ఫ్యాన్ కు ఓటేసిన వాళ్లే ఫ్యాన్ కు ఉరేసుకుంటున్నారు! 

జాబ్ రావాలంటే అన్న రావాలి.. ఇది వైసీపీ ఎన్నికల నినాదం. అది నమ్మి యువకులు వైసీపీకి ఓటేశారు. అన్న అధికారంలోకి వచ్చాడు. కాని రెండున్నర ఏండ్లు అవుతున్నా జాబులు మాత్రం రావడం లేదు. కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్లు జాడే లేకపోగా.. జగనన్న సర్కార్ విధానాలతో ఉన్న ప్రైవేట్ ఉద్యోగాలు పోతున్నాయి. అధికార పార్టీ నేతల బెదిరింపులతో  చాలా పారిశ్రామిక సంస్థలు ఏపీ నుంచి వెళ్లిపోయాయి. కొత్త కంపెనీలు ఏపీకి  రావడం లేదు. దీంతో ఉపాధి లేక లక్షలాది మంది యువతి యువకులు రోడ్డున పడుతున్నారు. కర్నూల్ జిల్లాలో ఉద్యోగం రావడం లేదనే మనస్థాపంతో  ఓ యువకుడు సూసైడ్ చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది.  కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరులో ప్రభుత్వ ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో వీరాంజనేయులు అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎర్రకోట గ్రామానికి చెందిన ఉప్పర ఈశ్వరమ్మ, వీరభద్ర కుమారుడైన వీరాంజనేయులు చదువులో చిన్నప్పటి నుంచి చురుకుగా ఉండేవాడు. ఉపాధ్యాయులంతా సరస్వతీ పుత్రుడని పిలిచేవారు, పదో తరగతిలో మంచి మార్కులతో ట్రిపుల్‌ ఐటీ సీటు సాధించాడు. ఆరేళ్ల ట్రిపుల్‌ ఐటీలోను మంచి మార్కులు సాధించాడు. ఆ తర్వాత ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ గ్రూపు-2కు సన్నద్ధమయ్యాడు. ఉద్యోగం రాలేదు. మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయని ఎదురుచూశాడు. నోటిఫికేషన్లు విడుదల కాకపోవడంతో మనోవేదనకు గురయ్యేవాడు. ఎంత చదివినా ప్రభుత్వ ఉద్యోగం రాలేదని నిరాశ చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకొని తనువు చాలించాడు. కుటుంబ సభ్యులు చూసేలోగా ప్రాణాలు విడిచాడు.  వీరాంజనేయులు చనిపోవడంతో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. చదువుల్లో టాప్ గా నిలిచిన వీరాంజనేయులు చనిపోవడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడం వల్లే వీరాంజనేయులు చనిపోయాడనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనపై స్పందించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఉద్యోగాలు రాక యువ‌కులు ఎన్నో ఇబ్బందులు ప‌డుతున్నార‌ని చెప్పారు. 'వైఎస్ జ‌గ‌న్ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఆత్మహత్యల ప్రదేశ్ గా మారిపోయింది. ఫ్యాన్ కి ఓటేస్తే 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డ యువత ఇప్పుడు అదే ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటోంది' అని లోకేశ్ విమర్శించారు.  'కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట గ్రామానికి చెందిన యువకుడు వీరాంజనేయులు ప్రభుత్వ ఉద్యోగం రాలేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన కలచివేసింది. ట్రిపుల్ ఐటీలో సీటు సాధించి సరస్వతీ పుత్రుడు అనిపించుకున్న యువకుడు జగన్ రెడ్డి మోసానికి బలైపోవడం బాధాకరం' అని లోకేశ్ ట్వీట్ చేశారు.'వీరాంజనేయులు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. ఇంకో యువకుడు ఇలాంటి నిర్ణయం తీసుకోకుండా ప్రభుత్వం తక్షణమే ఫేక్ క్యాలెండర్ రద్దు చేసి 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. యువకులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు.. పోరాడి  ఉద్యోగాలు సాదిద్దాం' అని నారా లోకేశ్ అన్నారు.

టీడీపీ నేత హత్యకు కుట్ర.. నిందితుడికి వైసీపీ స‌పోర్ట్‌!

రెండేళ్లుగా ఏపీ వ్యాప్తంగా టీడీపీ నాయ‌కులు ప్ర‌త్య‌ర్థుల‌కు టార్గెట్‌గా మారుతున్నారు. వ‌రుస దాడుల‌తో తెలుగు త‌మ్ముళ్ల‌ను భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. శ‌త్రువుల దాడుల్లో ప‌లువురు టీడీపీ నేత‌లు బ‌ల‌య్యారు కూడా. చాలా కేసుల్లో అధికార పార్టీ వారే నిందితులు. వారికి పోలీసులు వ‌త్తాసు ప‌లుకుతున్నార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. తాజాగా, గుంటూరులో ఏకంగా టీడీపీ కార్పొరేట‌ర్‌నే హ‌త‌మార్చ‌డానికి కుట్ర చేశాడో క్రిమిన‌ల్‌. ఇది టీడీపీ చేస్తున్న ఆరోప‌ణ కాదు.. స్వ‌యానా పోలీసులే ఆ విష‌యం వెల్ల‌డించారు. అయినా.. నిస్సిగ్గుగా ఆ నేర‌గాడికి వైసీపీ వంత పాడుతోంద‌ని విమ‌ర్శలు వినిపిస్తున్నాయి.  గుంటూరులోని టీడీపీ కార్పొరేటర్ యల్లావుల అశోక్ యాదవ్ హత్యకు కుట్ర పనిన్నట్లు పోలీసులు గుర్తించారు. అశోక్‌ను మట్టుబెట్టేందుకు కన్నెగంటి బాలకృష్ణ పధకం పన్నినట్లు తెలుస్తోంది. గత ఎన్నికలలో అశోక్‌ను ఓడించేందుకు బాలకృష్ణ గ‌ట్టి ప్రయత్నం చేశాడు. అయినా, ప్ర‌జాధార‌ణ‌తో టీడీపీ అభ్య‌ర్థి అశోక్ గెలుపొందారు. అశోక్ ఎదుగుదలను బాలకృష్ణ ఓర్వలేక.. ఏకంగా ఆయ‌న్ను హ‌త‌మార్చేందుకు కుట్ర చేసిన‌ట్టు తెలుస్తోంది.  నిఘా వర్గాల ద్వారా హత్య కుట్రను బ‌హిర్గ‌తం చేశారు గుంటూరు జిల్లా ఎస్పీ. ఆయ‌న ఆదేశాల మేరకు పట్టాభిపురం పోలీసులు బాలకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. కాగా బాలకృష్ణను కాపాడేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.  గతంలో రౌడీ షీటర్ బసవల వాసు హత్య కేసులో బాలకృష్ణపై ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ ఒత్తిళ్లతో బాలకృష్ణను కేసు నుంచి తప్పించారనే ఆరోపణలు వచ్చాయి. అలాగే కాలవ రమణ హత్యకు బాలకృష్ణ పధకం పన్నగా.. అతడిని తప్పించి మరో నలుగురిపై కేసు నమోదు చేశారనే విమ‌ర్శ‌లు ఉన్నాయి. గతంలో ఓ విద్యార్థినికి మత్తు మందు ఇచ్చి నగ్న చిత్రాలు, వీడియోలు తీసిన కేసులోనూ బాలకృష్ణపై ఆరోపణలు ఉన్నాయి. ఇంత నేర చ‌రిత్ర ఉన్న బాల‌కృష్ణ‌కు వైసీపీ నేత‌లు కొమ్ముకాస్తుడ‌టంపై గుంటూరు వాసులు మండిప‌డుతున్నారు.   

కండ్లు పీకేసి 13 నెలల బాలిక హత్య.. హైదరాబాద్ లో మరో కిరాతకం

హైదరాబాద్‌లోని సైదాబాద్‌ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలిక దారుణ హత్య ఘటన మ‌ర‌వ‌క‌ముందే న‌గ‌రంలో మ‌రో కిరాతకం  ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. మియాపూర్‌లో ఆదివారం ఉదయం అదృశ్యమైన 13 నెల‌ల బాలిక మృత‌దేహం ఇంటి స‌మీపంలోని ఖాళీ స్థలంలో  ల‌భ్య‌మైంది. ఆ పాప కళ్లు పొడిచి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 13 నెలల బాలికను అత్యంత కిరాతకంగా చంపేసి అక్కడ పడేసి వెళ్లినట్లు భావిస్తున్నారు.  పాత ఇనుప సామ‌గ్రి, ప్లాస్టిక్ ఏరుకుని అమ్మి జీవిస్తుంటారు ఆ పాప తల్లిదండ్రులు. ఆ బాలిక‌ను పక్కింట్లో వదిలి  ప‌నుల‌కు వెళ్లారు. అయితే తల్లిదండ్రులు తిరిగి ఇంటికి వ‌చ్చే సరికి బాలిక కనిపించలేదు. దీంతో త‌ల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయ‌డంతో కేసు నమోదు చేసుకున్న‌ పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. బాలిక మృతిపై అన్ని కోణాల్లోనూ ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఇంతలోనే ఆ పాప మృత‌దేహం ఇంటి స‌మీపంలో ఖాళీ స్థ‌లంలో క‌న‌ప‌డింది. అయితే బాలిక విషయంలో తల్లిదండ్రులు చెబుతోన్న‌ వివరాల్లో స్పష్టత లేద‌ని పోలీసులు అంటున్నారు. త‌ల్లిదండ్రుల‌ను పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి ప్ర‌శ్నిస్తున్నారు.  ఓ గుర్తు తెలియని 12 ఏళ్ల బాలుడు నిన్న సాయంత్రం త‌మ‌ పాపను తీసుకెళ్లినట్లు త‌ల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు. అనంత‌రం  ఆ బాలుడు కూడా అదృశ్యమైనట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు. బాలిక మృత‌దేహాన్ని గాంధీ ఆసుప‌త్రికి త‌ర‌లించారు.ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం స్పష్టిస్తోంది. సైదాబాద్ ఘటనపై తీవ్ర దుమారం రేగుతున్న సమయంలో మియాపూర్ లోనూ అలాంటి ఘటనే వెలుగు చూడటం పోలీసులను కలవరానికి గురి చేస్తోంది. 

జ‌గ‌న్ ఇలాఖాలో బీభ‌త్సం.. పులివెందుల‌లో రెచ్చిపోయిన దొంగ‌లు..

శాంతిభ‌ద్ర‌త‌ల విష‌యంలో జ‌గ‌న్ స‌ర్కారు అట్ట‌ర్‌ఫ్లాప్ అనే ఆరోప‌ణ‌లు. ఏపీలో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింది. ఏకంగా తాడేప‌ల్లిలో ముఖ్య‌మంత్రి ప్యాలెస్‌కు స‌మీపంలోనే అఘాయిత్యం జ‌రిగితే.. నెల‌లు గ‌డిచినా నిందితుల‌ను ప‌ట్టుకోలేక‌పోయార‌నే విమ‌ర్శ‌లు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేత‌లే టార్గెట్‌గా వ‌రుస దాడులు జ‌రుగుతున్నా.. పాల‌కులు, పోలీసులు కావాల‌నే మౌనంగా ఉంటున్నార‌ని మండిప‌డుతున్నారు. ఇలా ఏపీలో అరాచ‌కం పెరిగిపోవ‌డంతో.. నేర‌గాళ్లు, దోపిడీ దొంగ‌లు రెచ్చిపోతున్నారు. క్రిమిన‌ల్స్‌కు ప్ర‌భుత్వ‌మ‌న్నా.. ఖాకీల‌న్నా భ‌యం లేకుండా పోతోంది. అందుకేనేమో.. ఏకంగా సీఎం జ‌గ‌న్ ఏరియా పులివెందుల‌లో దొంగ‌లు తెగ‌బ‌డ్డారు. ఇది ముఖ్య‌మంత్రి ఇలాఖా.. ఇక్క‌డ దొంగ‌త‌నం చేస్తే పోలీసులు ఊరుకోర‌నే భ‌యం కూడా వారిలో లేనట్టుంది. వైసీపీ పాల‌న‌లో త‌మ‌ను ఎవ‌రూ ఏమీ చేయ‌లేర‌నే ధీమానో.. తెగింపో.. కార‌ణం ఏదైనా.. పులివెందుల‌లో దొంగ‌ల హంగామా మాత్రం జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి అప‌వాదు అంటున్నారు. తాజాగా, పులివెందులలో దొంగలు భీబత్సం సృష్టించారు. పట్టణంలోని భాకరాపురం, బ్రాహ్మణపల్లె రోడ్డు, సాయిబాబగుడి దగ్గర మూడు ప్రాంతాల్లో మూడు ఇళ్ల‌ల్లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. లక్ష్మిదేవి అనే మహిళను తాళ్ల‌తో కట్టేసి.. బంగారు న‌గ‌లతో పాటు ఇంట్లో పార్క్ చేసి ఉన్న బైక్ ఎత్తుకెళ్లారు. మరో  రెండు ఇళ్ల‌లోనూ బైక్‌లను దుండగులు అపహరించారు.  బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దొంగ‌లు స్థానికులా? అంత‌రాష్ట్ర ముఠానా అనే దిశ‌గా ఆరా తీస్తున్నారు పోలీసులు. స‌మీపంలోని సీసీకెమెరా ఫూటేజ్‌ను ప‌రిశీలిస్తున్నారు. ఏదిఏమైనా.. పులివెందుల‌లో దొంగ‌ల బీభ‌త్సం జ‌గ‌న్ స‌ర్కారుకు అవ‌మాన‌క‌ర‌మే అంటున్నారు.    

హైదరాబాద్ ఆగ‌మాగం.. కేసీఆర్ స‌ర్కారు టెన్ష‌న్‌...

ఎంకి పెళ్లి సుబ్బు చావుకొచ్చింది. హైకోర్టు తీర్పు జీహెచ్ఎమ్‌సీ నెత్తిన పిడుగులా ప‌డింది. హుస్సేన్‌సాగ‌ర్‌లో వినాయ‌క నిమ‌జ్జ‌నంపై కోర్టు క‌ఠిన ఆంక్ష‌లు విధించింది. వాటిని పాటించ‌లేక‌.. వేరే ప్ర‌త్యామ్నాయం లేక‌.. ల‌బోదిబోమంటూ మ‌ళ్లీ హైకోర్టునే ఆశ్ర‌యించింది తెలంగాణ స‌ర్కారు. గణేశ్‌ నిమజ్జనంపై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసింది. తీర్పును పునఃపరిశీలించాలంటూ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తీర్పులో ప్రధానంగా 4 అంశాలు తొలగించాలని కోరారు.   హుస్సేన్ సాగర్, ఇతర జలాశయాల్లో పీఓపీ విగ్రహాల నిమజ్జనంపై నిషేధం ఎత్తివేయాలని.. ట్యాంక్ బండ్ వైపు నుంచి నిమజ్జనానికి అనుమతించాలని.. సాగర్‌లో కృత్రిమ రంగులు లేని విగ్రహాలనే అనుమతించాలన్న ఆంక్షలు తొలగించాలని.. హుస్సేన్ సాగర్‌లో రబ్బరు డ్యాం నిర్మించాలన్న ఉత్తర్వులు సవరించాలని పిటిషన్‌లో జీహెచ్‌ఎంసీ కోరింది.   ట్యాంక్ బండ్ వైపు అనుమతించక పోతే.. నిమజ్జనం పూర్తి కావడానికి 6 రోజులు పడుతుందని జీహెచ్‌ఎంసీ పిటిషన్‌లో విన్న‌వించింది. వ్యయ ప్రయాసలతో కూడిన రబ్బరు డ్యాం నిర్మాణానికి కొంత సమయం అవసరమని వివరించింది.  నగరవ్యాప్తంగా మండపాల్లో వేల సంఖ్యలో భారీ విగ్రహాలు ఉన్నాయి..  విగ్రహాల సంఖ్యకు తగినన్ని నీటి కుంటలు లేవని తెలిపింది. పెద్ద విగ్రహాలు నీటి కుంటల్లో నిమజ్జనం చేయడం కష్టమని.. ఇప్పటికే హుస్సేన్ సాగర్ ద‌గ్గ‌ర‌ క్రేన్లు, ఇతర ఏర్పాట్లు చేశామని పిటిష‌న్‌లో చెప్పింది.  ఇప్పటికిప్పుడు ప్రణాళికలు మార్చితే గందరగోళం తలెత్తుతుందని.. నిమజ్జనం తర్వాత 24 గంటల్లో వ్యర్థాలు తొలగిస్తామని కోర్టుకు వెల్లడించింది. విగ్రహాలను ఆపితే నిరసనలు చేపడతామని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి పిలుపునిచ్చిందని జీహెచ్ఎంసీ కోర్టుకు తెలిపింది. హైకోర్టు మినహాయింపులు ఇవ్వకపోతే గందరగోళం తలెత్తి నగరం స్తంభిస్తుందని జీహెచ్ఎమ్‌సీ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.   

హైదరాబాద్ లో టీ హబ్ రెండో దశ సిద్ధం.. వరల్డ్ సెకండ్ టాప్ ఇంకు బేటర్! 

సైబరాబాద్ లో నిర్మించిన అతి పెద్ద ఇంక్యుబేటర్ ‘టీ-హబ్’ భవనం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఐటీ అంకురాలు ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు దేశంలోనే తొలిసారిగా అయిదేళ్ల క్రితం ట్రిబుల్ ఐటీ భవనంలో టీహబ్ ప్రారంభమైంది.  1500కు పైగా అంకురాల స్థాపన ద్వారా రూ.2200 కోట్ల మేరకు పెట్టుబడులను సమీకరించారు. ఈ క్రమంలోనే 350 అంతర్జాతీయ 435 కార్పొరేట్ సంస్థలు టీహబ్ లో భాగస్వామిగా ఉన్నాయి. అంకుర వ్యవస్థతో ప్రత్యక్షంగా 5000మందికి ఉపాధి కలిగింది.  ప్రస్తుతం ఉన్న భవనంలో 60 వేల చదరపు అడుగుల మేరకే స్థలం ఉంది. 85కు పైగా ఆవిష్కరణ కార్యక్రమాలను రూపొందించింది. టీ హబ్ తో  కొత్త అంకురాలతోపాటు ఆవిష్కరణల, పరిశోధనలకు  ఊపు వచ్చింది. వాటికి డిమాండ్ పెరగడంతో భారీ వైశాల్యంతో కొత్త భవనం నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రాయదుర్గం మైండ్ స్పేస్ జంక్షన్ వద్ద మూడు ఎకరాల స్థలం ఇస్తూ.. నిర్మాణానికి రూ.276 కోట్లు కేటాయించింది. మూడేళ్ల క్రితం పనులు ప్రారంభమైనా కరోనా వల్ల గత ఏడాది కొంత మందగించాయి. మొత్తానికి సకల హంగులతో భవనం ప్రారంభానికి సిద్ధమైంది.  త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది. రెండో దశ  టీ హబ్  భవనం పై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘ఆవిష్కరణల జగత్తును సాక్షాత్కారించేలా టీ-హబ్ భవనం అన్ని హంగులతో సిద్ధమైంది. భారత్ లో కెల్లా పెద్దది అని తేల్చారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్దదైన ఈ ఇంకు బేటర్ భవనం ద్వారా ఆవిష్కరణల వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. 3.5 లక్షల చదరపు అడుగుల నిర్మాణ స్థలంలో 2000 అంకురాలకు ఇది నిలయం కానుందని కేటీఆర్ ట్విట్టర్ లో ఆశాభావం వ్యక్తం చేశారు. 

ప్రియాంక సారధ్యంలో హస్త రేఖలు మారేనా?

దేశం మొత్తంలో అత్యధిక (80) లోక్ సభ స్థానాలున్న రాష్ట్రం ఉత్తర ప్రదేశ్. అంతే కాదు  దేశానికి నెహ్రూ నుంచి మోడీ దాకా ఎనిమిది మంది ప్రధానులను అందించిన రాష్ట్రం ఉత్తర ప్రదేశ్. కాంగ్రెస్ ప్రధానులలో అయితే ఒక పీవీ, ఒక మన్మోహన్ మినహా మిగిలిన వారందరూ యూపీ నుంచే పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. ఒక విధంగా యూపీ కాంగ్రెస్ పార్టీకి పుట్టినిల్లు. అలాగే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాన్ని 1950 నుంచి 1989 వరకు, (మధ్యలో కొద్ది కాలం చరణ్ సింగ్ (లోక్ దళ్) ఇంకొద్ది కాలం జనతా పార్టీ  అధికారంలో ఉన్నా) ఇంచుమించుగా 40 ఏళ్ళపాటు కాంగ్రెస్ పార్టీ పాలించింది. అయితే 1989లో అధికారం కోల్పోయిన తర్వాత గడచిన 32 – 33 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ యూపీలో  మళ్ళీ అధికారంలోకి రాలేక పోయింది.  ఇక ప్రస్తుతానికి వస్తే కలలోకూడా ఉహించి ఉండని దయనీయ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ కొట్టు మిట్టాడుతోంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో  ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. అంతకు ముందు 2014 ఎన్నికల్లోనూ అంతే, రెండే రెండు స్థానాల్లో(అమేథి, రాయిబరేలి),సోనియా, రాహుల్ గాంధీ మాత్రమే గెలిచారు. చివరకు 2019లో రాహుల్ కూడా ఓడి పోయారు. పుట్టింట కాంగ్రెస్ ఒకే ఒక్క స్థానికి పడిపోయింది. ఓట్ల శాతం చూసుకుంటే ఆరు శాతానికి కొంచెం అటూ ఇటుగా ఉంటుంది. ఇక అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే  2017 ఎన్నికలలో 403 స్థానాలున్న అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి దక్కింది కేవలం 7 సీట్లు, 5.38 శాతం ఓట్లు మాత్రమే. అందుకే యూపీలో కాంగ్రెస్ కథ కంచికి చేరినట్లేనన్న అభిప్రాయం బలపడింది. అందులోనూ వచ్చే సంవత్సరం (2022) లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు ఏవీ కాంగ్రెస్ తో పొత్తుకు సిద్దంగా లేవు. ఆ కారణంగా, అనివార్యంగా మరో దరి లేక కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీచేస్తోంది.  ఇలాంట పరిస్థితిలో కాంగ్రెస్ హస్త రేఖలు మారిపోయి, కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవ స్థితి వచ్చేస్తుందని ఆశించడం అత్యాశే అవుతుంది.అయితే, రాజకీయాలలో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చును. ప్రస్తుతం 303 స్థానాల సొంతబలంతో  కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి  ఒకప్పుడు రెండే లోక్ సభ స్థానాలున్న విషయాన్నీ మరిచి పోరాదు. అలాగే, సూది మొనంత చోటులేని అస్సాం, త్రిపుర, మేఘాలయ తదితర ఈశాన్య రాష్ట్రాలలో ఐదేళ్లలోనే బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ విషయాన్నే తీసుకున్నా, 2012 ఎన్నికల్లో బీజేపే బలం రెండంకెల సంఖ్య (47) దగ్గరే ఆగిపోయింది. అదే  2017 నాటికి ఏకంగా 312కు ఎగబాకింది. సమాజవాదీ పార్టీ బలం 224 నుంచి 47కు దిగివచ్చింది. సో .. రాజకీయాలలో ఏదైనా జరగవచ్చును. ఓడలు బండ్లు బండ్లు ఓడలు కావడం ఎవరూ కాదనలేని వాస్తవం. కళ్ళ ముందున్న చరిత్ర.  యూపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రియాంకా వాద్రా నడుం బిగించారు. అయితే ప్రియాంక ఆశిస్తున్న విధంగా యూపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవ స్థితి వస్తుందా అంటే ఇప్పటికిప్పుడు రాక పోవచ్చును, కానీ, ప్రయత్నించడంలో తప్పులేదు, నిజానికి అవసరం కూడా, అంటున్నారు రాజకీయ పరిశీలకులు. యూపీలో కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించేందుకు ప్రియాంకా వాద్రా సారధ్యంలో ఈ నెల (సెప్టెంబర్) 20వ తేదీ నుంచి, ప్రతిజ్ఞా యాత్ర పేరిట 12000 కిలో మీటర్ల భారీ యాత్రకు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుడుతోంది. ఈ యాత్రలో కాంగ్రెస్ నాయకులు ప్రతి గ్రామాన్ని పలకరిస్తారు. ప్రతి ఇంటి తలుపు తడతారని, ఆ విధంగా యాత్రను రుపొందించామని కాంగ్రెస్ నాయకులూ చెపుతున్నారు.  అలాగే గతంలో ఇతరేతర కారణాల వలన పార్టీని వదిలిపోయిన నాయకులు, క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ కాంగ్రెస్ నాయకులను కలిసి, తిరిగి పార్టీలోకి ఆహ్వానించాలని ప్రియాంక సూచించారని, అవసరం అయితే తానే, స్వయంగా మాజీల ఇళ్ళకు వెళ్లేందుకు, వారిని పార్టీలోకి ఆహ్వానించేందుకు సిద్దంగా ఉన్నట్లు చెప్పారని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే, ఒక్క సారిగా అద్భుతాలు జరుగుతాయని కాదు కానీ, ప్రియాంక ఈరోజు వేస్తున్న అడుగు, రేపు యూపీలోనే కాదు దేశంలోనూ పార్టీకి పూర్వవైభవం తెచ్చే తొలి అడుగు కావచ్చును, రాజకీయాలలో ఏదీ అనూహ్యం కాదు, ఏదైనా జరగవచ్చును, కొయ్యాగుర్రం ఎగరావచ్చును..

పటేల్ ఓట్ల కోసం కమల వ్యూహం.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన భూపేంద్రే సీఎం

గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా భూపేంద్ర భాయ్ పటేల్ ఎన్నికయ్యారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన భూపేంద్రకు ముఖ్యమంత్రి పదవి వరిస్తుందని ఎవరూ ఊహించలేదు. భూపేంద్ర పటేల్ పేరును విజయ్ రూపానీ ప్రతిపాదించగా, పార్టీ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. పాటీదార్ కమ్యూనిటీకి చెందిన భూపేంద్ర పటేల్ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఘాట్‌లోడియా నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. లక్షకు పైగా ఓట్ల ఆధిక్యంతో ఆయన విజయం సాధించారు. భూపేంద్ర గతంలో అహ్మదాబాద్‌లోని మెమ్నాగర్ మున్సిపాలిటీ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, అహ్మదాబాద్ అర్బన్ డవలప్‌మెంట్ అథారిటీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు.  గుజరాత్ లో ప్రస్తుతం బీజేపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుందనే ప్రచారం జరుగుతోంది. దీంతో వచ్చే శాసనసభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా  ముఖ్యమంత్రి మార్పు చేపట్టిందని అంటున్నారు. సీఎం పీఠాన్ని పటేల్ సామాజికవర్గానికి ఇవ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయించడంతో అనూహ్యంగా భూపేంద్ర పటేల్ పేరు తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో కీలకంగా ఉన్న పాటీదార్ (పటేల్) సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవడం కోసమే బీజేపీ ఈ వ్యూహానికి తెరతీసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గుజరాత్ లో పటేళ్లు బలమైన సామాజిక వర్గంగా కొనసాగుతున్నారు. రాష్ట్ర జనాభాలో దాదాపు 14 శాతం వీళ్లే. సుమారు 1.5 నుంచి 2 కోట్ల వరకు పాటిదార్ల జనభా ఉంటుందని అంచనా. రాష్ట్రంలోని మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు గాను 70కి పైగా స్థానాల్లో పటేళ్లు ప్రభావం చూపగలరు. పాటిదార్ల మద్దతుతోనే బీజేపీ రెండు దశాబ్దాలుగా గుజరాత్ లో అధికారంలో కొనసాగుతోంది.  2015లో రిజర్వేషన్ల కోటా కోసం పటేళ్లు ఆందోళన చేశారు. ఓబీసీల్లో కలిపి రిజర్వేషన్లు ఇవ్వాలనే డిమాండ్ తో  పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి పేరుతో యువ నాయకుడు హార్దిక్ పటేల్ నాయకత్వంలో ఆందోళన జరిగింది. 5 లక్షల మందికి పైగా పటేల్ వర్గం ప్రజలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హార్దిక్ ను అరెస్టు చేయడంతో గుజరాత్ అట్టుడికిపోయింది. పటేల్ డిమాండ్ కు తలొగ్గిన ప్రభుత్వం పూర్తిస్థాయిలో దాన్ని తీర్చలేనప్పటికీ పాటిదార్ సహా ఉన్నల కులాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్ ప్రకటించింది. ఈ ఆందోళన ప్రభావం 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీపై గట్టిగానే పడింది. 99 సీట్లు మాత్రమే గెలిచింది. గుజరాత్ చరిత్రలో ఆ పార్టీ సాధించిన అతి తక్కువ సీట్లు ఇవే. 2012 ఎన్నికల్లో 115 స్థానాల్లో గెలిచింది బీజేపీ. హార్దిక్ పటేల్ ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు. ఆయనకు యువత ఆదరణ ఉంది. దళిత నేత జిగ్నేశ్ మేవానీ కూడా కాంగ్రెస్ కు అండగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో గట్టెక్కాలంటే పటేల్ వర్గం మద్దతు అవసరమని బీజేపీ గుర్తించింది. విజయ్ రూపానీ జైన్ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో పాటిదార్లు ఆయన సీఎం కావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారని తెలిసింది. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగిన బీజేపీ విజయ్ రూపానీని మార్చి.. భూపేంద్ర భాయ్ పటేల్ ను ముఖ్యమంత్రిగా నియమించింది. 2019 లోక్సభ ఎన్నికలకు ముందు గుజరాత్ మంత్రివర్గంలో ఆరుగురు పాటిదార్ నాయకులకు చోటు కల్పించింది. ఇటీవల కేంద్ర మంత్రివర్గ విస్తరణలోనూ గుజరాత్ కు అధిక ప్రాధాన్యం దక్కింది. పటేల్ వర్గానికి చెందిన మన్సుఖ్ మాండవీయక ఆరోగ్య శాఖ బాధ్యతలు అప్పజెప్పడంతో పాటు మరో నేత పురుషోత్తం రూపాలాను మంత్రివర్గంలోకి తీసుకుంది. రాష్ట్రంలో కరోనా కట్టడిలో వైఫల్యం జనాకర్షణ లేదనే కారణాలతో విజయ్ రూపానిని గద్దె దించినట్లు చెబుతున్నప్పటికీ.. వెనక దాగి ఉన్న వ్యూహం మాత్రం పటేల్ వర్గానికి చేరువ కావడమేనని తెలుస్తోంది.  

రోడ్ల‌కు డ‌బ్బుల్లేవ్‌.. సీఎం జ‌గ‌న్‌కు వైసీపీ ఎమ్మెల్యే షాక్‌..

ఏపీలో ఎవ‌రిన‌డిగినా చెబుతారు. ఏ సామాన్యుడిని క‌దిలించినా ఏక‌రువు పెడ‌తారు. రాష్ట్ర ఖ‌జానాను సీఎం జ‌గ‌న్ ఊడ్చేస్తున్నార‌ని. అప్పు చేసి మరీ ప‌ప్పు-బెల్లాలు పంచేస్తున్నార‌ని. ఏపీకి రూపాయి పెట్టుబ‌డి కూడా రావ‌ట్లేదు. మ‌ద్యం మిన‌హా మ‌రే ఆదాయ‌మూ లేదు. అందుకే, ఏకంగా మ‌ద్యం రాబ‌డిని ష్యూరిటీగా పెట్టి.. భారీగా అప్పు చేస్తోంది జ‌గ‌న్ ప్ర‌భుత్వం. అయినా, ద‌మ్మిడి రాక లేక‌.. ఉద్యోగుల‌కు స‌మ‌యానికి జీతాలు కూడా ఇవ్వ‌లేని దుస్థితి. ఆ ఫ‌లిత‌మే సంక్షేమ ప‌థ‌కాల‌కు కోత పెట్టే ప్ర‌య‌త్నం. ఎడాపెడా రూల్స్ పెట్టేసి.. పెన్ష‌న్ల‌నూ కోతేస్తోంది వైసీపీ స‌ర్కారు. వ‌చ్చింది.. తెచ్చింది.. అంతా న‌వ‌ర‌త్నాల‌కే స‌రిపోక‌పోవ‌డంతో.. ఆ న‌వ‌ర‌త్నాలు కాస్తా న‌వ‌రంధ్రాలుగా మారి.. ర‌త్నాలు రాలిపోయే ప‌రిస్థితి వ‌చ్చిందంటూ వైసీపీ ఎంపీ ర‌ఘురామలాంటి వారు విమ‌ర్శిస్తున్నారు. తాజాగా, ఎంపీ బాట‌లోనే మ‌రో వైసీపీ ఎమ్మెల్యే సైతం త‌మ ప్ర‌భుత్వం ద‌గ్గ‌రున్న డ‌బ్బుల‌న్నీ పంచ‌డానికే స‌రిపోతున్నాయంటూ సంచ‌ల‌న కామెంట్లు చేశారు.  ఏపీలో రోడ్ల దుస్థితి దారుణంగా ఉంది. గ‌జానికో గుంత‌తో ప్ర‌జ‌లు న‌ర‌కం చూస్తున్నారు. అధ్వాహ్న‌పు రోడ్ల‌పై ప్ర‌తిప‌క్షాలు పెద్ద ఎత్తున ఉద్య‌మాలు చేస్తున్నాయి. సీఎం జ‌గ‌న్ సైతం స్వ‌యంగా రోడ్ల దుస్థితిపై స‌మీక్ష నిర్వ‌హించినా.. వాటిని బాగు చేద్దామంటే ఖ‌జానాలో పైసా కూడా లేక‌పాయే. అందుకే, స‌మీక్ష‌తోనే స‌రిపెట్టేసి.. రోడ్లు వేసే ప‌నిని ప‌క్క‌న‌పెట్టేసింది ప్ర‌భుత్వం. తాజాగా, య‌ల‌మంచ‌లి నియోజకవర్గం‌లో రోడ్ల పరిస్థితి బాగోలేదని, రోడ్లు వేయించాలని ఓ వ్యక్తి స్వయంగా ఎమ్మెల్యేకు ఫోన్ చేశారు. అత‌నికి వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబురాజు ఇచ్చిన స‌మాధానం విని అంతా షాక్‌. ఆ ఫోన్ ఆడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇంత‌కీ ఎమ్మెల్యే క‌న్నబాబు ఏమ‌న్నారంటే.... ‘‘అన్ని డబ్బులన్ని పంచడానికే సరిపోతున్నాయి. రోడ్లు వేయడానికి డబ్బుల్లేవు. అయినా అన్నీ వేయించడానికి దేవుడ్నా’’ అంటూ ఫోన్ చేసిన వ్య‌క్తికే ఎదురు ప్రశ్న వేశారు ఎమ్మెల్యే. స్వ‌యంగా వైసీపీ ఎమ్మెల్యేనే డ‌బ్బుల‌న్నీ పంచడానికే స‌రిపోతున్నాయ‌ని.. రోడ్లు వేయ‌డానికి డబ్బుల్లేవ‌ని చెప్ప‌డం.. అయినా అన్నీ వేయించ‌డానికి తానేమైనా దేవుడినా అంటూ ఎదురు ప్ర‌శ్నించ‌డంతో ఎమ్మెల్యే క‌న్న‌బాబురాజుపై సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్‌లో సెటైర్లు ప‌డుతున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే ఈ విధంగా మాట్లాడటం.. ఏపీ ప్రభుత్వ ఆర్థిక దుస్థితికి నిద‌ర్శ‌నం అంటున్నారు.   

అనంత‌లో జేసీ ముస‌లం.. టీడీపీలో ర‌చ్చ రంభోలా..

జేసీ ఫ్యామిలీ. అనంత‌లో బ‌ల‌మైన రాజ‌కీయ కుటుంబం. జేసీ బ్ర‌ద‌ర్స్ ఏ పార్టీలో ఉన్నా వారిదే హ‌వా. అయితే, మిగ‌తా నాయ‌కుల‌ను క‌లుపుకొని పోర‌నే విమ‌ర్శ వారిపై ఉంది. త‌మ సొంతంగా రాజకీయం చేస్తార‌ని.. పార్టీని పెద్ద‌గా ప‌ట్టించుకోరంటారు. ప్ర‌త్య‌ర్థి పార్టీ నేత‌ల‌ను ఎదుర్కొంటూనే.. సొంత పార్టీతోనూ స‌ఖ్య‌తగా ఉండ‌క‌పోవ‌డం వారి నైజం. ఏకంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబుపైనే సెటైర్లు వేసేంత చొర‌వ జేసీ దివాక‌ర్‌రెడ్డిది. ఇక ఆయ‌న త‌మ్ముడు జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి జిల్లా పాలిటిక్స్‌లో త‌న‌దైన స్టైల్‌లో దూసుకుపోతుంటారు. ఇటీవ‌ల జ‌రిగిన మున్సిప‌ల్ ఎల‌క్ష‌న్ల‌లో ఏపీవ్యాప్తంగా ఫ్యాను గాలి వీచినా.. తాడిప‌త్రి గ‌డ్డ‌పై మాత్రం టీడీపీ జెండా ఎగ‌రేసిన స‌త్తా ఆయ‌న‌ది. అలాంటి స్ట్రాంగ్ లీడ‌ర్ జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి.. ఇటీవ‌ల సొంత‌పార్టీ నేత‌లే టార్గెట్‌గా విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆ సౌండ్‌కు ఇప్పుడు అదే స్థాయిలో రీసౌండ్ వ‌స్తోంది. అనంత టీడీపీ నేత‌లు వ‌రుస‌బెట్టి జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి వ్యాఖ్య‌ల‌పై విరుచుకుప‌డుతున్నారు. అనంత‌ టీడీపీలో ముదురుతున్న ఈ ముస‌లం ఎక్క‌డికి దారి తీస్తుందోన‌నే టెన్ష‌న్ పార్టీ వ‌ర్గాల‌ను వేధిస్తోంది. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.... ‘టీడీపీకి చెందిన ఏ ఒక్క నాయకుడూ కార్యకర్తలను పట్టించుకోవడం లేదు. చంద్రబాబుగారూ ఇకనైనా మేల్కోండి’’ అని జేసీ ప్రభాకర్‌‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు టీడీపీలో కలకలం రేపాయి. రాయలసీమ ప్రాజెక్టుల భవిష్యత్తుపై అనంతపురంలో మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు అధ్యక్షతన సీమ టీడీపీ ముఖ్య నేతల సదస్సు జరిగింది. ఈ సదస్సులో జేసీ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘కార్యకర్తలకు అన్యాయం జరుగుతోంది. వారిని లోపలేస్తుంటే ఎవరు అండగా నిలబడ్డారో చెప్పాలి. ఆ ఇద్దరు నేతల కనుసన్నల్లోనే వ్యవహారం నడుస్తోంది. వారితోనే పార్టీకి నష్టం వాటిల్లుతోంది’’ అంటూ కాల్వ శ్రీనివాసులు, ప‌ల్లె ర‌ఘునాథ్‌రెడ్డి టార్గెట్‌గా కాంట్ర‌వ‌ర్సీ స్టేట్‌మెంట్స్ చేశారు జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి. ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై టీడీపీ నేత‌లు సైతం అదే రేంజ్‌లో కౌంట‌ర్ ఇవ్వ‌డంతో పొలిటిక‌ల్ హీట్ పెరిగింది.  తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి తన పట్ల తీవ్రమైన వ్యక్తిగత ఆరోపణలు చేశారని మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన డ్రెస్సింగ్ గురించి హేళనగా మాట్లాడారని మండిపడ్డారు. ‘‘మాకు కార్యకర్తలే ధైవం.. తాడిపత్రిలో కూర్చుని అదే రాజ్యం అనుకుంటున్నావ్? 2015 ముందు వరకు ఎంత మంది టీడీపీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయాయి. అప్పుడు కార్యకర్తలు గుర్తుకు రాలేదా? ఒకసారి జగన్మోహన్ రెడ్డి మరోసారి రాజశేఖర్ రెడ్డిని పొగుడుతావ్. టీడీపీ కార్యకర్తలను ఇది అవమానించడం కాదా? నోటి దురద..లూజ్ టంగ్ వున్న వాళ్లు రాజకీయాల్లో బాగు పడిన దాఖలాలు లేవు. కాల్వ శ్రీనివాసులు మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. మీరు పార్టీలో ఉన్నప్పుడు కన్నా లేనప్పుడే జిల్లాలో అత్యధిక సీట్లు గెలిచాం. జడ్పీ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాం. పార్టీకి నష్టం కలిగించేలా తోటి నాయకులను హేళన చేసి మాట్లాడడం బాధాకరం. మా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఓట్లు వేస్తే జగన్మోహన్ రెడ్డి వల్ల మున్సిపల్ చైర్మన్ అయ్యానని అన్నావు.. అంటూ జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డిపై మండిప‌డ్డారు ప‌ల్లె ర‌ఘునాథ్‌రెడ్డి.   జేసీ కుటుంబమే టీడీపీకి సమస్య అంటూ సంచ‌ల‌న కామెంట్ చేశారు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి. కాంగ్రెస్ పార్టీలో జేసీ చేసిన దౌర్జన్యాలకు వ్యతిరేకంగా జిల్లాలో పోరాటాలు చేశామని గుర్తు చేశారు. వ్యక్తిగతంగా కార్యకర్తలు లేరని చెప్పడం జేసీ అహంకారానికి నిదర్శనమన్నారు. మాజీమంత్రి కాలువ శ్రీనివాసులు వివాద రహితుడని చెప్పారు.  పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడిన వ్యక్తి కాల్వ శ్రీనివాసులని, అలాంటి వ్యక్తిని ఉద్ధేశించి మాట్లాడటం చాలా బాధాకరమన్నారు మాజీ మంత్రి ప‌రిటాల సునీల‌. 24 గంటలు పార్టీ కోసం పని చేసే వ్యక్తి కాల్వ శ్రీనివాసులన్నారు. ఆ స‌మావేశంలో అనంతపురం జిల్లాకు జరుగుతున్న అన్యాయంపై ప్రభాకర్ రెడ్డి మాట్లాడి ఉంటే బాగుండేదని సూచించారు సునీత‌.   

హరీష్ ఒంటరి పోరాటం వృధా ప్రయాసేనా ? కేటీఆర్ సేఫ్ జోన్ అందుకేనా? 

అర్థమై పోయింది. ఎప్పుడైతే  బ్రహ్మాస్త్రం అనుకున్న దళిత బంధుతోనూ లాభం లేదని తెలిపోయిందో, అప్పుడే ముఖ్యమంత్రి కేసీఆర్ కు హుజూరాబాద్ ఫలితం ఎలా ఉంటుందో అర్థమైపోయింది. అందుకే ఆయన వ్యూహం మార్చారు, హుజూరాబాద్ రాజకీయ రొంపిలోంచి కేటీఆర్ ను సేఫ్ జోన్ లోకి తీసుకొచ్చారు. నిజానికి, ముందు నుంచి కూడా, కీడెంచి మేలంచాలనన్న ‘దూర దృష్టి’తోనే కేసీఆర్ ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. ఓడిపోయినా, ఓటమి ముల్లు కేటీఆర్ కు గుచ్చుకోకుండా, హుజూరాబాద్ బాధ్యతలను హరీష్ కు అప్పగించారని అంటున్నారు. గెలిస్తే పార్టీ గెలుపు, అంటే కేసీఆర్, కేటీఅర్ గెలుపు, ఓడితే హరీష్ రావు ఓటమి. కేటీఅర్ ఇన్ సేఫ్ జోన్. ఆ విధంగా కేసీఆర్ స్కెచ్ గీసుకున్నారు. ఆ ప్రకారంగానే కథ నడిపిస్తున్నారనే చర్చ సాగుతోంది. ఎప్పుడైతే ఓటమి తధ్యమని తెలిపోయిందో, అప్పుడు కేటీఅర్ హుజూరాబాద్ ఉప ఎన్నికను శతకోటి ఉప ఎన్నికల్లో అదొకటి, అన్నట్లుగా హరీష్ రావు ఆరాటం మీద నీళ్ళు చల్లారు. గెల్సితే కేంద్రంలో అధికారం వస్తుందా, ఓడి పోతే  రాష్ట్రంలో అధికారం పోతుందా అంటూ, హుజూరాబాద్ ఉప ఎన్నిక గెలుపు ఓటములతో తనకు సంబంధం లేదని తేల్చేశారు. లైట్ గా తీసుకున్నారు. గెలిచినా ఓడినా ఒకటే అన్నట్లుగా మాట్లాడి, ఆ ఒక్క సీట్లో గెలిచి మామ ముందు కాలర్ ఎగరేద్దామనుకున్న హరీష్ రావు గాలి తీసేశారు. ఒక వేళ రేపు పొరపాటున తెరాస గెలిచినా, హరీష్ కు గండపెండేరాలు తొడిగేది ఏమీ ఉండదని, ముందుగానే కేటీఆర్ తేల్చేశారు. ఇక ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత, అక్కడ ఏమి జరిగిందో ఏమో కానీ, ఉప ఎన్నిక ఇప్పట్లో జరగదు అన్న కారణం చూపించి కేసీఆర్ దళిత బంధుకు బ్రేకులు వేశారు. అంతకు ముందే ఎనిమిది వేలమంది వరకు లబ్దిదారుల బ్యాంకు ఖాతలాలో పదివేలు తక్కువ పదిలక్షల రూపాయలు జమ చేశారు. అయితే,ఆ సొమ్ములు చూసుకోవడానికే కానీ, విత్’డ్రా చేసి తీసుకోవడానికి వీలులేకుడా బ్యాంకులకు సీజ్ ఆర్డర్స్ పాస్ చేశారు. అంతే కాకుండా, కొత్తగా ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్వో) నిబంధన తెచ్చారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక నుంచి ఫోకస్’ను మెల్లమెల్లగా ఇతర అంశాల వైపుకు మరల్చే ప్రయత్నం చేస్తున్నారు. మరో నాలుగు మండలాలలో దళిత బందు అంటూ  కొత్త ఎత్తుకు తెరతీశారు. ఉప ఎన్నికలు ఇప్పట్లో జరగవని తెలియడంతో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారా లేక ఎటూ ఓటమి తప్పదని నిర్ణయానికి వచ్చి, వెనకడుగువేస్తున్నారా అనేది  ప్రశ్నార్ధకంగా మారిందని పార్టీ వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి. కేసీఆర్. కేటీఆర్ తమ చేతికి మట్టి అంటకుండా  హుజూరాబాద్ ఉప ఎన్నిక రొంపిలోంచి బయట పడినా, హరీష్ రావు మాత్రం పద్మవ్యూహంలో అభిమన్యుడిలా చిక్కుకు పోయారని ఆయన అభిమానులే, అయ్యో... హరీష్ అంటున్నారు.  ఇప్పటికే దుబ్బాక ఓటమితో సగం ఇమేజి డ్యామేజి చేసుకున్న హరీష్ రావు.. హుజూరాబాద్ లోనూ ఓడిపోతే, అక్కడితో ఆయన రాజకీయ భవిష్యత్ ముగిసినట్లేనని, పార్టీలోని అయన వర్గం ఆందోళన చెందుతోంది. హుజూరాబాద్’లో హరీష్ రావు కాలికి బలపం కట్టుకుని ఇల్లిల్లు తిరిగి ప్రచారం చేస్తుంటే, హుజూరాబాద్ గెలుపు ఓటములతో సంబంధం లేకుండ , కేటీఆర్  పట్టాభిషేకానికి సిద్దమవుతున్నారని, కేసీఅర్ అన్ని రోజులు ఢిల్లీలో మకాం చేసింది అందుకే అన్న కథనాలు వినిపిస్తున్నాయి. హరీష్ వర్గం ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నంలో ఆ ఇద్దరూ ఉన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అందుకే  హరీష్ ఢిల్లీకి రాకుండా చేసారని కూడా పార్టీ వర్గాల్లో వినవస్తోంది.   కొంచెం ఆలస్యంగానే అయినా, హరీష్ రావు వర్గం తమ నాయకుడు తనకు తెలియకుండానే కేసీఆర్ విసిరిన పద్మవ్యూహంలో చిక్కుకుపోయారని అంటున్నారు. ఆయన తీరు చూస్తే.ఆయన స్థాయిని ఆయనే తగ్గించుకుంటున్నారని అంటున్నారు. ఇటు కార్యకర్తల్లో, అటు సామాన్య ప్రజల్లో చులకన అవుతున్నారని అంటున్నారు. అయితే, హరీష్’ను తక్కువగా అంచనా వేయలేమని అయన వ్యూహం ఆయనకు ఉండే ఉంటుందని అనేవాళ్ళు లేక పోలేదు. ఈ నేపధ్యంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చి వేస్తోందని, అయితే కొత్త చిత్రంలో హరీష్ బొమ్మ ఉంటుందా, లేక  ఢిల్లీ  భూమి పూజ ఫోటోలో లా మిస్ అవుతుందా చూడాలని పరిశీలకులు భావిస్తున్నారు. 

ఉద్యోగాలు ఇవ్వం.. మాంసం అమ్మండి! జగనన్న కొత్త స్కీమ్ ఇదేనా..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాంసం దుకాణాల ఏర్పాటు ప్రతిపాదన వివాదాస్పమవుతోంది. జగన్ రెడ్డి సర్కార్ నిర్ణయంపై విపక్షాలు మండిపడుతున్నాయి. పిచ్చి తుగ్లక్ లా నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మాంసం దుకాణాల కాన్సెప్ట్ పై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. జగనన్న మటన్ షాపులంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు.  ఉపాధ్యాయులతో మద్యం అమ్మించిన సీఎం జగన్మోహన్ రెడ్డి, తాజాగా నిరుద్యోగులతో మాంసం అమ్మించబోతున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బుద్దా వెంకన్న విమర్శించారు. డిగ్రీలు, పీజీలు చదివిన వారికి, తగిన ఉద్యోగాలు ఇవ్వలేని అసమర్థ ముఖ్యమంత్రి.. చివరకు వారికి మాంసం కొట్లలో కొలువులివ్వడానికి సిద్ధమయ్యారని ఆరోపించారు. మాంసం, చేపలు, రొయ్యలు అమ్మే బడుగు, బలహీనవర్గాల కడుపు కొట్టడానికే ముఖ్యమంత్రి ఈ కొత్త పథకానికి శ్రీకారం చుట్టారని విమర్శించారు. గతంలో ఇసుక అమ్మకాల పేరుతో 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేశారని, ఇప్పుడు మాంసం విక్రయాల పేరుతో లక్షల మందికి తిండిలేకుండా చేయబోతున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాంసం అమ్మడం మొదలెడితే, చెప్పిన ధరకే వినియోగదారుడు కొనాలని, లేకపోతే బెదిరించైనా మాంసాన్ని ప్రజలకు అంటగడతారని బుద్దా వెంకన్న అన్నారు. విజయసాయిరెడ్డి సలహాతోనే ముఖ్యమంత్రి మటన్ మార్టుల ఏర్పాటుకు సిద్ధమయ్యారనిపిస్తోందన్నారు. సీఎం, విజయసాయిరెడ్డిల ఆలోచనలన్నీ అంతిమంగా వారి ఖజానా నిండటానికే పనికొస్తాయి తప్ప, ప్రజలకు మేలుచేయవన్నారు. మాంసం అమ్మకాలు చేపట్టాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే బడుగు, బలహీనవర్గాల వారితో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతామని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం మొబైల్ మాంసం దుకాణాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఎక్కడైనా మటన్ అమ్ముకునే విధంగా వ్యాన్లను సిద్దం చేస్తుంది. ఇందులోనే మేకలను గొర్రెలను విక్రయిస్తారు. ఆరోగ్యకరమైన మేక, గొర్రె మాంసం, తలకాయ, కాళ్ళు, బోటీవి అందుబాటు ధరల్లో అందించేందుకు ప్రభుత్వం  ఏర్పాట్లు చేస్తుంది. ఏపీ మీట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో యూనిట్‌ రూ.10 లక్షల అంచనా వ్యయంతో తొలిదశలో మహానగరాలు, నగరాలు, పట్టణ ప్రాంతాల్లో 112 యూనిట్లు ఏర్పాటు కానున్నాయి. అయితే ప్రభుత్వ నిర్ణయంలో వేలాది మంది మటన్ విక్రేతలు రోడ్డున పడే అవకాశం ఉందనే విమర్శలు వస్తున్నాయి. ఉపాధి ఎలాగూ కల్పించలేకపోతున్నాం.. ఏదో ఉపాధి చూసుకుంటూ జివిస్తున్న కుటుంబాల పొట్ట కొట్టడం ఎందుకనే వాదన వస్తోంది. 

చనిపోయిన వ్యక్తికి వ్యాక్సిన్‌!.. అస‌లేం జ‌రిగిందంటే...

ఏపీలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్ర‌హ‌స‌నంగా సాగుతోంది. టీకా కేంద్రాల ద‌గ్గ‌ర భారీగా తోపులాట‌లు చూశాం. తాజాగా, అధికారుల నిర్ల‌క్ష్యంతో చిత్ర విచిత్ర సంఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయి. అనంత‌పురం జిల్లాలో ఒకే కుటుంబంలో జ‌రిగిన రెండు ఘ‌ట‌న‌లు వైద్య సిబ్బంది నిర్వాకానికి నిద‌ర్శ‌నంగా నిలుస్తున్నాయి. రెండు డోసుల టీకా వేసుకున్నా.. మొద‌టి డోసు వేసుకున్న‌ట్టు మెసేజ్ రావ‌డం ఒక‌టైతే.. ఏకంగా చ‌నిపోయిన వ్య‌క్తి పేరు మీద వ్యాక్సిన్ వేసుకున్న‌ట్టు స‌మాచారం రావ‌డం మ‌రింత షాకింగ్ న్యూస్‌. అనంత నగరానికి చెందిన ఓ వ్యక్తి మూడేళ్ల నుంచి హిందూపురంలో ఉంటున్నారు. అనారోగ్యంతో జులైలో చనిపోయారు. అయితే శనివారం ఉదయం ఆయనకు రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తయినట్లు అత‌ని కుమారుడి మొబైల్‌కి మెసేజ్ వ‌చ్చింది. అంతే. అంతా షాక్‌. త‌న తండ్రి చ‌నిపోయి రెండు నెల‌లు అవుతోంది.. ఇప్పుడు ఆయ‌న వ్యాక్సిన్ వేసుకున్న‌ట్టు మెసేజ్ రావ‌డ‌మేంట‌ని కుటుంబ స‌భ్యులంతా అవాక్క‌య్యారు. చుట్టుప‌క్క‌ల వారికి విష‌యం తెలిసి అంతా ఆ చోద్యంపై చ‌ర్చించుకుంటున్నారు. అయితే.. ఆ షాక్ నుంచి తేరుకోక‌ముందే మ‌రో ఝ‌ల‌క్ త‌గిలింది అదే ఫ్యామిలీకి. అదే కుటుంబంలో మరో యువకుడు గతంలోనే రెండు డోసులు టీకా వేయించుకున్నాడు. అయితే, లేటెస్ట్‌గా అత‌నికి మొదటి డోస్‌ పూర్తి చేసుకున్నట్టు మెసేజ్ వచ్చింది. మ‌రోసారి క‌న్ఫ్యూజ‌న్‌లో ప‌డిపోయింది ఆ కుటుంబం. ఇలా, ఒకేరోజు.. ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్ద‌రు వ్య‌క్తుల గురించి ఇలా తప్పుడు టీకా సందేశాలు రావడం.. స్థానికంగా ఆస‌క్తిక‌రంగా మారింది.  ఏపీలో కొవిడ్ టీకాల వ్య‌వ‌హారం మొద‌టి నుంచి విమ‌ర్శ‌ల పాలవుతూనే ఉంది. సిబ్బంది నిర్ల‌క్ష్యం వ‌ల్లే ఇలా జ‌రుగుతోంద‌ని ప్ర‌జ‌లు ఆరోపిస్తుంటే.. సాఫ్ట్‌వేర్ ప్రాబ్ల‌మ్ అంటూ స‌రిపెడుతున్నారు స్టాఫ్‌. పాల‌కులు, ఉన్న‌తాధికారుల నుంచి స‌రైన ప‌ర్య‌వేక్ష‌ణ లేక‌పోవ‌డం వ‌ల్లే ఇలాంటి అడ్డ‌దిడ్డ‌మైన మెసేజ్‌లు వ‌స్తున్నాయ‌ని మండిప‌డుతున్నారు.  ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల వారీగా టీకాలు వేస్తున్నారు. ఈ బాధ్యతను వైద్యఆరోగ్య సిబ్బందితోపాటు ఏఎన్‌ఎంలకు అప్పగించారు. పర్యవేక్షణ బాధ్యత మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలకు అప్పగించారు. కొంతమంది సిబ్బంది లక్ష్యాన్ని చేరుకోవడానికి అడ్డదారులు తొక్కుతున్నారు. ఆయా గ్రామాల్లోని ఆధార్‌కార్డులు, ఫోన్‌నెంబర్లు సేకరించి టీకాలు వేయకుండానే వేసినట్లు నమోదు చేస్తున్నారు. సమాచారాన్ని ఎప్పటికప్పుడు కొవిన్‌ యాప్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. అందుకే, జిల్లాలో చాలామంది రెండో డోసు వేసుకోకుండానే వేసుకున్నట్లు సమాచారం వస్తోంది. దీనిపై వందల్లో ఫిర్యాదులు వస్తున్నా సాంకేతిక లోపం అని చెప్పి ఉన్నతాధికారులు తప్పించుకుంటున్నారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్ల టీకాకు దూరమవుతున్నామని బాధితులు మండిప‌డుతున్నారు.

సాయిధ‌ర‌మ్‌తేజ్ కోసం 100, 108కి ఫోన్ చేసింది ఎవ‌రంటే...

ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే స్పందించ‌డం అత్యంత ముఖ్యం. ఆ తొలి నిమిషాలు గోల్డెన్ పిరియ‌డ్. వెంట‌నే ఆసుప‌త్రికి తీసుకెళితే బ‌తికే అవ‌కాశాలు ఎక్కువ ఉంటాయి. ఆల‌స్యం అవుతున్నా కొద్దీ.. అవ‌కాశాలు చేజారిపోతాయి. హీరో సాయిధ‌ర‌మ్‌తేజ్ యాక్సిడెంట్ స‌మ‌యంలో వెంట‌నే స్పందించి.. ఆసుప‌త్రికి చేర్చ‌డం అదృష్ట‌మ‌నే చెప్పాలి. అప్ప‌టికే స్పృహ కోల్పోయిన తేజ్‌కు వెనువెంట‌నే ట్రీట్‌మెంట్ ల‌భించ‌డం చాలా మంచిదైంది. ఓ బాధ్య‌త‌గ‌ల పౌరుడి వ‌ల్లే సాయిధ‌ర‌మ్‌తేజ్‌ను అత్యంత కీల‌క స‌మ‌యంలో.. హాస్పిట‌ల్‌కు చేర్చ‌గ‌ల‌గ‌డం.. మెరుగైన చికిత్సతో ఆయ‌న స్పృహ‌లోకి రావ‌డం జ‌రిగింది. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే డ‌య‌ల్ 100తో పాటు డ‌య‌ల్ 108కి ఫోన్ చేసి.. ద‌గ్గ‌రుండి మ‌రీ ఆసుప‌త్రికి త‌ర‌లించిన ఆ హైద‌రాబాదీ అబ్దుల్‌ను ఇప్పుడు అంతా అభినందిస్తున్నారు. మెగా ఫ్యాన్స్ ఆయ‌న‌కు కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నారు.   బైక్‌పై వెళుతున్న అబ్దుల్ స‌డెన్‌గా షాక్ అయ్యారు. ఆయ‌న ప‌క్క‌నే మ‌రో బైక్ స్కిడ్ అయి ప‌డిపోయింది. ఆ బైక్ రైడ‌ర్ రోడ్డు మీద ప‌ల్టీలు కొట్టాడు. ఆ స‌మ‌యానికి ఆయ‌నెవ‌రో అబ్దుల్‌కు తెలీదు. సెల‌బ్రెటీనా? సామాన్యుడా? అని చూడ‌లేదు. పౌరుడిగా త‌న బాధ్య‌త నెర‌వేర్చాడు. వెంట‌నే డయల్‌ 100కు, ఆ తర్వాత 108 అంబులెన్స్‌కు ఫోన్‌ చేశారు. వారు వ‌చ్చే వ‌ర‌కూ అక్క‌డే ఉన్నారు. క్ష‌త‌గాత్రుడిని ఆసుపత్రికి తరలించడంలో సహాయం చేశారు. హాస్పిట‌ల్‌ వరకూ వెంటే వెళ్లాడు. ఏదైనా ప్ర‌మాదం జ‌రిగితే.. మ‌న‌కెందుకులే.. మ‌రెవ‌రైనా ఫోన్ చేస్తారులే.. పోలీసుల‌తో త‌ల‌నొప్పి ఎందుకు.. ఇలా ప‌లుర‌కాల కార‌ణాల‌తో ప‌ట్టించుకోని జ‌నాలు ఉన్న ఈ రోజుల్లో.. సాయిధ‌ర‌మ్‌తేజ్‌కు యాక్సిడెంట్ జ‌ర‌గ్గానే వెంట‌నే స్పందించిన అబ్దుల్ చొర‌వ ఎంతైనా అభినంద‌నీయం. అమీర్‌పేట ఎల్లారెడ్డిగూడకు చెందిన అబ్దుల్‌.. సీఎంఆర్‌ సంస్థలో వ్యాలెట్‌ పార్కింగ్‌లో ఉద్యోగం చేస్తుంటారు.  ఇక‌, ప్రమాదం జరిగిన ప్రదేశానికి కొద్దిదూరంలో డ్యూటీలో ఉన్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ ఇస్లావత్‌ గోవింద్ సైతం సకాలంలో స్పందించారు. అబ్దుల్ చేసిన కాల్ త‌ర్వాత‌.. డయల్‌ 100 నుంచి ప్రమాదంపై కానిస్టేబుల్ గోవింద్‌కు సమాచారం అందింది. ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ స్థానిక పోలీసులకు సమాచారం అందించారు గోవింద్‌. ఆసుపత్రికి తరలించడంలోనూ హెల్ప్ చేశారు. అబ్దుల్‌.. గోవింద్‌.. వీరిద్దరూ స‌కాలంలో రెస్పాండ్ కావ‌డంతో సాయిధరమ్‌ తేజ్‌ను ఇన్‌టైమ్‌లో ఆసుపత్రికి తరలించగలిగారు. వెంట‌నే చికిత్స అందించి మ‌రింత ప్ర‌మాదం జ‌ర‌గ‌కుండా చూడ‌గ‌లిగారు. అందుకే, అబ్దుల్‌, గోవింద్‌ల‌ను పోలీస్ అధికారులు అభినందిస్తున్నారు.

చ‌లో చ‌లో ట్యాంక్‌బండ్‌.. సండే ఈవెనింగ్ సంద‌డే సంద‌డి... 

ట్యాంక్‌బండ్‌..హైద‌రాబాద్ మ‌ధ్య‌లో కొలువుదీరిన టూరిస్ట్ అట్రాక్ష‌న్‌. ఇన్నాళ్లూ ట్యాంక్‌బండ్ అంటే న‌గ‌రాన్ని క‌లిపే వార‌ధిగానే భావించేవాళ్లు చాలామంది. ఎప్పుడు చూసినా ఆ బండ్‌పై వాహ‌నాల ర‌ణ‌గొణులే. ట్రాఫిక్ ఇక్క‌ట్లే. వేగంగా వెళ్లే వెహికిల్స్‌, బండ్ల పొగ‌తో వ‌చ్చే పొల్యూష‌న్‌, హార‌న్స్‌, రోడ్డు దాటాలంటేనే టెరిఫిక్ సిట్యూయేష‌న్‌. అందుకే, అంద‌మైన ట్యాంక్‌బండ్ ఇన్నేళ్లూ అంద‌రికీ అంద‌కుండా పోయింది. స‌ర్కారుకు ఇప్పుడిప్పుడే జ్ఞానోద‌యం అయిన‌ట్టుంది. ట్యాంక్‌బండ్‌ను సండే ఈవెనింగ్‌.. ప్ర‌జ‌ల కోస‌మే కేటాయించేశారు. సాగర్ తీరాన‌.. సాయంసంధ్య‌వేళ‌లో.. ప్ర‌కృతి ఒడిలో.. న‌గ‌ర‌వాసులు కులాసాగా సేద‌తీరొచ్చు. ఇక‌పై సండే ఈవెనింగ్‌ ట్యాంక్‌బండ్‌పై నో వెహికిల్స్‌.. నో  ట్రాఫిక్‌. అంతేనా.. ఇంకేంలేదా.. అంటే, ఇంకా చాలానే మ‌స్తీ మ‌జా ఉందంటోంది హెచ్ఎండీఏ. ట్యాంక్‌బండ్‌ను సందర్శించే నగరవాసులకు ఇక నుంచి సండే.. ఫన్‌డేగా మారనుంది. ఆదివారం సాయంత్రం 5 నుంచి రాత్రి పది గంటల వరకు నగరవాసుల కోసం సాంస్కృతిక ఉత్సవాన్ని ట్యాంక్‌బండ్‌పై నిర్వహించేందుకు హెచ్‌ఎండీఏ సిద్ధమైంది. పర్యాటకులకు, సందర్శకులకు అనువుగా ఎన్నో సెల్ఫీ స్పాట్‌లను ఏర్పాటు చేసింది.  ట్యాంక్‌బండ్‌ను నగరవాసులకు మరింత చేరువ చేయడానికి సాయంకాలం ట్యాంక్‌బండ్‌పై వాహనాలను అనుమతించ వ‌ద్దని ట్విట్టర్‌లో ఓ వ్యక్తి చేసిన ట్వీట్‌కు కొంతకాలం క్రితం మంత్రి కేటీఆర్‌ స్పందించారు. కేటీఆర్ ఆదేశాల‌తో రెండు వారాలుగా ట్యాంక్‌బండ్‌పై సాయంత్రం 5నుంచి రాత్రి 10గంటల వరకు సందర్శకులను మినహా వాహనాలను అనుమతించడం లేదు. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి వస్తున్న న‌గ‌ర‌వాసులు.. త‌థాగ‌తుని స‌మ‌క్షంలో.. మ‌హ‌నీయుల విగ్ర‌హాల సాక్షిగా.. ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతున్నారు. 2 కిలోమీటర్ల మేర.. ట్యాంక్‌బండ్‌పై పండ‌గ చేసుకుంటున్నారు. అందుకే, సండే ఈవెనింగ్‌.. సంద‌డే సంద‌డి.  సండే ఈవెనింగ్ ట్యాంక్‌బండ్‌పై స్పెష‌ల్ ఎంట‌ర్‌టైన్మెంట్‌... -సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆర్డినెన్స్‌ క్రాప్స్‌ (ఏఓసీ) ఆధ్వర్యంలో బ్యాగ్‌పైపర్‌ బ్యాండ్‌ ప్రదర్శన ఇవ్వనున్నాయి. ట్యాంక్‌బండ్‌ ఆ వైపు నుంచి ఈ వైపు వరకు కలియ తిరుగుతూ బ్యాండ్‌ చప్పుళ్లతో సందర్శకులను ఆకట్టుకోనున్నారు.  - తెలంగాణ సాంస్కృతిక విభాగం సారథ్యంలో పలువురు కళాకారుల ద్వారా ఆట పాటలతో ప్రదర్శనలు - పిల్లలను ఆకట్టుకునే విధంగా మేజిషియన్లు, జోకర్ల ప్రదర్శనలు  - శిల్పారామంలోని హస్తకళాకారులకు చెందిన ఉత్పత్తులను ట్యాంక్‌బండ్‌పై విక్రయించడానికి ప్రత్యేకమైన స్టాల్స్‌ - టాస్కో హ్యాండ్లూమ్‌ ఆధ్వర్యంలో చేనేత ఉత్పత్తులను విక్రయించేందుకు స్టాల్స్‌ - హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ - వివిధ ప్రాంతాల్లో ఆహార ప్రియుల కోసం ప్రత్యేకమైన ఫుడ్‌స్టాల్స్‌ - సందర్శకులను ఆకట్టుకోవడానికి హుస్సేన్‌సాగర్‌లో ప్రత్యేకంగా లేజర్‌షో ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు

10 లక్షలు వేశారు.. ఖాతా ఫ్రీజ్ చేశారు! కేసీఆర్ దళిత బంధు లక్ష్యమేంటో? 

ప‌ళ్లెంలో అన్నం ఉండ‌టం ముఖ్యం కాదు. దానిని నోటికి అందిస్తేనే ఉప‌యోగం. అలా చేస్తేనే క‌డుపు నిండుతుంది. ఆక‌లి మాయ‌మ‌వుతుంది. ఒక సినిమాలో కోడిని తన ఎదురుగా  కట్టేసి పెట్టుకుని..  దాని చూస్తూ తెల్ల అన్నం తింటూనే చికెన్ కర్రీతో తింటున్నట్లుగా ఫీలవుతుంటారు కోట శ్రీనివాస రావు. ఈ సీన్ సినిమాలో సూపర్ డూపర్ హిట్. ఇప్పుడు తెలంగాణలో అమలవుతున్న దళిత బంధు పథకం తీరు కూడా అచ్చం కోట శ్రీనివాస రావు సినిమాలోని సీన్ లానే ఉంది.  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్తగా తీసుకొచ్చిన దళిత బంధు పథకంపై మొదటి నుంచి అనుమానాలు, కొన్ని వర్గాల నుంచి అభ్యంతరాలే ఉన్నాయి. హుజురాబాద్ లో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తుండటంతో .. త్వరలో జరగనున్న ఉపఎన్నిక కోసమే తీసుకొచ్చారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి అందిస్తామని చెబుతోంది. హుజురాబాద్ లో సర్వే కూడా పూర్తైంది. అయితే సర్వేతోనే సరి పుచ్చుతారని, ఎన్నికల వరకు నిధులు ఇవ్వరనే ప్రచారం జరిగింది. విపక్షాల విమర్శలతో 2 వేల కోట్ల నిధులు విడుదల చేసిన ప్రభుత్వం.. అర్హుల ఖాతాలకు మనీ ట్రాన్స్ ఫర్ కూడా చేస్తోంది. సెప్టెంబర్ 10వ తేదీ వరకు దాదాపు 13 వేల కుటుంబాల ఖాతాల్లోకి దళిత బంధు డబ్బులు జమ చేశామని కరీంనగర్ జిల్లా కలెక్టర్ చెప్పారు. మిగితా వాళ్లకు కూడా త్వరలోనే వేస్తామన్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా... ఇక్కడే అసలు కథ కనిపిస్తోంది. దళిత కుటుంబాలకు ఖాతాలకు డబ్బులు జమ చేస్తున్న ప్రభుత్వం. ఆ ఖాతాలపై ఆంక్షలు పెడుతోంది. ద‌ళిత బంధు ప‌థ‌కం కింద ల‌బ్ధిదారుల‌కు నిధులు విడుద‌ల చేశామంటూ కేసీఆర్ ఘ‌నంగానే ప్ర‌క‌టించినా.. ఆ నిధుల‌న్నీ మొన్న‌టిదాకా ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్ల ఖాతాల్లోనే ఉండిపోయాయ‌ట‌. ఇదేంటంని ల‌బ్ధిదారులు నిల‌దీయడం, విపక్షాలు ఆరోపణలు చేయడంతో మొదటికే మోసం వస్తుందని  గ్రహించిన ప్రభుత్వం.. లబ్దిదారుల ఖాతాలకు జమ చేయాలని ఆదేశించింది. దీంతో క‌లెక్ట‌ర్ల నిధుల‌ను ల‌బ్ధిదారుల బ్యాంకు ఖాతాల‌కు విడుద‌ల చేశారు. తమ ఖాతాల్లో 10 లక్షలు జమ అయినట్లు మెసేజ్ లు రావడంతో సంబరాలు చేసుకున్నారు హుజురాబాద్ దళితులు.  అయితే వాళ్ల సంతోషం ఎంతో సేపు నిలవలేదు. త‌మ ఖాతాల్లో జ‌మ అయిన ద‌ళిత బంధు నిధుల‌ను విత్ డ్రా చేసుకునేందుకు బ్యాంకుల‌కు వెళ్లిన ల‌బ్ధిదారుల‌కు షాక్ తగిలింది. జిల్లా క‌లెక్ట‌ర్ ఆదేశాల మేర‌కే మీ బ్యాంకు ఖాతాల‌ను ఫ్రీజ్ చేశామ‌న్న బ్యాంక‌ర్ల స‌మాధానంతో వాళ్లంతా అవాక్కయ్యారు. జిల్లా క‌లెక్ట‌ర్ వ‌ద్ద‌కెళ్లినా అదే పరిస్థితి ఎదురైంది. ‘‘ఈ నిధుల‌తో మీరేం చేస్తారో చెప్పాలి. ఎందుకు వినియోగిస్తారో చెప్పాలి. మీరు చెప్పిన వ్యాపారాలు లాభ‌సాటివి అయి ఉండాలి. అప్పుడే నిధుల విత్ డ్రా సాధ్యం అవుతుంది’’ అని చావు కబురు చల్లగా చెప్పరట అధికారులు. అంటే దళిత బంధు పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేసినా ఆ ఖాతాల‌ను బ్యాంకర్లు ఫ్రీజ్ చేసిపారేశార‌న్న మాట‌. లాభ‌సాటి వ్యాపారాలు చెబితే త‌ప్పించి ఆ నిధుల‌ను విత్ డ్రా చేసుకోవ‌డం కుద‌ర‌ద‌ని క‌లెక్ట‌ర్లు తేల్చి చెప్పార‌ట‌. ఈ క్ర‌మంలో ట్రాక్ట‌ర్ కొంటాన‌ని ఒకరు, కారు కొని క్యాబ్ గా మార్చుకుంటాన‌ని మ‌రొక‌రు చెబితే.. అవేవీ లాభ‌సాటి వ్యాపారాలు కాద‌ని క‌లెక్ట‌ర్లు వారి ముఖం మీదే చెప్పార‌ట‌. దీంతో జిల్లా క‌లెక్ట‌ర్లు భావించే లాభ‌సాటి వ్యాపారాలేవో అర్థంకాక ద‌ళిత బంధు ల‌బ్ధిదారులు జుత్తు పీక్కుంటున్నార‌ట‌. దళిత బంధు వచ్చిందని, 10 లక్షలు వచ్చాయని చెబుతూ.. మళ్లీ ఈ మెలికలు ఏంటని హుజురాబాద్ దళితులు ఇప్పుడు ఆవేదన చెందుతున్నారు. దళిత బంధు ఖాతాలు ఫ్రీజ్ చేశారన్న అంశంపై ఉద్యమానికి విపక్షాలు సిద్ధమవుతున్నాయి. 

అప్పుడు ఆనంద బెన్.. ఇప్పుడు రూపనీ! ఇద్దరికీ ఒకేలా ఉద్వాసన..

గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ రాజీనామా చేశారు. ఆయన ఎందుకు రాజీనామా చేశారు. ఏమిటీ అనే విషయాన్ని పక్కన పెడితే. ఇలా ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రులను మార్చడం, బీజేపీ కొత్తగా పెట్టుకున్న రూలు నిబంధన కాదు కదా అనే సందేహాలు, రాజకీయ, మీడియా వర్గాల్లోనే కాదు, పార్టీలోనూ వినిపిస్తున్నాయి.కొద్ది నెలల క్రితమే నిండా నాలుగు నెలలు అయినా నిందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీర్థ సింగ్ రావత్’ను రాత్రికి రాత్రే మార్చేశారు.అలాగే, బీజేపీ జాతీయ నాయకత్వం  ఇటీవల కర్ణాతక ముఖ్యమంత్రి యడ్యూరప్ప చేత  బలవంతంగా రాజీనామా చేయించారు. గుజరాత్ విషయానికే వస్తే, మోడీ 2014 లో ఢిల్లీకి షిఫ్ట్ అయిన తర్వాత ఈ ఏడేళ్ళలో ఇద్దరు ముఖ్యమంత్రులు మారారు. మోడీ తర్వాత ఆయన వారసురాలుగా, ఆయనే ఏరి కోరి ఎంపిక చేసిన ఆనందబెన్ పటేల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత రెండు సంవత్సరాలకు 2016 ఆగష్టులో  ఆమె రాజీనామా చేశారు. ఆమె స్థానంలో విజయ్ రూపానీ  నియామకం జరిగింది. అయితే ఇక్కడ ఆసక్తికర విషయం ఏమంటే, అప్పుడు ఆమె.. ఇప్పుడు ఈయన ఒకే విధంగా ఉద్వాసనకు గురయ్యారు. సిట్యువేషన్స్, ఇష్యూస్ వేరైతే కావచ్చును కానీ, ఫెయిల్ అయ్యే పక్కకు తప్పుకున్నారు. అప్పట్లో, మరో సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయన్న సమయంలో హార్దిక్ పటేల్ (ప్రస్తుత కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్) సారధ్యంలో ఉదృతంగా సాగిన పటీదార్ ఆందోళనను అదుపు చేయడంలో విఫల మయ్యారన్న కారణంగా, బీజేపీ అధిష్టానం ఆనందబెన్ పటేల్’కు ఉద్వాసన పలికింది. అఫ్ కోర్స్, దానికి తోడు 2016లో ఉన్నాలో దళితుల బహిరంగ ఉచకోత సంఘటన, వంటి ఇతర కారణాలు కూడా ఉన్నా. పటీదార్ ఆందోళన ప్రభావంతో 2015 స్థానిక సంస్థల ఎన్నికలో ఎదురైన ఓటమిని దృష్టిలో ఉంచుకునే బీజేపీ ఆమెకు ఉద్వాసన పలికిందని, పార్టీ వర్గాలు దృవీకరించాయి.    ఇప్పుడు కొవిడ్ కట్టడిలో ఫెయిల్ అయ్యారనే కారణంగానే, రూపానీని తప్పించారని తెలుస్తోంది. ఈ విషయంలో గుజరాత్ హై కోర్టు, గట్టిగానీ రూపనీ నెత్తిన అభిశంసన అక్షింతలు వేసింది. అంతే కాకుండా, వచ్చే సంవత్సరం (2022)  డిసెంబర్’లో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో పార్టీని విజయపధంలో నడిపించే సామర్ధ్యం రూపనీకి లేవని, ఆయన ఆ స్థాయికి ఎదగడంలో విఫల మయ్యారని అందుకే ఆయన స్థానంలో. పటేల్ సామాజిక వర్గానికి చెందిన సమర్ధ నాయకునికి పట్టం కట్టేందుకు రూపానీని తొలిగించి రూట్ క్లియర్ చేశారని అంటున్నారు. అయితే, రూపానీ వారసుడు ఎవరన్నది ఇంకా తేలవలసి ఉంది. కొత్త ముఖ్యమంత్రి ఎవరైనా, మోడీ బొమ్మ, అమిత షా వ్యూహంతోనే బీజేపీ 2022 అసెంబ్లీ ఎన్నికలకు వెళుతుంది. అందులో ఎవరికీ  సందేహం లేదు. అందుకు ఇప్పటి నుంచే వ్యూహ రచన సాగుతోంది, సంస్థాగతంగా మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి.  బీజేపీకి మొదటి నుంచి మంచి పట్టున్న పటేల్ వర్గం మీదనే బీజేపీ ఆశలు పెట్టుకుంది. నిజానికి రూపానీని ఇప్పుడు మార్చినా, గత సంవత్సరం జూన్’లో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు, సీఆర్ పాటిల్ ‘ను పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా నియమించడంతోనే మార్పు ప్రక్రియ ప్రారంభమైందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.ఆ తర్వాత కూడా 2022 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ సంస్థాగతంగా, ప్రభుత్వ పరంగా అనేక మార్పులు చేర్పులను చేపట్టింది.  వచ్చే సంవత్సరం ప్రారంభంలో ఉత్తర ప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలో పాటుగా గుజరాత్’లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచన బీజేపీ పెద్దలకు ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, రెండు కీలక రాష్ట్రాలలో ఒకే సారి ఎన్నికలకు వెళ్ళే సాహసం చేస్తారా అనే సందేహాలు కూడా ఉన్నాయి.చివరకు ఏమి జరుగుతుందో, గుజరాత్ రాజకీయ ఏ మలుపు తిరుగుతుందో.. ఈ అవకాశాన్ని ప్రతిపక్షలు ఎంత వరకు, ఎలా ఉపయోగించుకుంటాయో చూడవలసి ఉందని, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

కేంద్ర మంత్రికి కేసీఆర్ విందు.. ఫెవికాల్ బంధం నిజమేనా? 

రాజకీయాలలో శాశ్వత మిత్రులు ఉండరు. శాశ్వత శతృవులూ ఉండరు. శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి. అయితే అదేదో బహిరంగంగా ఉంటే అదో రకం.. కానీ, చాటుమాటు సంబందాలే కొంచెం చికాకు పరుస్తాయి. గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ వ్యవహారాలు అనుమానాలకు ఆస్కారం కలిపిస్తాయి. బీజేపీ, తెరాస సంబంధాల విషయంలో అదే జరుగుతోంది. అందులోనూ ఒకరికి అలాంటి  పుకార్లు రాజకీయంగా అవసరం కూడా అయినప్పుడు మీడియా లీకులకు  కొదవుండదు. అందుకే ఇప్పడు తెలంగాణాలో తెరాస, బీజేపీల మధ్య ఉందో లేదో తెలియని పుకార్ల ప్రేమ హాట్ హాట్ గా మారింది. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిసినా, కేంద్ర మంత్రులు హైదరాబాద్ వచ్చి ముఖ్యమంత్రిని కలిసినా, అదే జరుగుతోంది.  తెలంగాణ రాష్ట్రంలో తెరాస, బీజేపీల మధ్య యుద్ధమే నడుస్తోంది. రాష్టంలో పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ పాదయాత్ర సాగిస్తున్నారు. పాదయాత్ర పొడుగునా ఆయన కేసీఆర్ ప్రభుత్వం మీద నిప్పులు చెరుగుతున్నారు. విరుచుకు పడుతున్నారు. ముఖ్యమంత్రి అవినీతిని ప్రస్తావిస్తూ ఆయనకు జైలు ఖాయమని హెచ్చరిస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో మాజీ మంత్రి బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద కత్తులు దూస్తున్నారు. ఇటు కేసీఆర్ కు అటు అధికార పార్టీ ప్రచార బాధ్యతలు చేపట్టి, చెలరిగి పోతున్న మంత్రి హరీష్ రావుకు సవాళ్ళు విసురుతున్నారు. వాళ్ళూ వీళ్ళూ ఎందుకు ఫేస్ టూ ఫేస్ చూసుకుందాం రా  అని తొడలు చరుస్తున్నారు. ఇలాంటి వేడి వాతావరణంలో హైదరాబాద్ వచ్చిన బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు ప్రగతి భవన్ కు వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్ తో విందు వినోదాల్లో పాల్గొనడం, మంతనాలు జరపడం రాష్ట్ర నాయకత్వాన్ని ఇరకాటంలోకి నెట్టివేస్తోంది. పలు అనుమానాలకు తావిస్తోంది.  నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ  బీజేపీ, తెరాస మద్య రహస్య బంధం ఉందని, ఆరోపించేందుకు ప్రత్యర్ధి  కాంగ్రెస్ పార్టీ నాయకులకు చక్కని అవకాశం చిక్కుతోంది. ఇటీవలనే, టీపీసీసీ  చీఫ్ రేవంత్ రెడ్డి బీజేపీ,తెరాస బంధం ఎప్పటికీ విడిపోని ఫెవికాల్ బంధం అని సైటైర్లు వేశారు.  మీడియా కూడా అదే తరహాలో కథనాలు వండుతోంది. దీంతో సహజంగానే ప్రజల్లో, పార్టీ క్యాడర్ లో  అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలిసినా, రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసినా, ఎన్నిగంటలు చర్చలు జరిపినా అవి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన చర్చలుగానే చూడాలి, కానీ, రెండు  రాజకీయ పార్టీల మధ్య జరిగిన రాజకీయ చర్చలుగా చూడరాదు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతమున్న పరిస్థితుల్లో, ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి, వెళ్ళిన పని ముగించుకుని చక్కా వెనక్కి రాకుండా, అక్కడే తిష్ట వేసినా, రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రితో లంచ్ చేసినా అనుమానాలు వస్తాయి. ఇప్పుడు  అదే జరిగింది.  ఒక అధికార కార్యక్రమాలో పాల్గొనేందుకు శనివారం హైదరాబాద్ వచ్చిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతీరాధిత్య సింథియా ఆ తర్వాత ముఖ్యమంత్రిని ప్రగతి భవన్ లో కలిశారు. సహజంగా మరే ఇతర  రాష్ట్రంలో అయినా ఇలాంటి సమావేశాలు సచివాలయంలో జరుగుతాయి. కానీ,తెలంగాణ ముఖ్యమంత్రికి సంబంధించినంత వరకు ఇల్లే సచివాలయం, సచివాలయమే ఇల్లు. అన్నీ ప్రగతి భవనే.. కాబట్టి ఎలాంటి సమావేశాలు అయినా, అక్కడే జరుగుతాయి.  జ్యోతీరాధిత్య సింథియా కూడా అక్కడే ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు.దీంతో మళ్ళీ మరోమారు ఫెవికాల్ బంధం చర్చకు వచ్చింది.  కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింథియా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండే సంబంధాలే తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్ తో ఉన్నాయని స్పష్టం చేశారు. టీఆర్ఎస్‌తో బీజేపీ రాజకీయ పోరాటం కొనసాగుతోందన్నారు. తెలంగాణలో అధికారమే బీజేపీ లక్ష్యమని స్పష్టం చేయడంతో పాటుగా, 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలు గెలవటమే రాష్ట్రంలో బీజేపీ బల పడుతోంది అనేందుకు నిదర్శనమని  చెప్పారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే స్థానానికి పరిమితమైనప్పటకీ మూడేళ్ళల్లో బీజేపీ బలపడిందన్నారు. దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాత టీఆర్ఎస్‌కు బీజేపీ ప్రత్యామ్నాయంగా మారిందన్నారు. నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో సైతం అధికార టీఆర్ఎస్ కంటే బీజేపీ‌ అత్యధిక స్థానాలు సాధించిందన్నారు. అయితే ఎన్ని చెప్పినా, ఎంత చేసినా, అధికార, రాజకీయ సంబంధాల మధ్య ఉండే సన్నని గీత విషయంలో బీజేపే నాయకులు, కేంద్ర మంత్రులు జాగ్రత్త పడక పోతే. ప్రజలు అదే నిజమని నమ్మే ప్రమాదం నుంచి తప్పించుకోలేరని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అందులోనూ, అధికార తెరాస 20 ఏళ్ల ప్రస్థానంలో కాంగ్రెస్, తెలుగు దేం, సహా అన్ని పార్టీలతో పొట్టు పెట్టుకుంది కానే, ఇంతవరకు బీజేపీతో ఏ ఎన్నికల్లోనూ పొత్తు పెట్టుకోలేదు. భవిష్యత్ లో కూడా పెట్టుకోదు. కానీ అవసరం అనుకుంటే  పుకార్లకు మాత్రం స్వాగతం పలుకుతుంది. ఇప్పడు జరుగుతుంది కూడా అదే..  

తీన్మార్ మల్లన్నపై మరో కేసు.. జైలు నుంచి బయటికి రాకుండా కుట్రలా?

కేసీఆర్ ప్రభుత్వానికి కొంత కాలంగా కొరకరాని కొయ్యగా మారిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్నారు. బెదిరింపుల కోసం ఆగస్టు 26న తీన్మార్ మల్లన్నను హైదరాబాద్ చిలకలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు రిమాండ్ విధించడంతో చంచల్ గూడ జైలుకు తరలించారు. తర్వాత పోలీసులు నాలుగు రోజుల పాటు మల్లన్నను కస్టడీలోనికి తీసుకుని విచారించారు. బుధవారం సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీలోనికి తీసుకుని ప్రశ్నించారు.  తీన్మార్ మల్లన్నపై కేసులు కూడా పెరిగిపోతున్నాయి. మల్లన్నను తమను బెదిరించాడంటూ కేసులు వస్తుండటంతో పోలీసులు ఫైల్ చేస్తున్నారు. తీన్మార్ మల్లన్నపై రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఇప్పటివరకు 31 కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది. మల్లన్నపై కక్ష గట్టిన కేసీఆర్ ప్రభుత్వం.. వీలైనన్ని ఎక్కువ రోజులు జైలులుో ఉంచేలా కుట్రలు చేస్తుందని మల్లన్న టీమ్ సభ్యులు ఆరోపిస్తున్నారు. తీన్మార్ మల్లన్నకు మద్దతుగా పలు ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి.మ‌ల్ల‌న్న‌కు పార్టీల‌కు అతీతంగా వివిధ ప్ర‌ముఖుల నుంచి మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. మల్లన్నకు సపోర్ట్ పెరిగిపోతుండటంతో ఆయనపై మరిన్ని కేసులు పెట్టించేందుకు టీఆర్ఎస్ నేతలు ప్లాన్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.  మల్లన్న అనుచరులు చెబుతున్నట్లే ఆయనపై కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా  తీన్మార్ మల్లన్నపై నిజామాబాద్ జిల్లా ఎడపల్లి పోలీస్‌స్టేషన్‌లో  కేసు నమోదైంది. తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌ను ఏ5గా పేర్కొంటూ కేసు నమోదు చేసినట్టు బోధన్ ఏసీపీ రామారావు తెలిపారు. ఎడపల్లి మండలం జానకంపేట గ్రామానికి చెందిన కల్లు ముస్తేదార్ జయవర్ధన్ గౌడ్‌ను రూ. 20 లక్షలు చెల్లించాలని బెదిరించినందుకు క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్నతో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసినట్టు ఆయన వెల్లడించారు. బాధితుని ఫిర్యాదు మేరకు ఎడపల్లి మండలం జానకంపేట్‌కు చెందిన తీన్మార్ మల్లన్న టీం సభ్యుడు ఉప్పు సంతోష్‌ను ఏ1గా, ఏ2గా రాధా కిషన్, ఏ3గా రాజా గౌడ్, సాయగౌడ్ ఏ4, చింతపండు నవీన్ కుమార్‌ను ఏ 5గా పేర్కొంటూ కేసులు నమోదు చేశారు. కేసు వివరాలను కూడా వెల్లడించారు ఏసీపీ రామారావు. కల్లు ముస్తేదారు జయవర్ధన్ గౌడ్‌ను జూన్ నెల నుండి డబ్బుల కోసం అదే గ్రామానికి చెందిన కొందరు బెదిరిస్తున్నారని చెప్పారు. వారి బెదిరింపులకు భయపడి జయవర్ధన్ గౌడ్ ఆగస్టు నెలలో రూ. 5 లక్షలు చెల్లించారని, తీన్మార్ మల్లన్న పాదయాత్ర ఉందని మిగతా 15 లక్షలు ఇవ్వాలని బెదిరించడంతో వేధింపులు తాళలేక గురువారం ఫిర్యాదు చేశారన్నారు. దీంతో తాము ఈ ఘటనకు బాధ్యులైన మల్లన్నతో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశామన్నారు.  ఈ కేసులో ఉప్పు సంతోష్‌ను అరెస్టు చేయగా, మిగిలిన ముగ్గురు పరారీలో ఉన్నారన్నారు. తీన్మార్ మల్లన్నపై పిటీ వారెంట్ జారీ చేసే యోచనలో ఉన్నామన్నారు ఏసీపీ రామారావు.ఎవరైనా అవినీతి అక్రమాలకు పాల్పడినా, బ్లాక్ మెయిల్ చేసినా నేరుగా తమకు ఫిర్యాదు చేయాలని ఏసీపీ సూచించారు.