సుంకాల ‘ట్రంప్’ కు కోర్టులో ఎదురు దెబ్బ!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్  ఏది చేసిన అదొక సంచలనమే. నిజానికి.. కొన్ని కొన్ని నిర్ణయాలు కేవలం సంచలన సృష్టించడం కోసమే చేస్తుంటారా? అని కూడా అనిపిస్తుంది. అందుకే.. అగ్ర రాజ్యం అధినేత, అనే విషయం మరిచి పోయి ఆయన చేసే వ్యాఖ్యలు, తీసుకునే  నిర్ణయాలు అనేక సందర్భాలలో నవ్వుల పాలవుతున్నాయి. అమెరికా ప్రజలనూ నవ్వుల పాలు చేస్తున్నాయి. అందుకే, అమెరికా ప్రజలు కూడా  ట్రంప్ సెకండ్ టర్మ్ మొదలైనప్పటి నుంచే రోజులు లెక్క పెట్టుకుంటున్నారు. అదలా ఉంటే.. గత కొంత కాలంగా ‘ట్రంప్’ కోతికి కొబ్బరికాయ దొరికింది అన్నట్లుగా, తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు, ఇతర దేశాల విషయంలో అనవసర జోక్యం చేసుకోవడమే కాకుండాజజ  అన్నిటికీ  నేనే..నేనే అంటూ ప్రగల్బాలకు పోతున్నారు. సొంత డబ్బా గట్టిగా కొట్టు కుంటున్నారు. అంతే కాదు  భారత్ సహా ఆయన ప్రగాల్బాలకు జై కొట్టని దేశాలపై  పిచ్చివాడి చేతిలో రాయి చందంగా  సుంకాలను పెంచుకుంటూ పోతున్నారు.   అయితే..   సుంకాల ట్రంప్  నెత్తిన అమెరికా ఫెడరల్ అప్పీల్ కోర్టు మరో మారు మొట్టికాయ వేసింది. ట్రంప్  విధించిన సుంకాలు చట్ట విరుద్ధం అని అమెరికా ఫెడరల్ అప్పీల్ కోర్టు తీర్పు ఇచ్చింది. ట్రంప్ తన ఎమర్జెన్సీ అధికారాలను అతిక్రమించి భారీగా టారిఫ్ లు విధించారని పేర్కొంది. అయితే పెంచిన టారిఫ్ లను అక్టోబర్ వరకు కొనసాగించడానికి, అదే విధంగా తమ తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేసేందుకు కోర్టు అనుమతించింది.కాగా.. అప్పీల్ కోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టులో పోరాడతామని ట్రంప్‌ తన సోషల్‌ మీడియా ట్రూత్‌లో ఓ పోస్టు పెట్టారు. అయితే కోర్టుల వ్యవహారం ఎలా ఉన్న ట్రంప్  ఎడాపెడా సుంకాలు విధించడం అమెరికా ప్రజల్లోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

బాబుపై నమ్మకంతో పెట్టుబడుల వరద.. ఏపీలో పారిశ్రామిక రంగానికి పూర్వ వైభవం!

విభజిత ఆంధ్రప్రదేశ్ లో మరో సారి పారిశ్రామిక స్వర్ణయుగం రాబోతోందా అంటే బిజినెస్ ఎక్స్ పర్ట్స్ ఔననే అంటున్నారు. రాష్ట్ర విభజన తరువాత 2014 నుంచి 2019 వరకూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు కేంద్రంగా నిలిచింది.  ప్రపంచ దేశాలలోని అగ్రశ్రేణి పరిశ్రమలన్నీ తమ పరిశ్రమల విస్తరణకు ఏపీవైపే చూసే వారు. కియా సహా పలు అగ్రశ్రేణి సంస్ధలు రాష్ట్రంలో  పెట్టుబడులకు ముందుకు వచ్చాయి.  కియా అయితే కార్యకలాపాలు ప్రారంభించేసింది. మరెన్నో సంస్థలు ఎంవోయూలు చేసుకున్నాయి. అయితే 2019లో తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయి, వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చింది.  జగన్ నేతృత్వంలోని వైసీపీ సర్కార్  ఐదేళ్ల  హయాంను రాష్ట్ర పారిశ్రామిక రంగానికి చీకటి కాలంగా చెప్పవచ్చు. జగన్ ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక రంగం కుక్కలు చింపిన విస్తరిలా తయా రైంది. ఉన్న పరిశ్రమలు రాష్ట్రం దాటి తరలిపోయాయి. అంతకు ముందు అంటే 2014-19 మధ్య కాలంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చి ఎంవోయూలు చేసుకున్న సంస్థలు  మొహం చాటేశాయి.  ఇప్పుడు మళ్లీ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ఆధ్వర్యంలో చంద్రబాబు సర్కార్ కొలువుదీరింది. దీంతో రాష్ట్ర పారిశ్రామిక రంగం మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకోనుంది. ఇందు కోసం చంద్రబాబు పట్టుదలతో కృషి చేస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా కొత్త పారిశ్రామిక వధానాన్ని రూపొందించారు.  2014-19 మధ్య రాష్ట్రంలో పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఇచ్చిన రాయితీలు, పెట్టుబడులను ఆకర్షించేలా మౌలిక సదుపాయాలు, సులభతర వాణిజ్యంలో దేశంలో మొదటి స్థానాన్ని సాధించిన అప్పటి పరిస్థితులు మళ్లీ  తీసుకురావడం, వృద్ధి రేటు 15 శాతానికి తగ్గకుండా చూడటం లక్ష్యాలుగా చంద్రబాబు ముందుకు సాగుతున్నారు.  ఆయన కృషి ఫలిస్తోందనడానికి స్పష్టమైన తార్కాణంగా  జగన్ హయాంలో ఆయన విధానాలతో విసిగిపోయి మళ్లీ ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టేది లేదంటూ వెళ్లిపోయిన   లులు గ్రూప్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ మళ్లీ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడాన్ని చెప్పవచ్చు. ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు సర్కార్ కొలువు దీరిన తరువాత రాష్ట్రం పెట్టుబడులకు కేంద్రంగా మారడం ప్రారం భమైంది.   ఇందుకు తాజా తార్కానంగా ఇటీవల రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్ఐపీబీ) ఏకం గా 30 పరిశ్రమలు,  53 వేల922 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. ఈ పరిశ్ర మల ద్వారా 83 వేల437 మందికి ఉద్యోగాలు లభిస్తాయి.   

తాడిపత్రిలో పెద్దారెడ్డికి జేసీతోనే కాదు.. సొంత పార్టీ నేతలతోనూ తలనొప్పే!

అనంతపురంలో జిల్లాలోని తాడిపత్రి వెళ్లేందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఏపీ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఉత్తర్వులను నిలిపివేసింది. తాడిపత్రిలోని తన ఇంటికి వెళ్లేందుకు భద్రత కల్పించాలని ఆయన గతంలో హైకోర్టును ఆశ్రయించగా..  పోలీసులు భద్రత కల్పించాలని సింగిల్‌ జడ్జి బెంచ్‌ తీర్పు ఇచ్చింది. ఆ ఉత్తర్వులను అనంతపురం ఎస్పీ సవాల్‌ చేశారు. ఆ తీర్పును హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ రద్దు చేసింది. ఇప్పుడు సుప్రీం కోర్టు కేతిరెరడ్డికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో  ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇంతకాలానికి కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన నివాసానికి వెళ్లడానికి లైన్ క్లియర్ అయింది. అధికారం అటు,ఇటు మారడం, తాడిపత్రి సెగ్మెంట్లలో  గెలుపోటములు సాధారణమే అయినా టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి, జేసీ వర్గంపై 2019 ఎన్నికల్లో మొదటి సారి వైసీపీ నుంచి గెలిచి ఆధిపత్యం చెలాయించిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిలు మాత్రం మొదటి నుంచి తమ వైఖరి మారదంటున్నారు.  తాడిపత్రిలో ఫ్యాక్షన్ వాతావరణం స‌ృష్టిస్తూ అటు ప్రజలను, ఇటు ప్రభుత్వ యంత్రాంగాన్ని టెన్షన్ పెడుతూనే వస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి తన హవా నడిపించారు. ఏకంగా జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటికి వెళ్లి కూర్చుని సవాల్ విసిరారు.  ఆ విషయం అప్పట్లో సంచలనం రేపింది. అంతటితో ఆగకుండా ఏకంగా జేసీ ప్రభాకర్‌రెడ్డిని తాడిపత్రి రాకుండా అనేక సందర్భాల్లో అడ్డుకున్నారు 2024 ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. పొజిషన్స్ ఛేంజ్ అయ్యాయి. కేతిరెడ్డి అపోజిషన్‌లోకి వచ్చేశారు. ఇంకేముంది అందరూ అనుకున్నదే జరుగుతోంది. కేతిరెడ్డి ఘోరీ మహమ్మద్‌లా అనేక మార్లు తాడిపత్రి లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేయడం.. దాన్నిజేసీ వర్గం అడ్డుకోవడం షరా మాములు అయింది...ఆ క్రమంలో ఇటీవల తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు ఆదేశాలు తీసుకొచ్చారు పెద్దారెడ్డి.  హైకోర్ట్ ఆదేశాలతో ఇక తనకు లైన్ క్లియరైందని పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లడానికి రెడీ అయినా, ఎప్పటికప్పుడు జేసీ వర్గీయులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో  పోలీసులు  లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందంటూ పెద్దారెడ్డిని అడ్డుకున్నారు . పైగా కోర్టు ఇచ్చిన ఆర్డర్ మీద అప్పీలుకు వెళ్లారు. దీంతో మూడు వారాల పాటు స్టే విధించింది హైకోర్ట్. ఇలాంటి పరిస్థితుల్లో పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లలేకపోయారు. ఒకవేళ  బలవంతంగా అడుగు పెట్టగలిగినా అక్కడ యాక్టివ్ పాలిటిక్స్ చేయలేని పరిస్థితి ఏర్పడింది.  తాడిపత్రిలో పెద్దారెడ్డి తప్ప,  వైసీపీ తరపున ఎవరైనా రాజకీయాలు చేసుకోవచ్చని స్పష్టంగా చెబు తున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అంతే తప్ప మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి  కొడుకులు, కోడళ్లను కూడా రానివ్వబోనని ప్రతిజ్ఞ చేశారాయన. దీంతో ఆ గ్యాప్ ను భర్తీ చేసేందుకు స్థానిక వైసీపీ నేతలు కొంత మంది తహతహలాడుతున్నారు. తాడిపత్రి స్థానిక వైసీపీ నేత, ఇంజనీరింగ్ కాలేజీ అధినేత రమేష్ రెడ్డి తాను పెద్దారెడ్డి ప్లేస్ లోకి రావాలని ఉత్సాహంగా ఉన్నారట. అలా పెద్దారెడ్డి స్థానాన్న భర్తీ చేయాలని రమేష్ రెడ్డి ఆశలు పెట్టుకున్నారో లేదో అప్పుడే ఆ ఆశలపై నీళ్లు చల్లే ప్రయత్నాలు మొదలుపెట్టారు మరో వైసీపీ నాయకుడు వీఆర్ రామిరెడ్డి. 2014 ఎన్నికల్లో జేసీప్రభాకరరెడ్డికి మంచి పోటీనే ఇచ్చిన వీఆర్ రామిరెడ్డి చాలాకాలం తర్వాత తాడిపత్రిలోకి ఎంట్రీ ఇచ్చి సంచలనం రేపుతున్నారు. రహస్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డితో మంతనాలు జరుపుతున్నట్లు ఆయన ముఖ్య అనుచరులు అంటున్నారు.  అధిష్టానం నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణుల అభిప్రాయాలు సేకరించగా వైసీపీ కార్యకర్తలు తాడిపత్రి వైసీపీ ఇన్చార్జిగా విఆర్ రామిరెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారంట.  ఎప్పుడో పాలిటిక్స్ నుంచి వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకున్న రామిరెడ్డి సడెన్ గా ఇప్పుడు తాడిపత్రికి రావడం అందులోనూ కార్యకర్తలతో సమావేశం అవడం తాడిపత్రి పాలిటిక్స్ లో ఉత్కంఠ రేపుతోంది. ఇన్నాళ్లు ఇద్దరు కృష్ణులే అనుకుంటే ఇప్పుడు మూడో కృష్ణుడు రూపంలో వీఆర్ రామిరెడ్డి రావడంతో తాడిపత్రి  వైసీపీ లో తీవ్ర గంగదరగోళం ఏర్పడింది.  అటు విపక్షం నుంచి, ఇటు స్వపక్షం నుంచి తలనొప్పులు ఎదుర్కొంటున్న పెద్దారెడ్డి ఈ పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కుతారో చూడాలి.

బెస్ట్ సీఎంస్ ఇన్ ఇండియా.. చంద్రబాబు@3

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరి దాదాపు 16 నెలలు అయ్యింది. అంతకు ముందు ఐదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ హయాంలో అభివృద్ధి ఆనవాలే కనిపించలేదు. సంక్షేమం పేరిట అరకొర పందేరాలు వినా ప్రజలను ఇసుమంతైనా ప్రయోజనం కలిగే పథకాలూ లేవు, రాష్ట్ర ప్రగతికి దోహదపడేలా ప్రాజెక్టులూ లేవు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో రాష్ట్రం పూర్తిగా వెనుకబడిపోయింది. ఉన్న పరిశ్రమలు రాష్ట్రం నుంచి తరలిపోయాయి. కొత్తవి రాలేదు. జగన్ హయాంలో అధికారం అంటే కక్ష సాధింపు, దోచుకో, దాచుకో అన్నట్లుగానే సాగింది. ఆర్థిక అరాచకత్వం రాజ్యమేలింది. అప్పులు వినా, రాష్ట్రానికి ఆదాయమన్నదే లేకుండా పోయింది. ప్రభుత్వోద్యోగుల వేతనాలు కూడా విడతల వారీగా చెప్పించే పరిస్థితి ఉండేది.  2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి అఘండ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచీ రాష్ట్రంలో అభివృద్ధికి బాటలు పరుచుకున్నాయి. సంక్షేమానికి సముచిత ప్రాథాన్యతా లభించింది. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు అన్నట్లుగా పాలన సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ 16 నెలల కాలంలో రాష్ట్రానికి మళ్లీ పెట్టుబడులు తరలి వస్తున్నాయి. పారిశ్రామిక రంగానికి కొత్త జవజీవాలు వచ్చాయి. అలాగే గత జగన్ ప్రభుత్వ హయాంకు భిన్నంగా ఇప్పుడు పాలనలో  పారదర్శకత పెరిగింది. ప్రభుత్వ పథకాలకు, అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రజామోదం లభించింది.   ఇప్పుడు విషయానికి వస్తే.. దేశంలో ఉత్తమ పనితీరు కనబరిచిన ముఖ్యమంత్రులు అంటూ ఇండియా టుడే తాజాగా జారీ చేసిన బాబితాలో చంద్రబాబు  నాలుగో స్థానంలో ఉన్నారు. ఇదే ఇండియా టుడే గత ఏడాది ఆగస్టులో విడుదల చేసిన ఉత్తమ సీఎంల జాబితాలో ఐదో స్థానంలో ఉన్న చంద్రబాబు ఏడాది తిరిగే సరికి మూడో స్థానానికి ఎగబాకారు. తాజా జాబితాలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తొలి స్థానంలోనూ, పశ్చిమబెంగాల్ సీం రెండోస్థానంలోనూ ఉన్నారు. మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉన్నారు. అధికారం చేపట్టిన 16 నెలలలోనూ ఈ స్థానంలోకి దూసుకురావడం అంటే ఆయన పనితీరుకు లభించిన ప్రజామోదంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

అసెంబ్లీకి కేసీఆర్ డుమ్మా.. సంకేతం అదేనా?

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్లకుంట్ల చంద్రశేఖరరావు గత అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ  పరాజయం తరువాత దాదాపుగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ఆయన రాజకీయంగా ఏ మాత్రం క్రియాశీలంగా వ్యవహరించడం లేదు. పార్టీ వ్యవహారాలలోనూ అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి హాజరయ్యే బాధ్యతనూ విస్మరించారు. పార్టీ పరాజయం తరువాత ఆయన కేవలం రెండంటే రెండు సార్లు అసెంబ్లీకి హాజరయ్యారు. అప్పుడు కూడా నోరెత్తి మాట్లాడలేదు. అయితే.. ఈసారి మాత్రం కేసీఆర్ అసెంబ్లీకి హాజరౌతారని అంతా భావించారు. ఎందుకంటే.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించేందుకే  అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ సమావేశాలలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ జరుగుతుంది. కాళేశ్వరం అవకతవకలపై కమిషన్ నివేదికను అనుసరించి ఆ ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు, అవినీతికి బాధ్యులపై చర్యకు నిర్ణయం తీసుకుంటారు. కాళేశ్వరం అవకతవకలు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్ సభకు హాజరై తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తారని అంతా భావించారు. దివంగత ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు మాగంటి మృతి పట్ల సభ సంతాపం తెలిపే కార్యక్రమానికీ డుమ్మా కొట్టిన కేసీఆర్..  రానున్న రోజులలో కూడా వచ్చే అవకాశాలు అంతంత మాత్రమే. దీంతో కేసీఆర్ ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పేసినట్లేనా? అన్న చర్చ పోలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. అయితే.. సభకు గైర్హాజరైనా కేసీఆర్  సభలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై మాత్రం  మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లతో  శుక్రవారం (ఆగస్టు 29) సుదీర్ఘంగా చర్చించారు. ఆ చర్చల మేరకే హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారని పరిశీలకులు అంటున్నారు. సభలో కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేస్తామంటే కాంగ్రెస్ సర్కార్ భయపడుతోందంటూ ఎదురుదాడికి దిగడం, సభ కాదు కాళేశ్వరంపై వాస్తవాలు ఏంటన్నది తేల్చాల్సింది కోర్టులే అంటూ అసెంబ్లీ ప్రాధాన్యతను తగ్గించే విధంగా వ్యాఖ్యలు చేయడం కూడా కేసీఆర్ వ్యూహమేనని అంటున్నారు. 

కొందరు నేతల వల్లే తెలంగాణ బీజేపీలో సంక్షోభం.. మరోసారి కమలం పార్టీపై రాజాసింగ్ ఫైర్

రాజాసింగ్ ఇప్పుడు బీజేపీ మాజీ నాయకుడు. బీజేపీ టికెట్ పై గోషామహల్ నుంచి విజయం సాధించినా, పార్టీ రాష్ట్ర నాయకత్వం తీరుతో  అసహనానికి గురై పార్టీకి రాజీనామా చేసేశారు. ఎమ్మెల్యే గా కావాలంటే అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్ ను  పార్టీ రాష్ట్ర నాయకుడు కిషన్ రెడ్డి కోరాలని సవాల్ చేశారు. జంటనగరాలకు ఇంత కాలం బీజేపీ ఫేస్ గా గుర్తింపు పొందిన రాజాసింగ్ కమల బంధనాలను తెంచుకుని బయటకు వచ్చిన తరువాత తాను గతంలో ఎన్నడూ లేనంత స్వేచ్ఛగా తన భావాలను, అభిప్రాయాలను వ్యక్తం చేయగలుగుతున్నాన్నారు. తాజాగా ఆయన తెలంగాణ బీజేపీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాన్ని కోల్పోవడానికి రాష్ట్రంలోని కొందరు కమలం నాయకుల తీరే కారణమని విమర్శించారు. తాను ఇప్పుడు బీజేపీలో లేనని గుర్తు చేసిన ఆయన ఇప్పుడు ఏ విషయంపైనైనా స్వేచ్ఛగా మాట్లాడగలనన్నారు. తెలంగాణలో బీజేపీని కొందరు నాయకులు సంక్షోభంలోకి నెట్టే స్తున్నారని ఫైర్ అయ్యారు.  చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఇటీవల చేసిన ప్రకటనలను ప్రస్తావిస్తూ.. ఇది ఇక్కడితో ఆగదనీ, రాబోయే రోజుల్లో మరింత మంది తెలంగాణ బీజేపీ నేతలు మరింత తీవ్ర వ్యాఖ్యలు చేసే అవకాశం లేకపోలేదన్నారు.    తెలంగాణకు చెందిన పలువురు బీజేపీ నాయకులు పదవులు పోతాయన్న భయంతో మౌనం వహిస్తు న్నారన్న రాజా సింగ్,  రాష్ట్ర నాయకత్వ నిర్ణయాల  కారణంగా నే తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాన్ని జారవిడు చుకుందన్నారు.  పార్టీ బాస్‌ల అనుమతి కోసం వేచి ఉండకుండా అసెంబ్లీ సమావేశాల్లో సమస్యలను లేవనెత్తే స్వేచ్ఛ తనకు ఇప్పుడు ఉందనీ, గతంలో అంటే తాను బీజేపీలో ఉన్నప్పుడు అసెంబ్లీలో గళ మెత్తే అవకాశం ఇవ్వలేదని చెప్పారు.  తెలంగాణ బిజెపిలోని అంతర్గత సమస్యలను కూడా బయటపెడతానన్నారు.  

రుషికొండ ప్యాలెస్ వినియోగంపై పరిశీలనకు మంత్రుల కమిటీ

జగన్ హయాంలో విశాఖలోని రుషి కొండకు బోడిగుండు కొట్టింది.. వేల కోట్ల రూపాయల ఖర్చుతో అత్యంత విలాసవంతమైన ప్యాలస్ భవనాలను నిర్మించిన సంగతి తెలిసిందే. ప్రజాధనాన్ని వృధా చేసి మరీ నిర్మించిన ఆ ప్యాలెస్ భవనాలు ఎందుకూ పనికి రాకుండా నిరుపుయోగంగా పడి ఉన్నాయి. వాటిని ఎలా వినియోగించుకోవాలన్న విషయంపై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. అందులో భాగంగా రుషికొండ  ప్యాలెస్ వినియోగంపై పరిశీలనకు మంత్రుల కమిటీని వేసింది.   మంత్రు లు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, డోలా బాలవీరాంజనేయస్వామిలతో ప్రభుత్వం కమిటీని వేసింది. ఈ మేరకు సీఎస్ విజయానంద్ శుక్రవారం (ఆగస్టు 29) ఉత్తర్వులు జారీ చేశారు.  ఈ కమిటీ రుషికొండ ప్యాలెస్, భవనాలను వినియోగించే మార్గాలు, అవకాశాలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి  నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కమిటీ నివేదిక అనంతరం రుషికొండ ప్యాలెస్, భవనాల వినియోగం విషయంలో కూటమి సర్కార్ ఒక నిర్ణయం తీసుకుంటుంది. 

విశాఖలో జనసేన బహిరంగ సభ

 విశాఖలో సేనతో సేనాని పేరిట జనసేన శనివారం భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభ కోసం  రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున  జనసేన క్రియాశీల  కార్యకర్తలు విశాఖ నగరానికి చేరుకున్నారు.  విశాఖ వన్ టౌన్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వేదికగా ఈ బహిరంగ సభ జరగనుంది ఇప్పటికే మూడు రోజుల కార్యక్రమం కోసం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో బస చేశారు.   రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15 వేల మంది క్రియశీలక కార్యకర్తలు ఈ బహిరంగ సభ కు హాజరయ్యే అవకాశం ఉంది మధ్యాహ్నం ఒంటిగంట నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుంది ఈ బహిరంగ సభ వేదికకు అల్లూరి సీతారామరాజు ప్రాంగణంగా నామకరణం చేశారు.   విశాఖ నగర వ్యాప్తంగా జనసేన జెండాలు, ఫ్లెక్సీలు కటౌట్లు ఏర్పాటు చేశారు.  

ప‌వ‌న్ ధ‌రించిన... ఈ ఉంగ‌రంలో ఇంత అర్ధ‌ముందా?

  విశాఖ సేన‌తో సేనాని విస్తృత స్థాయి స‌మావేశాల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేతులు అటు ఇటు ఆడిస్తూ క‌నిపించారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న వేలికి ప్ర‌త్యేకించి ఒక ఉంగ‌రం ధ‌రించిన‌ట్టు క‌నిపించింది. ఈ మ‌ధ్య కాలంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ర‌క‌ర‌కాల ఉంగ‌రాలు ధ‌రిస్తూ క‌నిపిస్తున్నారు. వాటిలో ప‌గ‌డం.. ఉంగ‌రం ఆపై మేరు కూర్మ‌ ఉంగ‌రం.. ప్ర‌స్తుతం చూస్తే నాగ‌బంధ ఉంగ‌రం క‌నిపించించింది. దీని అర్ధ‌మేంట‌న్న చ‌ర్చ న‌డుస్తోంది. గ‌తంలో ఆయ‌న కూర్మం ఉండే మేరు ఉంగ‌రం ధ‌రించేవారు. మాములుగా ఇది ఎందుకంటే మేరు  ప‌ర్వ‌తాన్ని పాల స‌ముద్రంలో వేసి వాసుకి ద్వారా చిల‌క‌డానికి ప‌నికొస్తుంద‌ని అంటారు. ఆ ప‌ర్వ‌తం మ‌రీ స‌ముద్రంలోప‌ల మునిగి పోకుండా ఆపడానికి పుట్టుకొచ్చిందే కూర్మావ‌తారం. ఆ అవ‌తారం అర్ద‌మేంటంటే ఏదైనా స‌రే మునిగిపోకుండా ఆపేద‌ని అర్ధం. దాని ప్ర‌కారం కూట‌మిలో తానొక కూర్మావ‌తారం దాల్చి ఎలాగోలా గ‌ట్టించ‌గ‌లిగిన పేరు సాధించారు ప‌వ‌న్. ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ ప్ర‌భుత్వం 15 ఏళ్ల వ‌ర‌కూ ఉండాల్సిందే అంటున్నారు. కార‌ణం.. ఇటు రాజ‌ధాని అమ‌రావ‌తి కానీ, అటు రాష్ట్రం కానీ స్థిర‌ప‌డి అభివృద్ది చెందాలంటే.. ఈ మాత్రం స‌మ‌యం అవ‌స‌రం అన్న‌ది ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆలోచ‌న‌. ఈ విష‌యంపై నేరుగా జ‌న‌సైనికులు నాగబాబునే మొహాన్నే అడిగేసిన ప‌రిస్థితి. మీకు ఇష్టం ఉన్నా లేకున్నా అధినేత తీస్కున్న నిర్ణ‌యాన్ని మ‌నం ఎవ్వ‌రం మార్చ‌లేము అని క్లియ‌ర్ క‌ట్ గా చెప్పేస్తున్నారు నాగ‌బాబు. ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం ప‌వ‌న్ ధ‌రించిన ఈ నాగ‌బంధ ఉంగ‌రంలో ఒక బంధం ఉంటుంది. రెండు పాములు పెన‌వేసుకున్న దృశ్యం క‌నిపిస్తోంది. ఇది టీడీపీ కూట‌మితో త‌న పార్టీ బంధం ఇలాగే పెన‌వేసుకోవాల‌న్న కోణంలో ప‌వ‌న్  క‌ళ్యాణ్ ఇలాంటి ఉంగ‌రం ధ‌రించిన‌ట్టుగా భావిస్తున్నారు ప‌లువురు అభిమానులు.  

పిన్నెళ్లి సోదరుల బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన హైకోర్టు

జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులకు ఏపీ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. పిన్నెల్లి సోదరులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. మాచర్లకు సమీపంలో జరిగిన జంట హత్యల కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, వెంకటరామిరెడ్డి పిటిషన్ లను పరిశీలించిన ఏపీ హైకోర్టు ఈ కేసులో   పిన్నెల్లి బ్రదర్స్ కు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారన్న పోలీసుల వాదనతో ఏకీభవించింది. వారి బెయిలు పిటిషన్లను డిస్మిస్ చేసింది. ఈ కేసుకు సంబంధించి పక్కా ఆధారాలు ఉన్నాయని పోలీసుల తరఫున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో వాదనలు వినిపించారు. వారికి బెయిలు ఇస్తే విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉందని, సాక్షులను బెదరించే చాన్స్ ఉందని  కోర్టుకు తెలిపారు. ఆగస్టు 21న ఈ కేసులో విచారణ జరుగగా.. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం, తీర్పును  రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే.  పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌‌ను తిరస్కరిస్తున్నట్లు హైకోర్టు ధర్మాసనం శుక్రవారం (ఆగస్టు 29) తీర్పు వెలువరించింది.  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పిన్నెల్లి వెంకటరామిరెడ్డి పరారీలో ఉన్నారు.  ఇంతకీ కేసేమిటంటే.. పల్నాడు జిల్లాలోని వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ నాయకులు జవిశెట్టి కోటేశ్వరరావు, జవిశెట్టి వెంకటేశ్వర్లు దారుణ హత్యకు గురయ్యారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల ఫిర్యాదుతో పిన్నెల్లి బ్రదర్స్‌ సహా హత్యతో ప్రమేయం ఉన్న నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా జవిశెట్టి శ్రీను ఎలియాస్‌ బొబ్బిలి, ఏ2గా తోట వెంకట్రామయ్య, ఏ3గా తోట గురవయ్య, ఏ4గా దొంగరి నాగరాజు, ఏ5గా తోట వెంకటేశ్వర్లు, ఏ6గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఏ7గా పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలు ఉన్నారు.   

కామ్రేడ్ల కుర్చీ పోరు

  క్రమశిక్షణకు మారుపేరైన కమ్యూనిస్టుల్లో , ప్రజాసామ్యయుతంగా నడిచే ప్రజా ఉద్యమాల పార్టీ సీపీఐలో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. నాయకులు చెప్పినట్లు నడుచుకునే సీపీఐ నేతల్లో పదవీ కాంక్షలు మొదలయ్యాయి. అందుకోసం గ్రూపులు కట్టే పరిస్ధితి ఏర్పడింది. ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి హోదా కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్లు ప్రారంభించారు. దాంతో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎంపిక అర్ధంతరంగా ఆగిపోయింది.   కౌన్సిల్, కార్యదర్శివర్గం ఎన్నిక జరిగినా..కార్యదర్శి ఎన్నిక మాత్రం జరగకుండానే ఒంగోలులో జరిగిన 3 రోజుల మహసభలను ముగించేశారు. ఆల్ ఇండియా మహాసభ తరువాత దీనిపై నిర్ణయం తీసుకుందామంటూ దాట వేశారు. మూడు రోజుల పాటు ఒంగోలులో సీపీఐ రాష్ట్ర మహాసభలు జరిగాయి. ఈ మహాసభల్లో గత కార్యక్రమాలను చర్చించుకోవడంతో పాటు, భవిష్యత్ కార్యచరణపై చర్చ జరిగింది. దానితో పాటు నూతన సారథిని ఎన్నుకోవాల్సి ఉంది.  పార్టీ నిబంధనల ప్రకారం ఒక కామ్రేడ్ మూడు పర్యాయాలు కంటే ఎక్కువ సార్లు పార్టీ కార్యదర్శిగా పనిచేయాడానికి వీలు లేదు.  రాష్ట్ర విభజన తరువాత ఇప్పటివరకు రామకృష్ణ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగారు. మూడు సార్లు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన నేపధ్యంలో ఇప్పుడు కొత్త కార్యదర్శిని ఎన్నుకోవాల్సి ఉంది. అయితే ఇదే ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలో విభేదాలను, పదవిపై ఉన్న మోజు తో పాటు, పార్టీ నాయకత్వంపై క్యాడర్ మధ్య ఉన్న అంతరాలను బయటపెట్టింది. మహాసభ చివరిరోజు గందరగోళానికి గురైంది. రామకృష్ణ తరువాత రాష్ట్ర సీపీఐ కార్యదర్శిగా  పార్టీ సీనియర్ నాయకుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు ఉండాంటూ ప్రస్తుత కార్యదర్శి రామకృష్ణ ప్రతిపాదనలు పెట్టారు. అయితే పార్టీ నిబంధల ప్రకారం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవికి ఎవరైన పోటీ పడవోచ్చు. దాంతో ముప్పాళ్ల పేరు ప్రతిపాదించగానే మరో లీడర్ ఈశ్వరయ్య తాను కార్యదర్శి స్ధానానికి పోటీగా ఉంటానని చెప్పడంతో ఒక్కసారిగా పార్టీ లీడర్స్ అవ్వాకయ్యారు. అయితే అప్పటికే ఈశ్వరయ్య కార్యదర్శి అవుతారని మహాసభకి హాజరైన ప్రతినిధులు భావించారంట.  అయితే రామకృష్ణ ముప్పాళ పేరు తెరమీదకు తీసుకురావడంతో ఈశ్వరయ్య పోటీకి రావడం, ప్రజాస్వామ్య యుతంగా పోటీ పెట్టాలని కోరడంతో చేసేది ఏం లేక ఈశ్వరయ్య ను సమూదాయించే పనికి పార్టీ లీడర్స్ దిగారు. ముప్పాళ వయస్సులో పెద్దవారు. పార్టీ నిబంధన ప్రకారం 75ఏళ్లు వరకు మాత్రమే పార్టీ రాష్ట్ర పోస్టులో కొనసాగే అవకాశం ఉంది. ఈ ఒక్క సారి ముప్పాళ నాగేశ్వరరావుకి అవకాశం ఇద్దాం.. తరువాత నువ్వు సెక్రటరీ అవ్వవచ్చు అంటూ ఈశ్వరయ్యకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారంట. ప్రజాస్వాయ్యపద్దతిలో ఎన్నిక జరగాలి, తాను పోటీలో ఉంటానని ఈశ్వరయ్య తెగేసి చెప్పడంతో కార్యదర్శి పదవి తరువాత చూద్దాం అంటూ ఎన్నిక వాయిదా వేయాల్సి వచ్చింది. మరోపక్క ఈశ్వరయ్య అనుచర వర్గం కూడా ఓటింగ్ పెట్టాలని ఓటింగ్ నిర్వహిస్తే ఈశ్వరయ్యే గెలిచే అవకాశం ఉందని డిమాండ్ చేశారంట. అదే కనుక జరిగితే ప్రస్తుత సెక్రటరీగా ఉన్న రామకృష్ణ ప్రతిపాదన వీగిపోతే పరువు పోతుందని భావించిన సిపిఐ ఆగ్రనాయకత్వం కార్యదర్శి ఎన్నికలను వాయిదా వేసిందంటున్నారు.  ఇప్పటి వరకు ఇటువంటి పరిస్ధితి ఆంధ్రప్రదేశ్ సీపీఐ చరిత్రలో లేదంటున్నారు సీనియర్ నాయకులు. క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా ప్రస్తుతం కమ్యూనిస్టు పార్టీ లీడర్స్‌పై ప్రభావం చూపిస్తున్నాయని, దాని ప్రభావం కారణంగానే ముప్పాళ పేరు తెరమీదకు వచ్చిందనే అభిప్రాయం కూడా కొంతమంది క్యాడర్ వ్యక్తం చేస్తోంది.  బీసీ వర్గానికి చెందిన ఈశ్వరయ్యకు పదవి వస్తుందనే  కారణంతోతే వాయిదా వేశారనే వాదన వినిపిస్తుంది. ఒంగోలులో జరిగిన మహసభలో ఆ జిల్లా క్యాడర్ కూడా పార్టీ అగ్రనాయకత్వం చెప్పిన దానికి వ్యతిరేకంగా నినదించడంతో పార్టీ చరిత్రలో ఒంగోలు సభ నిలిచిపోతుందని, ఇటువంటి మహసభ ఇప్పటివరకు చూడలేదంటూ నాయకత్వం కూడా అసహనం వ్యక్తం చేసిందంట. కౌన్సిల్ సమావేశం జరుగుతున్న సమయంలో దాదాపు 10 మంది జిల్లా కార్యదర్శులు ప్రస్తుత రాష్ట్ర కార్యదర్శి ప్రతిపాదనను వ్యతిరేకించారంటే నాయకత్వానికి క్యాడర్‌కి మధ్య దూరం ఏవిధంగా పెరుగుతుందో అర్థమవుతుందని సీనియర్లు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా కమ్యూనిస్టుల్లో కూడా అంతర్గత కుమ్ములాటల ఇప్పుడు బహిర్గతం అవుతుండటం పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.. పదవీ కాంక్షకు కమ్యూనిస్టులు కూడా అతీతులు కాదన్న విమర్శలు వస్తున్నాయి.  

మోడీ రిటైర్మెంట్ చర్చకు ఫుల్ స్టాప్ పడినట్లేనా?

ప్రధాని నరేంద్ర మోడీ త్వరలో 75వ పడిలో అడుగుపెట్టనున్నారు. బీజేపీ తనంతట తానే విధించుకున్న నిబంధన మేరకు మోడీ ఇక రిటైర్ కావలసిందే. మోడీ ప్రధానిగా తొలి సారి అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచీ పార్టీలోని సీనియర్లను వయస్సు కారణంగా చూపుతూ క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంచే ప్రయత్నాలను ప్రారంభించారు. ప్రారంభించడమే కాదు.. చేసి చూపించారు కూడా. బీజేపీలో సీనియర్ మోస్ట్ నాయకులైన ఎల్ కే అద్వానీ, మురళీమనోహర్ జోషీలకు వారికి 75 ఏళ్లు వచ్చాయన్న ఒకే ఒక కారణంతో పార్టీలో క్రియాశీలక పాత్ర లేకుండా చేశారు. వారికి కనీసం పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. బీజేపీ అంగీకరించకపోవచ్చు కానీ ఆ సీనియర్లిద్దరినీ అత్యంత అవమానకర రీతిలో పక్కన పెట్టేశారు.  ఇప్పుడు అదే పరిస్థితి మోడీకి వస్తుందని చాలా మంది భావించారు. కానీ ప్రధానిగా పదవీ పగ్గాలు చేపట్టిన ఈ దశాబ్దంపైగా కాలంలో మోడీ పార్టీపైనా, ప్రభుత్వంపైనా కూడా పూర్తి పట్టు సాధించారు. మోడీ కాకపోతే మరెవరు? అన్న పరిస్థితి పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఏర్పడేలా చేశారు. ఈ నేపథ్యంలోనే మోడీ 75 ఏళ్ల వయస్సు వచ్చినా ప్రధానిగానే కొనసాగే పరిస్థితి కల్పించుకున్నారు. కానీ అనుకోని విధంగా మోడీ ఓవర్ డూయింగ్స్ పార్టీ మెంటార్ గా భావించే ఆర్ఎస్ఎస్ ఒకింత ఆగ్రహంగా ఉందన్న వార్తలు గుప్పుమనడం.. అదే సమయంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కొంత కాలం కిందట 75 ఏళ్లకే రిటైర్మెంట్ అంటూ నొక్కి వక్కాణించడంతో మోడీ కొనసాగింపు ఎండమావే అన్న అనుమానాలు బలంగా వ్యక్తమయ్యాయి. ఇందుకు తోడు అంతకు ముందు అంటే మోడీ ముచ్చటగా మూడొ సారి ప్రధానిగా పదవీ పగ్గాలు చేపట్టిన తరువాత హుటాహుటిన నాగపూర్ లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లి మోహన్ భగవత్ సహా సంఘ్ ప్రముఖులతో భేటీ అవ్వడం కూడా ఆర్ఎస్ఎస్, మోడీల మధ్య కుచ్ కుచ్ హోతా అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఆ తరువాత మోహన్ భగవత్ 75 ఏళ్ల నిబంధన గురించి లేవనెత్తడం కూడా మోడీ పదవికి ఇక ఎసరు వచ్చినట్లేనన్న వార్తలు గుప్పుమన్నాయి. దేశ వ్యాప్తంగా మోడీ వారసుడెవరన్న చర్చ సైతం జోరుగా సాగింది. అయితే ఈ వ్యవహారం అంతా టీ కప్పులో తుపానుగా తేలిపోయింది. 75 ఏళ్ల వయస్సు నిబంధనపై అంత గట్టిగా మాట్లాడిన మోహన్ భగవత్.. ఉన్నట్లుండి ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించేశారు. వయస్సు పైబడినా ఉత్సాహంగా పని చేసే వారికి ఆ నిబంధన వర్తించదంటూ ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ మోడీ పదవీ కాలం ఇక నెలలే అంటూ జరిగిన చర్చకు తెరపడింది. మరో సారి కూడా మోడీయే అన్న భావన బలపడింది. ఆర్ఎస్ఎస్ ను కూడా తన దారికి తెచ్చుకున్న మహాలుడిగా మోడీని కమలం శ్రేణులు కీర్తిస్తున్నాయి. మోడీ ముందు ఆర్ఎస్ఎస్ తలవంచినట్లైందంటూ పరిశీలకులు విశ్లేషణలకు పదును పెడుతున్నారు. 

బీహార్‌లో జెండా కర్రలతో కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు

  బీహార్‌లో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు దారుణంగా కొట్టుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓట్ అధికార్ యాత్రలో ఓ వ్యక్తి ప్రధాని మోదీపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. దీనికి నిరసన బీజేపీ ర్యాలీ చేపట్టగా దానిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలు కూడా ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతలు ఎదురుపడిన సమయంలో పార్టీ జెండాలతో పరస్పరం దాడి చేసుకున్నారు.విపక్ష నేత రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్ ఇద్దరూ కలిసి నిర్వహించిన 'ఓటర్ అధికార యాత్ర' కార్యక్రమంలో కొందరు వ్యక్తులు.. నరేంద్ర మోదీ సహా ఆయన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.  ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ కావాలనే ఇలాంటి చర్యలు చేపడుతోందని ఆరోపించారు. ఇప్పటికే ఈ కామెంట్స్ చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు రాహుల్ గాంధీ సైతం.. మోఈ ఘటనపై స్పందించారు. ప్రధాని మోదీని క్షమించమని అడిగారు. తప్పుడు వ్యాఖ్యలను తాము కూడా తీవ్రంగా ఖండిస్తున్నామని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాహుల్ తెలిపారు  

లాంగ్ లీవ్ పై ఐఏఎస్ స్మితా సబర్వాల్

తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ లాంగ్ లీవ్ లో వెళ్లారు. వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ వరకు అమె సెలవు పెట్టారు. సెలవుకు ఆరోగ్య కారణాలు చూపినప్పటికీ.. గత ప్రభుత్వంలో సీఎంవో లో అడిషనల్ కార్యదర్శిగా పని చేసిన స్మితా సబర్వాల్ కాళేశ్వరం ప్రాజెక్టు సహా పలు కీలక ప్రాజెక్టులలో కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. తాజాగా కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ నివేదికలో కూడా స్మితా సబర్వాల్ పై చర్యలకు సిఫారసు చేశారు. ఈ నేపథ్యంలో ఆమె లాంగ్ లీవ్ పై వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. కాగా ఆమె తన సెలవుకు కారణం గత కొంత కాలంగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. కాగా ఆమె సెలవును ప్రభుత్వం మంజూరు చేసింది.  

కేసిరెడ్డి పీఏకి బెయిలొచ్చింది కానీ.. పాపం!

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు రాజ్ కేసిరెడ్డి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను ఏసీబీ కోర్టు గురువారం (ఆగస్టు 28) కొట్టివేసింది. ఈ కేసులో రాజ్ కేసిరెడ్డి ఏ1 అన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో బెయిలు కోసం రాజ్ కాసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, దిలీప్ విజయవాడ ఏసీబీ కోర్టులో  పిటిషన్ దాఖలు చేశారు. వీరి బెయిలు పిటిషన్ల పై ఏసీబీ కోర్టు గురువారం (ఆగస్టు 28) తీర్పు వెలువరించింది. రాజ్ కేసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి లకు బెయిలు నిరాకరించిన కోర్టు, ఇదే కేసులో ఏ30 అయిన రాజ్ కేసిరెడ్డి పీఏ దిలీప్ రెడ్డికి మాత్రం బెయిలు మంజూరు చేసింది.  ఈ కేసులో అరెస్టై విజయవాడ జైలులో ఉన్న నిందితులలో దిలీప్ ఒకరు. అతడికి ఏసీబీ కోర్టు బెయిలు మంజూరు చేయడంతో విడుదలయ్యారు. అయితే రాజ్ కరేసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డిలకు మాత్రం కోర్టు బెయిలు నిరాకరించి, వారి పిటిషన్లను డిస్మిస్ చేసింది.  రాజ్ కేసిరెడ్డి గతంలో బెయిలు కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీం కోర్టు బెయిలు కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని  సూచిస్తూ ఆయన పిటిషన్ ను కొట్టివేసింది.   

రాహుల్ టార్గెట్ గా అరవింద్ విమర్శల వర్షం.. మర్మమేంటంటే?

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముంగిట కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి బిగ్ షాక్ తగిలింది.  బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో విజయాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఓట్ అధికార్ యాత్ర పేరుతో బీహార్ లోనే మకాం వేశారు. కీలక నాయకురాలు, ఆయన సోదరి ప్రియాంక గాంధీ కూడా బీహార్ లో పర్యటిస్తున్నారు. ఓట్ చోర్ అంటూ ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం బీహార్ పర్యటనలు చేస్తున్నారు. దీంతో బీహార్ ఎన్నికలు కాంగ్రెస్ కు గేమ్ చేంజర్ గా మారనున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది.   జాతీయ మీడియాలో మాత్రం రాహుల్ చేస్తున్న ఓటు అధికార్ యాత్రకు విస్తృత కవరేజ్ అయితే లభిస్తోంది. అంతే కాదు, విశ్లేషకులు కాంగ్రెస్ కూటమికి  బీహార్ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. సర్వేల ఫలితాలు సైతం అదే చెబుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలలో ఐక్యత కనిపిస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ రూపంలో రాహుల్ కు గట్టి షాక్ తగిలింది.  ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకూ ఇండియా కూటమిలోనే ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆ తరువాత బయటకు వచ్చేసింది. ఇప్పుడు బీహార్ ఎన్నికల సమయంలో మరోమారు కాంగ్రెస్ కు, రాహుల్ కు వ్యతిరేకంగా గళమెత్తింది. ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ రాహుల్ పై విమర్శలు గుప్పించారు. గురువారం (ఆగస్టు 28) ఆయన మీడియా సమావేశంలో  బీజేపీ, కాంగ్రెస్ ను ఒకే తాను ముక్కలు, పరిస్థితులను చూస్తుంటే ఇరు పార్టీల మధ్యా పొత్తు ఉందా అనిపిస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీజేపీల పొత్తుకు నేషనల్ హెరాల్డ్ కేసుకు ముడిపెట్టారు.   నేషనల్ హెరాల్డ్ కేసు మూతపడిందా? అన్న అనుమానం వ్యక్తం చేశారు. మద్యం కేసులో తాను అన్యాయంగా జైలుకు వెళ్లాననీ.. కానీ నేషనల్ హెరాల్డ్ కేసులో గాంధీ కుటుంబం నుంచి ఎవరూ జైలుకు వెళ్లలేదన్నారు. దీని వెనుక ఏదో మర్మం ఉందన్న అనుమానం వ్యక్తం చేశారు. అంతే కాదు   2 జి, బొగ్గు కుంభకోణం వంటి స్కాంల కథ ముగిసిపోయినట్లే కనిపిస్తోందన్న అరవింద్ కేజ్రీవాల్   కాంగ్రెస్ రాజీపడటమే ఇందుకు కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ అగ్రనేత ఇప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ అంటూ చేస్తున్న ఆందోళన, యాత్రలూ అన్నీ వ్యక్తిగత రక్షణ కోసమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు.  రాహుల్ గాంధీ ఇటీవలి కాలంలో బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఆయన విమర్శలకు జాతీయ స్థాయిలో స్పందన లభించడమే కాకుండా, చర్చకు కూడా కారణమౌతున్నాయి. రాహుల్ విమర్శలతో ఎంత కాదనుకున్నా బీజేపీ డిఫెన్స్ లో పడిందన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తం అవుతోంది. రాహుల్ దూకుడు కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు కూడా కాంగ్రెస్ వెనుక ర్యాలీ అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అరవింద్ కేజ్రీవాల్ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ లక్ష్యంగా  చేసిన విమర్శలు, వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.  ఇవి బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ప్రభావం చూపే అవకాశం ఉందా? అన్న చర్చకు తెరలేచింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీకి దూరంగా ఉన్న ఆప్.. ఇప్పుడు కాంగ్రెస్ లక్ష్యంగా, రాహుల్ టార్గెట్ గా ఎందుకు గళమెత్తుతోందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  

మాట మార్చిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

  ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని వ్యాఖ్యానించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇవాళ మాట మార్చారు. 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని నేను ఎవరికీ చెప్పలేదు అన్నారు. 75 ఏళ్ల తర్వాత కూడా చురుగ్గా పనిచేసే శక్తి ఉందని ఆయన తెలిపారు.సంఘ్ ఎలా చెప్తే అలా నడుచుకుంటామని వెల్లడించారు. కేంద్రం, ఆర్‌ఎస్‌ఎస్‌ మధ్య ఎలాంటి విభేదాలు లేవని  ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ స్పష్టం చేశారు.  . రాష్ట్రీయ స్వయం సేవక్‌  సంఘ్‌ వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని విషయాల్లో అభిప్రాయ బేధాలు ఉండొచ్చు.. వివాదం కాదంటూ చెప్పుకొచ్చారు. దేశ ప్రయోజనాలే ఇద్దరి ప్రాధాన్యతగా పేర్కొన్న మోహన్‌ భగవత్‌..  బీజేపీ అధ్యక్షుడి ఎన్నికను ఆర్‌ఎస్‌ఎస్‌ శాసించదన్నారు. ‘మేం సలహా ఇవ్వగలం  .. తుది నిర్ణయం వారిదేని తెలిపారు.  నూతన విద్యా విధానానికి మేం మద్దతిస్తున్నాం. ఇంగ్లీష్‌ నేర్చుకోవడంలో తప్పులేదు’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ తరఫున ఆర్‌ఎస్‌ఎస్‌ నిర్ణయాలు తీసుకుంటుందని  ప్రతిపక్షాల నుండి వస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలతో తమకు మంచి సమన్వయం ఉందని మోహన్ భగవత్ వెల్లడించారు.  

ఫేక్ వీడియోతో అమరావతిపై మరోసారి విషం కక్కిన వైసీపీ

వైసీపీ ఫేక్ ప్రచారం విషయంలో డాక్టరేట్ సాధించిందా అనిపించక మానదు. పదే పదే ఫేక్ ప్రాపగాండాతో ప్రజలను తప్పుదోవపట్టించాలన్న ఆ పార్టీ ప్రయత్నాలు విఫలమౌతూ వస్తున్నాయి. అయినా వైసీపీ తీరు మారడం లేదు. ముఖ్యంగా అమరావతి విషయంలో వైసీపీ ఫేక్ ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికే పలు సార్లు ఇలాంటి ప్రచారాన్ని వ్యాప్తి చేసి విఫలమైన వైసీపీ తాజాగా మరో సారి అదే విషప్రచారానికి తెగబడింది. ఇప్పటికే అమరావతి వరదల్లో మునిగిపోయిందంటూ నకిలీ వీడియోలను విడుదల చేసి అడ్డంగా దొరికిపోయిన వైసీపీ ఇప్పుడు తాజాగా మరో ఫేక్ వీడియోతో అమరావతిలో దళితులకు అవమానం జరుగుతోంది. వారిపై దాడులు జరుగుతున్నాయంటూ జనాలను నమ్మించడానికి ప్రయత్నించింది. వైసీపీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఈ నకిలీ వీడియోలో ఒక దళిత మహిళను అవమానానికి గురి చేస్తున్నట్లుగా ఉంది. ఒకింత నిశితంగా పరిశీలిస్తే అది ఫేక్ వీడియో అని ఇట్టే తేలిపోతుంది. ఎందుకంటే ఆ వీడియో తమిళ టెక్స్ట్ స్పష్టంగా కనిపి స్తున్నది. అయితే వైసీపీ సోషల్ మీడియా మాత్రం ఆ వీడియో అమరావతికి సంబంధించినదని చెప్పుకుంటోంది. అలా చెప్పడం ద్వారా అమరావతిలో దళితులకు అన్యాయం జరుగుతోందని, వారి మనోభావాలు దెబ్బతింటున్నాయనీ చాటడం ద్వారా కుల విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నది. ఇవన్నీ చూస్తుంటే.. అమరావతికి, దళితులకు వ్యతిరేకంగా వైసీపీ చేసే ఫేక్ ప్రచారానికి అంతం అన్నదే ఉండదా అనిపించక మానదు. ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన తెలుగుదేశం కూటమి వర్గాలు.. ఈ ఫేక్ వీడియో పోస్టు చేసిన వారు చట్టపరమైన చర్యలను ఎదుర్కొనక తప్పదని హెచ్చరించాయి.   

ఈ బ్లాక్ మెయిల్ అంతా...బాగోతం బ‌య‌ట‌ప‌డుతుంద‌నేనా?

  భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి, బీఆర్ నాయుడు మ‌ధ్య వ్య‌వ‌హారం పీక్ స్టేజీకి చేరిపోయిన‌ట్టుంది? ఒకరికొక‌రు టీటీడీ వ్య‌వ‌స్థాగ‌త విమ‌ర్శ‌ల స్థాయిని మ‌ర‌చి వ్య‌క్తిగ‌త ఆరోప‌ణ‌ల వ‌ర‌కూ వ‌చ్చేశారు. అయితే బీఆర్ నాయుడు ఎక్క‌డ భూమ‌న బాగోత‌మంతా తిర‌గ‌దోడుతాడో అన్న భ‌యాందోళ‌న నుంచి ఒక బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ కి తెర‌లేపిన‌ట్టు క‌నిపిస్తోంది. మేమొచ్చాక మొత్తం ప్ర‌క్షాళ‌న చేస్తామ‌ని చెప్పిన బీఆర్ నాయుడుకు అడుగ‌డుగునా ఆటంకాలు క‌లిగిస్తూనే వ‌స్తున్నారు భూమ‌న‌. అందులో మొద‌టిది గోశాల గోవుల మ‌ర‌ణాల‌ వ్య‌వ‌హారం  కాగా, రెండోది కాస్తంత సీవియ‌ర్ గానే ఉండేలా జాగ్ర‌త్త ప‌డ్డారు. ముక్కోటి టికెట్ల విష‌యంలో ఏకంగా తోపులాట‌ను సృష్టించి అందులో ఆరుగురు చ‌నిపోయిన‌ట్టుగా చిత్రీక‌రించారు. ఇదంతా టీటీడీ దాని పాల‌క మండ‌లి ఆపై దాని నిర్వాకం మీద పెద్ద ఎత్తున నింద వేశారు. ఇక ఆల‌యం ముందుకు చెప్పులు వేసుకుని వెళ్లేలా చేసి.. వాటి ద్వారా.. ఒక వివాదం సృష్టించాల‌ని చూశారు. ఆపై ఒక రెడ్డి స‌భ్యుడితో ఆల‌యం ముందు బూతులు తిట్టించి అలాక్కూడా బీఆర్ నాయుడు బ‌ద‌నాం అయ్యేలా చేశారు. ఇప్పుడు సుధాక‌ర్  రెడ్డిని రెచ్చ‌గొట్టించి.. ఆయ‌న ద్వారా తిరుప‌తికి ఒక మంత్రి కేవ‌లం  రాస‌లీల‌లు చేయ‌డానికే వ‌స్తార‌న్న కామెంట్లు గుప్పించారు. ఇక అక్క‌డితో ఆగ‌క బీఆర్ నాయుడు ఒక బంట్రోతు స్థాయి నుంచి ఒక ట్రావెల్ ఏజెంట్ స్తాయి నుంచి టీవీఫైవ్ అధినేత‌గా ఎలా ఎదిగార‌న్న పాత చ‌రిత్ర‌ను తిర‌గ‌దోడారు. ఆపై కాళేశ్వ‌ర్ బాబా చావు వెన‌క బీఆర్ నాయుడు హ‌స్తం ఉందంటూ గ‌త చ‌రిత్ర త‌వ్వి పోశారు.  అలాక్కూడా బీఆర్ నాయుడు భ‌య‌ప‌డ్డం లేద‌ని చెప్పి కొత్త‌గా జూబ్లిహిల్స్ ఓపెన్ ల్యాండ్స్ వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు తీశారు. ఆపై మంచి రేవుల భూముల ఇష్యూ సైతం వెలుగులోకి తెచ్చారు. వీట‌న్నిటిని బ‌ట్టీ చూస్తే భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి టీటీడీ కేంద్రంగా పెద్ద ఎత్తున అవినీతికి తెర‌లేపిన‌ట్టే ఉంద‌ని అంటున్నారు చాలా మంది. బీఆర్ కూడా గ‌తంలో చేసిన కామెంట్ల‌ను బ‌ట్టీ చూస్తే ఒక ద‌శ‌లో వీరంతా క‌ల‌సి.. చేసిన నిర్వాకానికి టీటీడీ అప్పుల్లో కూరుకుపోవ‌ల్సి వ‌చ్చేద‌ని తెలుస్తోంది.. అల‌నాడు పురాణ ఇతిహాసాల్లో చెప్పిన‌ట్టు వెంక‌న్న తిరిగి అప్పు తీస్కోవ‌ల్సి వ‌చ్చేద‌ని... అందుకే వెంక‌న్న వీరికెలాగైనా స‌రే బుద్ధి చెప్పాల‌న్న కోణంలో.. 11 సీట్ల పంగ‌నామాల గుణ‌పాఠం చెప్పార‌ని.. అంటారు.