‘ఈ’ కార్లు ఇక...ఇక్కడి నుంచి ఎక్స్ పోర్ట్

  దేశంలో విద్యుత్ వాహనాల వాడకం క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రధాని మోడీ గుజరాత్ హన్సల్ పుర్ మారుతీ సుజుకి మోటార్ ప్లాంట్ లో రెండు కీలక ప్రాజెక్టులు ప్రారంభించారు. మారుతీ విటారాతో పాటు హై బ్రెడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్స్ ఉత్పత్తి చేసే  తొలి ప్లాంటు కు జెండా ఊపారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, జపాన్ రాయబారి కీచీ ఒనో పాల్గొన్నారు. భారత్ స్వావలంబన సాధించేందుకు ఇదెంతో కీలకమని.. ఇక్కడ ఉత్పత్తి చేయనున్న కార్లు వంద దేశాలకు ఎక్స్ పోర్ట్ కానున్నాయని.. ఈ కార్యక్రమానికి ముందు మోడీ ఎక్స్ వేదికగా రియాక్టయ్యారు. ఇ విటారా.. తొలి కారు యూకేకి ఎగుమతి కానుంది. తొషిబా, డెన్సో, సుజుకీ సంస్థల భాగస్వామ్యంతో ఈ ప్లాంట్ లో హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్స్ తయారు కానున్నాయి. దీంతో 80 శాతం బ్యాటరీ దేశీయంగా సిద్ధం కానుంది. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ తన తొలి విద్యుత్ కారు ఇ విటారాను జనవరిలో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ కారును 100కు పైగా దేశాలకు ఎగుమతి చేయాలని కంపెనీ టార్గెట్ గా పెట్టుకుంది. తద్వారా భారత్ ను గ్లోబల్ ప్రొడక్షన్ హబ్ గా తీర్చి దిద్దాలనుకుంటున్నట్టు సుజుకీ మోటర్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ అప్పట్లో ఈ విషయం చెప్పారు.. కూడా. మారుతీ సుజుకీ ఇ విటారా రెండు బ్యాటరీ ఆప్షన్లతో వస్తోందని అన్నారు.  భారత్ లో ఇ విటారా తయారీకి 2 వేల 100 కోట్లు వెచ్చించినట్టు చెబుతున్నారు సుజుకీ ప్రతినిథులు. తమ ఈవీలో కొన్న వారికి స్మార్ట్ హోం ఛార్జర్, ఇన్ స్టలేషన్ సపో్ట్ ను అందించేలా చెప్పారు. తొలి దశలో వంద ప్రధాన నగరాల్లో ఫాస్ట్ చార్జింగ్ పాయింట్లు పెడుతున్నట్టు చెప్పారు. ప్రతి ఐదు పది కిలోమీటర్లకు ఒక మారుతీ సుజుకీ చార్జింగ్ పాయింట్లు అందుబాటులోకి తేనున్నట్టు చెప్పారు.

భూమన చెప్పిన...ఈ రజియా సుల్తానా ఎవరు శ్రీలక్ష్మీ?

  భూమన ఐఏఎస్ శ్రీలక్ష్మి గురించి మాట్లాడుతూ.. ఆమె ఒక తాటకి, పూతన, లంకిణి.. ఆధునిక రజియా సుల్తానా అంటూ మండి పడ్డారు. మనకు తాటకి తెలుసు, రామాయణంలో కనిపిస్తుందీ పాత్ర. ఇక పూతన అంటే భాగవతంలో వస్తుంది. లంకిణి కూడా రామాయణ పాత్రే. రజియా సుల్తానా ఎవరనే దగ్గర అందరి ఆలోచనలు ఆగిపోతున్నాయ్. ఒక వేళ అదే నిజమైతే.. రజియా సుల్తానా ఢిల్లీ సుల్తానేట్- మొదటి మహిళా పాలకురాలిగా చెప్పాల్సి వస్తుందని అంటారు. ఆమె 1236 నుంచి 1240 వరకూ ఢిల్లీని పాలించారు. ఆమె మహిళ అయినా ఆనాటి స్థితిగతులను తనకు అనువుగా మార్చుకుని, పురుషాధిక్యతను అధిగమించి.. సింహాసనం అధిరోహించి.. సైన్యాన్ని నడిపించి, రాజ్య వ్యవహారాలు చూసుకున్న ఏకైక డేరింగ్ డ్యాషింగ్ డైనమిక్ లేడీ లీడర్ గా చెబుతుంది ఆమె బయోగ్రఫీ. ఆమె ఎలాంటి దుస్తులు లేకుండా.. బహిరంగ ప్రదేశాల్లో గుర్రాలపై, ఏనుగులపై సవారీ చేసేదని అంటారు. సైనికులతో కలసి యుద్ధరంగంలో పోరాడేదని చెబుతుంది చరిత్ర. అంతే కాదు.. ఆమె పేరిట పలు సైనిక విజయాలు కూడా లిఖించబడ్డాయి. ఆమె తన రాజ్యానికి చెందిన సొంత నాణేలపై సుల్తానాగా తన పేరు లిఖింప చేసుకున్నారు. మాములుగా అయితే ఆమె పేరు కేవలం రజియా మాత్రమే. కానీ తనకు తాను ఒక సుల్తాన్ గా ప్రకటించుకున్న ధీరోదాత్తగా పేరు. ఇదంతా ఇలా ఉంటే.. ఒకప్పుడు కలెక్టర్ శ్రీలక్ష్మి అంటే అదో నేమ్ అండ్ ఫేమ్. అప్పట్లో ఆమె నెల్లూరు కలెక్టర్ గా పని చేస్తున్నపుడు ఎందరో ఆడపిల్లలకు ఐఏఎస్ అనే ఒకానొక పదం తమ పేరు తర్వాత తగిలించుకోవడం ఒక ప్యాషన్ గా మార్చుకున్నారంటే అతిశయోక్తి కాదు. అలాంటి శ్రీలక్ష్మి వైయస్ హయాంలో.. భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారనే చెడ్డ పేరు మూట కట్టుకున్నారు. ఒక సమయంలో ఆమె చేత చేయించుకోవాల్సిన సంతకాలు అన్నీ చేయించుకుని.. ఇప్పుడామెను తాటకి, పూతన, అభినవ రజియా అంటూ లేని పోని మారు పేర్లను తగిలించడం.. ఏమనుకోవాలన్నది చాలా మంది వేస్తున్న ప్రశ్న. ఒకప్పుడు సీపీఐ నారాయణ వంటి వారి చేత అందాల రాణిగా అభినందనలు అందుకున్న శ్రీలక్ష్మి- వైయస్ ఫ్యామిలీతో పెట్టుకున్నందుకు అనారోగ్యం పాలై.. జుట్టు మొత్తం పోగొట్టుకున్నారు. దీంతో ఆమె విగ్గులు వాడే వరకూ వచ్చేశారు. చివరికి ఆమె పరిస్థితి ఎలాంటిదంటే ఎవరి కోసమైతే తాను ఇంత కష్టపడ్డానో... ఆ వర్గం నుంచి కూడా ఇలాంటి చీత్కార సత్కారాలను ఎదుర్కోవడం. ఈ లెక్కన రాజకీయ నాయకుల కోసం వారి స్వలాభ.. స్వార్ధం కోసం పాటుపడే ఉన్నతాధికారుల పరిస్థితి ఏమై పోతుందో చెప్పడానికి ఒక నిలువెత్తు ఉదాహరణగా నిలుస్తున్నారు ఐఏఎస్ శ్రీలక్ష్మి.

తిరుమల చేరుకున్న ఉప రాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్.. రేపు శ్రీవారి దర్శనం

  శ్రీవారిని దర్శించుకునేందుకు ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి, మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బుధవారం తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి అతిథి గృహం వద్ద ఆయనకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరితో పాటు పలువురు ఉన్నతాధికారులు, కూటమి నేతలు స్వాగతం పలికారు. బుధవారం రాత్రి తిరుమలలోనే ఆయన బస చేయనున్నారు.  గురువారం ఉదయం శ్రీవారిని సీపీ రాధాకృష్ణన్ దర్శించుకోనున్నారు. అంతకుముందు రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు ప్రత్యేక విమానంలో వచ్చిన సీపీ రాధాకృష్ణన్‌కు టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు, రాష్ట్ర మంత్రి పి.నారాయణతోపాటు బీజేపీ అగ్రనేతలు నేతలు స్వాగతం పలికారు. అనంతరం ఆయన తిరుమలకు చేరుకున్నారు.  ఈ ఉప రాష్ట్రపతి పదవికి సెప్టెంబర్ 9వ తేదీన ఎన్నిక జరగనుంది. అదే రోజు.. ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్నారు.  

మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు...రెడ్ అలర్ట్ జారీ

  తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మెదక్, కామారెడ్డి జిల్లాలకు హైదరాబాద్‌ వాతావరణ శాఖ  రెడ్ అలర్ట్ జారీ చేసింది. అల్పపీడనం కారణంగా రేపు ఉదయం వరకు ఈ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొన్నాది. మరోవైపు భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌-కామారెడ్డి మధ్య పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. రెండు రైళ్లను అధికారులు రద్దు చేశారు. మరో నాలుగు రైళ్లను దారి మళ్లించారు.  కాచిగూడ-మెదక్‌, నిజామాబాద్‌-తిరుపతి రైళ్లు రద్దు చేశారు. ఈ మార్గంలో భారీ వర్షం కారణంగా పట్టాలపై నుంచి వరద ప్రవహిస్తోంది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కామారెడ్డి నుండి హైదరాబాద్ వెళ్లే నేషనల్ హైవే వరద కారణంగా మూసివేశారు. జంగంపల్లి వద్ద భారీగా వరద నీరు రోడ్డుపై నుండి ప్రవహిస్తున్న నేపథ్యంలో రోడ్డును మూసివేసిన అధికారులు. కామారెడ్డి మీదుగా హైదరాబాద్ వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కామారెడ్డి, మెదక్ జిల్లాలకు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.  జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎలాంటి విపత్కర పరిస్థితులొచ్చినా ఎదుర్కునేందుకు అన్ని విభాగాలను, అధికారులను సర్వసన్నద్ధంగా ఉండాలని, వెంటవెంటనే అవసరమైన సహాయక చర్యలను చేపట్టాలని చెప్పారు. పరిస్థితులకు అనుగుణంగా ఎన్​డీఆర్​ఎఫ్​, ఎస్​డీఆర్​ఎఫ్​ బృందాల సాయం తీసుకోవాలని సీఎస్ ను ఆదేశించారు. రేపు విద్యాసంస్థలకు సెలవు ఇస్తున్నట్లు డీఈవో ప్రకటించారు   

కాణిపాకం దేవస్థానంలో అన్నప్రసాద భవనం ప్రారంభించిన మంత్రి ఆనం

కాణిపాకం దేవస్థానంలో వినాయక చవితి పర్వదినం రోజున నూతన అన్న ప్రసాద భవనాన్ని మంత్రి ఆనం రామనారాయణరెడడి ప్రారంభించారు   పూతలపట్టు  ఎమ్మెల్యే కిలికిరి మురళీమోహన్,  దేవాదాయ శాఖ కమిషనర్ కే. రామచంద్ర మోహన్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, స్థానిక ప్రజా ప్రతినిధులు, దేవాదాయ శాఖ అధికారులు,ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.  నూతన అన్న ప్రసాద భవనం ప్రారంభించిన అనంతరం  మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వంటశాలను   పరిశీలించారు.  అనంతరం అన్నవితరణ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి తీర్థ ప్రసాదాలు  స్వీకరించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు ఆలయ సిబ్బంది స్థానిక ప్రజాప్రతినిధులు భారీగా పాల్గొన్నారు. కాగా కాణిపాకంలో వినాయక చవితి ఉత్సవాలు వేభవంగా జరిగాయి. వినాయకచవితా రోజున కాణిపాకంలో గ్రామోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా వినాయకుడి విగ్రహాన్ని ఊరేగిస్తారు. వినాయక చవితి మరుసటి రోజు నుంచీ కాణిపాకం వినాయకుడి బ్రహ్మోత్సవాలు ఆరంభమౌతాయి. ఈ ఏడాది వినాయకచవితి బుధవారం (ఆగస్టు 27)న వచ్చింది. దీంతో కాణిపాకం బ్రహ్మోత్సవాలు గురువారం (ఆగస్టు 28) నుంచి ఆరంభమౌతాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా   వాహన సేవలు, వినాయక కల్యాణోత్సవం, రథోత్సవం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. 

రాహుల్ బీహార్ పర్యటనలో రేవంత్ కు దక్కిన గౌరవం మామూలుగా లేదుగా?!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్  అధిష్టానికి  మరీ ముఖ్యంగా  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి, మధ్య దూరం పెరిగిందని ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.   రేవంత్ రెడ్డి పదే పదే ఢిల్లీ వెళ్ళి  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులను కలవడం,  కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా అసెంబ్లీ లోపలా బయటా మాట్లాడడం ఇందుకు కారణమని కాంగ్రెస్ వర్గాలే ప్రచారం చేశాయి. ఈ కారణంగానే గత కొద్ది కాలంగా కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ పట్ల వ్యతిరేకతతో ఉందని కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు కూడా ప్రైవేటు సంభాషణల్లో గట్టిగానే చెప్పారు. కొందరైతే బాహాటంగానే రేవంత్ వ్యతిరేక వ్యఖ్యలు చేశారు. అయితే అవన్నీ వాస్తవాలు కావనడానికి  తాజాగా తేటతెల్లమైపోయింది. ఆయనకు అధిష్ఠానం వద్ద పలుకుబడి తగ్గడం అటుంచి అనూహ్యంగా పెరిగిందనడానికి  రాహుల్ గాంధీ బీహార్‌లో నిర్వహించిన తాజా ప్రచారంలో తేలింది. బీహార్‌లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో కలిసి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అగ్రనేతల నుండి ఆయనకు ప్రత్యేక ప్రాధాన్యత లభించింది.  రాహుల్,  ప్రియాంకలతో రేవంత్ ప్రజార రధాన్ని పంచుకున్నారు. వారిరువురితో కలిసి ఒకే ప్రచార రథంలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఇదే కాంగ్రెస్ హైకమాండ్ వద్ద రేవంత్ పలుకుబడికి, ప్రతిష్టకు, ప్రాధాన్యతకు తిరుగులేని నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషించారు .రేవంత్ నిస్సందేహంగా కాంగ్రెస్ హైకమాండ్ ధృష్టిలో అత్యంత ప్రాధాన్యత ఉన్న నాయకుడని బీహార్ ప్రచారం ద్వారా రుజువైపోయిందని అంటున్నారు.   

పవన్ కల్యాణ్ వినాయక చవితి శుభాకాంక్షలు

వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా ఆయన గణేష్ చతుర్థిని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులంతా ఎంతో భక్తి శ్రద్ధలతో వేడుకగా, ఘనంగా జరుపుకుంటారని పేర్కొన్నారు. గణాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుడిని విఘనాయకుడిగా, తలపెట్టే పనులకు ఎలాంటి విఘ్నాలూ కలగకుండా చూడాలని భక్తులు పూజిస్తారన్న ఆయన తాను కూడా ప్రజలు తలపెట్టే అన్ని మంచి కార్యాలకూ ఎలాంటి విఘ్నాలూ కలగకుండా చూడాలని  ఆ పార్వతీ తనయుడిని వేడుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. అలాగే పర్యావరణ హితంగా ప్రజలంతా మట్టివినాయకుడినే పూజించాలని పిలుపునిచ్చారు.  

ట్రంప్ ఫోన్ కాల్స్ ను రిజెక్ట్ చేసిన ప్రధాని మోడీ!?

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ టారిఫ్ వార్ పేర ఇండియాపై 50శాతం సుంకాలు విధించడంతో ఇరు దేశాల మధ్యా ద్వైపాక్షిక సంబంధాలు ఒకింత దెబ్బతిన్న సంగతి తెలిసిందే. అంత కంటే ముందు ఆపరేషన్ సిందూర్ తరువాత భారత్- పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపేశానంటూ క్రెడిట్ కొట్టేయాలన్న ట్రంప్ ప్రయత్నాలను భారత్ బలంగా తిప్పికొట్టింది. అలాగే రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపకుంటే టారిఫ్ లు తధ్యమంటూ చేసిన హెచ్చరికలను కూడా ఖాతరు చేయలేదు.  అమెరికా పెద్దన్న పెత్తనాన్ని ఇసుమంతైనా సహించే ప్రశక్తి లేదని ఇండియా మాటల్లో చేతల్లో విస్పష్టంగా తేల్చేసింది. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల మధ్యా ద్వైపాక్షిక సంబంధాలు అంత సామరస్యపూరితంగా లేవు. అయితే.. భారత్ తో సంబంధాలను దెబ్బతీసుకుంటే.. భవిష్యత్ లో ఇబ్బందులు తప్పవన్న భావన అమెరికా వ్యాప్తంగా వ్యక్తం అవుతోంది. ఈ విషయంలో ట్రంప్ వైఖరిని అమెరికన్లు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ నివేదిక సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. జర్మన్ కు చెందిన ఫ్రాంక్ ఫర్టర్ ఆల్జెమైన్ జైటంగ్  ప్రచురించిన వార్త ప్రకారం ఇటీవలి కాలంలో అంటే భారత్ పై సుంకాల ప్రకటన తరువాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధాని నరేంద్రమోడీకి పదేపదే ఫోన్ చేశారు. అయితే ఆ ఫోన్ కాల్స్ ను ప్రధాని రిసీవ్ చేసుకోలేదు. అసలు ట్రంప్ తో మాట్లాడేందుకు కూడా మోడీ విముఖంగా ఉన్నారు. ట్రంప్ కనీసం నాలుగు సార్లు మోడీకి ఫోన్ చేశారు. అయితే ప్రధాని మోడీ మాత్రం సంప్రదించలేదు.    ఫ్రాంక్ ఫర్టర్ ఆల్జెమైన్ జైటంగ్  ప్రచురించి వ్యాసం  మేరకు ట్రంప్ భారత ఆర్థిక వ్యవస్థను చనిపోయిందంటూ చేసిన వ్యాఖ్య.. అలాగే   రష్యా నుంచి చమురు కొనుగోళ్ల కొనసాగింపునకు వ్యతిరేకంగా భారత్ పై సుంకాల విధింపు విషయంలో మోడీ ఆగ్రహంగా ఉన్నారు.   అందుకే ట్రంప్ టారిఫ్ లు అమలు అయ్యే బుధవారం (ఆగస్టు 27)కు ముందు అమెరికా అధ్యక్షుడు  ట్రంప్ మోడీతో సంప్రదించడానికి శతధా ప్రయత్నించినా మోడీ స్పందించలేదు. ట్రంప్ సుంకాల విధింపు అన్యాయమని విస్పష్టంగా తేల్చేసిన భారత్.. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల విషయంలో వెనకడుగు వేయలేదు. అమెరికా ఆంక్షలకు, ఒత్తిడికి తలొగ్గేది లేదని విస్పష్టంగా చెప్పడమే కాకుండా, ట్రంప్ ఫోన్ కాల్స్ ను అటెండ్ చేయకపోవడం ద్వారా మోడీ అమెరికాకు గట్టి హెచ్చరిక లాంటి సందేశం ఇచ్చారని ఆ వార్తా పత్రిక పేర్కొంది. 

స్టైల్ గా గంజా సిగరెట్ తాగుతూ పట్టుబడిన విద్యార్థులు!

తమ పిల్లలు బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపా దించాలని ప్రతి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వారిని చదివిస్తూ ఉంటారు. కానీ మరోవైపు విద్యా ర్థులు తమ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు తెలియకుండా రహస్యంగా చెడు అలవాట్లకు బానిసై బంగారు భవిష్యత్తు ను పాడు చేసుకుంటున్నారు. యువత డ్రగ్స్ అనే మహమ్మారి మాయలో పడి దాన్ని సేవించడమే కాకుండా సులభ పద్ధతిలో డబ్బులు సంపాదించడానికి వాటి విక్రయించి, చివరికి  జైలు పాలవుతున్నారు. ఓ పెద్ద యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు డ్రగ్స్ కు అలవాటు పడిన ఘటన ఇప్పుడు తాజాగా హైదరాబాద్ నగరంలో వెలుగు లోకి వచ్చింది.  బాచుపల్లి మహేంద్ర యూనివర్సిటీలో డ్రగ్స్‌ కలకలం సృష్టించింది. 50 మంది విద్యార్థులు గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ సేవిస్తున్నట్లు ఈగిల్ టీం గుర్తించింది. ఈ కేసులో కీలకపాత్ర పోషించిన నలుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకొని, వారి నుంచి కిలోకిపైగా గంజాయి, 47 గ్రాముల ఓజీ కుష్‌ స్వాధీనం చేసుకున్నారు.  ఈ విద్యార్థులు.. పోలీసుల కంట పడకుండా గంజాయిని కొరియర్ ద్వారా తెప్పించుకుంటున్నారు.  మణిపూర్‌కు చెందిన విద్యార్థి నోవెల్లను అధికారులు అరెస్ట్ చేశారు. ఈ విద్యార్థి ఢిల్లీ నుంచి కొరియర్ ద్వారా గంజాయి తెప్పించుకుంటున్నాడు. ఆ గంజాయిని నోవెల్ల ఒక్కో గంజాయి సిగరె ట్‌ను రూ.2500కు మిగతా విద్యార్థు లకు అమ్ముతు న్నాడు. ఈ గంజాయి కేసులో నోవెల్ల,అంబటి గణేష్‌, శివకుమార్, జావెద్‌  అనే నలుగురు విద్యార్థులు కీలక సూత్రధారులుగా ఉన్నట్లుగా అధికారులు గుర్తించి, ఆ నలుగురిని అరెస్టు చేశారు. గంజాయి, ఓజీ కుష్‌ కలిపి సిగరెట్లు తయారు చేసి అమ్మకాలు జోరుగా కొనసాగి స్తున్నారు.అయితే ఢిల్లీకి చెందిన అరవింద్‌ శర్మ అనే వ్యక్తి అనిల్‌తో కలిసి గంజాయి బిజినెస్ చేస్తున్నట్లు  అధికారులు గుర్తించారు.నోవెల్ల అనే విద్యార్థి ఢిల్లీకి చెందిన ముఠాతో  గంజాయి తెప్పించుకుం టున్నాడు.కేవలం విద్యార్థులను మాత్రమే టార్గెట్ గా చేసుకొని గంజాయి విక్రయాలు చేస్తున్నాడు.

కావలి మాజీ ఎమ్మెల్యే ఇంజినీరింగ్ కాలేజీలో మద్యం లోడు!

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ప్రతాప్ కుమార్ రెడ్డికి చెందిన ఆర్ఎస్ఆర్ కాలేజీలో మూడు లోడ్ల మద్యం ఉందంటూ కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి ఆరోపించారు. ప్రజా వ్యతిరేకతను మూటగట్టకున్న ప్రతాప్ రెడ్డి తెలుగుదేశం ప్రభుత్వానికి, ఎమ్మెల్యేగా తనకూ పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక తన హత్యకు కుట్రపన్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. గత 15 నెలలుగా తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకువెడుతున్న తనపై కక్షగట్టి వ్యక్తిగత దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. కావలి ఎమ్మెల్యేగా పదేళ్ల పాటు ఉన్న ప్రతాప్ కుమార్ రెడ్డి తన అవినీతి, అక్రమాలతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారని విమర్శించారు. రాజకీయాలలోకి రాకముందు నుంచే తనకు క్వారీ వ్యాపారం ఉందన్న కావ్యకృష్ణారెడ్డి. కావలి నియోజకవర్గానికి సంబంధం లేని ఉదయగిరిలొ ఉన్న క్వారీ మీద అధికారులతో దాడి చేయించారని, న్యాయస్థానం వైసీపీ హయాంలోనే తనకు క్లియరెన్స్ ఇచ్చిందనీ పేర్కొన్నారు.   ప్రజలు చిత్కరించుకుంటుంటే తట్టుకోలేని ప్రతాప్ కుమార్ రెడ్డి కావలిలో శాంతిభద్రతల విఘాతం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కావలిలో రౌడీ షీటర్లు సంస్కృతిని పెంచి పోషించిందే ప్రతాప్ కుమార్ రెడ్డి అని పేర్కొన్న కావ్యకృష్ణారెడ్డి డోన్ కెమేరాలతో తన కదలికలను పసిగట్టే ప్రయత్నం చేశారన్నారు.   ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించుకున్న ప్రతాప్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి కాకణి మద్దతు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. హత్యారాజకీయాలలో ఆరితేరిన కాకణి, ప్రతాప్ రెడ్డిలు ఇద్దరు కల్తీ మద్యం ముద్దాయిలు, దొంగలు అని విమర్శించారు. తనపై ఒక్కటంటే ఒక్క కేసు లేదనీ, అదే కాకాణిమీదైతే 14 కేసులు కాకణి,   ప్రతాప్ కుమార్ రెడ్డి ఎనిమిది కేసులలో ముద్దాయిలుగా ఉన్నారని కావ్య విమర్శించారు.

భారత్‌పై అమెరికా 50 శాతం టారిఫ్ అమలు ఎప్పటి నుంచంటే..?

రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నదన్న ఒకే ఒక్క కారణంతో.. అమెరికా ఇండియాపై పగబట్టినట్లే ప్రవర్తిస్తోంది. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విధించిన అదనపు సుంకాలు.. ఇంకొన్ని గంటల్లోనే అమల్లోకి రానున్నాయి.  దీనికి సంబంధించి అమెరికా గవర్నమెంట్.. భారత్‌కు అధికారికంగా నోటీసులు పంపింది.  ఆగస్ట్ 27 ఉదయం 10 గంటల నుంచి.. ఈ అదనపు టారిఫ్‌లు అమల్లోకి రానున్నాయి. ఈ టైమ్ దాటిన తర్వాత నుంచి.. అమెరికాలోకి ప్రవేశించే భారత ఉత్పత్తులకు  ఈ టారిఫ్‌లు వర్తిస్తాయి. ఈ మేరకు.. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్‌ సెక్యూరిటీ తమ నోటీసుల్లో తెలిపింది. ప్రస్తుత్తం అదే వ్యాపార, వాణిజ్య వర్గాల్లో కలకలం రేపుతోంది. భారత్‌పై ఇప్పటికే.. అమెరికా 25 శాతం ప్రతీకార సుంకాలు విధించింది. ఇవి..  అమల్లోకి వచ్చాయి. అయితే.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామనే కారణంతో.. మరో 25 శాతం అదనపు టారిఫ్‌లు విధించారు ప్రెసిడెంట్ ట్రంప్. దాంతో కలిపి.. ఇండియాపై అమెరికా సుంకాలు 50 శాతానికి పెరిగాయి. ఈ టారిఫ్‌లు అమల్లోకి వస్తే.. టెక్స్‌టైల్, ఆక్వా రంగం, తోలు ఉత్పత్తులపై వెంటనే ప్రభావం పడుతుంది. భారత్ నుంచి ఎగుమతి అయ్యే అతికొద్ది వస్తువులకే.. ఈ అధిక సుంకాల నుంచి మినహాయింపు ఉంది. ఇప్పటికే.. ఈ అదనపు టారిఫ్‌లపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది.. కరెక్ట్ కాదని స్పష్టం చేసింది. ఈ విషయంలో.. దేశ ప్రయోజనాలు కాపాడుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపింది.  మరోవైపు.. ప్రధాని మోడీ కూడా ఈ సుంకాల విషయంలో  స్పందించారు. రైతులు, పశుపోషకులు, చిన్నతరహా పరిశ్రమల ప్రయోజనాల విషయంలో.. రాడీపడే ప్రసక్తే లేదన్నారు. ఈ విషయంలో.. కేంద్రంపై ఒత్తిడి పెరిగినా.. భరిస్తామని స్పష్టం చేశారు. ఈ అదనపు సుంకాల వ్యవహారంపై ప్రధానమంత్రి కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. 50 శాతం సుంకాల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై.. ప్రభుత్వం దృష్టి పెట్టింది. ట్రంప్ టారిఫ్‌ల వల్ల భారతీయ ఎగుమతిదారులు తీవ్రంగా ప్రభావితం కానున్నారు. దానిని తగ్గించేందుకు  ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఎగుమతి - ఆధారిత యూనిట్లు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అండగా నిలవడంపై దృష్టి పెట్టనున్నారు.  సుంకాల వల్ల ప్రభావితమయ్యే కొన్ని పరిశ్రమలకు.. ప్రత్యేక మద్దతు అందించే విషయంపైనా చర్చ జరిగింది. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ లాంటి పథకాలని అమలు చేసే ప్రతిపాదనలపైనా చర్చించారు. 50 శాతం సుంకాలు.. భారతీయ ఎగుమతిదారుల మార్జిన్‌లని మరింత దెబ్బతీయడంతో పాటు సప్లై చైన్‌కి కూడా అంతరాయం కలిగిస్తుందనే వాదనలున్నాయి. టెక్స్‌టైల్, ఇతర ఉత్పత్తులు, కెమికల్స్ వరకు.. కీలక రంగాల్లో పోటీని ప్రభావితం చేస్తుందనే ఆందోళనలు పెరుగుతున్నాయి. దాంతో.. ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. ఈ విషయంలో.. భారత్ తన జాతీయ ప్రయోజనాలను, ఇంధన అవసరాలను బట్టి నిర్ణయాలు తీసుకుంటుందని, ఇతర దేశాల ఒత్తిడికి లొంగదని స్పష్టం చేసింది.

కుమారుడి నిశ్చితార్ధంపై క్లారిటీ ఇచ్చిన క్రికెట్ లెజెండ్ సచిన్

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తన కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహ నిశ్చితార్ధంపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చాడు.  సోషల్ మీడియాలో ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్ సందర్భంగా ఓ అభిమాని ప్రశ్నకు సమాధానమిస్తూ అర్జున్ టెండుల్కర్ నిశ్చితార్థం జరిగిందని ధృవీకరించి గత కొంత కాలంగా అర్జున్ టెండూల్కర్ వివాహ నిశ్చితార్థ కార్యక్రమంపై అభిమానులలో నెలకొన్న ఉత్కంఠకు తెరదించారు.    క్రికెట్ లెజెండ్ సచిన్ టెండుల్కర్ తనయుడు అర్జున్ టెండుల్కర్ నిశ్చితార్థం ఇటీవలే జరిగిందన్న వార్త ప్రస్తుతం సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. ఓ ముంబై వ్యాపారవేత్త మనుమరాలు సానియా చందోక్‌తో అతడి నిశ్చితార్థం జరిగిందని మీడియా వర్గాలు కూడా ధ్రువీకరించాయి. అయితే, ఈ అంశంపై సచిన్ కుటుంబం కానీ, సానియా కుటుంబం కానీ ఇంతవరకూ స్పందించలేదు. ఇది అభిమానుల్లో ఉత్కంఠకు దారితీసింది. అయితే..  ఈ విషయమై సచిన్ టెండుల్కర్ తొలిసారిగా స్పందించారు. సచిన్ టెండుల్కర్ ఇటీవల సోషల్ మీడియాలో ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్ నిర్వహించాడు. అభిమానుల ప్రశ్నలన్నిటికీ ఓపిగ్గా సమాధానమిచ్చాడు. ఈ క్రమంలో ఓ అభిమాని అర్జున్ టెండుల్కర్ నిశ్చితార్థం ప్రస్తావన తెచ్చారు.  అతడికి ఎంగేజ్‌మెంట్ అయిన విషయం నిజమేనా అని సచిన్‌ను ప్రశ్నించాడు. దీనికి ఆయన అవునని సమాధానం ఇచ్చారు. అవును.. ఎంగేజ్‌మెంట్ జరిగింది. అతడి జీవితంలో ఓ కొత్త అధ్యాయం ఆరంభమైంది. ఇది మాకెంతో ఆనందం కలిగించే అంశమని రిప్లై ఇచ్చారు. తనయుడిపై సచిన్ తొలిసారి స్పందించడంతో ఈ ఉదంతం ప్రస్తుతం తెగ ట్రెండవుతోంది. ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనుమరాలే సానియా చందోక్.  సానియా కుటుంబం.. హాస్పిటాలిటీ, ఆహార ప్రాసెసింగ్ రంగాల్లో పలు వ్యాపారాలు నిర్వహిస్తోంది. ప్రముఖ ఇంటర్‌కాంటినెంటల్ హోటల్, బ్రూక్లిన్ క్రీమరీ వారివే.  ఇక అర్జున్, సానియాల ఎంగేజ్‌మెంట్ వేడుక అతికొద్ది మంది కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య జరిగింది.  అర్జున్ ప్రస్తుతం క్రికెట్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అయిన అర్జున్‌కు బ్యాటింగ్‌పైనా పట్టు ఉంది. గోవా తరపున దేశవాళీ క్రికెట్ మ్యాచుల్లో ఆడుతున్నాడు. ఇప్పటివరకూ 17 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 37 వికెట్లు పడగొట్టి 532 పరుగులు చేశాడు. 24 టీ20 మ్యాచుల్లో 27 వికెట్లు పడగొట్టి 119 పరుగులు చేశాడు. 18 లిస్ట్ ఏ మ్యాచుల్లో కూడా ఆడి తన ప్రతిభ నిరూపించుకున్నాడు. ముంబై ఇండియన్స్ తరపున 2023 ఐపీఎల్‌లో ఆరంగేట్రం చేశాడు. నాలుగు మ్యాచులు ఆడి మూడు వికెట్లు తీశాడు. ఆ తదుపరి సీజన్‌లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు.

అవినీతి అనకొండ శ్రీలక్ష్మి.. భూమన సంచలన ఆరోపణలు

సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి.. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈమె పేరు తెలియని వారు ఉండరనడంలో అతిశయోక్తి లేదు.   జగన్ అక్రమాస్తుల కేసులోనూ, అలాగే ఓబులాపురం మైనింగ్ కేసులోనూ కూడా శ్రీలక్ష్మి నిందితురాలుగా అభియోగాలు ఎదుర్కోన్నారు. కొన్ని నెలల పాటు జైలులో కూడా ఉన్నారు.   రాష్ట్ర విభజన తరువాత శ్రీలక్ష్మిని తెలంగాణకు కేటాయించారు. అయితే 2019 ఎన్నికలలో ఏపీలో వైసీపీ విజయం సాధించి వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఆమె ఏపీకి వచ్చేశారు. ఆమెను ఏపీకి తీసుకురావడం కోసం అప్పటి ముఖ్యమంత్రి జగన్ స్వయంగా కేసీఆర్ ను కోరారు. సరే ఆమె ఏపీకి వచ్చిన తరువాత జగన్ ఆమెకు కీలకమైన మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ శాఖలలో తిరుగులేని పెత్తనం చెలాయించారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఆమెకు తిరుగులేని స్వేచ్ఛ, అధికారాలు అప్పగించారు. ఈ విషయంలో ఎన్ని విమర్శలు వెల్లువెత్తినా ఖాతరు చేయలేదు.  ఆ తరువాత 2024 ఎన్నికలలో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. కనీసం విపక్ష హోదా కూడా దక్కనంత పరాభవాన్ని ఎదుర్కొంది. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది. ఆమెకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. చంద్రబాబు ఆమె నుంచి కనీసం బొకే అందుకునేందుకు కూడా ఇష్టపడలేదు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు తాజాగా వైసీపీ సీనియర్ నాయకుడు, టీటీడీ మాజీ చైర్మన్ భూమన క రుణాకర్ రెడ్డి ఐఏఎస్ శ్రీలక్ష్మిని అవినీతి అనకొండగా అభివర్ణిస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. విశేషమేమిటంటే తెలుగుదేశం ఇంత కాలం శ్రీక్ష్మిపై చేసిన విమర్శలన్నిటినీ ఇప్పుడు తాజాగా భూమన కరుణాకర్ రెడ్డి చేశారు. శ్రీలక్ష్మి ఆమె నిర్వహిస్తున్న శాఖ మంత్రిని కనీసం గౌరవించలేదు సరికదా అవమానించారంటూ ఆరోపించారు. టీడీఆర్ బాండ్స్ కుంభకోణంలో శ్రీలక్ష్మి మాస్టర్ మైండ్ అన్నారు.  తన కింది ఉద్యోగుల పట్ల నిరంకుశంగా వ్యవహరించేవారని దుయ్యబట్టారు.  తన అక్రమాలకు సహకరించని నాయకులపై ఆమె అసత్య ఆరోపణలు చేశారని విమర్శించారు.  అయితే భూమన ఆమెపై విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడటం అందరినీ విస్మయపరుస్తోంది. అసలు భూమన ఈ విమర్శలు , ఆరోపణలు జగన్ కు తెలిసే చేశారా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. జగన్ ఈ విషయంలో ఎలా స్పందిస్తారన్న ఆసక్తి వ్యక్తం అవుతోంది. ఈ విషయంలో జగన్ భూమనను సమర్ధిస్తారా లేక శ్రీలక్ష్మిని డిఫెండ్ చేస్తారా అన్న ఉత్కంఠ వ్యక్తం అవుతోంది. లేదా అసలేం జరగనట్లు భూమన ప్రెస్ మీట్ ను పూర్తిగా విస్మరించి మౌనం దాలుస్తారా? చూడాల్సి ఉంది. ఏది ఏమైనా శ్రీలక్ష్మిపై భూమన విమర్శలు జగన్ హయాంలో ఆమె అవినీతికి పాల్పడ్డారన్న విషయాన్ని నిర్ధారిస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు.  ఎందుకంటే శ్రీలక్ష్మికి డబ్బు సంపాదించాలన్న యావ తప్ప నైతిక విలువలు లేవని భూమన విరుచుకుప్పడారు. తిరుపతిలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తిరుపతిలో మాస్టర్ ప్లాన్ రోడ్లు వేస్తున్న సమయంలో, టీడీఆర్ బాండ్ల ద్వారా భారీగా దోచుకోవాలని ఆమె ప్రణాళిక వేశారని, అయితే తాము దానిని అడ్డుకున్నామని భూమన చెప్పుకొచ్చారు. అందుకే శ్రీలక్ష్మి నెల్లూరు జిల్లా నేతలకు తప్పుడు సమాచారం అందించి4 తాను రెండు వేల కోట్టు దోచుకున్నట్లు అసత్య ప్రచారం చేయించారన్నారు.  శ్రీలక్ష్మి 35 ఏళ్ల సర్వీసులో ఎక్కడ పని చేసినా వందల, వేల కోట్ల లూటీకి పల్పడ్డారనీ, ఆమె అవినీతి వ్యవహారం సుప్రీం కు కూడా తెలుసునని చెప్పరు.  

దావోస్ లో చర్చలు.. ఏపీలో పెట్టుబడులు.. చంద్రబాబు విజన్ కు మరో నిలువెత్తు నిదర్శనం

 ప్రతి అడుగూ ఒక యుద్ధం.. ప్రతి మలుపూ ఒక సంక్షోభం.. ప్రతి యుద్ధం ఒక విజయం.. ప్రతి సంక్షోభం ఒక అవకాశం.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాలుగు దశాబ్దాలకు పైబడిన రాజకీయ జీవితం గురించి  చెప్పడానికి ఈ రెండు వాక్యాలు చాలు.  ఆయన దూరదృష్టి, రాష్ట్రప్రగతి, ప్రజా సంక్షేమం రెండు కళ్లుగా ఆయన చేపట్టిన కార్యక్రమాలు, ఆరంభించిన పథకాలు... ఆయన నిర్మిం చిన సైబరాబాద్.. ఇప్పుడు నిర్మిస్తున్న అమరావతి ఇలా ఆయన చేపట్టిన ఏ కార్యక్రమమైనా భవిష్యత్ తరాలకు కూడా ఒక ఆస్తిగా, ఒక అవకాశాల గనిగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ కోసం ఆయన ఈ ఏడాది కూడా దావోస్ లో పర్యటించారు. ఆ పర్యటనలో భాగంగా ఆయన అనేక మంది పారిశ్రామిక వేత్తలూ, పెట్టుబడి దారులతో బేటీ అయ్యారు. చర్చలు జరిపారు. ఆ ఫలితాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల రూపంలో కనిపిస్తున్నాయి.    చంద్రబాబు తన దావోస్ పర్యటనలో భాగంగా  ప్రపంచంలోనే అతిపెద్ద సరుకు రవాణా సంస్థ మెర్స్క్ సీఈవోతో బేటీ అయ్యారు. ఈ కంపెనీ నుంచి రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించారు.  ఆ చర్చల ఫలితం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు బిలియన్ డాలర్ల పెట్టుబడిని తీసుకువచ్చింది.  ఏపీలో వెయ్యి కిలోమీటర్ల తీరప్రాంతాన్ని మెర్స్క్ లాజిస్టిక్ కార్యకలాపాల నిర్వహణ కోసం పెట్టుబడి పెట్టనుంది. ఇందుకు సంబంధించి అధికారికంగా ధృవీకరించింది.   మెర్స్క్ అనుబంధ సంస్థ అయిన ఏపీఎం టెర్మినల్స్ నుండి ఆగస్టు 25, 2025న ప్రకటించిన బిలియన్ డాలర్ల పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డులో ఆ సంస్థ ఇన్వెస్ట్ చేయనున్న తొమ్మిదివేల కోట్ల రూపాయల పెట్టుబడిలో భాగం.  కాగా మెర్క్స్ పెట్టుబడులు రాష్ట్రంలో వర్షించడానికి బీజం.. ఈ ఏడాది జనవరిలో దావోస్ లో చంద్రబాబు, మెర్స్క్ సీఈవీల మధ్య జరిగిన చర్చలలో పడింది. ఇప్పుడు ఏపీలో పెట్టుబడుల ద్వారా ఆ బీజం మొలకెత్తింది.  

ఉచిత ప్రయాణమే కాదు.. ఆ బస్సుల లైవ్ ట్రాకింగ్ కూడా.. దటీజ్ సీబీఎన్

స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణమే కాదు.. అందుకు సంబంధించిన బస్సుల లైవ్ ట్రాకింగ్ కూడా   ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ మేరకు అధికారులకు విస్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సూపర్ సిక్స్ హామీలన్నిటినీ అధికార బాధ్యతలు చేపట్టిన తరువాత 15 నెలల వ్యవధిలోనే ఒక్కటొక్కటిగా అమలు చేసి  ప్రజల హర్షామోదాలను పొందిన చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పుడు వాటిని మరింతగా ప్రజలకు చేరువ చేయడంలోనూ అనితర సాధ్యమైన చొరవను, ఆసక్తిని చూపిస్తున్నది.  ఇక ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం హామీని ఈ నెల 15 నుంచి అమలులోనికి వచ్చింది. తెలంగాణ, కర్నాటక వంటి రాష్ట్రాలలో ఇప్పటికే ఇటువంటి పథకం అమలులో ఉన్నప్పటికీ.. ఆయా రాష్ట్రాలలోలా కాకుండా ఆంధ్రప్రదేశ్ లో ఈ పథకం అత్యంత పకడ్డందీగా, ప్రణాళికా బద్ధంగా మొదలైంది. రోజుల వ్యవధిలోనూ ఈ పథకాన్ని ఉపయోగించుకుని కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారు. మొదటి రోజు గుర్తింపు కార్డుల విషయంలో నెలకొన్న చిన్న గందరగోళం వినా ఈ పథకం సూపర్ సక్సెస్ అయ్యింది. బస్సుల కొరత మాటే వినిపించలేదు. ఓవర్ లోడింగ్, కోట్లాటలు వంటివి కూడా పెద్దగా జరగలేదు.  ఇప్పుడు చంద్రబాబు మరో అడుగు మందుకు వేసి ఉచిత బస్సుల లైవ్ ట్రాకింగ్ ను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఉచిత బస్సు పథకంపై అధికారులతో సమీక్షలో భాగంగా ఆయనీ ఆదేశాలు జారీ చేశారు. ఉచిత బస్సులన్నినీ టి లైవ్ ట్రాకింగ్ చేయాలనీ, ఇది మహిళల భద్రతకు దోహదం చేస్తుందని చంద్రబాబు అన్నారు.  అంతే కాదు..  లైవ్ ట్రాకింగ్ మహిళలు ఈ బస్సుల సమయాలను ట్రాక్ చేయడానికి అందుకు అనుగుణంగా  వారి ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడానికి వీలు అవుతుంది. ఏపీ వ్యాప్తంగా ఉమ్మడి 13 జిల్లాలలో కూడా ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా వంద శాతం ఆక్యుపెన్సీ వచ్చిందంటే ఈ పథకం ప్రజాదరణ, ప్రజామోదం పొందిందనడానికి తార్కానంగా చెప్పుకోవచ్చు.  అన్నిటి కంటే ముఖ్యంగా చెప్పుకోవలసిందేమిటంటే.. ఈ పథకం పై ప్రభుత్వానికి అందిన ఫీడ్ బ్యాక్ ద్వారా మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఎక్కడా దుర్వినియోగం చేయలేదు. వారి అవసరాల నిమిత్తం మాత్రమే ప్రయాణాలు సాగిస్తున్నారు.  

ఈ నెల 29న తెలంగాణ కేబినెట్ సమావేశం

  తెలంగాణ కేబినేట్ సమావేశం ఈ నెల 29న జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టును ఆమోదించనున్నారు. అనంతరం ఆ రిపోర్టును శాసన సభ సమావేశాల తొలి రోజే సభలో ప్రవేశపెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు 5 రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.. ఈ నెల 30 నుంచి ఈ సమావేశాలు జరగనున్నాయి.  ఈ నెల 29న మంత్రి వర్గ భేటీలో స్పెషల్‌ సెషన్‌కు సంబంధించిన ఎజెండా ఖరారు కానుంది. మూడు లేదంటే ఐదు రోజులపాటు అసెం‍బ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కేబినెట్ భేటీలో చర్చించాల్సిన పలు అంశాలపై ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ప్రభుత్వ కార్యదర్శులు అజెండా అంశాలను సాధారణ పరిపాలన విభాగానికికి పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ రామకృష్ణ రావు ఇవాళ సర్క్యూలర్ జారీ చేశారు  

ఏపీ లిక్కర్ స్కామ్‌లో నిందితులకు రిమాండ్ పొడిగింపు

    ఏపీ మద్యం  కుంభకోణం కేసులో నిందితులకు ఏసీబీ కోర్టు వచ్చే నెల 9 వరకు రిమాండ్ పొడిగించింది. గతంలో విధించిన రిమాండ్ నేటితో ముగియడంతో సిట్ అధికారులు నిందితులను న్యాయస్ధానంలో హాజరుపరిచారు.  రిమాండ్ పొడిగించిన నేపథ్యంలో 12 మంది నిందితులను జైళ్లకు అధికారులు తరలిస్తున్నారు. ఈ కేసులో వైసీపీ ఎంపీ పి. మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు అధికారులు తరలించారు. మిగిలిన 9 మందిని విజయవాడ జైలుకు... అలాగే మరో ఇద్దరిని గుంటూరు జైలుకు పోలీసులు తరలించారు. మరోవైపు ఈ కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి మాట్లాడుతూ.. తనపై నమోదైన కేసును ఖండించారు. కస్టోడియల్ విచారణ అని సెట్ తనను అరెస్ట్ చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. లిక్కర్ స్కామ్‌లో తన పాత్ర ఎక్కడా లేదన్నారు. తన తప్పు ఎక్కడా లేకపోయినా.. ఆధారాలు సృష్టించారని రాజ్ కసిరెడ్డి ఆరోపించారు. గతంలో కానీ.. ప్రస్తుతం కానీ ఇప్పటి వరకు తనపై ఒక్క కేసు కూడా లేదన్నారు. లిక్కర్ కేసులో తప్పించి.. ఇప్పటి వరకు తాను అరెస్ట్ కాలేదని చెప్పారు.