కింద వీణవంక పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి.  6. నవంబర్ 28, 2018న హుజురాబాద్ పీఎస్ లో కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. రూల్స్ కు విరుద్దంగా హనుమాన్ టెంపుల్ లో పబ్లిక్ మీటింగ్ నిర్వహించారనే అభియోగాలతో  505, 171-C, 171-G r/w 171-F IPC    కింద కేసులు పెట్టారు.  7. మే 8, 2020న మార్కెట్ యార్డులో ఎలాంటి అనుమతి లేకుండా సమావేశం, నిరసన తెలిపినందుకు ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి ఇల్లంతకుండ పోలీస్ స్టేషన్లో పాడి కౌశిక్ రెడ్డిపై  188 IPC కింద కేసు నమోదైంది. 8. కొవిడ్ మార్గదర్శకాలు ఉల్లంఘిస్తూ 59 మందితో సమావేశం నిర్వహించారనే కారణంతో సిరిసిల్ల పీఎస్ లో జూన్ 13, 2020న పాడి కౌశిక్ రెడ్డిపై 143, 147, 353, 341, 269, 270 r/w 149 IPC, Sec 3 of Epidemic Diseases Act   కింద కేసులు నమోదయ్యాయి.  9. సెప్టెంబర్ 1, 2020న హుజురాబాద్ పీఎస్ లో కౌశిక్ రెడ్డిపై  186, 188, 506 IPC, Sec 3 The Epidemic Diseases Amendment   కింద కేసులు కట్టారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో కలిసి హుజురాబాద్ ప్రభుత్వాస్పత్రిని విజిట్ చేశారు. ఆ సయమంలో డ్యుటీలో ఉన్న వైద్యులు, మెడికల్ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారనే ఫిర్యాదుతో కౌశిక్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి కౌశిక్ రెడ్డిపై తొమ్మిది కేసులు ఉన్నాయన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గవర్నర్ ఆయన విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నారని తెలుస్తోంది. సామాజిక సేవా రంగంలో ప్రతిపాదన వచ్చినందున.. కేసులు ఉన్న వ్యక్తిని ఎంపిక చేయడం సరికాదనే భావనలో గవర్నర్ ఉన్నారంటున్నారు. తమిళి సై తాజా ప్రకటనతో కౌశిక్ రెడ్డికి నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీ దక్కడం కష్టమేనన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. --- పాదయాత్రకు ప్రజల నుంచి ఊహించనంత స్పందన వస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బుధవారం 11 రోజుల ప్రజా సంగ్రామ యాత్ర తీరుతెన్నులపై సంగారెడ్డిలో  పాదయాత్ర కమిటిలతో బండి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు మాట్లాడుతూ  2023లో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ప్రజా సంగ్రామ యాత్రతో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పు వస్తోందని ఇంటెలిజెన్స్‌ వర్గాలు సీఎంకు సమాచారం ఇచ్చాయన్నారు. అందుకే కేసీఆర్ భయంతో ఢిల్లీకే పరిమితమయ్యారని వ్యాఖ్యానించారు. పాదయాత్రపై కేంద్రం నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. యాత్రను ప్రోత్సహిస్తూ అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందిస్తోందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, జేపీ నడ్డా, అమిత్ షా స్పూర్తితో మరింత కష్టపడి పనిచేసి పాదయాత్రను కనీవినీ ఎరగని రీతిలో విజయవంతం చేయాలని కోరుతున్నట్లు బండి సంజయ్ పేర్కొన్నారు. 

తెలంగాణ‌లో వ‌ర‌ద‌ల‌కు కేసీఆరే కార‌ణం.. మంత్రి సంచ‌ల‌నం..

తెలంగాణ‌లో ఫుల్ వ‌ర్షాలు. వాన‌తో పాటు వ‌ర‌ద‌. చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. న‌గ‌రాలు, పట్ట‌ణాలు, ఊరూ-వాడ.. వ‌ర‌ద నీటిలో మునిగిపోయాయి. ఇక‌, లోత‌ట్టు ప్రాంతాల్లో జ‌ల‌విల‌య‌మే. ముందు హైద‌రాబాద్ నిండా మునిగింది. ఆ త‌ర్వాత వ‌రంగ‌ల్‌ను ముంచెత్తి. అట్నుంచి క‌రీంన‌గ‌ర్‌, సిరిసిల్ల‌లలో జ‌ల ప్ర‌ళ‌యం సంభ‌వించింది. మునుపెన్న‌డూ లేనంత వాన‌లు. అంత‌కుమించి వ‌ర‌ద‌లు. అంతా ఆగ‌మాగం. వ‌ర‌ద ముంపుతో అరాచ‌కం.  ప్ర‌కృతి ప్ర‌కోప‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని ప్ర‌భుత్వం అంటోంది. స‌ర్కారు వైఫ‌ల్యం వ‌ల్లే వ‌ర‌దకు కార‌ణ‌మ‌నేది ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌లు. ఇలా ఎవ‌రి వాద‌న వారు వినిపిస్తుంటే.. మ‌ధ్య‌లో మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ చేసిన వ్యాఖ్య‌లు మ‌రింత క‌ల‌క‌లం రేపుతున్నాయి. తెలంగాణ‌లో వ‌ర‌ద ముంపున‌కు కార‌ణం.. సీఎం కేసీఆరే కార‌ణ‌మంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు మంత్రి గంగుల‌. అందుకు ఆయ‌న చేసిన సూత్రీక‌ర‌ణ బ‌హు చిత్రంగా ఉందంటున్నారు జ‌నాలు. ఎడ‌తెర‌పి లేని వ‌ర్షాల‌కు కరీంనగర్ టౌన్‌తో పాటు పరిసర గ్రామాలు, లోత‌ట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది. ముంపు ప్రాంతాల్లో ప‌ర్య‌టించిన‌ మంత్రి గంగుల కమలాకర్.. ఆ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కరీంనగర్‌లో వరదనీరు చేరడానికి తమ ప్రభుత్వ పాలనే కారణమంటూ గంగుల కమలాకర్ అన్నారు. కేసీఆర్ సీఎం కాక ముందు గ్రౌండ్ వాటర్ ఎక్కువగా లేదని.. అందుకే వర్షాలు పడ్డప్పుడల్లా ఆ నీరు భూమిలోకి ఇంకిపోయి భూగర్భ జలాలుగా మారేవని.. ఇప్పుడు నీళ్లు పుష్క‌లంగా ఉండ‌టంతో గ్రౌండ్ వాట‌ర్ పెరిగి.. వాన నీరు భూమిలో ఇంకేందుకు ప్లేస్ లేక‌.. ఇలా వ‌ర‌ద‌లా వెల్లువెత్తుతోంద‌ని.. వ‌ర‌ద పురాణాన్ని చ‌క్క‌గా వ‌ల్లెవేశారు మంత్రి గంగుల కమలాకర్.  మానేరు జలాశయం నిండి గేట్లు తెరిచామని.. కాబట్టి నీరు భూమిలోకి పోలేక ఇలా నగరాలు, పల్లెల్లోకి చేరుతోంద‌ని చెప్పారు. ఇక ప్రకృతి విపత్తులు చెప్పి రావని.. అవి వచ్చినపుడు ప్రభుత్వం కూడా వాటిని ఆపలేదని స‌ర్కారును వెన‌కేసుకొచ్చే ప్ర‌య‌త్నం చేశారు.  అయితే తెలంగాణలో అనేక‌ నగరాలలో చెరువులు, నాలాలు విచ్చ‌ల‌విడిగా కబ్జాలకు గురయ్యాయని.. అందుకే వరదనీటికి దారి లేక, ఇళ్ల మధ్యలోకి నీరు చేరుతుందనేది అంద‌రి మాట‌. ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించే ధైర్యం స‌ర్కారుకు లేదు. ఎందుకంటే చెరువులు, నాలాల క‌బ్జాలో ఎక్కువ భాగం అధికార పార్టీ నేత‌ల క‌నుస‌న్న‌ల్లో జ‌రిగిన‌వే కాబ‌ట్టి. మ‌రోవైపు, వరద నీరు వెళ్లేందుకు సరైన ప్రణాళికలు రూపొందించ‌కుండా ప్ర‌భుత్వం చేతులెత్తేయ‌డం వల్లే.. ఇలా భారీ వాన‌లు కురిసిన‌ప్పుడు న‌గ‌రాలు నిండా మునుగుతున్నాయ‌నేది నిపుణుల ఆరోప‌ణ‌. ఇవ‌న్నీ ప‌క్క‌న పెట్టేసి.. సీఎం కేసీఆర్ చేసిన గొప్ప ప‌ని వ‌ల్లే వ‌ర‌ద‌లు వ‌స్తున్నాయంటూ.. అర్థం ప‌ర్థం లేని వ్యాఖ్య‌లు చేసి.. ఇటు స‌ర్కారును, అటు జ‌నాల‌ను క‌న్ఫ్యూజ‌న్‌లో ప‌డేసిన మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ చేసిన కాంట్ర‌వ‌ర్సీ కామెంట్స్ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. మంత్రి గారి వ‌ర‌ద పురాణంపై ట్రోలింగ్ సైతం బీభ‌త్సంగా జ‌రుగుతోంది.   

హుజూరాబాద్ ఉప ఎన్నిక ఆలస్యం.. ఎవరికి విషం? 

హుజూరాబాద్ ఉపఎన్నిక ఇక ఇప్పట్లో లేనట్లే ... నవంబర్  లేదా డిసెంబర్ కాదంటే కొత్త సంవత్సరంలో ఉప ఎన్నిక జరిగినా ఆశ్చర్య పోనవసరం లేదు. ఈ నేపధ్యంలో ఈ ఆలస్యం ఎవరికి మేలు చేస్తుంది, ఎవరికీ  కీడు చేస్తుంది, ఈ సమయంలో సమీకరణలు ఏ విధంగా మారిపోతాయని ఆలోచిస్తే, ఇప్పటికైతే అధికార తెరాసకు మేలు జరుగుతుందని పరిశీలకులు భావిస్తున్నారు.  నిజానికి, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, అధికార పార్టీ ఓటమి ఖాయమని సర్వేలు ఘోషిస్తున్నాయి. దళిత బందు ప్రకటన తర్వాత కూడా మూడొంతుల ఓటర్లు ఆటు, ఈటల వైపే ఉంది పోయారు. అందుకే, ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త కొత్త ఎత్తులు వేస్తున్నారు. చివరకు రాష్ట్రంలో కరోనా లేదు పాడు లేదు అంటూనే, అదే లేని కరోనాను బూచిగా చూపించి, ప్రభుత్వం ఉప ఎన్నికను  వెనక్కి నెట్టింది. ఇది కేవలం విపక్షాలు చేస్తున్న విమర్శ కాదు, స్వపక్షీయులు కూడా అవే గుసగుసలు పోతున్నారు. ఉప ఎన్నిక ఆలస్యం అవడం వలన అధికార తెరాసకు నిజంగా ప్రయోజనం చేకూరుతుందా అంటే, ఖచ్చితమైన సమాధానం చెప్పడం,రాజకీయ పండితులకు సైతం కష్టమే. రాజకీయాలు ఎప్పుడు  ఏ మలుపు తీసుకుంటాయో ఊహించడం ఎవరికైనా అయ్యే పని కాదు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు అతి వేగంగా పరుగులు తీస్తున్న ప్రస్తుత సంక్లిష్ట రాజకీయ వాతావరణంలో రేపేమి జరుగుతుందో ఈరోజే చెప్పడం ఒక విధంగా దుస్సాహసమే అవుతుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి ఈటలను బర్తరఫ్ చేసిన సమయంలో ఉన్న లెక్కలు వేరు ఇప్పుడున్న లెక్కలు వేరు. అప్పుడు ముఖ్యమంత్రి, ఈటలను పిల్లోడు అనుకున్నారు. అంతే కాని, ఇంతలా ఏకు మేకవుతాడని అనుకోలేదు. అందుకే, చకచకా పావులు కదిపి, ఈటల మీద వేటు వేశారు.  పరిస్థితి ఇంతలా విషమిస్తుందని అప్పుడే తెలిసుంటే, కేసీఆర్ అసలు ఈటల ఉద్వాసన వరకు వెళ్ళేవారే కాదని తెరాస వర్గాల్లోనే చర్చ నడుస్తోంది.  పరిశీలకులూ అదే అంటున్నారు. ఏదో అనుకుంటే ఇంకేదో అయింది కాబట్టే కేసీఆర్ వేల కోట్లు కుమ్మరించినా, దళిత బంధు వంటి ‘అద్భుత’ పథకాన్నిప్రవేశ పెట్టినా, తమ శక్తి యుక్ట్లు అన్నీ సంపూర్ణంగా వినియోగించినా,ఆయన్ని ఓటమి భయం వెంటాడుతూనే ఉంది. ఈ విషయంలో ఇంత వరకు ఎవరికైనా ఏవైనా అనుమానాలుంటే, ఉప ఎన్నిక వాయిదా నిర్ణయంతో ప్రభుత్వం కరోనాకు కాదు, ప్రజలకు భయపడుతోందని తేలిపోయింది.  ఉపఎన్నిక రెండు మూడు నెలలు ఆలస్యంగా జరిగినంత మాత్రాన అధికార పార్టీకి ఫలితం దక్కుతుందా అంటే, ఖాయంగా ప్రయోజనం జరుగుతుందని చెప్పీ పరిస్థితి లేదనే అంటున్నారు పరిశీలకులు.వ్రతం చెడ్డా ఫలితం దక్కకుండా పోతుందా అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.   అంతే కాదు, ఎన్నికలు ఆలస్యం అయిన కొద్దీ కొత్తసమస్యలు చుట్టుముడతాయని, ముఖ్యంగా కేసీఆర్ ఆశలు పెట్టుకున్న దళిత బంధు పథకమే ప్రతికూల అంశంగా మారే ప్రమాదం ఉందని పార్టీ నాయకులే అంటున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలోని 21 వేల పై చిలుకు దళిత కుటుంబాలకు కుటుంబానికి పది లక్షల రూపాయల వంతున ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దమైంది. అందుకోసం ఇప్పటికే రూ. 2 వేల కోట్లు రిలీజ్‌‌ చేసింది. లబ్ధిదారులతో కొత్త బ్యాంకు ఖాతాలు తెరిపించింది.   మొదటి దశలో ప్రభుత్వ ఉద్యోగులు తప్ప మిగతా వారి ఖాతాల్లో నగదు జమ చేసే ప్రక్రియ మొదలుపెట్టింది. ఇప్పటికి దాదాపు 8 వేల మంది ఖాతాల్లో రూ.9.90 లక్షల చొప్పున డబ్బులు జమ చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఇప్పట్లో లేదని తేలడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కలెక్టర్‌‌ క్లియరెన్స్‌‌ ఇచ్చే వరకు డబ్బులను లబ్ధిదారులు తమ ఖాతాల నుంచి  విత్‌‌డ్రా చేయకుండా ఫ్రీజింగ్ చేస్తూ అన్ని బ్యాంకులకు ఆదేశాలిచ్చింది.  కొత్తగా ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్ఓ) మెలిక పెట్టింది. అంటే, నియోజకవర్గ పరిధిలోని 21 వేల కుటుంబాలకు లబ్ది చేకూరే సమయానికి పుణ్య కాలం కాస్తా పూర్తయి పోతుంది. ఆలా కొంతమందికి వచ్చి కొంతమందికి రాక, అదొక సమస్యగా మారుతుంది. అలాగే, ఇతర సామాజిక వర్గాల నుంచి వత్తిళ్ళు పెరుగుతాయి. ఆ వర్గాలు దూరమవుతాయి..ఇలా కొత్త సమస్యలు తలకు చుట్టుకుంటాయని పార్టీ నాయకులు ఆందోళన వ్యక్త పరుస్తున్నారు. అంతే కాకుండా ఈ ప్రభావం 2023 అసెంబ్లీ ఎన్నికల మీద కూడా ఉంటుందని అంటున్నారు.    తెరాసకు ప్రధాన ప్రత్యర్ధిగా భావిస్తున్న మాజీ మంత్రి బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్కు నియోజక వర్గంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా సానుభూతి, సానుకూలత వ్యక్తమవుతున్నాయి. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నుంచి ఆయనకు ప్రత్యక్ష పరోక్ష మద్దతు లభిస్తోంది. అయితే ప్రస్తుతం వీస్తున్నాఈ సానుకూల పవనాలు, అందాకా అలాగే ఉంటాయా అనేది అనుమానమే అంటున్నారు. ప్రస్తుత సానుకూల పరిస్థితులు నిలబెట్టుకోవడం ఈటలకు అంత సులభం కాదు. ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాలు, ఎత్తుగడలు ఎదుర్కుంటూ, పట్టు నిలుపుకోవడమే అంటే అది మాములు విషయం కాదు. ఒక విధంగా అది ఈటలకు కత్తి మీద సాము లాంటిదే అంటున్నారు.  ఇక ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా బరిలో దిగలేదు. కానీ ఇప్పుడు కావలసినంత సమయం చిక్కడంతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రంగంలోకి దిగితే, అది కేసీఆర్ కే కాదు ఈటలకు చిక్కులు తెచ్చిపెడుతుందని అంటున్నారు. రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి ఈటల పట్ల సానుకూలత ఉన్నా, ఆయన బీజేపీ అభ్యర్ధి కావడం వలన కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వక తప్పదు. సో, కాంగ్రెస్ బరిలో దిగితే అది ఈటల గెలుపు అవకాశాలను దెబ్బ తీస్తుందని, ఆ కోణంలో చూసినప్పుడు ఈటలకు, ఆలస్యం అమృతం విషంగా మారుతుందని అంటున్నారు. 

ఆంధ్రా మరో కేరళ అవుతుందా? జగన్ సర్కార్ లక్ష్యమేంటీ?

ఆంధ్రాలో జరుగుతున్న పరిణామాలపై సర్వత్రా ఆందోళన నెలకొంటోంది. జగన్ సర్కారు మూర్ఖపు వైఖరిని ప్రజలంతా నిశితంగా గమనిస్తున్నారు. పండుగలు కూడా జరుపుకునే స్వేచ్ఛ లేదా అంటూ సామాన్యుడి నుంచి ధనవంతుడి వరకు హిందూ భక్తులంతా జగన్ ప్రభుత్వ  వైఖరిని నిలదీస్తున్నారు. జగన్ లో ఇంత కరుడుగట్టిన హిందూ వ్యతిరేకి ఉంటాడని తాము అనుకోలేదని, వ్యక్తిగతంగా ఏ ధర్మాన్ని అవలంబించినా పాలకుడిగా అందరిసెంటిమెంట్లను ఆదరించే, గౌరవించే ఔన్నత్యం ఉంటుందనే తాము భావించామని, అందుకే ఎవరేమనుకున్నా జగన్ కు ఉన్నతమైన ముఖ్యమంత్రి స్థానం కట్టబెట్టి తమ పాలకుడిగా నెత్తిన పెట్టుకున్నామని, అయితే పాలకుడైన తరువాత మాత్రం జగన్ పూర్తి ఒంటెద్దు పోకడలు పోతున్నారని ప్రజలంతా అసహనం వ్యక్తం చేస్తున్నారు. జగన్ వైఖరి విద్యావంతులకు, మేధావులకు, సెక్యులరిస్టులకు, యాక్టివిస్టులకు సైతం జీర్ణం కాకపోవడం విశేషం.  వినాయక చవితిని కేవలం ఇళ్లలోనే జరుపుకోవాలని జగన్ సర్కారు ఎందుకు ఆదేశించిందో ఎవరికీ అంతు పట్టడం లేదు. వినాయక చవితి అనగానే పిల్లలు, యూత్, వృద్ధులు సైతం ఆ తొమ్మిది రోజులు ఎంతో ప్రత్యేకంగా భక్తిశ్రద్ధలతో పండుగను జరుపుకుంటారు. ఊరూరా అనేక వీధుల్లో వినాయక మండపాలు వేసి శక్తికొద్దీ గణేశ్ విగ్రహాలు తీసుకొచ్చి అలంకరించి ముచ్చటగా వేడుకలు జరుపుకుంటారు. అయితే వినాయక మండపాలు పెట్టుకునేవారు ముందుగా తమకు తెలియజేయాలని పోలీసులు నిబంధనలు విధించడం సాధారణం. ఎందుకంటే ఇలా వినాయకుల విగ్రహాల లెక్కలు సేకరించినప్పుడే నిమజ్జనానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడానికి అవకాశం ఉంటుంది. అపశ్రుతులు నివారించే ఆస్కారం ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా అలాగే వ్యవహరిస్తోంది. కానీ జగన్ ఏనాడూ లేంది ఈసారి వింత పోకడలు, చెత్త పోకడలు పోతూ హిందూ సెంటిమెంట్లు గాయపరచడమే పనిగా పెట్టుకున్నాడని జనమంతా గగ్గోలు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రజలంతా గుమిగూడి జరుపుకునే బక్రీద్ ప్రార్థనలు, మొహర్రం వేడుకలు, క్రిస్మస్ వేడుకలకు లేని ఆంక్షలు అక్కడక్కడా వీధుల్లోని మండపాల్లో జరుపుకునే వినాయక చవితికే ఎందుకొచ్చాయని జగన్ ను నిలదీస్తున్నారు.  జగన్ వైఖరి కారణంగా ప్రజల సెంటిమెంట్లు గాయపడటమే కాకుండా.. అసలు వినాయక విగ్రహాల తయారీ మీదనే జీవించే ఎందరో పేద కార్మికుల పొట్ట కొట్టినట్టవుతోందన్న నిరసనలు ఊపందుకుంటున్నాయి. ఒకవేళ ఇలాంటి నిర్ణయం 3 నెలల ముందే తీసుకుంటే అప్పుడు ప్రజలు మరోలా రిసీవ్ చేసుకునేవారని, తీరా పండుగ ముందు ఇలా ఆంక్షలు పెట్టి కేవలం ఇళ్లలోనే జరుపుకోవాలని షరతులు విధించడమేంటని ప్రజలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలే కరోనా కారణంగా గతేడాది కూడా వినాయక వేడుకలు పరిమిత స్థాయిలోనే జరిగాయి. విగ్రహాల తయారీ గానీ, కొనుగోళ్లు గానీ పెద్దగా జరగలేదు. దీంతో విగ్రహాలు తయారుచేసే శ్రామికులకు కడుపునిండా సరైన భోజనం కూడా దొరకలేదు. అలాంటిది ఇప్పుడు కూడా వారు తయారు చేసిన విగ్రహాలను తీరా అమ్ముకునే సమయంలో జగన్ పిడుగులాంటి నిర్ణయం తీసుకున్నాడని, తమకు వచ్చే అరాకొరా పైసలు కూడా రాకుండా పోతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పండుగను కేవలం ఇళ్లకే పరిమితం చేస్తే దాని మీదే ఆధారపడ్డ వ్యాపారాలు కూడా పడకేస్తాయంటున్నారు. ఏ ముందుచూపు లేకుండా జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడంటే జగన్ పిచ్చి పీక్స్ కు వెళ్లిందన్న ఆగ్రహం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది.  మరోవైపు ప్రభుత్వం ఆదేశాలందుకున్న పోలీసులు విగ్రహాల తరలింపు కోసం మున్సిపాలిటీ చెత్త వాహనాలు వాడటం, వాటిలోనే అందమైన వినాయక ప్రతిమలను బలవంతంగా తరలించడాన్ని ప్రజలు జీర్ణం చేసుకోలేకపోతున్నారు. విగ్రహాల తరలింపుకు అడ్డుపడుతున్న స్థానిక హిందూ సంస్థల కార్యకర్తలు, కొనుగోలుదారులతో పోలీసులు చాలా దురుసుగా వ్యవహరిస్తున్నారు. ఎవరొస్తారో రానీయండి.. మేమూ చూస్తాం అంటూ హిందువుల సెంటిమెంట్లను తీవ్రంగా గాయపరుస్తున్నారు. తమకు పండుగ చేసుకునే హక్కు లేదా, స్వేచ్ఛ లేదా అంటూ పోలీసుల్ని నిలదీస్తుంటే... గొంతు లేవకూడదని, చెప్పింది చేయాలని వినాయక చవితి వేడుకతో, హిందువుల సెంటిమెంట్లతో చెలగాటమాడుతున్నారు. పోలీసుల వైఖరితో గుంటూరు జిల్లాలో పరిస్థితులు పలుచోట్ల ఉద్రిక్తంగా మారాయి.  వినాయక చవితిని టార్గెట్ చేసిన జగన్ అసలు ఆంధ్రాను ఏం చేయాలనుకుంటున్నాడు అన్న ప్రశ్నలు క్రమంగా బలపడుతున్నాయి. జగన్ వైఖరి ఇలాగే కొనసాగితే త్వరలోనే ఆంధ్రా మరో కేరళగా మారడం ఖాయమని, ఆ తరువాత హిందువులు, ఇతర వర్గాల మధ్య వైరం పెరిగి ఆశాంతికి దారితీస్తుందని అలాంటి పరిస్థితులు ఏర్పడకముందే విపక్షాలు కూడా వినాయక చవితి విషయంలో జగన్ ను నిలదీయాలన్న డిమాండ్లు బలపడుతున్నాయి. జగన్ ను ఇలాగే ఉపేక్షిస్తే హిందువులను దారుణంగా అణచివేసి మరో కేరళగా మార్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న ఆందోళన క్రమంగా ఊపందుకుంటోంది.  కేరళ చరిత్రను గమనిస్తే 1920ల్లోనే అక్కడ హిందువుల ఊచకోతలు జరిగాయి. ఎక్కడో టర్కీలో తలెత్తిన ఖిలాఫత్ ఉద్యమానికి ఇక్కడి ముస్లింలు మద్దతివ్వడం, హిందువులను ఊచకోత కోయడం జరిగాయి. ఆనాటి సామూహిక మారణకాండను నిరసిస్తూ హిందూ సంస్థలు ప్రదర్శనలు చేస్తే... ఆ ఊచకోతను స్ఫూర్తిగా తీసుకొని ముస్లిం సంస్థలు గతేడాది పోటాపోటీ ర్యాలీలు తీశాయి. రెండు వర్గాల మధ్య స్నేహ వాతావరణం చెడిపోయి పలుచోట్లు ఉద్రిక్తతలకు దారితీసింది. మరోవైపు హిందూ అమ్మాయిలే టార్గెట్ గా లవ్ జిహాద్ పేరుతో చాపకింద నీరులా మతమార్పిడి కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. అలాంటి పరిస్థితులే ఇప్పుడు ఆంధ్రాలో కూడా తలెత్తే ప్రమాదం లేకపోలేదన్న ఆందోళనలు ఇప్పుడు బలపడుతున్నాయి.  హిందూ సెంటిమెంట్లు గాయపరిస్తే దాని అవమానం మరో రూపంలో వెల్లువెత్తే ప్రమాదాన్ని కొట్టిపారేయలేమన్న హితోక్తులను మేధావులు సైతం వ్యక్తం చేస్తున్నారు. ముస్లింలకు, క్రిస్టియన్లు పూర్తి స్వేచ్ఛనిచ్చిన జగన్ సర్కారు... అసలు హిందువులనే ఎందుకు అణగదొక్కుతున్నాడన్న ఆలోచన అందరిలోనూ రగులుకుంటోంది. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హిందూ ఆలయాలే టార్గెట్ గా అనేకమైన దాడులు జరిగాయి. 100 కు పైగా ఆలయాలు, దేవతా విగ్రహాలపై దాడులు జరిగాయి. చాలా విగ్రహాలు ధ్వంసమయ్యాయి. ఇక తాజాగా వినాయక చవితి ఆంక్షలు విధిస్తే ఇతర వర్గాలవారు హిందూ సెంటిమెంట్లను మరింత చులకన చేసి మాట్లాడతారని, అదే తరహాలో వ్యవహరిస్తారన్న అనుమానాలు ముసురుకుంటున్నాయి. అలాంటివి జరగకుండా ఉండాలంటే తక్షణమే జగన్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలన్న హితోక్తులు వినిపిస్తున్నాయి. మరి జగన్ వింటాడా... చూడాలి.

త‌మ్ముళ్ల‌కు ఖాకీల వేధింపులు.. చంద్ర‌బాబు ఆగ్ర‌హం.. డీజీపీకి లేఖాస్త్రం..

ఏపీ పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారార‌నే విమ‌ర్శ‌లు. కేసులు, కుట్ర‌ల‌తో టీడీపీ శ్రేణుల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు. అందుకు త‌గ్గ‌ట్టే ఖాకీల ఓవ‌రాక్ష‌న్ మామూలుగా ఉండ‌ట్లేదు. తాజాగా, ఓ కేసులో ప‌లువురు టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు టార్చ‌ర్ చేశార‌ని అంటున్నారు. ప‌దేళ్ల లోపు చిన్నారుల‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవ‌డం మ‌రింత వివాదాస్ప‌ద‌మ‌వుతోంది. ఖాకీల తీరు స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌ల పాల‌వుతోంది.  ప్రకాశం జిల్లా లింగసముద్రం పోలీసులు మొగిలిచర్లకు చెందిన ఆరుగురు టీడీపీ కార్యకర్తలను స్టేషన్‌కు పిలిపించి వేధిస్తున్నారంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు మండిప‌డ్డారు. ఘ‌ట‌న‌పై డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు లేఖ రాశారు. పి.రత్తయ్య, ఎం.శ్రీకాంత్ అనే కార్యకర్తలను పోలీసులు చిత్రహింసలకు గురి చేశారన్న చంద్రబాబు.. టీడీపీని వీడాలని వారిపై ఒత్తిడి చేశారన్నారు. అర్ధరాత్రి 2 గంటలకు వదలిపెట్టారని.. ఉదయాన్నే మళ్లీ 6.30 గంటలకు లింగసముద్రం ఎస్ఐ ఫోన్ చేసి పోలీస్ స్టేషన్‌కు రావాలని బెదిరించారని డీజీపీ దృష్టికి తీసుకొచ్చారు చంద్ర‌బాబు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో 6 నుంచి 10 ఏళ్ల చిన్నారులు కూడా ఉన్నారని తెలిపారు. పోలీసుల బెదిరింపులు తట్టుకోలేక రత్తయ్య, శ్రీకాంత్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ తర్వాత మిగిలిన వారిని హడావుడిగా స్టేషన్ నుంచి పంపించారని, ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వలేదని చంద్ర‌బాబు ఆరోపించారు. ఈ సంఘటనతో ఏపీలో పోలీసుల వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతోందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  రెండేళ్లుగా పోలీసుల బెదిరింపులు తారస్థాయిలో ఉన్నాయంటు చంద్రబాబు మండిప‌డ్డారు. పోలీస్ ప్రతిష్ఠ రోజురోజుకూ దిగజారుతోందన్నారు. చట్టానికి లోబడి పోలీసులు విధులు నిర్వహించాలన్నారు. లింగసముద్రం ఘటనపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డీజీపీని డిమాండ్‌ చేశారు చంద్రబాబు.     

సెప్టెంబ‌ర్ 17.. తెలంగాణ గ‌డ్డ‌పై రాహుల్ వ‌ర్సెస్ అమిత్‌షా..

తెలంగాణ రాజ‌కీయం కాక మీదుంది. బెంగాల్ త‌ర్వాత మ‌న‌ద‌గ్గ‌రే పొలిటికల్ హీట్ తారాస్థాయిలో ఉంది. టీఆర్ఎస్ వ‌ర్సెస్ కాంగ్రెస్ వ‌ర్సెస్ బీజేపీ.. ట్ర‌యాంగిల్ వార్ ఓ రేంజ్‌లో సాగుతోంది. ఎవ‌రూ త‌గ్గ‌ట్లే. ఎవ‌రూ ఆగ‌ట్లే. పోటాపోటీ వ్యూహాలు. ఎత్తుకు పైఎత్తు రాజ‌కీయాలు. అధికార పార్టీ ద‌ళిత‌బంధుతో దూకుడు పెంచింది. ద‌ళిత‌, గిరిజ‌న దండోరాల‌తో కాంగ్రెస్ జోరు పెరిగింద‌ది. బండి పాద‌యాత్ర‌తో బీజేపీ బాహుబ‌లిలా మారుతానంటోంది. మూడు పార్టీలు స‌మ‌రోత్సాహంతో తెలంగాణ రాజ‌కీయం స‌ల‌స‌ల కాగుతోంది.  తాజాగా, తెలంగాణ పొలిటిక‌ల్ హీట్ జాతీయ స్థాయికి చేరింది. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌పై దండెత్త‌డానికి.. కాంగ్రెస్‌, బీజేపీ అధినేత‌లు సైతం క‌ద‌న‌రంగంలోకి దూకుతున్నారు. రాహుల్‌గాంధీ, అమిత్‌షాలు ఒకే రోజు తెలంగాణ గ‌డ్డ‌పై త‌మ బ‌లం, బ‌ల‌గం చాటేందుకు క‌ద‌లివ‌స్తుండ‌టం కాక రేపుతోంది. అందులోనూ తెలంగాణ చ‌రిత్ర‌లో కీల‌క‌మైన సెప్టెంబ‌ర్ 17న కాంగ్రెస్‌-రాహుల్‌, బీజేపీ-అమిత్‌షాలు.. బ‌హిరంగ స‌భ‌ల‌కు స‌మాయ‌త్త‌మ‌వుతుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.  ద‌ళిత‌బంధుకు కౌంట‌ర్‌గా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో కాంగ్రెస్ పార్టీ ద‌ళిత‌-గిరిజ‌న దండోరా స‌భ‌ల‌ను నిర్వ‌హిస్తోంది. ఇప్ప‌టికే రెండు స‌భ‌లు భారీగా స‌క్సెస్ అయ్యాయి. ఇక‌, ఆఖ‌రి దండోరా స‌భ వ‌రంగ‌ల్‌లో ఈ నెల 17న నిర్వ‌హించ‌నుంది. ఆ బ‌హిరంగ స‌భ‌కు కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ రానున్నారు. రేవంత్‌రెడ్డి కోరిక మేర‌కు రాహుల్‌గాంధీ.. వ‌రంగ‌ల్ స‌భ‌కు వ‌చ్చేందుకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చార‌ని తెలుస్తోంది. చివ‌రి నిమిషంలో ఏదైనా షెడ్యూల్ మారితే త‌ప్ప తెలంగాణ‌కు రాహుల్ రాక క‌న్ఫామ్‌.  స‌రిగ్గా అదే రోజు.. సెప్టెంబ‌ర్ 17న‌.. తెలంగాణ విమోచ‌న దినాన్ని ఈసారి మ‌రింత ఘ‌నంగా నిర్వ‌హించేందుకు క‌మ‌ల‌నాథులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్మ‌ల్‌లో భారీ బ‌హిరంగ స‌భ త‌ల‌పెట్టారు. ఆ స‌భ‌కు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రానున్నారు. గ‌తంలో రేవంత్‌రెడ్డి మొద‌టి ద‌ళిత‌-గిరిజ‌న దండోరా స‌భ పెట్టిన ఉమ్మ‌డి ఆదిలాబాద్ ఇలాఖాలోనే బీజేపీ మీటింగ్ పెడుతుండ‌టం వ్యూహాత్మ‌కం అంటున్నారు. కాంగ్రెస్ కంటే త‌మ బ‌ల‌మే ఎక్కువ‌ని నిరూపించేందుకు.. భారీగా జ‌న స‌మీక‌ర‌ణ‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ స‌భ‌కు అమిత్‌షాను ర‌ప్పించ‌డం ద్వారా ప్ర‌జ‌ల అటెన్ష‌న్‌ను త‌మ‌వైపు తిప్పుకోవాల‌ని చూస్తున్నారు.  ఇలా సెప్టెంబ‌ర్ 17న‌.. ఒకే రోజు.. ఇటు రాహుల్‌, అటు అమిత్‌షాల రాక‌తో తెలంగాణ‌లో రాజ‌కీయ వేడి అమాంతం పెరిగిపోయింది. కేసీఆర్‌ను గ‌ద్దె దించేందుకు కాంగ్రెస్‌, బీజేపీలు పోటాపోటీగా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. రేవంత్‌రెడ్డి నాయ‌క‌త్వంలో కాంగ్రెస్ య‌మ జోరు మీదుండ‌గా.. బండి సంజ‌య్ పాద‌యాత్ర‌తో క‌మ‌ల‌నాథులు క‌ద‌నోత్సాహంతో ఉన్నారు. ఇక రాహుల్‌, అమిత్‌షాల ఎంట్రీతో.. ప్ర‌తిప‌క్షాల్లో ఫుల్ జోష్ పెర‌గ‌డం ఖాయం. ఆ రెండు పార్టీలు.. వేరు వేరుగా.. కేసీఆర్‌పై క‌ల‌బ‌డితే..? ఆ కొట్లాట‌లో గెలిచేదెవ‌రు? నిలిచేదెవ‌రు?   

జగన్ ను పట్టించుకోని వైసీపీ ఎమ్మెల్యే.. అదే బాటలో మరికొందరు? 

సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు వైసీపీ నేతలకు నచ్చడం లేదా? ఆయన నిర్ణయాలను పట్టించుకోవడం లేదా? అంటే అవుననే తెలుస్తోంది. కొన్ని రోజులుగా ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలన్ని వివాదాస్పమవుతున్నాయి. జనాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. కోర్టుకు కూడా తప్పు పడుతున్నాయి. కొన్నింటిని రద్దు చేశాయి. వరుస ఎదురు  దెబ్బలు తగులుతున్నా జగన్ సర్కార్ తీరు మాత్రం మారడం లేదు. దీంతో ప్రభుత్వ తీరుపై సొంత పార్టీ నేతలే అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది.  ముఖ్యమంత్రి తప్పుడు సలహాలతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారనే అభిప్రాయం వైసీపీ నేతల్లో వ్యక్తమవుతోందని సమాచారం. అంతేకాదు కొందరు లీడర్లు ప్రభుత్వ నిర్ణయాలను పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నందునే అలా చేస్తున్నారని సమాచారం. తాజాగా వినాయక చవితి బహిరంగ వేడుకలపై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధించడం దుమారం రేపుతోంది. దీనిపై ప్రతిపక్షాలు జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. గణేష్ పందిళ్లు.. వినాయక చవితి ఉత్సవాలకు అనుమతులను నిరాకరించడంతో జనాల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. దీంతో పక్క రాష్ట్రాల్లో లేని విధంగా వినాయక చవితి వేడుకలపై ఆంక్షలు పెట్టడంతో మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ వైఖరిని సమర్థించుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. జనాల్లో వ్యతిరేకత ఉండటంతో కొందరు గ్రామాలకు వెళ్లడానికి జంకుతున్నారు.  ఒక వైసీపీ ఎమ్మెల్యే   సొంత ప్రభుత్వంపైనే అసంతృప్తి వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. వినాయక మండపాలకు అనుమతి కోరుతూ ఆయన లేఖ రాయడంతో వైసీపీలో అలజడి రేగింది.వైసిపికి చెందిన విజయనగరం జిల్లా సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర గణేష్ ఉత్సవానికి అనుమతి కోరుతూ స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్కు లేఖ సమర్పించారు. ప్రభుత్వం విగ్రహాలను పెట్టవద్దని చెబుతుంటే.. అధికార వైసిపి ఎమ్మెల్యే రాజన్న దొర రాసిన ఈ లేఖ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. రాజన్న దొర లేఖతో వినాయక చవితి వేడుకలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వైసీపీ నేతలకు నచ్చడం లేదని స్పష్టమవుతోంది.  గణేష్ పండుగపై వివాదాస్పద నిర్ణయంపై జగన్ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్న ప్రతిపక్ష నాయకులకు ఇది ఆయుధంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే గణేష్ మండపాలకు అనుమతి నిరాకరించడంపై టిడిపి బిజెపి పార్టీలు వైయస్ఆర్సిపిని లక్ష్యంగా చేసుకున్నాయి. వారితో కలిసి పవన్ కళ్యాణ్ కోవిడ్ ఆంక్షలు వినాయక చవితికి మాత్రమే వర్తిస్తాయా? అని నిన్న తీవ్రవిమర్శలు చేశారు. వైఎస్ఆర్సిపి నాయకుల పుట్టినరోజు వర్థంతి జయంతి వేడుకలకు వర్తించదా అని కడిగేశాడు. ఈ నేపథ్యంలో గణేష్ మండపానికి అనుమతి కోసం అధికార పార్టీ ఎమ్మెల్యే లేఖ రాయడం ఏపీలో ఆసక్తిగా మారింది. రాజన్న దొరే కాదు మరికొందరు వైసీపీ నేతలు కూడా వినాయక చవితి వేడుకల విషయంలో ఇదే అభిప్రాయంతో ఉన్నారని చెబుతున్నారు. 

ఆప్ఘన్‌లో తాలిబన్ పాలనలా.. జగన్ పాలన! బీజేపీ నేత హాట్ కామెంట్స్.. 

ఆంధ్రప్రదేశ్ లో వినాయక చవితి వేడుకలపై వివాదం ముదురుతోంది. ప్రభుత్వ నిర్ణయంపై మండిపడుతున్న బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. సర్కార్ ఆంక్షలు పట్టించుకోకుండా పెద్ద ఎత్తున విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై  బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. వినాయక చవితి పండగపై  ఆంక్షలు పెట్టడమంటే...హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా వెళ్లడమే అని అన్నారు. జగన్ అన్నీ తప్పుడు నిర్ణయాలే తీసుకుంటున్నారని విమర్శించారు.  ఏపీ ప్రజల దురదృష్టవశాత్తు జగన్ పొరపాటున మరొకసారి సీఎం అయితే..వినాయక చవితిని ఎవ్వరి ఇంటిలోనూ చేసుకోనివ్వరని విష్ణుకుమార్ రాజు అన్నారు. ఆప్ఘన్‌లో తాలిబన్ పాలనలా...అప్పుడు జగన్ పాలన ఉంటుందని వ్యాఖ్యానించారు. జగన్ పాలనలో అన్నీ నాశనం..వినాశనమే అని, తమిళనాడు సీఎం స్టాలిన్ చూసి జగన్ నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉందని హితవుపలికారు. దేవాలయాలపై దాడులు, రథం దగ్దం లాంటి ఎన్నో  ఘటనలు ఏపీలోజరిగాయన్నారు. దేవాదాయ శాఖ మంత్రిగా వెల్లంపల్లి శ్రీనివాస్ అనర్హుడని అన్నారు.  బీజేపీ నేతలపై కేసులు పెడితే భయడతామా? అన్న విష్ణుకుమార్ రాజు..  ముందు మీ మీద ఉన్న కేసుల నుంచి బయటపడండి అంటూ ముఖ్యమంత్రికి హితవు పలికారు.  వైసీపీ నేత‌లు నిర్వ‌హించే కార్య‌క్ర‌మాల‌కు వేలాది మంది త‌ర‌లివ‌స్తే రాని క‌రోనా.. ప్ర‌జ‌లు వినాయ‌క చ‌వితి చేసుకుంటే మాత్రం వ‌స్తుందా? అని బీజేపీ నేత విష్ణు వ‌ర్ధ‌న్ రెడ్డి నిల‌దీశారు.'ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ గారు.. మీ కాళహస్తి ఎమ్మెల్యే బియ్య‌పు మ‌ధుసూద‌న్ రెడ్డి గారు వేల మందితో జగనన్న అద్దాల మహల్  ప్రారంభోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహిస్తే కరోనా రాదా సార్?' అని ఆయ‌న నిల‌దీశారు. '20 మంది హిందూ యువ‌కులు వీధిలో వినాయకుడిని పూజిస్తే మాత్రమే వస్తుందా? మీ వాళ్లు ఏమైనా క‌రోనా రహిత కార్యకర్తలా?' అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఈ సంద‌ర్భంగా వైసీపీ కార్య‌క‌ర్త‌ల ర్యాలీకి సంబంధించిన వీడియోను ఆయ‌న పోస్ట్ చేశారు. 

జైలులో మంటలు.. 41 మంది ఖైదీలు సజీవ దహనం

ఇండోనేషియా రాజధాని జకార్తాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. టాంగెరాంగ్ జైలులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 41 మంది ఖైదీలు మరణించారు. మరో 39 మంది తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం తెల్లవారు జామున జైలులోని సి బ్లాక్ లో మొదట మంటలు వచ్చాయి. నిమిషాల్లో మొత్తం విస్తరించాయి. మంటలు భారీగా ఎగిసిపడటంతో  తమ గదుల్లో ఉన్న ఖైదీలు తప్పించుకునే మార్గం లేక విలవిల్లాడారు. అధికారులు స్పందించినప్పటికీ, అప్పటికే పదుల సంఖ్యలో ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు. అగ్ని ప్రమాదానికి కారణం ఏంటన్నది ఇంకా తెలియరాలేదు. టాంగెరాంగ్ జైలును 1225 మంది ఖైదీలు ఉండడానికి వీలుగా నిర్మించినా, దీంట్లో ప్రస్తుతం 2 వేల మందికి పైగా ఖైదీలు ఉన్నారు. అగ్నిప్రమాదం జరిగిన సి బ్లాక్ లో ప్రమాదం జరిగిన సమయంలో 122 మంది ఖైదీలు ఉన్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. జైళ్లలో ఘర్షణలు, తద్వారా ఇలాంటి అగ్నిప్రమాదాలు సంభవించడం ఇండోనేషియాలో సర్వసాధారణం. ఈ కోణంలోనూ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. టాంగెరాంగ్ జైలులో ఎక్కువగా మాదకద్రవ్యాల కేసుల్లో పట్టుబడిన వారిని ఖైదు చేస్తుంటారు. 

ఇవేం రోడ్లు.. ఇదేం పాలన! జగన్ సర్కార్ పై భగ్గుమంటున్న జనం 

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలి క్షణం నుంచి ఇప్పటివరకు, ఒకటే లక్ష్యంతో పనిచేస్తున్నారు. మళ్ళీ అధికారంలోకి రావడమే టార్గెట్’గా  ఓట్లు లెక్కలు వేసుకుంటూ అడుగులు వేస్తున్నారు. ఇందుకు ఆయన ఎంచుకున్నమార్గం, సంక్షేమ పథకాల పేరిట ప్రజలకు సొమ్ములు పంచి, ఓటు బ్యాంకును పెంచుకోవడం. ఒక్క మాటలో చెప్పాలంటే, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రజల సొమ్ములతో ప్రజల ఓట్లు కొని అధికారం నిలుపుకునే రాజకీయ బేహారి రూపం దాల్చారు. ఈ క్రమంలో ఆయన అభివృద్ధిని అటకెక్కించారు. మౌలిక సదుపాయల విషయం పక్కన పెట్టేశారు.  ఈ రెండున్నర సంవత్సరాలలో రాష్ట్రంలో ఎక్కడా పది కిలో మీటర్ల రోడ్డు వేయలేదు, కనీసం ఉన్న రోడ్ల మరమ్మతులను పట్టించుకోలేదు. ఫలితంగా, రాష్ట్రంలో చాలావరకు రోడ్లు యమపురికి దగ్గరి దారి,షార్ట్ కట్’గా మారిపోయాయి. అడుగు’కో గుంత, గజానికో గండం అన్నట్లుగా రాష్ట్ర రోడ్లన్నీ అద్వాన్న స్థితికి చేరుకున్నాయి. దానికి తోడు ‘మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు’ ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాలతో రోడ్లన్నీ మరింత అద్వాన్న స్థితికి చేరుకున్నాయి. బండి కాదు, కాలు కూడా కదలని స్థితికి చేరుకున్నాయి. పరిస్థితి ఇంత అద్వాన్న స్థితికి చేరడంతో, సహజంగానే, ప్రతిపక్షాలు రోడ్లెక్కాయి. ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం, బీజీపీ, జనసేన పార్టీలు ఆందోళనకు నడుం బిగించాయి. అయితే చిత్రం ఏమంటే, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇప్పటికీ కళ్ళు తెరవలేదు, సరికదా, అదేదో తమ పాద మహిమ అన్నట్లుగా మురిసిపోతున్నారు. ఆ రకంగా మాట్లాడుతున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు రాష్ట్రంలో వర్షాలు పుష్కలంగా కురుస్తున్నాయని, దేవుడి దయ వల్ల వర్షాలు బాగా పడటంతో రైతులు సంతోషంగా ఉన్నారని అంటూ వర్షాలు తీవ్రంగా పడటం వల్ల రోడ్లు కూడా దెబ్బతిన్నాయని, అంతా తమ పాదమహిమ, దేవుని దయ తప్ప మరొకటి కాదని, తమ ప్రభుత్వం తప్పేమీ లేదని ఆత్మవంచనను అక్కున చేర్చుకున్నారు. అంతే కాదు, ఆడ లేక మద్దెల ఓడన్నట్లు, విపక్ష్లాల మీద, మీడియా మీద కూడా ముఖ్యమంత్రి విరుచుకు పడ్డారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు, విపక్షాలు వీధుల కెక్కిన తర్వాత, రోడ్ల దుస్థితిఫై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన, అక్టోబర్ నెలాఖరు కల్లా వర్షాలు తగ్గుముఖం పడతాయి. తర్వాత, పనుల కాలం మొదలవుతుంది. ముందుగా రోడ్లను బాగుచేయడంపై దృష్టిపెట్టండి. మళ్లీ వర్షాకాలం వచ్చేలోపు రోడ్లన్నీ బాగుచేయాలి అంటూ అధికారులకు హుకుమజారీ చేశారు.  రోడ్లు బాగుచేయడనికి ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టిందన్నారు. వనరుల సమీకరణలో అనేక చర్యలు తీసుకుంటోందని.. ఒక నిధిని కూడా ఏర్పాటు చేసినట్లు సీఎం జగన్‌ తెలిపారు. అయితే, ఆ నిధి  ఎప్పుడోనే  నిండుకుందని అధికారాలు గుర్తు చేస్తున్నారు.నిజమే,ప్రభుత్వం నిధిని ఏర్పడు చేసింది, కానీ, అందులో నిధులు వేయడమే మరిచి పోయింది. కేంద్రం నుంచి వచ్చిన నిధులను ప్రభుత్వం పక్కదారి పట్టించిందని అధికారాలు సీక్రెట్ గా స్మైల్తున్నారు.    రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై వినూత్నంగా సోషల్ మీడియా వేదికా ఆందోళన చేపట్టిన జనసేన అధినేత పవన్కళ్యాణ్, తాజాగా ప్రభుత్వానికి మరిన్ని వాతలు పెట్టారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రహదారుల దుస్థితిపై ప్రజల నుంచి ఉవ్వెత్తున నిరసన రావడంతో దాని నుంచి తప్పించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి సోమవారం రహదారులపై నిర్వహించిన సమీక్షలో.. ఎయిర్ పోర్టులు, షిప్పింగ్‌ యార్డుల అభివృద్ధి గురించి మాట్లాడటాన్ని పవన్‌ ప్రస్తావించారు. ‘సొంతిల్లు చిమ్ముకోవడానికి చీపురు లేదుగానీ పక్కిళ్లు చిమ్మేస్తాం.. కల్లాపు చల్లేస్తాం.. ముత్యాల ముగ్గులు పెట్టేస్తాం’ అన్న చందంగా రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు.అలాగే, వెన్నుముక లేని వైసీపీ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలను కూడా పవన్ కళ్యాన్ ఎద్దేవా చేశారు, ‘నిజమే, మంత్రులు అంటున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం అద్భుతాలే చేసిందని.. చిన్న గోతులను గొయ్యిల్లాగా.. గొయ్యిల్ని కాలువల్లా చేశారు’ అంటూ పవన్ కళ్యాణ్ విమర్శించారు.  

పోర్టులు సరే ముందు రోడ్లను బాగు చేయండి.. సీఎం జగన్ పై పవన్ సెటైర్లు

ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల పరిస్థితిపై మరోసారి సీరియస్ గా స్పందించారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. రహదారుల అధ్వాన్న పరిస్థితిపై ప్రజల నుంచి ఉవ్వెత్తున నిరసన రావడంతో దాని నుంచి తప్పించుకోవడానికి ముఖ్యమంత్రి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ఎయిర్ పోర్టులు, పోర్టులను అభివృద్ధి చేస్తున్నాం అంటూ సమీక్షలో కలిపారు తప్ప ఇంకేం లేదని పవన్ విమర్శించారు. జనసేన పిలుపు మేరకు లక్షల మంది స్పందించి రోడ్ల దుస్థితిని తెలిపారన్నారు. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య దెబ్బ తిన్న రహదారుల సమస్య గురించే సీఎం మాట్లాడాలన్నారు. ‘సొంతిల్లు చిమ్ముకోవడానికి చీపురు లేదుగానీ పక్కిళ్లు చిమ్మేస్తాం.. కల్లాపు చల్లేస్తాం.. ముత్యాల ముగ్గులు పెట్టేస్తాం’ అనే చందంగా రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఉందని జనసేనాని సెటైర్లు వేశారు. రోడ్ల దుస్థితిపై చేస్తున్న సమీక్షలో వీటిని దూర్చడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ది ఉంటే వెంటనే రోడ్లకు మరమ్మత్తులు చేయాలని డిమాండ్ చేశారు.  ఆంధ్రప్రదేశ్ లో వినాయక చవితి వేడుకలపై ఆంక్షలు విధించడాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తప్పుబట్టారు. వినాయక చవితికి కరోనా నిబంధనలు వర్తింపజేయడం ఎందుకని ప్రశ్నించారు. వైసీపీ కార్యక్రమాలకు కరోనా నిబంధనలు అడ్డురావా? సంస్మరణ సభకు కరోనా లేదా? అని నిలదీశారు. విపక్షాలు నిరసనలు చేస్తే కరోనా కేసులా? అంటూ మండిపడ్డారువినాయక చవితి ఉత్సవాలపై ఎందుకు నిషేధం విధించారో నిజంగా తనకు అర్ధం కాలేదన్నారు పవన్ కల్యాణ్. కొన్ని వేల సంవత్సరాలుగా మన సంస్కృతిసంప్రదాయాలు, ధర్మానికి ముడిపడి ఉన్న వినాయక చవితి పండగకు కోవిడ్ నిబంధల వల్ల అనుమతులు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పడం నమ్మశక్యంగా లేదన్నారు.  కోవిడ్ నిబంధనలు కేవలం వినాయక చవితి పండగకు మాత్రమే వర్తిస్తాయా? వైసీపీ ప్రజా ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యుల పుట్టిన రోజులకు, పండగలకు, పబ్బాలకు వర్తించవా?  అని ప్రశ్నించారు.  ప్రతిపక్షాలు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామంటే మాత్రం కోవిడ్ నిబంధనలు గుర్తొస్తాయా? కోవిడ్ నిబంధనలు దేనికి వర్తిస్తాయి? దేనికి వర్తించవు అనేది మన రాష్ట్రంలో ప్రభుత్వమే డిసైడ్ చేస్తోందని పవన్ విమర్శించారు. పక్క రాష్ట్రాలు వినాయక చవితి పూజలకు షరతులతో కూడిన అనుమతులు ఇస్తుంటే ఇక్కడ మాత్రం పండగను చేసుకోవద్దని చెప్పడం దారుణమన్నారు. గణపతి విగ్రహాలను అమ్మే వ్యక్తులను అరెస్టు చేయడం, విగ్రహాలు తీసుకుపోవడం చూస్తుంటే పాలకులు దేని మీద దాడి చేస్తున్నారో ఆలోచించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో రహదారుల అధ్వాన్న పరిస్థితిపై ప్రజల నుంచి ఉవ్వెత్తున నిరసన రావడంతో దాని నుంచి తప్పించుకోవడానికి మేకపోతు గాంభీర్యంతో ఎయిర్ పోర్టులు, పోర్టులను అభివృద్ధి చేస్తున్నాం అంటూ సమీక్షలో కలిపారు తప్ప ఇంకేం లేదని పవన్ విమర్శించారు. జనసేన పిలుపు మేరకు లక్షల మంది స్పందించి రోడ్ల దుస్థితిని తెలిపారన్నారు. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య దెబ్బ తిన్న రహదారులు. ఆ సమస్య గురించే మాట్లాడాలన్నారు. ‘సొంతిల్లు చిమ్ముకోవడానికి చీపురు లేదుగానీ పక్కిళ్లు చిమ్మేస్తాం.. కల్లాపు చల్లేస్తాం.. ముత్యాల ముగ్గులు పెట్టేస్తాం’ అనే చందంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఉందని జనసేనాని సెటైర్లు వేశారు.రోడ్ల దుస్థితిపై చేస్తున్న సమీక్షలో వీటిని దూర్చడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పవన్ కల్యాణ్ మంగళవారం ఢిల్లీ వెళ్లారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానం మేరకు పవన్ హస్తిన చేరుకున్నారు. ప్రహ్లాద్ జోషితో భేటీ అనంతరం, బీజేపీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. పవన్ కల్యాణ్ బీజేపీ పెద్దలతో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. 

ఆలయ భూములకు దేవుడే యజమాని.. పూజారులకు హక్కు లేదన్న సుప్రీంకోర్టు

ఆలయ భూములకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. గుడికి ఇచ్చిన భూములకు దేవుడే యజమాని అని, పూజారికి ఎలాంటి యాజమాన్య హక్కులు ఉండబోవని  స్పష్టం చేసింది.రెవెన్యూ రికార్డుల్లో పూజారులు పేర్లు రాయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు  తేల్చి చెప్పింది. పూజారులు కేవలం దేవుడి ఆస్తులను అన్యాక్రాంతం కాకుండా చూసే సంరక్షకులు మాత్రమేనని తెలిపింది. దేవుడి భూములపై పర్యవేక్షణ హక్కులు ఉన్నంత మాత్రాన వారు భూస్వాములు కాలేరని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.  మధ్యప్రదేశ్‌ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం వేసిన ఓ పిటిషన్‌ విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ఆలయాల ఆస్తులను పూజారులు అనధికారికంగా విక్రయించకుండా ఉండేలా మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఆ మధ్య చర్యలు చేపట్టింది. ఆలయ భూములకు సంబంధించిన రెవెన్యూ రికార్డుల నుంచి పూజారుల పేర్లు తొలగించాలంటూ రెండు సర్క్యులర్లు జారీ చేసింది. అయితే దీనిపై కొందరు హైకోర్టుకు వెళ్లగా.. ఈ ఆదేశాలను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ హేమంత్‌ గుప్తా, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్నలతో కూడిన ధర్మాసనం.. ఆలయ భూములకు దేవుడే యజమాని అని స్పష్టం చేసింది.  ‘‘ఆలయ భూములకు సంబంధించిన రికార్డుల్లో ఓనర్‌షిప్‌ కాలమ్‌ వద్ద కేవలం దేవుడి పేరు మాత్రమే ఉండాలి. అనుభవదారు అనే కాలమ్‌లోనూ దేవుడే పేరే ఉండాలి. ఎందుకంటే ఆ భూములకు దేవుడే యజమాని. పూజారి కేవలం దేవుడి ఆస్తులను నిర్వహిస్తాడు. అందువల్ల పూజారుల పేర్లు అక్కడ రాయాల్సిన అవసరం లేదు. చట్టప్రకారం.. పూజారి అంటే వ్యవసాయంలో కౌలుదారుడు కాదు. దేవుడికి పూజలు చేసే వ్యక్తి. అయితే దేవస్థానం తరఫున ఆ భూమిని కలిగి ఉంటాడు. దేవుడి ఆస్తులను పరిరక్షిస్తుంటాడు. అంతమాత్రాన అతడు భూస్వామి కాలేడు’’ అని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.