భవానీపూర్ మరో నందిగ్రామ్ అవుతుందా?
గత మార్చి, ఏప్రిల్ మాసాలలో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు బీజీపీ చేయని ప్రయత్నం లేదు. సర్వ శక్తులు వడ్డింది. ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా, సారధ్యంలో కేంద్ర మంత్రులు బెంగాల్ ను కమల దళం ఖాతాలో కలుపుకునేందుకు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోలేదు. కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్నా లెక్క చేయలేదు. ఆ లెక్క చేయక పోవడం వలన దేశం కరోనా కోరల్లో చిక్కి విలవిల లాడింది. విపక్షాలు మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండా గట్టాయి. కరోనా సెకండ్ వేవ్ వైఫల్యం కేంద్ర ప్రభుత్వం,మరీ ముఖ్యంగా మోడీ ఇమేజ్’ని బాగా డ్యామేజి చేసింది. మోడీ గ్రాఫ్ గణనీయంగా పడిపోయింది.
అయినా ఇంత చేసినా మమతా బెనర్జీని గద్దె దిచాలనే మోడీ, షా జోడీ కల మాత్రం నెరవేర లేదు. మమతా బెనర్జీ సారధ్యంలో తృణమూల్ కాంగ్రెస్ హ్యాట్రిక్ కొట్టింది. అయితే, గుడ్డిలో మెల్ల అన్నట్లుగా, ఆ ఎన్నికల్లో తృణమూల్ ముందుకంటే, మంచి మెజారిటీతో విజయం సాధించినా, నందిగ్రామ్ లో మాజీ సహచరుడు, బీజేపీ అభ్యర్ధి సువేందు అధికారి చేతిలో స్వల్ప తేడాతో ఓడి పోయారు. అయినా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపధ్యంలోనే, తిరిగి శాసన సభ సభ్యత్వం పోనేందుకు,తమ సొంత నియోజక వర్గం భవానీపూర్’లో గెలిచిన పార్టీ అభ్యర్హ్ది .... చేత రాజీనామా చేయించారు. ఆ స్థానానికి ఈ నెల (సెప్టెంబర్) 30 న ఉప ఎన్నిక జరుగుతోంది.
నిజానికి, ఇక్కడి నుంచి మమత గెలుపు గురించి అంతగా కష్ట పడవలసిన అవసరం లేదు. అయినా మమత కష్ట పడుతున్నారు. కష్ట పడడమే కాదు భయపడుతున్నారు. మమత భయానికి కారణమా ఉంది. ఆమెను వరసగా రెండు సార్లు ఇదే నియోజక వర్గం నుంచి గెలిచినా, మూడవసారి పార్టీ అభ్యర్ధి .... విజయం సాధించినా, విక్టరీ మార్జిన్ మొదరి సారికంటే రెండవ సారికి, 50 వేల నుంచి 25 వేలకు సగానికి సగం పడిపోయింది. అయితే, మళ్ళీ మొన్నటి ఎన్నికల్లో ఆమె పోటీలో లేక పోయినా పార్టీ అభ్యర్ధి శోబన్ దేవ్ ఉపాధ్యాయ 28 వేల పై చిలుకు ఆధిక్యతతో విజయం సాధించారు. ఈ రెండు ఎన్నికలకు మధ్యన 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో భవానీపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో తృణమూల్ అధిక్యత ఏకంగా మూడు వేలకు పడిపోయింది. ఇలా, అటూ ఇట్తో అవుతున్న ఎన్నికలోలో భవానీ పూర్ ఓటర్లు ఈసారి ఎటు మొగ్గుచూపుతారో ఎలాంటి తేర్పు ఇస్తారో అని తృణమూల్ నేతల్లో అంతో ఇంతో భయం అయితే ఉందని అంటున్నారు.
భవానీపుర్ నియోజక వర్గంలో 40 శాతం ఉన్న బెంగాలీ ఇతరులలో చాలా వరకు హిందువులు, సిక్కులు, మార్వాడీలు, గుజారాతీలు ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాలీ ఇతరులు తృణమూల్ వైపే మొగ్గుచూపారు. కానీ అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన హింసలో ఈ వర్గాలకు చెందిన వారే హింసకు గురయ్యారు. మరో వంక బీజేపీ ఎన్నికల అనంతర హింసనే ప్రధాన అస్త్రంగా ప్రచారం సాగిస్తోంది. అంతేకాదు, ఎన్నికల అనంతర హింసకు సంబందించిన కేసుల్లో బాధితుల తరపున న్యాయ పోరాటం సాగిస్తున్న యువ న్యాయవడి ప్రియాంకా తబ్రీవాల్’ ను బీజేపీ అభ్యర్ధిగా నిలిపింది. అలాగే, బెంగాల్ బీజేపీ నూతన అధ్యక్షుడు సుకాంత మజుందార్, మమతా బెనర్జీని తాలిబన్లతో పోలుస్తూ, ఆమె పై యుద్దాన్ని ప్రకటించారు. ఎన్నికల అనంతర హింసకు ఆమె మూల్యం చెల్లించ తప్పదని ఆన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ఉపఎన్నికల్లో ముఖ్యమంత్రిగ ఓడి పోతారు అని అంటున్నారు.
ఈ నేపధ్యంలో బెంగాలేతర ఓటర్లు ఎటు మొగుచూపుతారో అనే ఆందోళన కూడా తృణమూల్ శ్రేణుల్లో వ్యక్త మావుతోందని అంటున్నారు. ఇక మిగిలిన 60 శాతం ఓటర్లలో 20 శాతం ఉన్న ముస్లిం ఓటు, గంప గుత్తగా మమత పడుతుందని, మిగిలిన 40 శాతం బెంగాలీ ఓటు కూడా అటూ ఇటూ అయితే, మమత గెలుపు అనుకున్నంత ఈజీ కాకపోవచ్చని అంటున్నారు. అంతే కాకుండా మమత, జాతీయ రాజకీయలపై మక్కువ చూపుతున్న నేపధ్యంలో ఈ ఎన్నికల్లో మాములుగా గెలిస్తే సరిపోదని, లక్ష పైచిలుకు భారీ మెజారిటీతో విజయం సాధిస్తేనే ఆమెకు ఆబోరు దక్కుతుందని అంటున్నారు. మరో వంక మమతను గద్దెదించేందుకు చేసిన తొలి ప్రయత్నంలో ఓడి పోయిన బీజేపీ మాత్రం, సెకండ్ ఎఫర్ట్ లో అయినా, ఆమె మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం ఎక్కకుండా చేయాలని శత విధాలా ప్రయత్నిస్తోంది. అయితే చివరకు ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారో ... ఎవరికి జై కొడతారో అక్టోబర్ 4 న తేలిపోతుంది.