గిదేంది కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి! కాంగ్రెస్ కార్యకర్తల సూటి ప్రశ్నలు...

తెలంగాణ కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే జోష్ లో కనిపిస్తోంది. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం తర్వాత కేడర్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. వరుస కార్యక్రమాలతో ప్రజల్లోకి దూసుకుపోతున్నారు రేవంత్ రెడ్డి. పీసీసీ చీఫ్ కాగానే ఛలో రాజ్ భవన్ ఆందోళనతో అధికార పార్టీని షేక్ చేశారు. దళిత గిరిజన దండోరా సభలతో సీఎం కేసీఆర్ ను ఏకిపారేస్తున్నారు. దండోరా సభలకు ఊహించిన దానికంటే భారీగా స్పందన వచ్చిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ తో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని తనదైన శైలిలో టార్గెట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. దీంతో హస్తం పార్టీదే వచ్చే ఎన్నికల్లే అధికారమనే చర్చ కూడా గాంధీభవన్ లో జరుగుతోంది. మరోవైపు అదే సమయంలో కాంగ్రెస్ లో కోల్డ్ వార్ తెరపైకి వస్తోంది. ముఖ్యంగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బందిగా మారుతున్నాయి. వైఎస్ విజయమ్మ ఏర్పాటు చేసిన వైఎస్ సంస్మరణ సభకు ఎవరూ వెళ్లొద్దని పీసీసీ ఆదేశాలు ఇచ్చినా ఆ సభకు హాజరయ్యారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. అంతేకాదు అక్కడ పీసీసీని టార్గెట్ చేస్తూ కామెంట్లు చేశారు. రేవంత్ రెడ్డి, సీతక్కలపై ఘాటు విమర్శలు చేశారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీరుపై కాంగ్రెస్ లో అసహనం వ్యక్తమవుతోంది. పార్టీకి ఫుల్ జోష్ వస్తున్న సమయంలో ఇలాంటి నేతలు వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయం కాంగ్రెస్ కార్యకర్తల నుంచి వస్తోంది. ఆ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఉద్దేశించి కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో కోమటిరెడ్డి వ్యవహార శైలిని తప్పుపట్టడంతో పాటు ఆయనకు పలు సూచనలు చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు.  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ కార్యకర్తల సూటి ప్రశ్నలు అంటూ వైరల్ అవుతున్న పోస్టు ఇదే... ⦁ పీసీసీ అధ్యక్ష పదవి దక్కలేదన్న అక్కసుతో, వ్యక్తిగత కక్షతో మీరు వ్యవహరిస్తోన్న తీరు, మాట్లాడుతున్న మాటలు కాంగ్రెస్ పార్టీకి లాభమా... నష్టమా? ⦁ తండ్రి సంస్మరణ సభ ముసుగులో షర్మిల, విజయమ్మలు రాజకీయ సమ్మేళనాన్ని పెట్టి, రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తూ... కాంగ్రెస్ కు నష్టం చేసే ప్రయత్నం చేస్తుంటే దానిని సమర్ధించమంటారా...? ⦁ నా కుమార్తెను మీకు అప్పగిస్తున్నా దీవించండి అని విజయమ్మ...తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తాను అని షర్మిల రాజకీయ ప్రకటనలు చేసిన సభ సంస్మరణ సభ అవుతుందా... రాజకీయ సభ అవుతుందా... మీ పరిజ్ఞానానికే వదిలేస్తున్నాం? ⦁ అది వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంస్మరణ సభే ఐతే ఆయన కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకు హాజరు కాలేదో మీరు చెప్పగలరా? ⦁ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా వైఎస్ ను గౌరవిస్తాం... కానీ, సమైక్య వాదిగా ఆయనను తిరస్కరిస్తాం... రాజశేఖర్ రెడ్డి బతికి ఉంటే తెలంగాణ వచ్చి ఉండేది కాదు అన్న విజయమ్మ మాటలను ఆమె సభకు హాజరైన మీరు సమర్ధిస్తారా? ⦁ వైఎస్ తెలంగాణను వ్యతిరేకించినా ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాబట్టే... వర్ధంతి రోజు కాంగ్రెస్ శ్రేణులు టీపీసీసీ ఆదేశాల మేరకు ఊరువాడా నివాళి అర్పించిన విషయం మీ కంటికి కనిపించలేదా...? ⦁ వైఎస్ తనయుడు జగన్ మోహన్ రెడ్డి కారణంగానే ఏపీలో కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయింది... ఇప్పుడు తనయ షర్మిల ద్వారా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ నష్టపోవడాన్ని మీరు సమర్ధిస్తారా...? తన వారసుల ద్వారా కాంగ్రెస్ భూస్థాపితం కావాలని వైఎస్ కోరుకున్నారా...? ⦁ రేవంత్ రెడ్డిని పదే పదే చంద్రబాబు మనిషి అని ముద్ర వేయడం టీఆర్ఎస్ దుష్ట ఎజెండాలో భాగం అని తెలంగాణ సమాజం మొత్తం భావిస్తోంది... అదే ఎజెండా ను మోస్తున్న మిమ్మల్ని కాంగ్రెస్ మనిషి అనుకోవాలా... లేక కేసీఆర్ కోవర్ట్ అనుకోవాలా...? ⦁ సోనియాగాంధీ నిర్ణయం మేరకు పీసీసీ అధ్యక్ష పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి పై చంద్రబాబు మనిషి అని ముద్ర వేయడం కాంగ్రెస్ కు లాభమా... నష్టామో చెప్పగలరా? ⦁ షర్మిల, విజయమ్మ పెట్టిన రాజకీయ సమ్మేళన సభకు వెళ్లకూడదన్నది ఒక్క రేవంత్ రెడ్డి నిర్ణయం కాదు... టీపీసీసీ, ఏపీసీసీ, టీసీఎల్పీ కలిసి తీసుకున్న నిర్ణయం... దీంట్లో మీరు ఒక్క రేవంత్ రెడ్డి గారినే టార్గెట్ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి? ⦁ తెలంగాణలో కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఈ బాధ్యతను తీసుకుంది. ఆ క్రమంలోనే ముఖ్య నేతలు ఇతర పార్టీల నేతలను కలిసి కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నారు...ఈ ప్రయత్నాన్ని మీరు తప్పు పడతారా... ? ⦁ టీపీసీసీ ఆధ్వర్యంలో జరుగుతోన్న కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణను వ్యతిరేకించడమంటే పరోక్షంగా కేసీఆర్ ను సమర్ధించడం కాదా... ఇన్నేళ్ల రాజకీయ అనుభవం ఉన్న మీకు ఈ మాత్రం అవగాహన లేదా...? ⦁ రాజకీయాల్లో విలువలు దిగజారి పోయాయి. ఆయారాం గాయారం గాళ్లు పార్టీలు మారగానే కొత్త పార్టీ అధినేతలను ప్రసన్నం చేసుకోవడం కోసం పాత పార్టీ అధినేతల పై ఇష్టారాజ్యంగా నోరు పారేసుకుంటున్న రోజులివి... అలాంటి రాజకీయాలకు భిన్నంగా రేవంత్ రెడ్డి వ్యవహరించడం  మీ దృష్టిలో రాజకీయ విలువలను ప్రోత్సహించినట్టా... దిగజార్చినట్టా...? ⦁ చంద్రబాబు భుజాలపై తుపాకీ పెట్టి టీపీసీసీ అధ్యక్ష పదవిలో ఉన్న రేవంత్ రెడ్డిని కొట్టాలన్నది టీఆర్ఎస్ ఆలోచన... కేసీఆర్ ఆలోచనను మీరు ఆచరణలో పెట్టాలనుకుంటున్నారా...? ⦁ 2018 డిసెంబర్ 11తో తెలంగాణలో తెలుగుదేశం చరిత్ర ముగిసిపోయింది. అసలు అస్థిత్వంలోనే లేని... సంబంధం లేని పార్టీని టార్గెట్ చేసి మాట్లాడాలని మీరు కోరుకోవడంలో ఆంతర్యం ఏమిటి? ⦁ 2018 అసెంబ్లీ ఎన్నికలలో ఇదే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబుతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే అదే పచ్చకండువా మెళ్లో వేసుకుని మీరు ఊరూరు ఊరేగలేదా...? తెలుగుదేశం నేతలతో కలిసి ప్రచారం చేసుకోలేదా...? ఆ రోజు మీరు చేసింది చంద్రబాబు భజన కాదా...? ⦁ కేసీఆర్ మోసపూరిత విధానాలకు వ్యతిరేకంగా ఏఐసీసీ ఆమోదం మేరకు టీపీసీసీ నిర్వహిస్తోన్న దళిత - గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలకు హాజరయ్యేందుకు సమయం లేని మీకు... విజయమ్మ - షర్మిలలు నిర్వహించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సమావేశాలకు హాజరయ్యేందుకు మాత్రం సమయం ఉందా...? ⦁ నీ నియోజకవర్గంలో దళిత - గిరిజన ఆత్మగౌరవ సభ పెడదామంటే... అవసరం లేదు అని పార్టీ నిర్ణయాన్ని అడ్డుకున్న మీకు కాంగ్రెస్ పార్టీ మీద, పార్టీ భవిష్యత్ మీద కమిట్ మెంట్ అన్నాటా... లేనట్టా... మమ్మల్ని ఎలా అర్థం చేసుకోమంటారు...? ⦁ ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం అటు ఢిల్లీలో మోదీని, ఇటు రాష్ట్రంలో కేసీఆర్ తో చీకటి ఒప్పందం చేసుకున్నారని మీపై ప్రచారం జరుగుతోంది... ఆ ప్రచారాన్ని మేం నమ్మాలా... వద్దా? ⦁ అనేక మంది సీనియర్లు పార్టీలో ఉన్నా... 1984లో జూనియర్ అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పీసీసీ పదవి ఇచ్చిన మాట వాస్తవం కాదా... సీనియర్లకే పీసీసీ ఇవ్వాలంటే మీ కంటే సీనియర్లు పార్టీలో లేరా... వాళ్లకు లేని బాధ మీకొక్కరికే ఎందుకు...? ⦁ కోవర్టులు కాంగ్రెస్ ను వీడి పోవాలని ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారే పిలుపునిచ్చారు... ఆయన మార్గంలోనే టీపీసీసీ కూడా పయనిస్తోంది అన్న విషయం మీకు అర్థం కావడం లేదా...? ⦁ మీరు కాంగ్రెస్ నాయకులుగా ఉన్నారో... కేసీఆర్ కోవర్టుగా ఉన్నారో కాంగ్రెస్ కార్యకర్తలమైన మాకు అర్థం కావడం లేదు... ⦁ పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత మీరు రావద్దన్నా... సీనియర్లను అందరినీ కలుపుకుని పోవాలన్న ఉద్ధేశంతో రేవంత్ రెడ్డి ఓ మెట్టు దిగి ఢిల్లీలో మూడు సార్లు మిమ్మల్ని కలిసి కాంగ్రెస్ బలోపేతం కోసం కలిసి పని చేద్దామని చెప్పిన మాట వాస్తవం కాదా...? ⦁ మీరు చచ్చేదాకా కాంగ్రెస్ లో ఉంటారా... లేక కాంగ్రెస్ ను చంపేదాకా ఉంటారో అర్థం కావడం లేదు... ⦁ ఒకవైపు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో పని చేస్తాం అని చెబుతారు... మరోవైపు ఆ సోనియాగాంధీ, రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయాన్నే వ్యతిరేకిస్తారు... దీనిని ఎలా అర్థం చేసుకోవాలి? ⦁ తమపై కేసులు సోనియాగాంధీ కుట్రలో భాగమేనని ఊరువాడ తిరిగి బదనాం చేసిన విజయమ్మ, షర్మిల సభలకు వెళ్లి మీరు ఏం సంకేతం ఇవ్వదలచుకున్నారు. సోనియాగాంధీ పై వాళ్లు వేసిన అబాండాలపై మీ వైఖరి ఏమిటి? ⦁ కేవలం పీసీసీ అధ్యక్ష పదవి రాలేదన్న అక్కస్సుతో... ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం కేసీఆర్ తో లాలూచీ పడి మీరు చేస్తోన్న విమర్శలు కాంగ్రెస్ పార్టీకి మేలు చేస్తాయని భావిస్తున్నారా....? ⦁ పీసీసీ పదవిలో ఈ రోజు రేవంత్ రెడ్డి ఉండొచ్చు... రేపు మరొకరు ఉండొచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ శాశ్వతం. మీ మాటలు, చేతలు దానిని శాశ్వత సమాధి చేసేలా ఉన్నాయన్నది వాస్తవం కాదా...? ⦁ మీ వ్యవహార శైలి ఇలాగే కొనసాగితే మిమ్మల్ని కేసీఆర్ కోవర్టుగా భావించాల్సి ఉంటుంది... మీ లాంటి వాళ్లు కాంగ్రెస్ కు అవసరమా అని కూడా కార్యకర్తలుగా మేం ఆలోచన చేయాల్సిన పరిస్థితి వస్తోంది. ⦁ వెంకట్ రెడ్డి ... చివరిగా ఒక విజ్ఞప్తి. మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. దయచేసి వ్యక్తులపై కోపంతో కాంగ్రెస్ కు వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేయకండి.

హైద‌రాబాద్ నెత్తిన వాట‌ర్ బాంబ్‌.. మ‌రో 5 రోజుల పాటు అల‌ర్ట్‌..

ఒకప్పుడు పొద్దంతా ఎండ‌కొట్టేది. రాత్రి అయ్యాక వ‌ర్షం ప‌డేది. మ‌ళ్లీ మార్నింగ్‌క‌ల్లా అంతా సాఫ్. ఎవ‌రి ప‌నులు వాళ్లు చేసుకొనేవాళ్లు. నైట్ వాన వ‌ల్ల ఎవ‌రికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేది. కానీ, కాలం మారింది. కాల‌చ‌క్రం క‌కావిక‌లం అయింది. ప‌గ‌లు-రాత్రి తేడా లేకుండా రోజంతా వ‌ర్షం ప‌డుతూనే ఉంది. రోజులు, వారాల త‌ర‌బ‌డి రెయిన్ కుమ్మేస్తోంది. వ‌ర‌ద పోటెత్తుతోంది. హైద‌రాబాదీల‌ను ప‌రేషాన్ చేసేస్తోంది.  భాగ్య‌న‌గ‌రాన్ని ప‌ట్టిన ముసురు ఇంకా వీడ‌నే లేదు. మూడు రోజులుగా నాన్‌స్టాప్ రెయిన్ న‌గ‌రాన్ని రొచ్చు రొచ్చుగా మార్చేసింది. వ‌ర‌ద నీరు, డ్రైనేజీ వాట‌ర్ అంతా క‌లిసి కంపు రేపుతోంది. స‌డెన్‌గా కురుస్తున్న‌ వ‌ర్షంతో ట్రాఫిక్ జామ్‌లు, వాహ‌న‌దారుల ఇక్క‌ట్లు అన్నీఇన్నీ కావు. ఎప్పుడూ అంచనాలు త‌ప్పే వాతావ‌ర‌ణ శాఖ ఈసారి మాత్రం క‌రెక్ట్‌గానే గెస్ చేసిన‌ట్టుంది. అది చెప్పిన‌ట్టుగానే రోజూ వాన కురుస్తోంది. మ‌రో ఐదు రోజుల పాటు ఓ మోస్తారు నుంచి భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని.. ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచిస్తోంది వెద‌ర్ రిపోర్ట్‌.  హైద‌రాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది. మూసీ పరీవాహక ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు పెద్ద ఎత్తున రావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూసీ పరీవాహక ప్రాంతాల్లో రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. భారీ వాన‌ల‌తో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. నగరంలోని వివిధ ప్రాంతాలను ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి రోడ్లపై నిలిచిన నీళ్లను తొలగిస్తున్నారు. కంట్రోల్‌ రూంకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.  గండిపేట జలాశయం పూర్తిగా నిండటంతో నాలుగు గేట్లు తెరిచి నీటిని దిగువన మూసీ నదిలోకి వదిలిపెట్టారు.  భారీ వర్షాలతో మూసీ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో జలాశయం నీటి మట్టం 1788.88కు చేరింది. గండిపేటకు ఎగువ నుంచి 1000 క్యూసెక్కుల నీరు వస్తోంది. నాలుగు గేట్ల ద్వారా 400 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. 2010 తర్వాత ఈ ఏడాదే గండిపేట, హిమాయత్‌సాగర్‌ గేట్లు రెండుసార్లు ఎత్తారంటే.. వాన‌లు ఏ రేంజ్‌లో కురుస్తున్నాయో తెలుస్తోంది. మ‌రో 5 రోజులు వ‌ర్షాలు ఉన్నాయ‌ని చెబుతున్నారు కాబ‌ట్టి.. ప్ర‌జ‌లు త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ అప్ర‌మ‌త్తంగా ఉంటే మంచిది.   

కేసీఆర్ రజాకార్లను మించిండు.. హరీష్ రావు మూర్ఖుడు! రెచ్చిపోయిన ఈటల రాజేందర్ 

తెలంగాణ ముఖ్యమంత్రి రజకార్లను మించి అరాచకాలు చేస్తున్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు.  కేసీఆర్ తీరు  ఇలాగే కొనసాగితే  తెలంగాణలో మళ్లీ చీకటి రోజులకు, బానిసత్వానికి దారితీసే ప్రమాదం ఉందన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ గౌడ గర్జన సభలో మాట్లాడిన రాజేందర్.. కేసీఆర్, హరీశ్ రావుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాను కన్నెర్రచేస్తే మాడి మసైపోతారంటూ హెచ్చరించారు కేసీఆర్ అప్పుడేం మాట్లాడారు... ? ఇప్పుడేం మాట్లాడుతున్నారు? అని ప్రశ్నించారు రాజేందర్. ఒకప్పుడు కేసీఆర్ మాట్లాడితే.. తెలంగాణ జాతి పులకించేపోయేది.. ఇప్పుడు ఆయన మాట్లాడితే టీవీలు బంద్ చేస్తున్నారు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నారు. పోలీసులను ప్రయోగించడం, డబ్బుల సంచులు తేవడం ఆపేసి.. తనకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో కేసీఆర్ ఆలోచించాలన్నారు ఈటల. ఇక్కడ అడ్డాపెట్టి హరీష్ రావు అనేక ఇబ్బందులు పెడుతున్నాడని మండిపడ్డారు. 20 ఏళ్ళు కలిపి పనిచేస్తే నీవు ఇక్కడ చేస్తున్నదేమిటి? యావత్ తెలంగాణ నిన్ను అసహ్యించుకుంటు థూ అంటున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు రాజేందర్. ఇది మార్చుకుంటావా లేదా? నీ పరువు కాపాడుకుంటవా లేదా? ఆలోచించుకో హరీష్ అంటూ కామెంట్ చేశారు.   కమలాపూర్ ఎంపీపీగా ఉన్న తడకరాణికి రోజు టీఆర్ఎస్ నాయకులు ఫోను చేసి తమవైపు రావాలని టార్చర్ చేస్తున్నారని ఈటల ఆరోపించారు. రాత్రి పూట దొంగలాగా.. మా నాయకుల ఇళ్లకు పోలీసుల వాహనాల అండతో హరీశ్ వస్తున్నాడు.. సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు రాకపోతే.. పోలీసుల వాహనాలను ముందు పెట్టుకుని మా నాయకుల ఇండ్లకు వస్తున్నాడు.. ప్రగతి భవన్ లో కూర్చుని కేసీఆర్ ఆదేశిస్తే.. వాటిని ఆచరించే మూర్ఖుడు హరీశ్ రావు అంటూ ఈటల వ్యాఖ్యానించారు. మిస్టర్ హరీశ్ రావు .. ఇట్లాంటి పిచ్చివేషాలు బంద్ చేయకపోతే నీ భరతం పట్టడం ఖాయం అంటూ హెచ్చరించారు.  ఇలాంటి దురగతాలను ఆపగలిగే శక్తి హుజురాబాద్ ప్రజలకు మాత్రమే ఉందన్నారు.  నీకున్న వేల కోట్ల రూపాయలను, పోలీసులను, అధికారులను బొంద పెట్టే రోజులు దగ్గర్నే ఉన్నాయని హెచ్చరిస్తున్నా అన్నారు రాజేందర్. మా సహనాన్ని, ఓపికను పరీక్షించే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు,.  ఆనాడు కత్తి ఆంధ్రోళ్లదైతే.. పొడిచేది తెలంగాణవాడని ఆనాడు కేసీఆర్ చెప్పేవాడు.. ఇప్పుడు కత్తి కేసీఆర్, హరీశ్ రావు ఇస్తే.. మనోళ్లే పొడుస్తున్నారన్నారు. పనిగట్టుకుని పరిచయాలను, కులాన్ని, చుట్టరికాన్ని ఆసరా చేసుకుని ఇండ్లకెళ్లి పట్టుకొచ్చే వాళ్ల భరతం పట్టడం ఖాయమన్నారు. తన  నుంచి దూరం పోయిన నాయకుల పరిస్థితి గంజిలో ఈగ కంటే అధ్వానంగా మారింది రాజేందర్ అన్నారు. మిస్టర్ పరకాల ఎమ్మెల్యే.. నిన్ను ప్రజలు ప్రేమతో గెలిపించారు. ఓటుకు 2 వేలు పంచి గెలిచావు..  పరకాల నియోజకవర్గంలో నేను అడ్డపెడతా ఎలా గెలుస్తావో చూస్తా..వర్ధన్నపేట, చొప్పదండి ఎమ్మెల్యేల్లారా మీ నియోజవర్గాల్లో దళిత బంధు ఇప్పిస్తున్నావా బిడ్డా.. అక్కడ దద్దమ్మ నా కొడుకులు మీరు.. ఇక్కడకొచ్చి మాట్లాడుతారా? అంటూ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మీద జరిగిన దుర్గార్మం రేపు మరికొందరిపై జరిగే అవకాశం ఉందన్నారు. కేసీఆర్ మాటలు తప్పే.. పేదల బతుకుల్లో ఏనాడు తొంగి చూడలేదని విమర్శించారు.  పేదరికానికి కులంతో పనిలేదన్న ఈటల. దళితులతో పాటు అన్ని కులాల్లో పేదలకు పది లక్షల రూపాయలు ఇవ్వాలన్నారు. దళిత సోదరుల ఖాతాల్లో పది లక్షలు జమ అయినట్లుగా మెసేజ్ వస్తోన్నా.. వాటిని స్వేచ్ఛగా ఖర్చు చేసుకునే అవకాశం ఇవ్వడం లేదని చెప్పారు. ఎవరి స్థలాల్లో వారు ఇల్లు కట్టుకునేలా డబ్బులు ఇవ్వాలన్నారు. 2014 వరకు కేసీఆర్ కు 5 కోట్ల ఖర్చు చేసే కెపాసిటీ లేకుండే.. కానీ ఇప్పుడ ఒక్క హుజురాబాద్ లోనే వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని చెప్పారు.

సీఎం జ‌గ‌న్‌పై స్వామిజీ తీవ్ర‌ ఆగ్ర‌హం.. భ‌క్తులు తిర‌గ‌బ‌డ‌తార‌ని శాపం..

రెండేళ్లుగా ఏపీలో అల్ల‌క‌ల్లోలం. ఓవైపు అవినీతి, అక్ర‌మాలు, అరాచ‌కాలు. మ‌రోవైపు.. మత మార్పిడిలు, ఆల‌యాల‌పై దాడులు, హిందుత్వంపై కుట్ర‌లు తీవ్ర స్థాయిలో జ‌రుగుతున్నాయ‌నే ఆందోళ‌న. ఇవి చాల‌వ‌న్న‌ట్టు.. వినాయ‌క చ‌వితికి బ్యాంకుల‌కు సెల‌వు ఇవ్వ‌క‌పోవ‌డం, తాజాగా చ‌వితి వేడుక‌ల‌కు ప‌ర్మిష‌న్ ఇవ్వ‌క‌పోవ‌డం మ‌రింత వివాదాస్ప‌ద‌మ‌వుతోంది. ఏపీలో హిందూ సంప్రదాయాలను ధ్వంసం చేయాలని జగన్ సర్కార్ చూస్తోందని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.  కరోనాను అడ్డుపెట్టుకుని సీఎం జ‌గ‌న్‌ వినాయక చవితి పండుగను అడ్డుకుంటున్నారని స్వామిజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గణపతి నవరాత్రులకు ఆంక్షలు పెట్టడం ఏమిటని, ఏ పీఠాధిపతులను సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నారని.. హిందూత్వం మీద ఎందుకు కుట్రలు పన్నుతున్నారని ప్రశ్నించారు. ‘‘మీ నాన్న జయంతి కార్యక్రమాలకు కరోనా అడ్డు రాలేదా?’’ అంటూ సీఎం జగన్‌ను నిల‌దీశారు శ్రీనివాసానంద సరస్వతి స్వామి.  ఈ సంద‌ర్భంగా శ్రీనివాసానంద స‌ర‌స్వ‌తి ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌ను సంధించారు. జెరూసలెంకు ఫ్యామిలీతో క‌లిసి వెళ్లే సీఎం జగన్.. హిందూ దేవాలయాలకు కుటుంబసమేతంగా ఎందుకు వెళ్లడం లేదని సందేహం వ్య‌క్తం చేశారు. హిందూత్వాన్ని జగన్ గౌరవించడం లేదని.. ఏపీని క్రైస్తవ రాష్ట్రంగా మారుస్తున్నారని ఆరోపించారు.  పక్క రాష్ట్రంలో లేని ఆంక్షలు ఏపీలోనే ఎందుకని స్వామిజీ ప్ర‌శ్నించారు. వినాయక చవితి ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలని, లేకపోతే భక్తులు తిరగబడతారని హెచ్చరించారు. ప‌నిలో ప‌నిగా జ‌గ‌న్‌ను ఎంతో ఇష్ట‌ప‌డే విశాఖ స్వ‌రూపానంద స్వామీ తీరునూ త‌ప్పుబ‌ట్టారు. వినాయక చవితి ఉత్సవాలపై ఆంక్షలు విధిస్తే జగన్ రాజగురువు శారదా పీఠం స్వామీజీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించడం ఆస‌క్తిక‌రం.   

కేసీఆర్‌-మోదీ మిలాఖ‌త్‌!.. ఈట‌ల బ‌ర్‌బాత్‌..!

టీఆర్ఎస్ వ‌ర్సెస్ కాంగ్రెస్ వ‌ర్సెస్ బీజేపీ. తెలంగాణ‌లో ట్ర‌యాంగిల్ వార్‌. ప్ర‌గ‌తిభ‌వ‌న్ కోసం మూడు పార్టీల కుమ్ములాట‌. హోరాహోరీగా వార్‌. త‌గ్గేదే లే అంటూ కేసీఆర్‌పై యుద్ధానికి దిగుతున్నాయి ప్ర‌తిప‌క్షాలు. ఈసారి గులాబీ దండుకు కాషాయ‌ద‌ళం గ‌ట్టి షాక్ ఇస్తుంద‌నే పొలిటిక‌ల్ వెద‌ర్ క్రియేట్ అయింది. దుబ్బాక‌, జీహెచ్ఎమ్‌సీ జోరుతో మాంచి ఊపు మీదుంది. ఈట‌ల చేరిక‌.. హుజురాబాద్‌లో కాక‌తో.. ఇక తెలంగాణ గ‌డ్డపై కాషాయ జెండా ఎగురుతుంద‌ని అనుకున్నారు. ఇక రేవంత్‌రెడ్డి దూకుడుతో కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. బండి సంజ‌య్ ప్ర‌జా సంగ్రామ యాత్ర‌తో..  బీజేపీ బండిని ముందుకు లాగించేస్తున్నారు. హుజురాబాద్‌ను కొల్ల‌గొట్టి.. ఈట‌ల‌ను అసెంబ్లీకి పంపించి.. కేసీఆర్‌పై తొడ‌గొట్టాల‌ని తెగ ఆరాట‌ప‌డుతున్నారు.  క‌ట్‌చేస్తే.. కేసీఆర్ క‌దిపిన ఒక్క పావుతో సీన్ మొత్తం రివ‌ర్స్ అయింది. అనుకున్న‌దొక్క‌టి అయిన‌ది ఇంకొక్క‌టి అన్నట్లుగా మారిపోయింది. తెలంగాణ బీజేపీ ఇంత గ‌ట్టిగా ట్రై చేస్తుంటే.. సింపుల్‌గా సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి.. ప్ర‌ధాని మోదీని, కేంద్ర‌హోంమంత్రి అమిత్‌షా ను క‌లిశారు. దీంతో సీన్ మొత్తం మారిపోయింది. ఇంత‌కీ ఢిల్లీలో ఏం జ‌రిగింది? ఈట‌ల ఆగం అయిన‌ట్టేనా? ఢిల్లీ రాజ‌కీయం ఇలానే ఉంటుందా? భ‌విష్య‌త్ అవ‌స‌రాల కోసం ప్ర‌స్తుత రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌ను వ‌దులుకుంటున్నారా? ఆ పొలిటిక‌ల్ గేమ్‌లో ఈట‌ల రాజేంద‌ర్ బ‌లి ప‌శువుగా మార‌నున్నారా? అంటే ప‌రిస్థితులు అలానే ఉన్నాయంటున్నారు విశ్లేష‌కులు. హుజురాబాద్‌లో ఈట‌ల‌-బీజేపీ ఫుల్ జోష్ మీదున్నారు. ఇప్ప‌టికిప్పుడు ఎల‌క్ష‌న్స్ జ‌రిగితే క‌మ‌లం పార్టీదే గెలుప‌ని అంటున్నారు. అయితే, ఆ ఇప్ప‌టికిప్పుడు ఎల‌క్ష‌న్స్ అనే ద‌గ్గ‌రే కేసీఆర్ త‌న‌దైన మార్క్ రాజ‌కీయం ప్ర‌ద‌ర్శించార‌ని అనుమానిస్తున్నారు. ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ శ‌నివారం ఉద‌యం ప్ర‌ధాని మోదీని క‌లిశారు.. ఆ త‌ర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. సాయంత్రం ఎన్నిక‌ల క‌మిష‌న్ నుంచి బెంగాల్‌, ఒడిషాలో జ‌రగాల్సిన ఉప ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ విడుద‌లైంది. హుజురాబాద్ బై పోల్ మాత్రం వాయిదా పడింది. సీఈసీ ఇచ్చిన బై ఎల‌క్ష‌న్ జాబితాలో హుజురాబాద్ లేకపోవ‌డం వెనుక కీల‌క రాజ‌కీయం న‌డిచింద‌ని అంటున్నారు. కేంద్రం త‌లుచుకుంటే.. హుజురాబాద్‌కు ఎన్నిక వ‌చ్చుండేది. కేంద్రం అలా త‌లుచుకోకుండా చేయ‌డంలో కేసీఆర్ స‌క్సెస్ అయ్యార‌ని అంటున్నారు.  సెప్టెంబ‌ర్‌లోనే హుజురాబాద్ ఉప ఎన్నిక అని మొద‌టి నుంచీ ప్ర‌చారం జ‌రిగింది. ఎన్నిక‌ల‌కు స‌మ‌యం లేనందనే ఆందోళ‌న‌తోనే సీఎం కేసీఆర్ ఎలాంటి క‌స‌ర‌త్తు లేకుండా హ‌డావుడిగా ద‌ళిత‌బంధుకు శ్రీకారం చుట్టేశారు. సెప్టెంబ‌ర్‌లోనే ఎన్నిక‌ల‌నే లీకుల‌తోనే కేండిడేట్‌ను కూడా ప్ర‌క‌టించేశారు. కానీ, ఈ నెల‌లోనే ఎల‌క్ష‌న్ జ‌రిగితే ఈట‌ల‌కే విజ‌యావ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయంటూ స‌ర్వేలు తేల్చ‌డంతో.. వెంట‌నే వ్యూహం మార్చేసి.. ఢిల్లీ వెళ్లేసి.. కేంద్ర పెద్ద‌ల‌ను క‌లిచేసి.. త‌న‌దైన స్టైల్‌లో మేట‌ర్ డీల్ చేశార‌ని చెబుతున్నారు.  తెలంగాణ‌లో కాంగ్రెస్ ఫుల్ జోష్ మీదుంది. రేవంత్‌రెడ్డి దూకుడు ప్ర‌గ‌తిభ‌వ‌న్‌కు ద‌డ‌పుట్టిస్తోంది. ప్ర‌జ‌ల్లో రేవంత్ క్రేజ్ మామూలుగా లేదు. రేవంత్ నాయ‌క‌త్వంలో కాంగ్రెస్ పున‌ర్‌వైభ‌వం దిశ‌గా అడుగులేస్తోంది. ఈ ప‌రిణామం టీఆర్ఎస్‌ కంటే బీజేపీ ఎదుగుద‌ల‌కు తీవ్ర విఘాతం అంటున్నారు. కాంగ్రెస్ ఎంత బ‌ల‌ప‌డితే బీజేపీగా అంత న‌ష్ట‌పోతుంది. తెలంగాణతో పాటు దేశ‌వ్యాప్తంగా బీజేపీ వ్య‌తిరేఖ ప‌వ‌నాలు వీస్తుండ‌టం.. ఆ పార్టీని క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తోంది. బీజేపీ ఏకైక ల‌క్ష్యం.. కాంగ్రెస్ ముక్త్ భార‌త్.. కాబ‌ట్టి ఆ అస‌లైన టార్గెట్ రీచ్ అవ‌డానికి.. కొన్ని సంద‌ర్భాల్లో కాంప్ర‌మైజ్ కాకతప్ప‌ని ప‌రిస్థితి. అందుకే, తెలంగాణ‌లో రేవంత్‌రెడ్డి నాయ‌క‌త్వంలో మ‌ళ్లీ ఎమ‌ర్జ్ అవుతున్న‌ కాంగ్రెస్‌ను తొక్కేయాల‌నేది ఢిల్లీ నాయ‌క‌త్వం వ్యూహం. వారికి కేసీఆర్ కంటే కాంగ్రెస్సే ప్ర‌ధాన శ‌త్రువు. కేంద్రానికి ఎప్పుడు ఏ అవ‌స‌రం వ‌చ్చినా కేసీఆర్ బీజేపీకి మ‌ద్ద‌తు ఇస్తారు. కాంగ్రెస్ అలా కాదు. అందుకే, జాతీయ నాయ‌క‌త్వానికి కేసీఆర్ కంటే రేవంత్‌రెడ్డినే ఎక్కువ టార్గెట్. ఇలాంటి రాజ‌కీయ అవ‌స‌రాల‌న్నిటినీ మోదీ, అమిత్‌షాల‌ దృష్టికి తీసుకొచ్చారట కేసీఆర్‌. భ‌విష్య‌త్తులో త‌న‌ను త‌మ‌కు ఇష్టం వ‌చ్చిన‌ట్టు వాడేసుకోవ‌చ్చ‌ని.. ఇప్ప‌టికి మాత్రం ఈట‌ల‌ను త‌న‌కు వ‌దిలేయమ‌ని చెప్పిన‌ట్టు స‌మాచారం.  త‌న‌కు బీజేపీతో వైరం లేకున్నా.. ఈట‌ల రాజేంద‌ర్‌తో ఉన్న వ్య‌క్తిగ‌త వైష‌మ్యాల దృష్ట్యా ఆయ‌న్ను ఓడించి తీరాల్సిన త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల‌ను మోదీ, అమిత్‌షాల‌కు వివ‌రించార‌ట కేసీఆర్‌. ఇద్ద‌రం క‌లిసి కాంగ్రెస్‌ను ఖ‌తం చేద్దాం.. అందుకు ఈట‌ల గెలుపును బీజీపీ వ‌దులుకోవాల‌ని.. హుజురాబాద్ ఉప ఎన్నిక ఇప్ప‌ట్లో జ‌ర‌గ‌కుండా సాధ్య‌మైనంత ఆల‌స్యం చేయాల‌నే.. క్విడ్ ప్రోకో డీల్‌కు బీజేపీ-టీఆర్ఎస్ వ‌చ్చింద‌ని చెబుతున్నారు. అందుకే, మోదీ అమిత్‌షాల‌తో మీటింగ్ త‌ర్వాత వ‌చ్చిన ఈసీ ప్ర‌క‌ట‌న‌లో హుజురాబాద్ లేకుండా పోయింద‌ని.. ఆఖ‌రి నిమిషంలో అది జాబితా నుంచి మాయ‌మైపోయింద‌నేది ఢిల్లీ వ‌ర్గాల స‌మాచారం. ఎన్నిక ఎంత ఆల‌స్య‌మైతే ఈట‌ల‌కు అంత మైన‌స్‌.. కారుకు అంత ప్ల‌స్ అనే కేసీఆర్ అంచ‌నా నిజ‌మ‌వుతుందో.. లేక‌, పెద్ద‌లు ఎలా త‌ల‌చినా ఓట‌ర్లు మాత్రం బీజేపీనే గెలిపించి ఈట‌ల‌ను అక్కున చేర్చుకుంటారో చూడాలి. 

హిందూ సంప్రదాయాలు ధ్వంసం.. క్రైస్తవ రాష్ట్రంగా ఏపీ! 

వినాయక చవితి వేడుకలపై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు పెట్టడంపై హిందూ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. హిందూ పండుగులపై కావాలనే వివక్ష చూపిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వినాయక చవితి వేడుకలను ఇండ్లలోనే జరుపుకోవాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయంపై స్వామిజీలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఏపీలో హిందూ సంప్రదాయాలను ధ్వంసం చేయాలని జగన్ సర్కార్ చూస్తోందని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనాను అడ్డుపెట్టుకుని వినాయక చవితి పండుగను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూత్వం మీద ఎందుకు కుట్రలు పన్నుతున్నారని ప్రశ్నించారు  శ్రీనివాసానంద సరస్వతి.  వైఎస్సార్ జయంతి కార్యక్రమాలకు కరోనా అడ్డు రాలేదా అని శ్రీనివాసానంద సరస్వతి ప్రశ్నించారు. గణపతి నవరాత్రులకు ఆంక్షలు పెట్టడం ఏమిటని, ఏ పీఠాధిపతులను సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నారని నిలదీశారు. జెరూసలెంకు కుటుంబ సభ్యులతో వెళ్లే సీఎం జగన్ హిందూ దేవాలయాలకు కుటుంబసమేతంగా ఎందుకు వెళ్లడం లేదన్నారు  శ్రీనివాసానంద సరస్వతి. హిందూత్వాన్ని జగన్ గౌరవించడం లేదన్నారు. ఏపీని క్రైస్తవ రాష్ట్రంగా మారుస్తున్నారని ఆరోపించారు. వినాయక చవితి వేడుకలపై పక్క రాష్ట్రంలో లేని ఆంక్షలు ఏపీలోనే ఎందుకని శ్రీనివాసానంద సరస్వతి స్వామి ప్రశ్నల వర్షం కురిపించారు. వినాయక చవితి ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలని, లేకపోతే భక్తులు తిరగబడతారని హెచ్చరించారు. వినాయక చవితి ఉత్సవాలపై ఆంక్షలు విధిస్తే జగన్ రాజగురువు శారదా పీఠం స్వామీజీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.

పంజ్‌షేర్‌లో తాలిబ‌న్లు ఫ‌స‌క్‌.. ముష్క‌రుల‌కు పాక్ స‌పోర్ట్‌!

పిచ్చోళ్లంతా ఒక్క‌చోట చేరారు. ముష్క‌ర మూక‌లంతా అఫ్గ‌నిస్తాన్‌ను అడ్డాగా చేసుకున్నారు. ఎక్క‌డెక్కడో ఉన్న ఉగ్ర‌వాదులంతా కాబూల్‌లో తిష్ట‌వేశారు. తాలిబ‌న్ల పంచ‌న చేరి ఎవ‌రికి వారే ఉగ్ర‌వాదాన్ని ఎగ‌దోస్తున్నారు. మొత్తం అఫ్గ‌న్‌లో వారికి కొరుకుడుప‌డ‌ని ఏకైక ప్రాంతం..పంజ్‌షేర్‌. అదొక్క‌డి కైవ‌సం చేసుకుంటే.. ఇక పాపిష్టి మూక‌కు తిరుగుండ‌దు. కానీ, పంజ్‌షీర్ అంత ఈజీగా వారికి చేజిక్క‌డం లేదు. ఆ లోయ‌లోకి వెళ్లిన‌వారంతా.. అట్నుంచి అటే పైకిపోతున్నారు. ఇప్ప‌టికే వంద‌లాది మంది తాలిబ‌న్లు పంజ్‌షీర్ యోధుల దెబ్బ‌కు హ‌త‌మ‌య్యారు. మ‌రోవైపు.. ఈ నెల గ‌డిస్తే ఇక పంజ్‌షేర్‌లో అడుగుకూడా పెట్ట‌లేరు. అందుకే, స‌మ‌యం లేదు మిత్ర‌మా అంటూ తాలిబ‌న్లు, ఐసిస్‌, ఆల్‌ఖైదా ఉగ్ర‌వాదులంతా ఏక‌మై.. లోయ‌పై యుద్ధానికి దిగారు. వారికి నేరుగా పాకిస్తాన్ ఆర్మీ స‌పోర్ట్ చేస్తోంద‌ని అంటున్నారు. ఇంతా చేసినా.. పంజ్‌షేర్ సింహాల ముందు వీరి ప‌ప్పులేమీ ఉడ‌కడం లేదు. తాజాగా, ఏకంగా 600మంది తాలిబ‌న్లు హ‌త‌మ‌య్యారు. మ‌రో 1000 మందిని పంజ్‌షేర్ ద‌ళాలు బంధీగా మార్చేశాయి. ‘నార్తర్న్‌ అలయెన్స్’ పేరుతో ఉన్న ట్విటర్‌ అనధికారిక ఖాతాలో ఈ విషయాలు ఉన్నాయి. పంజ్‌షేర్‌ సైతం తాలిబన్ల వశమైందంటూ వార్తలు వస్తుండ‌గా ఈ విషయాలు వెలుగులోకి రావడం ఆస‌క్తిక‌రం. ప్రస్తుతం పర్యాన్‌ జిల్లాలో తాలిబన్లు, రెసిస్టెన్స్ దళాల మధ్య పోరాటం కొనసాగుతోంది. రెసిస్టెన్స్ దళాలు అత్యాధునిక డ్రోన్లు, బాంబులు వినియోగిస్తున్నారు. పంజ్‌షేర్‌కు ప్రవేశించే మార్గాల్లో ల్యాండ్‌మైన్స్‌ ఏర్పాటు చేయడంతో తాలిబన్లు ముందుకు క‌ద‌ల‌లేక పోతున్నార‌ట‌. అందుకే, పాకిస్థాన్‌కు చెందిన గూఢచార సంస్థ ఐఎస్‌ఐ.. తాలిబ‌న్ల‌కు మ‌ద్ద‌తుగా రంగంలోకి దిగింద‌ని అంటున్నారు. తాలిబన్‌ బద్రి 313 పేరిట 570 మంది పాకిస్థాన్ ప్రత్యేక దళాలు, అల్‌ ఖైదా, ఐసిస్‌ వంటి ఉగ్రవాదులు ప్రావిన్స్‌పై దాడికి దిగుతున్నట్లు నార్తర్న్‌ అలయెన్స్‌ ఆరోపించింది. పంజ్‌షేర్‌పై దాడి చేస్తున్న తాలిబన్‌ దళాలకు పాక్‌ ఐఎస్‌ఐ హెడ్‌ నేరుగా మార్గనిర్దేశం చేస్తున్నార‌ని తెలుస్తోంది. అయితే, ఇటీవల కాబుల్‌ చేరుకున్న ఐఎస్‌ఐ హెడ్‌ మాత్రం తాను తాలిబన్లను కలవడం లేదని తెలిపారు.  తాలిబ‌న్ల టెన్ష‌న్ అంతా రానున్న చ‌లికాలం గురించే అంటున్నారు. అందుకే, ఆ లోగా పంజ్‌షేర్‌ను ఎలాగైనా అక్ర‌మించుకోవాల‌ని తెగ ఆరాట‌ప‌డుతున్నారు. అక్టోబర్‌ నాటికి లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైతే.. పంజ్‌షేర్‌ ముట్టడి తాలిబన్లకు మరింత కష్టంగా మారుతుంది. చలికాలంలో దళాల కదలికలు అసాధ్యంగా మారే అవకాశం ఉంది. కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయిలో మనుగడలోకి రావడానికి ముందే అహ్మద్‌ మసూద్‌ నేతృత్వంలోని యాంటీ తాలిబన్‌ దళాలను అణగదొక్కాలని భావిస్తున్న ముష్క‌రుల‌కు పంజ్‌షేర్ నుంచి తీవ్ర ప్ర‌తిఘ‌ట‌న ఏర్ప‌డుతోంది. వంద‌ల్లో తాలిబ‌న్లు హ‌త‌మ‌వుతుండ‌టంతో ఫ్ర‌స్టేష‌న్‌కి గుర‌వుతున్నారు ముష్క‌రులు.  

జగనన్న కాలనీలో వరి సాగు..

పేదలందరికి ఇల్లు కట్టి ఇస్తామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. 25 లక్షల మందికి ఇండ్ల పట్టాలు పంపిణి చేశామని.. అందులోనే రెండు దశలో ఇండ్లు నిర్మిస్తామని ప్రకటిస్తోంది. ఇప్పటికే లక్షలాది ఇండ్ల నిర్మాణం మొదలైందని కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు ఏపీ మంత్రులు చెబుతున్నారు. కాని క్షేత్రస్థాయిలో మాత్రం సీన్ మరోలా ఉంది.జగనన్న కాలనీలు ప్రకటించిన ప్రాంతాలు వరదతో నిండిపోయాయి. మరికొన్ని చోట్ల చెరువులుగా మారిపోయాయి. పేదలకు ఇచ్చిన స్థలాల్లో వెంటనే ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలని అధికారులు హడావుడి చేస్తుండగా.. విజయనగరం జిల్లాలో గనన్న కాలనీలో ఓ రైతు ఏకంగా వరి సాగు చేపట్టాడు.  పార్వతీపురం మండలం నర్సిపురం గ్రామ పంచాయతీలోని సర్వే నం.388/5 పరిధిలో పేదలకు స్థలాలు ఇచ్చారు. హద్దురాళ్లు కూడా వేశారు. అక్కడే 20 సెంట్లలో గ్రామానికి చెందిన రైతు సీహెచ్‌ రాజు వరి సాగు చేస్తున్నాడు. తనకున్న 35సెంట్లలో 15సెంట్ల స్థలాన్ని లేఅవుట్‌ కోసం ఇచ్చానని, అయితే రోడ్డుకు ఆనుకుని ఉన్న తన భూమిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారని రాజు అంటున్నారు.తన భూమిలో తాను పంట వేశానని చెబుతున్నాడు.  ప్రధాన రహదారి పక్కనే జగనన్న కాలనీ లేఅవుట్‌లో రైతు వరి సాగు చేస్తున్నా అధికారులు చర్యలు తీసుకోలేదు. కాగా, పేదల కోసం ఆ భూమిని సేకరించామని, చెల్లింపులు కూడా పూర్తయ్యాయని తహసీల్దార్‌ వెంకటరమణ చెప్పారు. ఆ భూమి ఇవ్వలేదని రాజు అంటున్నట్లు తనదృష్టికి వచ్చిందని, సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటన ఇప్పుడు జిల్లాలో సంచలనంగా మారింది. జగనన్న కాలనీలో జగనన్న పంట అంటూ కొందరు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. 

వినాయక చవితి వేడుకలపై ఆంక్షలు... జగన్ సర్కార్ కు హిందూ పండుగలపైనే వివక్షా?

ఆంధ్రప్రదేశ్ లో వినాయక చవితి వివాదం ముదురుతోంది. జగన్ సర్కార్ తీరుపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వినాయక చవితి ఉత్సవాలను ఇళ్లకే పరిమితం చేయాలని అధికారులను ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. బహిరంగ స్థలాల్లో విగ్రహాలు పెట్టవద్దని, నిమజ్జన ఊరేగింపులు కూడా చేయకూడదని ప్రభుత్వం తెలిపింది. ఎవరికి వారు ఇళ్లల్లోనే జరుపుకోవాలని స్పష్టం చేసింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూను మరికొద్ది రోజులు పొడిగిస్తున్నట్లు కూడా ఏపీ సర్కార్ ప్రకటించింది. ప్రజారోగ్యం దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోక తప్పదని సీఎం జగన్ స్పష్టం చేశారు.  వినాయకుడి ఉత్సవాలకు మాత్రం కొవిడ్ పేరు చెప్పి ఆంక్షలు పెడుతున్న ప్రభుత్వం.. ఇతర విషయాల్లో ఏం జాగ్రత్తలు పాటిస్తోందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆలయాల్లో భక్తుల సందర్శనలు ఆగడం లేదు, చర్చిల్లో ఆదివారం ప్రార్థనలు ఆగడం లేదు. జగన్ సర్కార్ తీరుపై హిందూ సంఘాలు, బీజేపీ నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. హిందూ పండుగలపై వివక్ష చూపుతున్నారని, కావాలనే కొవిడ్ పేరుతో ఆంక్షలు విధించారని ఆరోపిస్తున్నాయి. కొవిడ్ కారణంగా వినాయక చవితి వేడుకలకు ఇండ్లలో జరుపుకోవాలని చెబుతున్న జగన్ ప్రభుత్వం.. ఇతర వర్గాల పండుగలకు ఎందుకు అనుమతి ఇచ్చారనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇటీవలే మొహర్రం వేడుకలను ఘనంగా నిర్వహించారని, పెద్ద ఎత్తున ర్యాలీలు తీశారని బీజేపీ నేతలు చెబుతున్నారు. గుడ్ ఫ్రైడే రోజున వందలాది మంది ఒకే చోట గుమిగూడి వేడుకలు చేసుకున్నారని గుర్తు చేస్తున్నారు. అప్పుడు లేని ఇబ్బందులు వినాయక చవితి పండుగగే ఎందుకని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు సెప్టెంబర్ 2న దిగంవత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతిని వైసీపీ నేతలు, కార్యకర్తలు ఊరువాడా నిర్వహించారు. సభలు, సమావేశాలు పెట్టారు. పెద్ద ఎత్తున ర్యాలీలు కూడా తీశారు. వర్దంతి జరుపుకోవడానికి లేని అంక్షలు హిందూ పండుగైన వినాయక చవితిపైనే ఎందుకనే బీజేపీ నేతలు ఏపీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఏపీలో స్కూళ్లను కూడా ఓపెన్ చేశారు. విద్యార్థుల హాజరు కూడా బాగానే ఉంది. నిజానికి థర్డ్ వేవ్ వస్తుందన్న వైద్య నిపుణుల హెచ్చరికలతో స్కూళ్లు ఇప్పుడే తెరవద్దని జనాలు కోరుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేశారు. కాని జగన్ సర్కార్ మాత్రం మొండిగా ముందుకు వెళ్లింది. విద్యాసంస్థలను తెరిచింది. స్కూల్స్ తెరిచాకా కరోనా కేసులు కూడా నమోదవుతున్నాయి. స్కూల్స్ తెరిచినప్పుడు.. వినాయక చవితిపైనే ఎందుకు ఆంక్షలు విధించారన్నది హిందూ సంఘాల ప్రశ్న,  ఏపీ సర్కార్ తీరును బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. వినాయక చవితి వేడుకలపై విధించిన ఆంక్షలను వెంటనే రద్దు చేయాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు బహిరంగ ప్రకటన విడుదల చేశారు. ఒకవైపు వ్యాక్సిన్‌ వేస్తూ, మరోవైపు కరోనా తగ్గిందని చెబుతున్న ప్రభుత్వం మళ్లీ ఆంక్షలు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు బీజేపీ నేతలు. ప్రభుత్వ ఆంక్షలపై ఏకంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు సోము వీర్రాజు. ఇడుపులపాయలో లేని ఆంక్షలు వినాయక చవితికి ఎందుకని ప్రశ్నించారు బీజేపీ జాతీయ నాయకురాలు పురంధేశ్వరి. జగన్ ప్రభుత్వంపై ఉద్యమానికి కూడా సిద్ధమవుతున్నారు.హైదరాబాద్ తర్వాత కర్నూల్ లో గణేష్ నిమజ్జనోత్సవం వైభవంగా సాగుతుంది. దీంతో ఏపీ బీజేపీ నేతలు కర్నూల్ లో సమావేశం నిర్వహిస్తున్నారు.  కరోనా పేరుతో వినాయక భక్తుల పై ఆంక్షలు సరికాదని, ఉత్సవాలకు నిమజ్జన ఊరేగింపు లకు అనుమతించాలని డిమాండ్ చేస్తున్నారు.   మరోవైపు ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై జనాల నుంచి వ్యతిరేకత వస్తోంది. కొవిడ్ నేపథ్యంలో జనం గుమికూడకుండా, ప్రమాదం పొడసూపకుండా జాగ్రత్తలు తీసుకోవడం వేరు. కానీ.. అసలు చవితి ఉత్సవాలను నిర్వహించే అవకాశమే లేకుండా ఆంక్షలను విధించడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.  వినాయక చవితి అంటే కులమతాలకు అతీతంగా అందరూ కలిసి జరుపుకునే అరుదైన పండుగ. ఏ కాలనీలో జరిగే ఉత్సవాల్లో అయినా హిందువులతో పాటు, ముస్లిములు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటూనే ఉంటారు. ఒక పందిరి వేసి వినాయకుడిని ప్రతిష్టించి జనం లేకుండా అయినా సరే.. పూజలు చేసి వేడుక చేసుకోవడం ప్రతిచోటా ప్రజలకు ఒక సెంటిమెంట్ గా మారిపోయిన విషయం. అలాంటిది పూర్తి నిషేధం అనేది ప్రజలకు బాధగా ఉంది. వినాయకచవితి ఉత్సవాలు నిర్వహిస్తే.. పబ్లిక్ స్థలాల్లో ఏర్పాటుచేసే పందిర్ల వద్ద వాలంటీర్లు, పోలీసులతో నియంత్రణకు కొన్ని ఏర్పాట్లు చేస్తే జనం ఎక్కువ రాకుండా చేయడం చాలా చిన్న పని. అలాంటి జాగ్రత్తలకు సంబంధించిన ఏర్పాట్ల గురించి ఆలోచించకుండా.. ఏకంగా ఉత్సావాలనే రద్దు చేయాలని సీఎం జగన్ నిర్ణయించడంపై ప్రజలు మండిపడుతున్నారు. 

జగనన్న సర్కార్ రోడ్ల స్పెషల్.. రన్నింగులోనే ఊడుతున్న బస్సు చక్రాలు

ఆంధ్రప్రదేశ్ లో రహదారులు అధ్వాన్నంగా తయారయ్యాయనే విమర్శలు వస్తున్నాయి. గతుకుల రోడ్లకు సంబంధించి జనాలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పాడై పోయిన రోడ్లు ఫోటోలు, వీడియోలు పోస్టూ చేస్తూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడుగుకో గుంత, గజానికో గొయ్యిలా రోడ్లు తయారయ్యాయని.. పట్నం, పల్లె తేడా లేకుండా ఎక్కడ చూసినా అధ్వాన్న రోడ్లే  కనిపిస్తున్నాయని చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై కార్లు పడిపోయే సైజులో గుంతలు ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించచ్చు.  గతుకుల రోడ్లపై ప్రయాణిస్తూ వేలాది మంది జనాలు హాస్పిటల్ పాలవుతున్నారు. దీంతో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పిలుపుతో జన సైనికులు అధ్వాన్న రోడ్లను బాగు చేయాలంటూ రోడ్డెక్కారు. జనసేన ఆన్ లైన్ ఉద్యమం ప్రారంభించింది. దీంతో ఏపీలో అధ్వాన్నపు రహదారులపై #JSPForAP_Roads హ్యాష్ ట్యాగ్ తో రెండు రోజుల్లో దాదాపు 2 లక్షల ట్వీట్స్ వచ్చాయి. గుంతల మధ్య రోడ్లను కళ్ళకు కట్టేలా ఉన్న ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో జనాలు అప్ లోడ్ చేశారు. జగన్ రెడ్డి పాలనలో రోడ్ల దుస్థితిపై జనసేన చేపట్టిన ఉద్యమం ట్విట్టర్ ట్రెండింగ్ లో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో, జాతీయ స్థాయిలో 5వ స్థానంలో నిలిచింది. ఏపీలో రోడ్లు ప్రమాదకరంగా మారాయని విపక్షాలు చెబుతున్నట్లే.. వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో ఆర్టీసీ బస్సు చక్రాలు రన్నింగులో ఉండగానే ఊడిపోవడం కలకలం రేపుతోంది. తూర్పుగోదావరి జిల్లా గోకవరం నుండి మారేడుమిల్లి మీదుగా గుర్తేడు వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు వెనక చక్రాలు ఊడిపోయాయి.. వై. రామవరం మండలం ఎడ్లకొండ వద్దకు బస్సు రాగానే.. రెండు వెనుక చక్రాలు ఒక్కసారిగా బస్సు నుంచి విడిపోయాయి.. పెద్దశబ్దం రావడంతో బస్సులో ఉన్నవారితో పాటు స్థానికులు కూడా భయాందోళనకు గురయ్యారు.. బస్సులో ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు.  ఆర్టీసీ బస్సు చక్రాలు ఊడిపోయిన ఘటనపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు ఆయన ట్వీట్ చేశౄరు. ఓ ఆర్టీసీ బస్సు వెనుక చక్రాలు ఊడిన స్థితిలో రోడ్డుపై నిలిచిపోయి ఉన్న ఫొటోను ఆయన షేర్ చేశారు. దెబ్బతిన్న రోడ్ల దుష్ఫలితం అని బస్సు పరిస్థితిపై నాదెండ్ల అన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో గోకవరం నుంచి గుర్తేడు పాతకోట వెళ్లే బస్సు వెనుక చక్రాలు ఊడిపోయాయని వెల్లడించారు. ఆ రోడ్డు ఎలా ఉందో చూడండి అంటూ ఫొటోలు ట్వీట్ చేశారు.  

ఉప ఎన్నికలకు భయపడుతున్నారా? జగన్, కేసీఆర్ వ్యూహమేంటీ? 

అటు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, ఇటు తెలంగాణ ప్రభుత్వం కరోనా ఒక ముగిసిన అధ్యాయం అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే, కరోనాతో సహజీవనం తప్పదని ఎప్పుడోనే తేల్చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో బడులు, గుడులు, సినిమా ధియేటర్లు ... బార్లు... అన్నీ బార్లా తెరిచారు. తెలంగాణలో అయితే, రాజకీయ జాతరలు కూడా జోరుగా సాగుతున్నాయి. అయినా, అక్కడ ఏపీలో ఒకటి (బుద్వేల్) ఇక్కడ (హుజూరాబాద్) అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల విషయంలో మాత్రం, వామ్మో ... కరోనా అంటూ భయాన్ని ప్రదర్శిస్తున్నారు. ఉప ఎన్నికలు నిర్వహించడం ఇప్పట్లో అయ్యే పని కాదని, చేతు లెత్తేశారు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలు దసరా తర్వాతే నిర్వహిస్తామని ప్రకటించింది.  తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిజానికి కరోనాకు భయపడతున్నారా లేక జనానికి భయపడుతున్నారా? అంటే, రెండవదానికే అనుకోవలసీ వస్తోంది. ముందు ముందు ఎలా ఉంటుందో తెలియదు కానీ, ప్రస్తుతానికి అయితే, రెండు రాష్ట్రాలలో కరోనా కొంచెం అటూ ఇటుగా చాలా వరకు కంట్రోల్లోనే ఉందని ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాలు సూచిస్తున్నాయి.  అదెలా ఉన్నా, అక్కడ ఇక్కడ రెండు రాష్ట్రాలలో ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాల అభ్యర్ధనలను కాదనలేక కేజీ టూ పీజీ తరగతుల విద్యార్ధులకు ఒకేసారి ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాయి. విద్యావ్యాపారం మాత్రమే కాదు, అన్ని ఆర్థిక కార్యకలాపాలు సాగిపోతూనే ఉన్నాయి. తెలంగాణలోనే కాదు, ఏపీలో కూడా  ఒక్క వినాయక చవితి మినహా అన్ని మతపరమైన, ఊరేగింపులు ఇతరేతర  కార్యక్రమాలకు  రాష్ట్ర ప్రభుత్వం పచ్చ జెండా ఉపింది.  తెలంగాణలో హుజూరాబాద్ ఉపఎన్నికలో ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ముఖ్యమంత్రి కేసీఆర్, తమ శక్తి యుక్తులు అన్నిటినీ ఉపయోగిస్న్తున్నారు. నిధులు ప్రవాహం, దళిత బంధు, పదవుల పందారం, పెన్షన్లు, రేషన్ కార్డులు ఒకటని కాదు చేతిలో ఉన్న అధికారం మొత్తాన్ని ఇష్టారాజ్యంగా ఉపయోగించుకుంటున్నారు. రాజకీయంగానూ సొంత పార్టీ స్థానిక నాయకులు మొదలు, పక్క పార్టీల నాయకులను కారెక్కించి, రేటు ఎంతైనా డోంట్కేర్ అంటూ కండువాలు కప్పేస్తున్నారు. ఇంతచేసినా, ఎక్కడో ఏదో అనుమానం, ఓటమి తధ్యం అన్న భయం ఆయన్ని వెంటాడుతున్నాయి కావచ్చు, అందుకే, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాలేంని చేతులెత్తేసింది.  ఇక ఏపీ విషయానికి వస్తే, ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో అధికార వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య అకాల మరణంతో బద్వేల్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అన్వర్యమైంది , నిజానికి, హుజూరాబాద్ ఉప ఎన్నికకు డిసెంబర్ 12 వరకు  సమయముంది, కానీ బద్వేల్ నియోజకవర్గంలో ఆరు నెలల గడువు సెప్టెంబర్ 28తో ముగుస్తోంది. అయినా, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి  ఎన్నికల సంఘాన్ని ఉప ఎన్నిక వాయిదా కోరారంటే, ఓడిపోతామనే భయమే కానీ, కరోనా కారణం కాదని వేరే చెప్పనక్కరలేదని,పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో, అధికార పార్టీలో చాలా కాలంగా సాగుతున్నఅంతర్గత పోరు ఇటీవల కాలంలోతారాస్థాయికి చేరింది. స్వపక్షలో విపక్షం ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి తలనొప్పిగా మారింది. పార్టీలోని ప్రత్యర్ధి వర్గాలు ఒఅక్రిపై ఒకరు కత్తులు దూస్తున్నారు. బద్వేల్ సహా ఇంచుమించుగా జిల్లాలోని అన్ని నియోజక వర్గాలలో రాజకీయ అదుపత్య పోరు రక్తి కట్టిస్తోంది. రాజకీయ ఆధిపత్యంతో పాటుగా  కాంట్రాక్టుల వరకు పార్టీ నాయకులు తగవు పడుతున్నారు. మరోవంక, ముఖ్యమంత్రి బాబాయ్ ముదర్ కేసు విచారణ కొత్త మలుపులు తిరుగుతోంది. అలాగే, వైఎస్ ఫ్యామిలీలో కుటుంబ తగవులు కూడా కొత్త సమస్యలు తెచ్చి పెడుతోంది.    మరోవైపు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికకు చాలా ముందుగానే దూకుడు పెంచారు. ఉప ఎన్నికకు చంద్రబాబు నాయుడు పార్టీ అభ్యర్ధిని ఖరారు చేసేశారు. ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా 2019 పోటీచేసిన ఓబులాపురం రాజశేఖర్‌ను బరిలో దింపనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. గత ఎన్నికల్లో ఓటమి చవిచూసినా మరీనా పరిస్థితులలో టీడీపీ అభ్యర్ధి గట్టిపోటీ ఇస్తారని పార్టీ వర్గాలు బావిస్తున్నాయి.దీంతో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి  సొంత గడ్డపై మరో రసవత్తర రాజకీయ పోరుకు రంగం సిద్దమైంది. ఇంకా వేడి రాచుకోకపోయినా, ముందు ముందు మరో హుజూరాబాద్ గా మారినా ఆశ్చర్య పోనవసరం లేదని అంటున్నారు.

ఎమ్మెల్యే తల్లికి పింఛన్! వారెవా.. జగనన్న సర్కార్ 

ఆంధ్రప్రదేశ్ లో అన్ని సంచలనాలే. జగన్ రెడ్డి సర్కార్ పథకాలు.. వాటి అమలు తీరు అన్ని వివాదాస్పదమే. అందుకే హైకోర్టు కూడా మొట్టికాయలు వేస్తోంది. ప్రభుత్వం తీసుకున్న చాలా నిర్ణయాలను కొట్టి  వేసింది. అయినా జగన్ ప్రభుత్వం తీరు మారడం లేదు. దీంతో రోజుకో సర్కార్ నిర్వాకం బయటికి వస్తూనే ఉంది. తాజాగా ఏ ఎమ్మెల్యే తల్లికి వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్న విషయం వెలుగులోనికి వచ్చింది.  ఆయన ఒకటి కాదు రెండు కాదు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీ సీనియర్ నేతల్లో ఒకరు. ఆయన ఖరీదైన కార్లతో తిరుగుతారు, అయినా ఆ ఎమ్మెల్యే తల్లికి వృద్ధాప్య పెన్షన్ వస్తోంది.కడప జిల్లా రైల్వే కోడూరు వైసీపీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు తల్లి తులశమ్మకు పింఛన్లు ఇష్తున్న విషయం తాజాగా బయటపడింది. ఒక ఎమ్మెల్యే తల్లికి అధికారులు పింఛన్ ఇవ్వడం దుమారం తీవ్ర కలకలం రేపుతోంది. ఏపీలో చాలా మంది అర్హులైన వృద్ధులకు పింఛన్ రావడం లేదు. పింఛన్ కోసం వాళ్లంతా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. పింఛన్ ఇవ్వండి సార్లూ అంటూ కాళ్లా వేళ్లా పడుతున్నారు. అయినా కనికరించడం లేదు అధికారులు. అర్హులైన వారికి పింఛన్లు ఇవ్వడం లేదని రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నేతలు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పంతగాని నరసింహప్రసాద్ తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే శ్రీనివాసులు తల్లికి పింఛన్లు ఇస్తున్నారని.. అభాగ్యులకు తొలగిస్తున్నారని ఆరోపించారు. రైల్వే కోడూరు ఎంపీడీవో కార్యాలయానికి వృద్ధుడి వేషధారణలో వెళ్లి ఆయన వినూత్న నిరసన తెలిపి ఫిర్యాదు చేశారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేత తల్లికి ఇప్పటికీ పింఛన్ ఇస్తుండడం ఏమిటని అధికారులను ప్రశ్నించారు పంతగాని నరసింహప్రసాద్. ఆ ఎమ్మెల్యే రూ.కోటి విలువ చేసే కారులో తిరుగుతున్నా ఆయన తల్లికి పింఛన్ ఇస్తున్నారని.. పేదల పింఛన్లు తొలగిస్తున్నారని.. ఇది ఎంతవరకు న్యాయమని నిలదీశారు. పంతగాని నరసింహప్రసాద్ ఎంపీడీవో కార్యాలయంలో నిరసన వ్యక్తం చేసి వెళుతుండగా ఆయనను కొందరు వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

సోమరులను చేయకండి.. ముఖ్యమంత్రికి వాలంటీర్ వాత 

ముఖ్యమంత్రి గారు దయచేసి, పనికిరాని, ప్రయోజనం లేని పథకాలు తీసుకొచ్చి,ప్రజలను సోమరిపోతులను చేయకండి, అది మంచిది కాదు.. ఇది ఏ ప్రతిపక్ష నాయకుడో చేసిన విజ్ఞప్తో, విమర్శో కాదు. ముఖ్యమంత్రి మానస పుత్రిక, గ్రామ వాలంటీర్ వ్యవస్థలో పనిచేసిన అనుభవంతో, ఒక గ్రామ వాలంటీర్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చేసిన విజ్ఞప్తి. శ్రీకాకుళం జిల్లా ఎల్‌ఎన్‌ పేట మండలం రావిచెంద్రి గ్రామ సచివాలయానికి చెందిన గ్రామ వాలంటీరు చిట్టివలస కృష్ణ ఆవేదన తమ వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పెట్టిన లేఖ వైరల్‌ అయింది. నిజానికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రాజకీయ ప్రయోజనాలు, ఎన్నికల విజయాలు లక్యంె గా. ఓటు బ్యాంకు రాజకీయాల్లో భగంగా అమలు చేస్తున్న నవరత్నాలు సహా వివిధ సంక్షేమ పథకాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు భారం కావడం మాత్రమే కాకుండా, ప్రజలలో సోమరితనాన్ని పెంచుతున్నాయని ఎప్పటినుంచో ఇటు ప్రతిపక్ష పార్టీలు అటు రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉన్నారు. అయితే,ఒంటెద్దు పోకడలకు అలవాటుపడిన జగన్ రెడ్డి ప్రభుత్వం ఇవేవీ పట్టించుకోలేదు. అప్పులు చేసి మరీ ప్రజల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు బదిలీ చేస్తూ వస్తోంది. దానితో, ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పాట్లు తప్పి, రాష్ట్రం అప్పుల ఊబిలో కురుకు పోయింది. ఇప్పుడు రాష్ట్ర ప్రజల నెత్తిన ఉన్న తలసరి అప్పు లక్ష రూపాయలను దాటి పోయింది. అప్పులు పుట్టే పరిస్థితి కూడా లేదని, త్వరలోనే రాష్ట్ర దివాలా తీయడం ఖాయమని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.  అలాగని  సంక్షేమ పథకాలు వద్దని కాదు, ప్రజల సంక్షేమం ప్రభుత్వాల బాధ్యత, అందులో మరో అభిప్రాయం లేదు. అయితే, ఎట్లో పారేసినా ఎంచి పారేయాలని, అంటారు. గీత దాటి, సంక్షేమమే సర్వస్వం అన్నట్లుగా పేదప్రజలు శాశ్వతంగా చేయిచాపే విధంగా చేయడం మాత్రం సమర్ధనీయం కాదు. సంక్షేమ ఫలాలు అందుకునే వారు,ఎంతోకొంత కాలానికి తమ కాళ్ళ మీద తాము నిలబడేలా పథకాలు ఉండాలే కానీ, ఎప్పటికీ పేదలు పేదలుగానే ఉండేలా, ఉంచేలా పథకాలు ఉండకూడదు.  నిజానికి, సంక్షేమ పథకాల లక్ష్యం కూడా అదే. అందుకే రాజ్యాంగ నిర్మాతలు రిజర్వేషన్ల విషయంలో కూడా పదేళ్ళ కాలపరిమితిని విధించారు. అయినా  ఇప్పటికీ, రిజర్వేషన్లు, రిజర్వేషన్ రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి అనుకోండి, అది వేరే విషయం.  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాల లక్ష్యం, నిర్వచనం పూర్తిగా మార్చివేసింది. సంక్షేమ పథకాల అసలు లక్ష్యం పేదరిక నిర్మూలన,కానీ, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం పేదరికాన్ని పెంచి,  ఓటు బ్యాంక్’ను సుస్థిరం చేసుకునేందుకు, సక్షేమ పథకాలను ఉపయోగించుకుంటున్నారు. ఆలోచన రహితంగా అమలు చేస్తున్న సంక్షేమా పథకాల వలన,అర్హులైనా పేదల కంటే, అర్హతలు లేని అస్మదీయులు, అధికార పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారు.ఇదే  విషయాన్ని, వాలేంటీర్ కృష్ణ తమ లేఖలో పేర్కొన్నారు.పదెకరాల భూములు ఉన్నవారికి పింఛను అందుతోంది,కానీ నిరుపేదలు కొందరు పింఛనుకు దూరమయ్యారు. అలాగే, ఆయన తమ లేఖలో, సమస్యల మీద దృష్టిసారించి, యువతకు మంచి ఉద్యోగాలు కల్పించే దిశగా ఆలోచించాలి. నిత్యావసర సరకుల ధరలు తగ్గించాలని చక్కని సూచన కూడా చేశారు.  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మానసిక పుత్రిక గ్రామ వలెంటీర్ వ్యవస్థ అవినీతి మయం అయిందని సొంత పార్టీ ఎమ్మెల్యేలే విమర్శలు చేస్తున్నారు. సో .. ముఖ్యమంత్రి వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుచేసి వాలంటీర్ వ్యవస్థ మీద పునరాలోచాన చేయవలసిన అవసరం ఉందని అధికార వైసీపీ నాయకులు, కార్యకర్తలు అంటున్నారు.  

నన్ను చంపాలని చూస్తున్నారు! డీజీపీపై చింతమనేని సంచలన వ్యాఖ్యలు.. 

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులతో తనకు ప్రాణ హాని ఉందని కాబట్టి తనకు సీఆర్పీఎఫ్ బలగాలతో రక్షణ కల్పించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానన్నారు. మంగళగిరిలోని ఏపీ పోలీస్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ మీడియా సమావేశం నిర్వహించి, ఎవరిదైనా నేర చరిత్ర తెలుసుకోవడం ఎలాగో యాప్ ద్వారా ప్రత్యక్షంగా ప్రదర్శించారు. ఈ క్రమంలో ఎంటర్ ప్రైజెస్ సెర్చ్ లో టీడీపీ నేత చింతమేని ప్రభాకర్ పేరు టైప్ చేసి ఆయనపై ఉన్న కేసుల వివరాలను మీడియా ప్రతినిధులకు డెమో ఇచ్చారు. చింతమనేని బాగా ఫేమస్ కాబట్టి ఆయన పేరు సెర్చ్ లో కొడుతున్నానని డీజీపీ చెప్పారు.  అయితే నేర చరిత్రలు తెలుసుకునేందుకు డీజీపీ తన పేరును వాడడం పట్ల చింతమనేని ప్రభాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మీడియా సమావేశంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ తానొక డీజీపీ అన్న విషయం మర్చిపోయారని విమర్శించారు. రాష్ట్రంలో ఆర్థిక నేరగాళ్లు ఎంతోమంది ఉండగా, కేసుల వివరాలు చెప్పడానికి నా పేరు ఎందుకు ఉపయోగించారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో సీఎం జగన్ చెప్పే కట్టుకథలను డీజీపీ బాగా వంటబట్టించుకున్నారని, అక్రమ కేసుల సినిమాలు చూపించడంలో డీజీపీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను మించిపోయారని చింతమనేని మండిపడ్డారు. తనపై ఉన్న కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేయాలన్నారు చింతమనేని. టీడీపీ క్యాడర్‌ను మానసికంగా ఇబ్బంది పెట్టేందుకు తను బంతిలా వాడుకుంటున్నారని విమర్శించారు. ఓ ఎస్పీ చింతమనేనిపై కేసులు పెట్టేందుకు ముందుకు రావాలంటూ 1+1 ఆఫర్లు ప్రకటించారన్నారు. తప్పుంటే ఉరి శిక్షకైనా సిద్ధమే. కేసులు తొలగించమని దేహీ అని ఎవర్నీ అడగలేదు. నేను వనజాక్షి సమీపంలో కూడా లేనని ఆమె ఫిర్యాదులో పేర్కొంటే, అసెంబ్లీలో జగన్ రెడ్డి చెప్పిన కట్టుకథల్ని డీజీపీ వినిపించారు’’ అని చింతమనేని ప్రభాకర్ చెప్పారు. "నాపై నమోదైన కేసుల్లో ఎన్ని ఇప్పటికీ నడుస్తున్నాయో డీజీపీ చెప్పాలి. కొన్ని కేసులు చార్జిషీట్లు వేయలేక మూసేశారు. వాటిపై ఏం సమాధానం చెబుతారు?..కేసులు ఏవీ దొరక్క... రండి, చింతమనేనిపై కేసులు పెట్టండి అంటూ ప్రజలను ఆహ్వానిస్తున్నారు. ఎంత గట్టిగా కొడితే అంత వేగంగా పైకిలేస్తా" అని చింతమనేని స్పష్టం చేశారు. "తప్పుడు కేసులకు భయపడేది లేదు. డీజీపీకి వైసీపీ అంటే అంత వ్యామోహం ఉంటే ఆ రుణం మరో రూపంలో తీర్చుకోవాలే తప్ప, నా వంటి వారితో చెలగాటాలు వద్దు...డీజీపీ పదవిని కాపాడుకునేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడొద్దు" అని చింతమనేని హితవు పలికారు.  

బద్వేలు ఉప ఎన్నిక వాయిదా.. జగన్ రెడ్డి భయపడుతున్నారా?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక సీటు ఖాళీగా ఉంది. కడప జిల్లా బద్వేలు ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య చనిపోవడంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. మార్చి 28న  బద్వేలు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే డా.వెంకట సుబ్బయ్య  కన్నుమూశారు. ఎన్నికల సంఘం రూల్స్ ప్రకారం చట్ట సభల్లో ఏదైనా సీటు ఖాళీ అయితే 6 నెలల లోపు అక్కడ ఉప ఎన్నిక నిర్వహించాలి. ఈ లెక్కన సెప్టెంబర్ 28కి బద్వేలు ఎమ్మెల్యే చనిపోయి ఆరు నెలలు పూర్తవుతాయి. అంటే అంతలోపే ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించాలి. కాని బద్వేలు ఉప ఎన్నిక విషయంలో మాత్రం సీన్ మారిపోయింది.  రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడంలో బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నిక వాయిదా పడింది. శనివారం బెంగాల్, ఒడిషాలోని అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది సీఈసీ. తెలంగాణలోని హుజురాబాద్, ఏపీలోని బద్వేలు సహా 11 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలను వాయిదా వేసింది. ఇందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నివేదికలే కారణమని సీఈసీ చెప్పింది. పండుగలు, వరదలు, కోవిడ్-19 మహమ్మారిని ఆయా రాష్ట్రాలు కారణాలుగా చూపినట్లు తెలిపింది. పండుగ సమయం దాటిన తర్వాత ఉప ఎన్నికలను నిర్వహించాలని సూచించారని.. ఆ విధంగానే ఎన్నికల నిర్వహిస్తామని సీఈసీ తెలిపింది.  దేశవ్యాప్తంగా 32 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలకు ఉప ఎన్నికలు జరగవలసి ఉంది. ఉప ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాలను తెలియజేయాలని రాష్ట్రాలు, రాజకీయ పార్టీలను ఎన్నికల సంఘం కోరింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు  రాతపూర్వకంగా తమ అభిప్రాయాలను తెలియజేశాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, అస్సాం, బిహార్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, మేఘాలయ, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు తమ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలను వాయిదా వేయాలని కోరారు. తమ రాష్ట్రాల్లో కరోనా వైరస్ మహమ్మారి అదుపులో ఉందని ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఈసీకి లేఖలు రాశారు. ఎన్నికల నిర్వహణకు పూర్తి సన్నద్ధంగా ఉన్నామని తెలిపారు. దీంతో పశ్చిమ బెంగాల్‌లోని భవానీపూర్, శంషేర్‌గంజ్, జంగీపూర్ నియోజకవర్గాలకు, ఒడిశాలోని పిప్లీ శాసన సభ నియోజకవర్గానికి ఎన్నికల షెడ్యూల్ ఇచ్చింది సీఈసీ. బెంగాల్, ఒడిషాలు ఎన్నికలు జరుగుతూ తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు వాయిదా పడటం చర్చగా మారింది. ప్రభుత్వాల నిర్ణయం మేరకే సీఈసీ నిర్ణయం తీసుకోవడంతో.. అధికార పార్టీలకు ఓటమి భయం పట్టుకుందా అన్న చర్చ సాగుతోంది. ముఖ్యంగా బద్వేలు ఉప ఎన్నికను జగన్ సర్కార్ ఎందుకు ఆలస్యం చేస్తుందన్నది ఆసక్తిగా మారింది. బద్వేలు నియోజకవర్గం సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో ఉంది. అది వైసీపీకి గట్టి పట్టున్న ప్రాంతం. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 85 శాతానికి పైగా స్థానాలు అధికార పార్టీనే గెలుచుకుంది. అయినా వైసీపీ ప్రభుత్వం కోవిడ్ కారణంగా చూపి ఎందుకు ఉప ఎన్నిక వాయిదా కోరిందన్నది అంతుపట్టడం లేదు. జగన్ రెడ్డి ప్రభుత్వంపై ప్రస్తుతం ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా పతనం కావడం, కనీసం రోడ్లకు మరమ్మత్తులు చేసే దిక్కు లేకుండా ఉండటం, మహిళలపై దాడులు పెరిగిపోవడం.. వంటి అంశాలు వైసీపీని కలవరానికి గురి చేస్తున్నాయి. జగన్ సర్కార్ పై రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతోందని ఇటీవల నిర్వహించిన కొన్ని సర్వేల్లోనూ తేలింది. ఏపీ జనాలు టీడీపీకే ఎక్కువగా జై కొట్టారు, ఈ నేపథ్యంలో బద్వేలు ఉప ఎన్నికలో తేడా కొడుతుందేమోనన్న ఆందోళనలో వైసీసీలో ఉందని అంటున్నారు. ప్రభుత్వ నిర్వహించిన సర్వేల్లోనూ ఆశించిన ఫలితం రాలేదని చెబుతున్నారు.  2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి వెంకట సుబ్బయ్య  దాదాపు 45 వేల ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థిపై గెలిచారు. వైసీపీకి 95 వేల 482 ఓట్లు రాగా.. టీడీపీ అభ్యర్థి ఓబులాపురం రాజశేఖర్ కు 50 వేల 748 ఓట్లు వచ్చాయి. ఉప ఎన్నికలో అధికార వైసీపీ ఓడిపోకున్నా.. గతంలో కంటే మెజార్టీ తగ్గినా ఇబ్బందే. ఎందుకంటే ఇది సీఎం సొంత జిల్లా. వైసీపీ ఎమ్మెల్యే చనిపోవడంతో  సెంటిమెంట్ కూడా ఉంటుంది.  ఉప ఎన్నికలో గతంలో కంటే మెజార్టీ పెరగాల్సిందే. కాని ప్రస్తుతం అలాంటి సీన్ కనిపించపోవడంతోనే ఇప్పడే ఉప ఎన్నిక వద్దని సీఎం జగన్ భావించారని అంటున్నారు. మరోవైపు బద్వేలు ఉప ఎన్నిక కోసం టీడీపీ కేడర్ ను సిద్ధం చేసింది. తమ అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేసిన ఓబులాపురం రాజశేఖర్ ను ప్రకటించారు చంద్రబాబు నాయుడు. వైసీపీ మాత్రం ఇంకా అభ్యర్థిని అధికారికంగా ప్రకటించలేదు. 

ఈటలకు బిగ్ షాక్.. హుజురాబాద్ ఉప ఎన్నిక వాయిదా

తెలంగాణ రాజకీయాల్లో సెగలు రేపుతున్న కరీంనగర్ జిల్లా హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక వాయిదా పడింది. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడంతో ఉప ఎన్నికను మరి కొంత కాలం వాయిదా వేస్తూ  కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. కొవిడ్ ఇంకా పూర్థి స్థాయిలో కట్టడిలో లేనందున  ఉప ఎన్నిక ఇప్పుడే వద్దని, పండగల తర్వాత నిర్వహించాలని కేసీఆర్ ప్రభుత్వం సీఈసీని కోరింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ సహా మరో 11 రాష్ట్రాలు కూడా ఉప ఎన్నికలకు ముందుకు రాలేదు. దీంతో ఉప ఎన్నికలు జరగాల్సి ఉన్నా 11 రాష్ట్రాలను మినహాయించి బెంగాల్, ఒడిషాలో ఉప ఎన్నికలకు షెడ్యూల్ ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. పశ్చిమ బెంగాల్ లోని మూడు, ఒడిషాలోని ఒక అసెంబ్లీ ఉప ఎన్నికకు ఈనెల 6న నోటిఫికేషన్ రానుంది. ఈనెల 13 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. సెప్టెంబర్ 30న పోలింగ్ జరగనుండగా.. అక్టోబర్ 3న ఓట్లను లెక్కిస్తారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్డీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. అయినా సీఎంగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రిగా ఆమె కొనసాగాలంటే 6 నెలల లోపు ఎమ్మెల్యే కావాల్సి ఉంది. ఇందుకోసం మమతకు నవంబర్ వరకు గడువుంది. బెంగాల్ లో మూడు అసెంబ్లీ సీట్లు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఉప ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘంపై టీఎంసీ ఒత్తిడి తెస్తోంది. అయితే తమను తీవ్రంగా టార్గెట్ చేస్తున్న మమతను ఇబ్బంది పెట్టేలా ఉప ఎన్నికలను ఆలస్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందనే ఆరోపణలు వచ్చాయి. కాని ఇప్పుడు సీఈసీ షెడ్యూల్ ఇవ్వడంతో టీఎంసీ నేతలు ఊరట చెందుతున్నారు. 

కేసీఆర్ కు అమిత్ షా అపాయింట్ మెంట్.. ఢిల్లీలో ఏం జరుగుతోంది? 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన జాతీయ రాజకీయాల్లో చర్చగా మారింది. దేశ రాజధానిలో తెలంగాణ భవన్ నిర్మాణం భూమి పూజ కోసం హస్తిన వెళ్లిన టీఆర్ఎస్ అధినేత... ముందుగా ఇచ్చిన షెడ్యూల్ లేకున్నా వరుసగా కేంద్రం పెద్దలను కలుస్తుండటం ఆసక్తిగా మారింది. శుక్రవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన కేసీఆర్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ కూడా ఖరారైంది. మధ్యాహ్నం అమిత్ షా నివాసంలో ఇద్దరి మధ్య సమావేశం జరగనుంది. ప్రధాని మోడీతో జరిగిన సమావేశానికి కొనసాగింపుగానే అమిత్ షాతో తెలంగాణ ముఖ్యమంత్రి చర్చలు ఉంటాయని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.  శుక్రావరం సాయంత్రం ఐదు గంటలకు ప్రధాని నివాసానికి వెళ్లిన కేసీఆర్.. ప్రధానితో సుమారు 50 నిమిషాలపాటు చర్చించారు. యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీని కేసీఆర్ ఆహ్వానించారు. మొత్తంగా 16 అంశాలపై ప్రధాని మోడీకి కేసీఆర్‌ వినతిపత్రం సమర్పించారు. ఐపీఎస్‌ల సంఖ్యపెంపు, కొత్తజిల్లాలకు ఐపీఎస్‌ల కేటాయింపు, హైదరాబాద్‌- నాగ్‌పూర్‌ ఇండస్ట్రీయల్‌ కారిడార్‌ ప్రధాన అంశాలుగా ఉన్నాయి. ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదం, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చ జరిగింది.  పీఎంజీఎస్‌వైకి అదనపు నిధులు, కొత్త జిల్లాలకు జవహర్‌ నవోదయ విద్యాలయాలను కేటాయించాలని ప్రధానికి ముఖ్యమంత్రి విన్నవించారు. తెలంగాణకు గిరిజన వర్సిటీ, ఐఐఎం, కరీంనగర్‌కు ఐఐటీ, వరంగల్‌లో టెక్స్‌టైల్‌ పార్క్‌కు రూ.1,000 కోట్లు మంజూరు చేయాలని కేసీఆర్ కోరారు. ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణానికి స్థలం కేటాయించాలని ప్రధానిని కోరారు సీఎం కేసీఆర్. ప్రధాని మోడీని కేసీఆర్ కలవడం రాజకీయ వర్గాల్లో చర్చగా మారగా.. హోమంత్రి అమిత్ షాను కలుస్తుండటం మరింత వేడి పుట్టిస్తోంది. అమిత్ షాతో జరిగే సమావేశంలో ఖచ్చితంగా రాజకీయ అంశాలపై చర్చ ఉంటుందని చెబుతున్నారు. జాతీయ స్థాయిలో ప్రస్తుతం ఎన్డీఏ వ్యతిరేక కూటమి ఏర్పాటు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఇటీవలే కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ విపక్ష పార్టీల నేతలతో సమావేశమయ్యారు. మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమించాలని నిర్ణయించారు. అయితే ఈ సమావేశానికి టీఆర్ఎస్ అధినేత అయిన కేసీఆర్ కు సమాచారం రాలేదు. తమ కూటమిలోకి కేసీఆర్ ను తీసుకోవడానికి సోనియా ఇష్టంగా లేరని చెబుతున్నారు. కేసీఆర్ ను బీజేపీ మనిషిగానే ఆమె చూస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రధాని మోడీని కలిసిన కేసీఆర్.. అమిత్ షాను కలుస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.  తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. కేసీఆర్ సర్కార్ పై ఓ రేంజ్ లో ఫైరవుతున్నారు కమలనాధులు. పాదయాత్ర చేస్తున్న ఎంపీ బండి సంజయ్.. కేసీఆర్ సర్కార్ పై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. కేసీఆర్ ను జైలుకు పంపిస్తామని చెబుతున్నారు. రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉంటే .. ఢిల్లీలో కేసీఆర్ కేంద్రం పెద్దలను కలుస్తుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దేశ వ్యాప్తంగా మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేసీఆర్ ను దూరం చేసుకోకూడదనే యోచనలో బీజేపీ పెద్దలు ఉన్నారని తెలుస్తోంది. అందుకే కేసీఆర్ తో చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. కాంగ్రెస్ కూటమి వైపు వెళ్లడానికి ఇష్టం లేని కేసీఆర్ కు కూడా బీజేపీ తప్ప మారో మార్గం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.  మరోవైపు బీజేపీ, టీఆర్ఎస్ ఒకటేనని, రెండు పార్టీలు కావాలనే డ్రామాలు చేస్తున్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఢిల్లీలో కేసీఆర్ కదలికలను ఆ పార్టీ నేతలు నిశితంగా పరిశీలిస్తున్నారు. బీజేపీ పెద్దలతో కేసీఆర్ సమావేశాన్ని తమకు అనుకూలంగా మలుచుకుని జనంలోకి వెళ్లాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.  

కౌన్ బ‌నేగా క‌రోడ్ ప‌తిలో ప్ర‌శ్న‌గా కేటీఆర్ ట్వీట్‌..

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తెలంగాణా ఐటీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ మరోసారి ఆసక్తికరంగా వార్తల్లో నిలిచారు.  పాపులర్‌ రియాల్టీ  షో కౌన్ బ‌నేగా క‌రోడ్ ప‌తిలో అనూహ్యంగా  చోటు సంపాదించుకున్నారు. అయితే ఆయన ఆ కార్యక్రమంలో పాల్గొనలేదు. విభిన్న అంశాలపై స్పందించే  కేటీఆర్ ట్వీట్‌ కేబీసీలో ఒక ప్రశ్నగా వచ్చింది.  కొన్ని సంవ‌త్స‌రాలుగా బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న బిగ్ రియాలిటీ షో కౌన్ బ‌నేగా క‌రోడ్ ప‌తి. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ షోకి సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీలు ఎంద‌రో హాజ‌ర‌య్యారు. తాజాగా భార‌త మాజీ క్రికెట‌ర్స్ వీరేంద్ర సెహ్వాగ్‌, సౌర‌వ్ గంగూలీ హాజ‌ర‌య్యారు. వీరికి అమితాబ్‌.. కేటీఆర్ గ‌తంలో చేసిన ట్వీట్‌ని ప్ర‌శ్న‌గా అడిగారు. కోవిడ్‌ బాధితులు, ఇతర సమస్యలపై సోషల్ మీడియా ద్వారా వేగంగా స్పందించారు కేటీఆర్. కొద్ది రోజుల క్రితం  కరోనా చికిత్సలో ఉపయోగించే మెడిసిన్ లిస్ట్‏ను తెలంగాణ మంత్రి కేటీఆర్ గతంలో ట్వీట్‌ చేశారు. వీటిని సరిగ్గా పలికే వారున్నారా ? అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు దీని వెనుక ఖచ్చితంగా ఈయన హస్తం ఉండే ఉంటుదని చమత్కరిస్తూ కాంగ్రెస్‌ సీనియర్‌ ఎంపీ శ‌శి ధ‌రూర్‌ని ట్యాగ్‌ చేశారు. ఆ ట్వీటే కేబీసీలో ప్ర‌శ్నగా మారింది.  తెలంగాణ మంత్రి కేటీఆర్ వీరిలో ఎవరికి ట్యాగ్ చేశారంటూ ప్రశ్నిస్తూ.. నాలుగురి పేర్లను ఆప్షన్స్‏గా ఇచ్చారు అమితాబ్ . అందులో ఒకరు సీనియర్ న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్, బీజేపీ ఎంపీ సుబ్రమణ్యన్ స్వామి, అమితావ్ గోష్, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆప్షన్స్ ఇచ్చారు. దీనిపై సౌర‌వ్ గంగూలీ తెలివిగా శ‌శి థ‌రూర్ అని చెప్పారు. ఆయ‌న‌కు ఇంగ్లీష్‌పై ప‌ట్టు బాగా ఉంటుంది. అందుకే ఆయ‌న పేరు గెస్ చేసి చెప్పాను అని సౌర‌వ్ గంగూలీ అన్నారు. త‌ను చేసిన ట్వీట్ కేబీసీ తాజా ఎపిసోడ్‌లో ప్ర‌శ్న‌గా రావడంతో కేటీఆర్ ఆశ్చ‌ర్య‌పోయారు. ఏదో స‌ర‌దాగా చేసిన ట్వీట్ ఇలా కేబీసీలో రావ‌డం సతోషంగా ఉందని చెప్పారు. దాదా, సెహ్వాగ్ ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెబుతారని అనుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. దీంతో కేటీఆర్ ట్వీట్ తెగ వైరల్‌గా మారింది.  

ఐదు రాష్ట్రాల ఎన్నికలపై లేటెస్ట్ సర్వే.. యూపీలో సంచలనమేనా? 

దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్డీఏ సారథ్యంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు , ప్రైవేటీకరణ సహా పలు అంశాల్లో మోడీ సర్కార్ తీరుపై జనాలు అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలోనే గతంలో కంటే ప్రధాని మోడీ గ్రాఫ్ భారీగా తగ్గింది. అదే సమయంలో విపక్షాలు యాక్టివ్ అవుతున్నాయి. బీజేపీ ప్రభుత్వంపై పోరాటానికి ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే పనిలో పడ్డారు కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షరాలు సోనియా గాంధీ. సెప్టెంబర్ చివరి వారంలో తమ కార్యాచరణ మొదలుపెట్టేలా ప్లాన్ చేస్తున్నారు.  దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులతో త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కీలకంగా మారాయి. యూపీలో కూడా ఎన్నికలు జరగనుండటంతో.. ఆ ఫలితం వచ్చే సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందనే చర్చ సాగుతోంది. అందుకే 2022 ప్రదమార్థంలో జరిగే యూపీ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను 2024కు సెమీ ఫైనల్ గా భావిస్తున్నారు. ఆ నేపథ్యంలో యూపీతో పాటు ఎన్నికలు జరగనున్న పంజాబ్.. గోవా.. ఉత్తరాఖండ్.. మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలపై  తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థ సర్వే నిర్వహించింది. ఏబీపీ న్యూస్ తో పాటు సి వోటర్ తో కలిసి నిర్వహించిన సర్వేలో ఆసక్తికర ఫలితాలు వచ్చాయి. పంజాబ్ లో  ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు గడ్డు పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని సర్వేలో తేలింది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కు ఈసారి గెలవడం అంత ఈజీ కాదని తెలుస్తోంది. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అనూహ్యంగా పుంజుకుందని సర్వేలో స్పష్టమైంది. ఢిల్లీ సీఎంగా వ్యవహరిస్తున్న అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ కు సీఎం అయితే బాగుంటుందని 22 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇటీవలే ఎన్డీఏ నుంచి బయటికి వచ్చిన శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్ బీర్ సింగ్ బాదల్ ను సీఎంగా 19 శాతం మంది కోరుకుంటున్నారు. ప్రస్తుతం సీఎం అమరీందర్ సింగ్ 18 శాతం మంది జై కొట్టగా.. ఆప్ ఎంపీ భగవంత్ మన్ కు 16 శాతం మంది ఓటేశారు. పీసీసీ చీఫ్ నవజ్యోత్ సిద్ధూకు 15 శాతం మంది సానుకూలంగా ఉన్నారు. మొత్తంగా చూస్తే ఆప్ కు మద్దతుగా 40 శాతం మంది నిలవగా.. కాంగ్రెస్ కు 33 మంది ఉన్నారు. ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్  రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ వశం కానుందని సర్వేలో తేలింది. ఇటీవల సీఎంగా బాధ్యతలు స్వీకరించిన బీజేపీ నేత ఫుష్కర్ సింగ్ దామీకి 23 శాతం మంది మద్దతు పలికితే..  కాంగ్రెస్ నేత హరీశ్ రావత్ కు 31 శాతం మంది మద్దతుగా నిలిచారు. ఇక గోవాలో మళ్లీ బీజేపీకి గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న ప్రమోద్ సావంత్ వైపే మెజార్టీ గోవా ప్రజలు ఉన్నారు. 33 శాతం మంది మళ్లీ ఆయనే సీఎం కావాలని కోరుకున్నారు. గోవాలోనూ ఆమ్ ఆద్మీ పార్టీ బలపడుతున్నట్లు కనిపించింది. గోవాలో ఆప్ అభ్యర్థి సీఎం కావాలని 14 శాతం మంది కోరుకున్నారు. దేశంలో అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీకి ఈసారి గడ్డు పరిస్థితులు ఉంటాయనే ప్రచారం సాగుతోంది. కాని  ఏబీపీ న్యూస్  సి వోటర్ సర్వేలో మాత్రం వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీకి సానుకూలంగా ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న యోగిని మెజార్టీ యూపీ ప్రజలు కోరుకుంటున్నట్లుగా తేలింది. సర్వే చేసిన వారిలో 40 శాతం మంది యోగికి అనుకూలంగా స్పందించారు. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్  కు 27 శాతం మంది మద్దతు తెలిపితే.. బీఎస్పీ అధినేత్రి మాయావతిగ్రాఫ్ మరింతగా పడిపోయినట్లుగా తేలింది. ఆమెను యూపీ సీఎం కావాలని కేవలం 15 శాతం మందే కోరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ యువనేత, యూపీపై ఫోకస్ చేసినప్రియాంక వాద్రాను ముఖ్యమంత్రిగా కేవలం 3 శాతం మందే అంగీకరించడం ఆసక్తి రేపుతోంది.  యూపీలో బీజేపీకే విజయావకాశాలు మెండుగా కనిపిస్తున్నా.. 2017లో జరిగిన ఎన్నికలతో పోలిస్తే మాత్రం భారీగా సీట్లను కోల్పోనుందని సర్వే ద్వారా తెలుస్తోంది. 2022 ఎన్నికల్లో గతంలో కంటే  బీజేపీ 62 సీట్లను కోల్పోనుందని, సమాజ్ వాదీ పార్టీకి ఇప్పుడున్న బలానికి అదనంగా మరో 65 సీట్లు గెలిచే వీలుందని వెల్లడైంది. యూపీ అసెంబ్లీలో మొత్తం 403 స్థానాలు ఉన్నాయి. సర్కార్ ఏర్పాటుకు మేజిక్ ఫిగర్ 202 స్థానాల్లో.  ఏబీపీ న్యూస్ సి వోటర్ సర్వే అంచనాల ప్రకారం బీజేపీకి 259 సీట్ల నుంచి 276స్థానాలు.. సమాజ్ వాదీ పార్టీకి 109 నుంచి 117 స్థానాలు.. బీఎస్పీ 12 నుంచి 16 స్థానాలు.. కాంగ్రెస్ 3 నుంచి 7 స్థానాలు రానున్నాయి. ఇతరులకు 6 నుంచి 10సీట్ల రావొచ్చంటున్నారు. ఇక ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ లో  బీజేపీకే మరోసారి గెలుపు అవకాశాలు ఉన్నాయి. 40.5 శాతం మంది మణిపూర్ లో బీజేపీకి పట్టం కట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు.  ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ కు 34.5 శాతం మంది ఓటర్లు మద్దతుగా నిలిచారు. మొత్తంగా తాజా సర్వే ప్రకారం ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీకి ఒక్క ఉత్తరాఖండ్ లో గడ్డు కాలం కనిపిస్తుండగా.. పంజాబ్ లో హస్తం ఎదురీదుతోంది. అనూహ్యంగా పంజాబ్, గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీ బలపడుతున్నట్లు స్పష్టమవుతోంది. మొత్తంగా సర్వే ఫలితాలు కాంగ్రెస్ ను కలవరపెడుతుండగా.. బీజేపీకి కొంత ఊరటనిస్తున్నాయి.