లోకేష్ చొరవతో గణేష్, దసరా మండపాలకు ఉచిత విద్యుత్

తెలుగు రాష్ట్రాలలో పండుగ వాతావరణానికి మంత్రి లోకేష్ తీసుకున్న నిర్ణయం మరింత శోభను ఇచ్చింది. తెలుగురాష్ట్రాలలో బుధవారం (ఆగస్టు 27) నుంచి వినాయక చవిత నవరాత్రులు అత్యంత వైభవంగా, అంబరాన్నంటే సంబరంతో జరగనున్నాయి. వీధి వీధినా గణేష్ పందిళ్లు వేసి తొమ్మిది రోజుల పాటు గణపతి నవరాత్రులను అత్యంత వేడుకగా జరుపుకోవడం తెలుగురాష్ట్రాలలో ఆనవాయితీ. ఇక ఈ వేడకకు మరింత శోభ, నిర్వాహకులకు, భక్తులకు మరింత ఆనందం చేకూర్చేలా మంత్రి లోకేష్ నిర్ణయం తీసుకున్నారు. గణపతి నవరాత్రుల సందర్భంగా వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలన్న మండపాల నిర్వాహకుల వినతి లోకేష్ వద్దకు చేరింది. ఆయన క్షణం ఆలోచించకుండా అందుకు సానుకూలంగా స్పందించారు.   మండప నిర్వాహకుల వినతిపై యఆయన సామాజిక మాధ్యమ వేదికగా ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన మేరకు వినాయక మండపాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించనుంది. ఉచిత విద్యుత్ సరఫరాకు సంబంధించిన ఉత్తర్వులు కూడా వెలువడతాయి. అన్నది ఆ ప్రకటన సారాంశం. ఆయన అన్నట్లుగానే గణపతి మంటపాలకు ఉచిత విద్యుత్ సరఫరాకు సంబంధించి ఉత్తర్వులు వెలువడ్డాయి. అంతే కాదు. వినాయక చవితి తరువాత వచ్చే దసరా నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసే మండపాలకు కూడా ప్రభుత్వం విద్యుత్ ను ఉచితంగా అందించనుంది. ఈ రెండు పండుగలకూ సంబంధించి ఏర్పాటు చేసే మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా కోసం ప్రభుత్వం పాతిక కోట్ల రూపాయలు కేటాయించింది.  ఈ నిర్ణయంతో మంత్రి లోకేష్ ప్రజా నాయకుడిగా తన ఇమేజ్ ను మరింత పెంచుకున్నట్లు అయ్యింది.   చూడటానికి గణేష్, దసరా మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా అన్నది ఒక చిన్న చర్య గా కనిపించవచ్చు. కానీ ఇది ప్రజా హృదయాలపై చాలా బలమైన ముద్ర వేస్తుందనడంలో సందేహం లేదు. ఆబాలగోపాలం ఆనందంగా భాగస్వాములై నిర్వహించుకునే ఈ రెండు పండుగల విషయంలో లోకేష్ చూపిన చొరవ ఆయన వ్యక్తిగత ఇమేజ్ ను పెంచేయడమే కాదు.. తెలుగుదేశం కూటమి ప్రతిష్ఠను కూడా ఇనుమడింప చేసిందనడంలో సందేహం లేదు.  

తీరు మారని ట్రంప్... ప్రపంచ దేశాలకు మళ్లీ యూఎస్ వార్నింగ్

  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన దూకుడు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజా మరోసారి ఆయన ప్రపంచ దేశాలకు వార్నింగ్ ఇచ్చారు. అమెరికా టెక్ సంస్థల నుంచి డిజిటల్ పన్నులు వసూలు చేసే దేశాలకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా గట్టివార్నింగ్ ఇచ్చారు. అమెరికాకు, అమెరికా కంపెనీలకు సముచిత గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయా దేశాలకు అమెరికా నుంచి కంప్యూటర్ చిప్స్ ఎగుమతులపై ఆంక్షలు విధిస్తానని హెచ్చరించారు. ఆల్ఫబెట్, మెటా, అమెజాన్.. వంటి అమెరికా కంపెనీలపై డిజిటల్ పన్నులు, ఇతర ఆంక్షలు పెట్టే దేశాలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ట్రూత్ సోషల్‌లో ఓ పోస్టు పెట్టారు. అమెరికా టెక్ కంపెనీలపై దాడులు చేసే దేశాలకు ఎదురొడ్డి నిలబడతామని అన్నారు. డిజిటల్ ట్యాక్స్‌లు, డిజిటల్ సర్వీస్ చట్టాలు, డిజిటల్ మార్కెట్ నియంత్రణలు అన్నీ అమెరికా కంపెనీలపై వివక్ష చూపించేందుకు రెడీ చేశారని విమర్శించారు. చైనా కంపెనీలకు మాత్రం ఈ దేశాలు ఎలాంటి అడ్డంకులు కల్పించట్లేదని, పద్దతి మార్చుకోవాలని సూచించారు. అలాంటి దేశాలను అప్రమత్తం చేస్తున్నానని, అమెరికా కంపెనీలు మీకు కాళ్లు తుడుచుకునే డోర్ మ్యాట్స్ వంటివి కావని,  అమెరికాకు, అమెరికా కంపెనీలకు సముచిత గౌరవం ఇవ్వండి లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ట్రంప్ ప్రపంచ దేశాలపై మండిపడ్డారు. డిజిటల్ పన్నుల విషయంలో అమెరికా కెనడాపై అగ్గిమీద గుగ్గిలమవుతున్న విషయం తెలిసిందే.  కెనడాతో వాణిజ్య పరంగా తెగదెంపులు చేసుకుంటామని జూన్‌లో గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఈ అంశాల్లో ఈయూ మాత్రం అమెరికా అనుకూల ధోరణితో ముందుకు వెళుతోంది. ఇలాంటి వాణిజ్య అడ్డంకులు తొలగింపునకు కలిసి పనిచేస్తామని అమెరికా, ఐరోపా సమాఖ్య ఓ సంయుక్త ప్రకటన చేశాయి. ఎలక్ట్రానిక్ ప్రసారాలపై ఎలాంటి కస్టమ్స్ డ్యూటీలు విధించబోమని పేర్కొన్నాయి. నెట్‌వర్క్ యూసేజీ ఫీజులను కూడా విధించబోమని కూడా ఐరోపా సమాఖ్య పేర్కొంది. ప్రస్తుతం అనేక దేశాల ప్రభుత్వాలు అమెరికన్ కంపెనీల నుంచి సగటున 3 శాతం వరకూ పన్ను వసూలు చేస్తున్నాయి. అమెరికా కంపెనీలు ఆయా దేశాల్లో పొందుతున్న ఆదాయంపై ఈ పన్ను విధించాయి. ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ, యూకే వంటి దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి.  

కాంగ్రెస్‌‌పై జగన్ సీరియస్.. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేకే మద్దతు

  ఏపీలో అధికారంలో లేకపోయినా మాజీ సీఎం జగన్ జాతీయ  రాజకీయాల్లో బీజేపీతో అంటకాగలనే చూస్తున్నారు. 2014 నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి మద్దతు ప్రకటిస్తున్నారు. తాజాగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్ధికి మద్దతు ఇవ్వాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది. గతంలో  ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇదే తరహాలో మద్దతుగా నిలిచి బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేసి, సక్సెస్ అయిన వైసీపీ ఇప్పుడే అదే స్ట్రాటజీ అవలంభిస్తోంది.  ఆ క్రమంలో కాంగ్రెస్‌తో టచ్ ఉన్న పార్టీ నేతలకు జగన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారంట. వైసీపీ 2014 ఎన్నికల్లో ప్రతిపక్షానికి పరిమితమైంది. 2019 ఎన్నికలు వచ్చేనాటికి అధికారంలోకి వచ్చింది. ఆ రెండు పర్యాయాలు జగన్ తనదైన లెక్కలతో బీజేపీ పెద్దలకు దాసోహమన్నట్లే వ్యవహరించారు. అయితే గత ఎన్నికల్లో బీజేపీ.. టీడీపీ, జనసేనతో కూటమి కట్టడంతో వైసీపీకి చావు దెబ్బతగిలింది. దివంగత వైఎస్ మరణాంతరం తనను ముఖ్యమంత్రిని చేయలేదని, తర్వాత తన ఓదార్పు యాత్రలకు అనుమతించలేదని కాంగ్రెస్‌కు దూరమై వైసీపీ పేరుతో జగన్ సొంత కుంపటి పెట్టుకుని పొలిటికల్ గేమ్ మొదలెట్టారు.  మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి దూరంగానే ఉంటూ వస్తున్న వైసీపీ తిరిగి ప్రతిపక్షంలోకి రావడంతో మరోసారి బీజేపీతో దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తుంది. పార్లమెంట్‌లో వైసీపీకి నలుగురు లోక్ సభ సభ్యులు.. ఏడుగురు రాజ్యసభ సభ్యుల బలం ఉంది. అవి నిర్ణయాత్మక ఓట్లు కాకపోయినా ఎన్డీఏ, ఇండియా కూటములకు అవి కీలకమే.అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైనా, వైసీపీ పార్లమెంటులో చెప్పుకోదగ్గ బలాన్ని చాటుకుంది. అక్రమాస్తుల కేసుతో పాటు వివిధ కేసుల ఉచ్చు బిగుసుకుంటడంతో జగన్ మోడీ సర్కారుకి దాసోహం అంటున్నట్లే కనిపిస్తున్నారు.   అధికారంలో ఉన్నప్పుడు ఎలా కేంద్రంలోని బీజేపీతో స్నేహ సంభందాలు కొనసాగించిందో వైసీపీ అదే తరహాలో తిరిగి తమ స్నేహాన్ని కొనసాగించేందుకు ఉపరాష్ట్రపతి ఎన్నికల ద్వారా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. ఉప రాష్ట్రపతి ఎన్నికపై వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్డీయే ప్రతిపాదించిన అభ్యర్థి రాధాకృష్ణన్‌ కే తమ మద్దతు ఉంటుందని వైసీపీ ప్రకటించింది. తమ పార్టీ కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా ఏర్పడిందని స్పష్టం చేసింది. ఎన్డీఏ కూటమి అధికారంలో తొలి పదేళ్లు వైసీపీ పార్లమెంట్‌లో కేంద్రం ప్రవేశపెట్టిన పలు బిల్లులకు ఆమోదం తెలిపించి. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు, అంతకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కేంద్రానికి పలు కీలక సందర్బాల్లో బేషరతుగా బీజేపీకి మద్దతు ప్రకటించింది వైసీపీ. 2017లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే బలపరచిన రాంనాధ్ కోవింద్ కి.. ఉప రాష్ట్రపతి పదవికి వెంకయ్యనాయుడుకు వైసీపీ మద్దతుగా ఓటేసింది. 2022లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో కూడాఎన్డీయే బలపరచిన ద్రౌపది ముర్ముకి,  ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధంకర్ కి మద్దతిచ్చింది.  తర్వాత ఉపరాష్ట్రపతిగా ఉన్న జగదీప్ ధంఖర్ రాజీనామా చేయడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి.. దీంతో ఎన్డీఏ తరఫున  బీజేపీ సీపీ రాధకృష్ణన్ ఉప రాష్ట్రపతి అభ్యర్దిగా బరిలో నిలవటంతో మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. మొత్తంమీద మరోసారి తమకు బీజేపీతో స్నేహ సంబంధాన్ని పునరుద్దరించుకోవడానికే జగన్ ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతుంది. తెలంగాణ నుంచి తెలుగు బిడ్డ జస్టీస్ సుదర్శనరెడ్డిని ఇండియా కూటమి అభ్యర్ధిగా ప్రకటించినా జగన్ అలాంటి నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదంగా మారింది. మరోవైపు కాంగ్రెస్ అగ్ర నేతలు వైసీపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు.... రాజ్యసభలో ఏడుగురు సభ్యుల బలమున్న వైసీపీనీ కనీసం తమకు మద్దతు తెలపకపోయినా తటస్థంగా ఉంటే చేయడానికి కాంగ్రెస్ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో ఎంపీ రఘునాథరెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసానికి వెళ్లి భేటీ ఆవ్వటం ఏపీ రాజకీయాల్లో కీలకంశంగా మారింది. అది జరిగిన గంటల వ్యవధిలోనే కాంగ్రెస్ అగ్ర నేత జై రాం రమేష్ వైసీపీకి కీలక నేత వైవీ సుబ్బారెడ్డి కి ఫోన్ చేసి మద్దతు కోరారు.   ఉప రాష్ట్రపతి ఎన్నికను బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. నిజానికి బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమికి ఎలక్ట్రోరల్ కాలేజిలో పూర్తి మెజారిటీ ఉంది. అయితే ఎక్కువ పార్టీలు పరోక్షంగా అయినా తమతోనే ఉన్నాయని ఎస్టాబ్లిష్ చేసేలా బీజేపీ అడుగులు వేస్తోంది. ఈ ఎత్తుగడతోనే బీజేపీ జగన్‌కి టచ్‌లోకి రాజ్‌నాథ్ సింగ్ వచ్చారనే టాక్ నడుస్తోంది. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కే ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి విపక్షాలను కో ఆర్డినేట్ చేసుకునే బాధ్యతను కేంద్రం అప్పగించింది. దాంతో ఆయన జగన్ కి ఫోన్ చేసి మాట్లాడారు. తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు. బీజేపీ నుంచి వచ్చిన ప్రతిపాదనతో జగన్ పార్టీ నేతలతో చర్చించి ఎన్డీఏ అభ్యర్ధికి మద్దతు ప్రకటించారంటున్నారు. మరోవైపు కాంగ్రెస్‌కి చెందిన కీల‌క నాయ‌కులు న‌లుగురు వైసీపీ తో ట‌చ్‌లో ఉన్నారు. వైసీపీ ఎంపీ రఘునాథరెడ్డి ఏకంగా మ‌ల్లికార్జున ఖ‌ర్గేతోనూ స‌మావేశమ‌య్యారు. త‌న‌కు ఖ‌ర్గేతో 30 ఏళ్ల‌కుపైగా అనుబంధం ఉంద‌ని.. అందుకే క‌లిశాన‌ని ఆయ‌న చెప్పుకొస్తున్నారు. దీనిపై వైసీపీ అధినేత స‌ద‌రు నేత‌ను వివ‌ర‌ణ కోరిన‌ట్టు తెలిసింది. ఇక‌, కాంగ్రెస్ పార్టీ నుంచి కీల‌క నాయ‌కులు డీకే శివ‌కుమార్‌, మ‌ల్లికార్జున ఖ‌ర్గే, జాతీయ స్థాయిలో చ‌క్రం తిప్పుతున్న చిదంబ‌రం వంటి వారి నుంచి వైసీపీకి ఫోన్లు వ‌చ్చాయ‌ని స‌మాచారం. వచ్చే నెల 9న జ‌ర‌గ‌నున్న ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఇండియా కూట‌మి అభ్య‌ర్థి బి. సుద‌ర్శ‌న్ రెడ్డిని గెలిపించేందుకు స‌హ‌క‌రించాల‌ని కోరుతున్నారు. అయితే.. దీనికి వైసీపీ నుంచి స‌రైన స‌మాధానం రాలేదు. ఇదిలావుంటే.. అంత‌ర్గ‌త స‌మావేశంలో కాంగ్రెస్ నేత‌ల వైఖ‌రిపై జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తంచేసిన‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి. పార్టీ నాయ‌కుల‌ను కూడా ఆయ‌న మంద‌లించిన‌ట్టు తెలిసింది. అస‌లు వారు ఫోన్లు చేస్తే.. మీరెందుకు రిసీవ్ చేసుకున్నార‌ని.. ప్ర‌శ్నించిన‌ట్టు స‌మాచారం. తనపై కేసులు పెట్టిన విష‌యం.. తమ పార్టీని ఇరుకున పెట్టేలా.. ఇప్ప‌టికీ ష‌ర్మిల‌తో మాట్లాడిస్తున్న విషయం మీకు తెలియ‌దా? ఎవ‌డో మాణిక్యం ఆయ‌న కూడా మ‌న‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారని మండిపడ్డారంట. ఇలాంటి పార్టీ వారు ఫోన్లు చేస్తే.. మ‌నం ఎందుకు స్పందించాలి. ఇక‌, నుంచి ఫోన్లు కూడా తీయొద్దని సీరియ‌స్ గా చెప్పేశార‌ని.. తాడేప‌ల్లి కార్యాల‌యానికి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, ఎమ్మెల్సీ ఒక‌రు ఆఫ్‌ ద రికార్డుగా మీడియా వారితో అన్నారంట. ప్ర‌స్తుతం కాంగ్రెస్‌కు వైసీపీ మ‌ద్ద‌తు ఉన్నా.. లేకున్నా.. త‌ట‌స్థంగా వ్య‌వ‌హ‌రిస్తే త‌మ‌కు మేలు జ‌రుగుతుంద‌ని వైసీపీ సీనియర్లు కొందరు అంటున్నారు. నేరుగా మాకు ఓటు వేయ‌క‌పోయినా ఫ‌ర్వాలేదు. మీరు ఎన్నిక‌ల‌కు దూరంగా ఉండండి. అదే మేం కోరుతున్నామని ఖ‌ర్గే కూడా వ్యాఖ్యానించారు. ఎన్డీయేలో లేని పార్టీలు ఈ విష‌యంపై ఆలోచ‌న చేయాల‌ని ఆయ‌న కోరుతున్నారు. ప్రస్తుతం వైసీపీ ఏ కూటమిలో లేదు. త‌ట‌స్థంగా ఉంది. ఈ నేప‌థ్యంలో ఎలాగోలా వైసీపీని తటస్థంగా ఉంచడానికి కాంగ్రెస్ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. మ‌రి వైసీపీ మాత్రం కాంగ్రెస్‌పై నిప్పులు చెరుగుతోంది. ఆ క్రమంలో బీజేపీతో అంటకాగడానికే జగన్ ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది.  

బీహారు ఓటరుపై...ఓటు చోర్ యాత్ర ప్రభావం?

  త్వరలో జరగానున్నబీహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఓటర్ అధికార్ యాత్ర’ చివరాఖరి ఘట్టానికి చేరుకుంది. ఈ నెల 17 న ససారలో ప్రారంభమైన రాహుల్ యాత్ర, సెప్టెంబర్ 1న పాట్నాలో ముగుస్తుంది. అయితే, రాహుల్ గాంధీ సాగిస్తున్న ఈ యాత్ర రానున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతుందా ? అంటే, రాజకీయ విశ్లేషకుల నుంఛి అవుననే సమాధానమే వస్తోంది.  అయితే, రాహుల్ యాత్ర ప్రభావం, ఆయన ఆశించిన స్థాయిలో, ఆశించిన విధంగా అయితే, ఉండకపోవచ్చని, విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. నిజానికి, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్’ ప్రభుత్వం పట్ల ప్రజల్లో కావల్సినంత వ్యతిరేకత వుంది. ముఖ్యంగా అటునుంచి ఇటు ఇటునుంచి అటూ గోడలు దూకుతూ,14 ఏళ్లకు పైగా ముఖ్యమంత్రి కుర్చీని అంటి పెట్టుకుని కూర్చున్న నితీష్ కుమార్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత మాత్రమే కాదు, ఒక విధమైన ఏహ్య భావం కూడా ఏర్పడిందని, అంటున్నారు.   దానికి తోడు, నిరుద్యోగం,క్షీణిస్తున్న శాంతి భద్రతల సమస్యలు తదితర సమస్యల కారణంగా, ప్రభుత్వ వ్యతిరేక పవనాలు చాలా బలంగా వీస్తున్నాయి. అవును   ఇటు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పట్ల, అటు, ఎన్డీఎ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని పరిశీలకులు పేర్కొంటున్నారు. అలాగే, ఇటీవల వివిధ సంస్థలు నిర్వహించిన ప్రీ పోల్ సర్వే ఫలితాలను గమనిస్తే రాష్ట్రంలో, కేవలం 18 శాతం మంది ఓటర్లు మాత్రమే, ఎన్డీఎ ప్రభుత్వం కొనసాగాలని కోరుకుంటున్నారు. అదే సమయంలో 48 మంది ఓటర్లలో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది.  అన్నిటికీ మించి, ముఖ్యమంత్రిగా ఎవరు బెస్ట్ అన్న ప్రశ్నకు, 25 శాతం మంది నితీష్ కుమార్’ కు జై కొడితే, 32 శాతం మంది ఆర్జేడీ, నాయకుడు,మహా ఘటబంధన్’ ముఖ్యమంత్రి అభ్యర్ధి తేజస్వీ యాదవ్’కు జై కొట్టారు. ముఖ్యంగా యువత తేజస్వీ యాదవ్’ వైపు మొగ్గు చూపుతున్నారు. నితీష్ కుమార్’కు తేజస్వీ యాదవ్’  బలమైన ప్రత్యర్ధిగా ఓటర్లు గుర్తిచినట్లు సర్వేలు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో అక్టోబర్, నవంబర్ నెలలో జరగనున్నబీహార్ అసెంబ్లీ ఎన్నికలలో, ఎగసి పడుతున్న నితీష్ ప్రభుత్వ వ్యతిరేకత, రాష్ట్రంలో వీస్తున్న తేజస్వీ అనుకూల పవనాలను ప్రధాన ఎన్నికల ప్రచార అస్త్రాలుగా చేసుకుంటే, మహా ఘట బంధన్’ విజయావకాశాలు’ మరింత మెరుగ్గా ఉండచ్చని పరిశీలకులు అంటున్నారు.  అలాగే, రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార్ యాత్ర’ వలన కూడా మహా ఘటబంధన్’ కు కొంత ప్రయోజనం జరగవచ్చు కానీ, ఎన్నికల కథా కథనం స్థానిక సమస్యల నుంచి పక్కకు వెళ్ళే ప్రమాదం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. నిజానికి, కేంద్ర ఎన్నికల సంఘం బీహార్‌లో నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఓటర్ అధికార్ యాత్ర’కు ఆశించిన స్థాయిలో స్పందన రాక పోగా, రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలలో నిజం లేదనే విషయం తేట తెల్లం కావడంతో, ఒక ప్రత్యేక వర్గానికి చెందిన ప్రజలు మినహా ఇతర వర్గాల ప్రజలు రాహుల్ యాత్రను అసలు పట్టిచుకోవడం లేదని అంటున్నారు.  అలాగే,అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు సహజంగా స్థానిక సమస్యలు,స్థానిక నాయకత్వానికి ప్రాధాన్యత ఇస్తారు కానీ, జాతీయ అంశాలకు మరీ ముఖ్యంగా, ఎన్నికల అక్రమాలకు సంబదించిన అంశాలకు ఓటర్లు అంతగా ప్రాధాన్యత ఇవ్వరని పరిశీలకులు బావిస్తునారు. నిజానికి,  నితీష్ వర్సెస్ తేజస్వీగా సాగ వలసిన ఎన్నికల  ప్రచారం, రాహుల్ ఎంట్రీతో మోదీ వర్సెస్ రాహుల్. పోల్ బ్యాటిల్’ గా మారుతోందని, ఇది మహా ఘట బంధన్’ కు అంతగా మంచిది కాదని అంటున్నారు.అంతే కాకుండా మహా ఘట బంధన్’ కు అనుకూలంగా ఉన్న వాతావరణం తిరగబడే ప్రమాదం లేక పోలేదని విశ్లేషకులు అంటున్నారు.  

మాజీ సీఎం జగన్‌కు బిగ్ షాక్

  ఏపీ మాజీ సీఎం జగన్‌కు తెలంగాణ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది.  వాన్ పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థపై ఉన్న కేసు క్వాష్ చేయాలని పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల్లో వాన్‌పిక్‌ పేరును సీబీఐ తన ఛార్జ్‌షీట్‌లో చేర్చింది. 2022 జులైలో వాన్‌పిక్‌ ప్రాజెక్ట్‌ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది.  అయితే ఈ కేసులో సీబీఐ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. వాన్‌పిక్ వేసిన క్వాష్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. వాన్‌పిక్ ఓడరేవుకు భూకేటాయింపుల్లో అక్రమాలు, క్విడ్ ప్రోకో జరిగిందంటూ అభియోగాలు మోపారు సీబీఐ అధికారులు. వాన్ పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో భూసేకరణ జరిగిందని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు.  

అభ్యర్థులు ఎంపికే అగ్నిపరీక్ష అన్ని పార్టీలదీ అదే స్ధితి

  బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి అధికార కాంగ్రెస్ గూటికి చేరిన 10 మంది ఎమ్మెల్యేల పై అనర్హత వేటు పడుతుందా? ఆ పది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు వస్తాయా, అంటే సమాధానం చెప్పడం కష్టం. కానీ, సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్’ ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన జూబ్లీ హిల్స్ నియోజక వర్గం ఉప ఎన్నిక మాత్రం ఖాయంగా జరిగి తీరుతుంది.  అది కూడా రెండు మూడు నెలల్లోనే జరుగుతుంది. నిజానికి, కేంద్ర ఎన్నికల సంఘం,ఓటర్ల జాబితా సవరణతో ఉప ఎన్నిక కసరత్తుకు శ్రీకారం చుట్టింది. అక్టోబర్, నవంబర్ నెలల్లో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా జూబ్లీ హిల్స్’ ఉప ఎన్నిక జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అదలా ఉంటే, జూబ్లీ ఉప ఎన్నిక ఫలితాలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల దశదిశను నిర్దేశిస్తాయనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అలాగే, ఎవరి కారణాలు వారికి ఉన్నా జూబ్లీ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక నుంచే మూడు ప్రధాన పార్టీలకు, ముగ్గురు ముఖ్య నేతలకు అగ్ని పరీక్ష కానున్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా,అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఘోర పరాజయంతో పాటుగా, ఇప్పటికే జరిగిన కంటోన్మెంట్ ఉపఎన్నికలో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్’కు మరీ ముఖ్యంగా, పార్టీ పగ్గాలను తమ గుప్పిట్లోకి తీసుకున్న, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, కేటీ రామరామా రావు (కేటీఆర్’) కు జూబ్లీ ఉప ఎన్నిక అగ్ని పరీక్షే అంటున్నారు.  వరస ఓటములతో పాటుగా, బజారుకు ఎక్కిన కుటుంబ కలహాలతో సతమతమవుతున్న, గులాబీ పార్టీ, మరో సిట్టింగ్ స్థానంలో ఓటమి ఎదురైతే, పార్టీ భవిష్యత్’ ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదం ఉందని పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరో వంక, ప్రత్యర్ధుల విషయం ఎలా ఉన్నా, కేటీఆర్’ నాయకత్వాన్ని ఇప్పటికే డిస్కార్డ్’ చేసి తిరుగుబాటు జెండా ఎగరేసిన సోదరి కవిత’ అన్నకు వ్యతిరేకంగా మరింతగా విజృంభించడం ఖాయంగా కనిపిస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.నిజానికి., కవిత అలాంటి అవకాశం కోసం ఎదురు  చూస్తున్నారని, సో.. అవకాశం వస్తే .. ఆమె  తగ్గేదేలే ..అన్నట్లు రెచ్చిపోవడం ఖాయమని అంటున్నారు. అలాగే, కారణాలు ఏవైనా, పార్టీ అధినేత కేసీఆర్’ క్రియాశీల రాజకీయాలకు చాలా వరకు దూరంగా ఉంటున్నారు. సో .. జూబ్లీ ఉప ఎన్నిక గులాబీ పార్టీకీ, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్’ కు అగ్ని పరీక్ష కానుందని పరిశీలకులు పేర్కొంటున్నారు.   అదలా ఉంటే, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేజరినా, బీఆర్ఎస్’ హైదరాబాద్ నగరంలో తిరుగులేని ఆధిక్యతను నిలబెట్టుకుంది.అయితే,ఇప్పడు ఆ పరిస్థతి కనిపించడం లేదని అంటున్నారు.ముఖ్యంగా, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్’కు అండగా నిలిచిన ఎంఐఎం’ ఇప్పడు కాంగ్రెస్ పక్షాన చేరింది.  అలాగే, 2022 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 150 కి 44 డివిజన్లలో విజయ సాధించి, ఎంఐఎం మద్దతుతో మేయర్ స్థానం సొంతం చేసుకున్న కారు పార్టీ కథ, అసెంబ్లీ ఓటమితో పాటుగా తిరగబడింది. మేయర్, మాజీ మేయర్ సహా కారు పార్టీ కార్పొరేటర్లు’ చాలా వరకు అధికార పార్టీ గూటికి చేరి పోయారు. మరోవంక దానం నాగేందర్ సహా కొందరు నగర ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరారు. సో.. జూబ్లీ సీటు నిలుపుకోవడం బీఆర్ఎస్’ కు అంత  తేలికైన వ్యవహారం కాదని, పరిశీలకులు భావిస్తున్నారు. అందుకే .. జూబ్లీ ఉప ఎన్నిక కారు పార్టీకి ..అంతకంటే ముఖ్యంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్’కు అగ్ని పరీక్ష కానుందని పరిశీలకులు అంటున్నారు.  ఇక అధికార కాంగ్రెస్’ పార్టీ విషయానికి వస్తే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వానికి జూబ్లీ ఉపఎన్నిక సవాలు కానుందని అంటున్నారు.కంటోన్మెంట్ సీటుకు సొంత చేసుకున్న కాంగ్రెస్ పార్టీ  జూబ్లీ సీటును కూడా కైవసం చేసుకుంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాకర్షక నేతగా తమ స్థానాన్ని, పదిల పరచు కుంటారు.  కానీ, ఓటమి ఎదురైతే మాత్రం, ఆయన ప్రత్యర్ధులకు అవకాశం ఇచ్చినట్లు అవుతందని పరిశీలకులు భావిస్తున్నారు. నిజానికి, అధికార పార్టీగా కాంగ్రెస్’ పార్టీకిగెలుపు అవకాశాలు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి,అయితే, అభ్యర్ధి ఎంపిక విషయంలో పార్టీ మల్లగుల్లాలు పడుతున్నట్లు చెపుతున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన  మాజీ క్రికెటర్’ అజారుద్దీన్’ పేరు మరో మారు ప్రముఖంగా వినిపిస్తున్నారు. బీసీ నామ జపం చేస్తూ ముస్లింకు టికెట్ ఇస్తే, హిందూ ఓటు పోలరైజ్’ అయ్యే ప్రమాదం ఉందని, ముఖ్యంగా,బీజేపీ నూతన అధ్యక్షుడు రామచంద్రరావు నాయకత్వంలో గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్దమవుతున నేపధ్యంలో, అజారుద్దీన్’కు మరో ఛాన్స్’ ఇవ్వడమా, బీసీ అభ్యర్ధిని బరిలో దింపడమా , సెలబ్రిటీని పోటీ చేయించాలా అనే విషయంలో హస్తం పార్టీ  తర్జన  భర్జన  పడుతున్నట్లు తెలుస్తోంది. అలాగే, పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావుకు కూడా ఇది తొలి పరీక్ష కాగలదని అంటున్నారు.

వార్డు మెంబర్‌గా గెలవని వారు.. ఓట్ల చోరీ అంటున్నారు : బండి సంజయ్

  కాంగ్రెస్ నాయకులది బిచ్చగాళ్ల బతుకు అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓట్ల కోసం ముస్లీంల వద్దకు వెళ్లి టోపీలు పెట్టుకుని నమాజ్ చేస్తారు. మేం అలా కాదు. నేను   కరీంనగర్ లోక్ సభ సభ్యుడిగా కేవలం హిందూ ఓటు బ్యాంక్ ద్వారనే గెలిచానని గల్లా ఎగిరేసి చెప్తున్నా. తెలంగాణ వ్యాప్తంగా హిందూ ఓటూ తయారు చేస్తామని బండి సంజయ్ తెలిపారు.  ఓట్ల చోరీ అంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలు అర్ధరహితం. కరీంనగర్‌లో ప్రతి ఓట్లు తీసేయాలి. దొంగ ఓట్లు అంటూ చేసే దుప్ఫ్రచారం ప్రజలను అవమానంచడమేన్నారు. కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్‌ తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్‌ గౌడ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వార్డు మెంబర్‌గా కూడా గెలవలేరని విమర్శిస్తున్నరని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ మళ్లీ అధికారంలోకి రాదని, ఒకవేళఆ పార్టీ మరొకసారి  అధికారంలోకి  వస్తే రాజకీయ సన్యాసం చేస్తానంటూ సవాల్‌ చేశారు. కరీంనగర్‌లో ఒక్కో మైనార్టీ ఇంట్లో 200 ఓట్లు ఉన్నాయంటూ బండి సంజయ్‌ ఆరోపించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ఇయ్యమని అడిగితే ముస్లీం రిజర్వేషన్లు ఇస్తున్నారు. ఓట్ల చోరి జరిగి ఉంటే తెలంగాణలో అత్యధికంగా ఎంపీ సీట్లు బీజేపీకీ వస్తాయని ప్రశ్నించారు.

భయానకంగా భౌ- భౌ...బెంబేలెత్తిస్తున్న వీధి కుక్కలు

  బౌ..బౌ మనే శబ్దం ఇప్పుడు దేశవ్యాప్తంగా దడ పుట్టిస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న వీధి కుక్కల తో గ్రామాల నుంచి పట్టణాల దాకా భయోత్పాతం సంతరించుకొంటోంది. కాలనీలు, వీధుల్లో వీటి అరుపులు వినిపిస్తేనే అలజడి  రేగుతోంది. వెంటపడి కరవడం, కాట్లు చేయడంతో ప్రాణాంతకంగా మారింది. వీధి కుక్కల బెడదపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సీరియస్ గా స్పందించి తగు చర్యలు తీసుకోవడంతో పాటు వీధుల్లో, బహిరంగ ప్రదేశాల్లో వీటికి ఆహారం వేయడం కూడా నేరంగా భావిస్తూ చర్యలు తీసుకోవాలని ఈనెల 22న ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. అంటే దేశవ్యాప్తంగా వీటి అలజడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో 3.50 లక్షల వీధి కుక్కలు ఉన్నట్లు అంచనా వేశారు. వీటి కాట్లతో  ర్యాబిస్ వ్యాధికి గురి కాకుండా అధికారులు చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో వీటితో భయానకమే అవుతుంది. *కడపలో లోనే 14376 మందికి కుక్క కాట్లు వీధి కుక్కల స్వైర  విహారం ప్రజలను భయపెడుతోంది. ఒక కడప జిల్లాలోనే ఇంచుమించు రెండున్నర ఏళ్ల కాలంలో 14376 మంది కాటేశాయంటే ఏ స్థాయిలో వీధి కుక్కలు మనుషులపై దాడి చేస్తున్నాయో ఊహించవచ్చు. జిల్లాలో 2023లో 5485 మందిని, 2024 లో 5549 మందిని 2025 ఇప్పటివరకు 3342 మందిని వీధి కుక్కలు కాటేశాయి.  అంటే సగటున సుమారు 400 మందిని నెలకు కుక్కలు కాటేస్తున్నాయి. ఇది అధికారులు అధికారిక లెక్క మాత్రమే. అనధికారికంగా అయితే ఇంతకు మూడింతలు గా కుక్క కాట్లు తప్పడం లేదు. కుక్కకాటు గురైన కొందరు దానిపై అవగాహన లేకపోవడం, చిన్నచిన్న గాయాలే కదా అని పెద్దగా పట్టించుకోకుండా ఉండడం లాంటి కారణాలతో ఇవి పూర్తి గా నమోదు కావడం లేదు. నిజంగా అన్ని నమోదు అయితే నెలకు 1500 కు పైమాటే అని అధికారులే అనధికారికంగా చెబుతున్న మాటలు. *పెంపుడు కుక్కలూ కాటేస్తున్నాయి వీధి కుక్కలే కాదు పెంపుడు కుక్కలూ(పెట్ డాగ్స్)కాటేస్తున్నాయి. వీటితోనూ జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అవసరమయ్యాయి . ఒక అంచనా ప్రకారం  నెలకు సుమారు 200 మందిని పెంపుడు కుక్కలు కూడా కాటేస్తున్నాయి. యజమానుల కుటుంబ సభ్యులు,వారి ఇంటికి వచ్చేవారు, చుట్టుపక్కల వారికి వీటి తో  ఏర్పడుతోందని చెప్పుకొస్తున్నారు. దీంతో కుక్కలు పెంచుకునే యజమానులు వాటిపై జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది *ఒకే రోజు 27 మందిని కాటేసిన ఒకే కుక్క  బద్వేల్ పట్టణంలో ఓ కుక్క భయానక వాతావరణాన్ని సృష్టించింది. కుక్కల్లో ఆవేశపూరిత కుక్కలు ,పిచ్చి పట్టిన కుక్కలు ఉంటాయి. ఈ కోవకు చెందిన ఓ కుక్క బద్వేల్ లో ఈ ఏడాది మే 26న 27 మందిని కాటేసి కలకలం రేపింది .దీంతో బద్వేలు వాసులు భయాందోళనలకు గురయ్యారు. ఇలాంటి కుక్కలు చాలా ప్రమాదకరంగా చెప్పుకోవాలి *నివేదిక కోరిన డిల్లీ  బద్వేల్ లో ఒకేరోజు 27 మందిని కాటేసిన కుక్క వ్యవహారంపై ఢిల్లీలోని సెంట్రల్ మీడియా స్కానర్ రాష్ట్ర వైద్య శాఖను నివేదిక కోరింది. ఆ వీధి కుక్క ఎంతమందిని కాటేసింది. వారికి వ్యాక్సిన్స్ వేశారా, చికిత్స చేశారా,వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయా అనే అంశాలతో నివేదిక కోరడం జరిగింది .ఈ మేరకు రాష్ట్ర వైద్యశాఖ ఆదేశాలతో జిల్లా వైద్యాధికారులు బద్వేల్ కు వెళ్లి వ్యాక్సిన్ విచారణ చేసి అందుబాటులో ఉన్నాయి, వీరందరికీ వ్యాక్సిన్ చేశారని నివేదిక పంపడం జరిగింది. *ఇద్దరు మృతి   కడప జిల్లాలో రాబిస్ కారణంగా ఇద్దరు మృతి చెందారు. వీధి కుక్కలు పెద్ద ఎత్తున మనషులపై  పై దాడి చేస్తునన్నా  గాయాలు కావడం వైద్యం చేయించుకోవడంతో బయటపడుతున్నారు .ఒకటి రెండు చోట్ల ర్యాబిస్ కారణంగా మృత్యువాత పడ్డారు .2003 వ సంవత్సరం పులివెందులలో ఒకరు 2024లో కడపల ఒకరు మృతి చెందారు. వీధి కుక్కల కారణంగా ఇలాంటి పరిస్థితులు ఏర్పడడంతో ఇప్పుడు దేశమంతా వీటి వ్యవహారం చర్చ అంశంగా మారింది *సుప్రీంకోర్టు ఆదేశాలతో అయినా! వీధి కుక్కల వ్యవహారంపై సీరియస్ గా స్పందించిన సుప్రీంకోర్టు త్రి సభ్య ధర్మాసనం  ఢిల్లీతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలకు పలు ఆదేశాలు జారీ చేసింది.వీధి కుక్కలకు  స్టెరిలైజేషన్ చేసిన తర్వాత వదిలేయాలని, వ్యాధులు ఆవేశపూరిత  ప్రవర్తన కలిగిన కుక్కలను షెల్టర్ కు తరలించాల్సిందేనని, బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కలకు ఆహారం పెట్టడం నేరంగానూ, ఉల్లంఘనగాను పేర్కొంది .వీధుల్లో ఆహారం పెట్టే వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. జంతు  ప్రేమికులు వీధి కుక్కలను  దత్తత  తీసుకోవచ్చు కానీ మళ్ళీ వాటిని మళ్ళీ వీధుల్లో వదిలేయ కూడదని సూచించింది. కేవలం ఢిల్లీ మాత్రమే కాకుండా అన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను సైతం భాగస్వామ్య పక్షాలుగా చేస్తున్నామని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రియల్ టైం పరిశీలన కోసం ప్రత్యేక డ్యాష్  బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. సెప్టెంబరు నెల నాటికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయనున్నట్లు సమాచారం.ఈ నేపథ్యంలో అయనా మున్సిపాలిటీలు, పంచాయతీలో వీధి కుక్కల వ్యవహారంపై దృష్టి పెట్టాల్సిన అవసరం అధికారులపై ఉంది.  

ఏపీలో భారీ వర్షాలపై..హోం మంత్రి అనిత సమీక్ష

  బంగాళాఖతంలో ఏర్పాడిన అల్పపీడన ప్రభావంతో నేటి నుంచి మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రతో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తం అయింది. జిల్లా స్ధాయి అధికారులతో హోం మంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. ఉత్తరాంధ్ర తీరం వెంబడి ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.  సముద్రంలో వేటకు వెళ్లరాదని మత్స్యకారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్‌ ఏర్పాటు చేయాలని  హోం మంత్రి  ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో దిశా నిర్దేశం చేశారు. సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు. ప్రమాదకర హోర్డింగ్‌లు, కూలిన చెట్లను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు.  మరోవైపు ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలపై మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను అప్రమత్తం చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడం కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎస్పీ మహేశ్వర్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. ఎడతెరిపి లేని వర్షాలకు పంట నష్టం నివారణకు  తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు మంత్రి సూచనలు చేశారు.

కుక్కలతో విసిగిపోయి... ఢిల్లీ సీఎంపై దాడికి ప్రయత్నం

  తన ఇంటి దగ్గర ఊర కుక్కల బెడద పెరిగిందని ఒక దుండగుడు గతవారం ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై  దాడికి పాల్పడటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ కేసులో పోలీసులు ప్రధాన నిందితుడి నుంచి కీలక విషయాలు రాబట్టారు. వాస్తవానికి ఘటన జరిగిన రోజున నిందితుడు కత్తితో దాడి చేయాలని ప్రణాళిక రచించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సకారియా రాజేశ్‌భాయ్ ఖిమ్జీభాయ్‌ను అరెస్ట్ చేశారు.  విచారణలో అతడు సంచలన విషయాలను బయటపెట్టాడంట. నిందితుడు సకారియా పోలీసుల విచారణలో సీఎంపై దాడికి గల కారణాన్ని వెల్లడించాడంట. తమ ప్రదేశంలో వీధి కుక్కల సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు చాలా సార్లు ప్రయత్నించినప్పటికీ.. సరైన స్పందన లేకపోవడంతో అసహనం కలిగి దాడి చేయాలని నిశ్చయించుకున్నట్లు చెప్పాడు. ఘటన రోజు కత్తితో పొడిచి చంపాలని ప్లాన్ చేసుకుని బయల్దేరాడు.  కానీ, నిందితుడు సీఎం అధికారిక నివాసానికి చేరుకోక ముందు సుప్రీంకోర్టు వద్దకు వెళ్లాడు. అక్కడ భారీ భద్రతా వ్యవస్థను గమనించి తన దాడి ప్రణాళికను విరమించుకున్నానని పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. సీఎంపై దాడి కేసుకు సంబంధించి గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన తహసీన్ సయ్యద్ అనే వ్యక్తిని రెండవ నిందితుడిగా పోలీసులు గుర్తించారు. అతడు ప్రధాన నిందితుడు సకారియాకు స్నేహితుడు. ఘటన జరిగిన రోజు తహసీన్ ప్రధాన నిందితుడితో నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.  అంతేకాదు.. ఆర్థికంగా సహాయం చేసినట్లు సమాచారం. తహసీన్ మొబైల్ ఫోన్ నంబర్ కాల్ వివరాలు, ఐపీడీఆ, యూపీఐ ద్వారా జరిగే లావాదేవీల ఆధారంగా పోలీసులు నిందితుడి పాత్రను కనుగొన్నారు. ఆగస్టు 20న సివిల్‌ లైన్స్‌లోని సీఎం కార్యాలయం వద్ద సీఎం రేఖా గుప్తా ‘జన్‌ సున్వాయ్‌’’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముసుగులో వచ్చిన ఓ దుండగుడు హఠాత్తుగా సీఎంపై దాడికి యత్నించాడు. ఫిర్యాదుదారుడిలా పత్రాలను చేతికందిస్తూ.. కేకలు వేస్తూ ముఖ్యమంత్రిని చెంపదెబ్బ కట్టాడు. రెప్పపాటులోనే ఆమెను వెనక్కు తోసి జుట్టు గట్టిగా పట్టుకుని లాగాడు. వెంటనే భద్రతా సిబ్బంది అతడ్ని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.  ఈ దాడిలో సీఎం తల, చెయ్యి, భుజానికి స్వల్ప గాయాలయ్యాయి. కాగా, దాడి నేపథ్యంలో ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు ఇటీవలే జడ్ కేటగిరీ భద్రత కల్పించింది కేంద్ర ప్రభుత్వం. అయితే, తాజాగా ఆ భద్రతను ఉపసంహరించింది. మునుపటి తరహాలో ఢిల్లీ పోలీసులే సీఎం భద్రతా వ్యవహారాలు పర్యవేక్షిస్తారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ ముఖ్యమంత్రికి కల్పించిన జెడ్ కేటగిరీ సీఆర్‌పీఎఫ్ సెక్యూరిటీని కేంద్రం ఉపసంహరించుకున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. ఇకపై ఢిల్లీ పోలీసులు ముఖ్యమంత్రికి భద్రత కల్పించనున్నారు.  

ఏపీ, తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు

  బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలో రెండ్రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో నేడు అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొన్నాది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి పలు జిల్లాల్లో వర్షం దంచికొడుతోంది.  విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, శ్రీకాకుళం, తూర్పుగోదావరి మోస్తరు నుంచి భారీ వాన పడుతోంది. అలాగే ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు మోస్తరు వర్షసూచన చేసింది. రేపు (బుధవారం) విశాఖపట్నంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ విభాగం పేర్కొంది విశాఖలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని  వాతావరణ విభాగం పేర్కొంది.  శ్రీకాకుళంలో ఎడతెరపి లేని వర్షం కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆర్టీసీ కాంప్లెక్స్ మొత్తం వర్షపు నీరు రావడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు అరకు ఏజెన్సీలోనూ భారీ వర్షం కురుస్తుండటంతో చాపరాయి సందర్శనను నిలిపివేశారు.  ఇటు తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. భద్రాది కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల పరిధిలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొన్నాది. ఇతర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

యూరియా కొరతపై రైతులకు మంత్రి తుమ్మల బహిరంగ లేఖ

  రాష్ట్రంలో యూరియా కొరతపై వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ రైతాంగానికి బహిరంగ లేఖ రాసారు. కేంద్ర ప్రభుత్వ అసమర్థత కారణంగానే రాష్ట్రంలో యురియా కొరత ఏర్పడిందంటూ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రానికి రావాల్సిన యూరియా సరఫరాలో కేంద్రం ఘోరంగా విఫలమైందని లేఖలో తుమ్మల ఆరోపణలు చేసారు. మరోవైపు యూరియాపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఏపీ, తెలంగాణకు 18,900 మెట్రిక్ టన్నుల యూరియా ఇచ్చేనందుకు నిర్ణయం తీసుకుంది.  రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మొత్తం 4 రాష్ట్రాలకు 30,491 మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇష్యూ చేసింది. బీహార్‌కు 2,700, ఏపీకి 10,800, తెలంగాణకు 8,100, ఒడిశాకు 8,891 మెట్రిక్ టన్నులు కేటాయింపులు చేసింది. తద్వారా యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఉపశమనం లభించనుంది. యూరియా కోసం రైతన్నలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.  ఎరువుల కేంద్రం వద్ద  రైతులు పెద్ద ఎత్తున చేరుకొని క్యూలో చెప్పులు పెట్టి పడి కాపులు కాశాస్తున్నారు. 

జ‌గ‌న్ సార్ జ‌గ‌న్ అంతే!

  క‌నీసం కులాభిమానం కూడా లేదా? జ‌గ‌న‌న్నా.. నువ్వా కులపోడివే కావా? అంటూ సోష‌ల్ మీడియాలో ర‌చ్చ‌. ఇంత‌కీ అస‌లేం జ‌రిగిందంటే.. అజాత శ‌తృవు సుర‌వ‌రం సుధాక‌ర్ రెడ్డిపై జ‌గ‌న్ కి ఎనిమిదేళ్ల నాటి ప‌గ ఉన్న‌ట్టుగా చెబుతున్నారు. అందువ‌ల్లే జ‌గ‌న్ తానెంతో ఖాళీగా బెంగ‌ళూరు ఎల‌హంక ప్యాలెస్ లో ప‌డి ఉన్నా నివాళి అర్పించ‌డానికి రాలేద‌ని అంటున్నారు. త‌నపై కాంగ్రెస్ అక్ర‌మ కేసులు పెట్టింద‌ని, త‌న పార్టీ నుంచి టీడీపీకి ఎమ్మెల్యేలు ఫిరాయింపులు చేశార‌ని మ‌ద్ద‌తు అడ‌గ‌టానికి ఢిల్లీలో సుర‌వ‌రం సుధాక‌ర్ రెడ్డిని క‌ల‌వ‌డానికి పార్టీ నాయ‌కుల‌తో స‌హా వెళ్లారు జ‌గ‌న్.. సుర‌వ‌రం మ‌ద్ద‌తు ఇచ్చారా లేదా? అటుంచితే ఆయ‌న జ‌గ‌న్ తో త‌ప్ప అంద‌రికీ క‌ర‌చాల‌నం చేశారు. ఈ ఘ‌ట‌న అత్యంత దారుణ‌మైన అవ‌మానక‌ర‌మైన‌ ఘ‌ట‌న‌గా త‌న‌మైండ్లో బ్లైండ్ గా ఫిక్స్ అయ్యారు జ‌గ‌న్. ఆ త‌ర్వాత ఎప్పుడూ సుర‌వ‌రం సుధాక‌ర్ రెడ్డిని క‌ల‌వ‌లేదు జ‌గ‌న్. రాజ‌కీయంగా ఎంతో సైద్ధాంతిక వైరుధ్యం గ‌ల బీజేపీకి చెందిన వారెంద‌రో సుర‌వ‌రంకి నివాళి అర్పించ‌డానికి వ‌చ్చారు. చివ‌రికి వెంక‌య్య‌నాయుడు వంటి బీజేపీ కురువృద్ధులు కూడా వ‌చ్చి తెలుగు క‌మ్యూనిస్టు దిగ్గ‌జం, రెండు సార్లు ఎంపీ, సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి అయిన సుర‌వ‌రం కి నివాళులు అర్పించ‌డానికి వ‌చ్చారు. కానీ జ‌గ‌న్ మాత్రం రాలేదు. అప్ప‌టికీ జ‌గ‌న్ కి ఈ విష‌యం తెలియ చేసినా తాను రాన‌ని తెగేసి చెప్పారట‌ జ‌గ‌న్. అయినా చ‌నిపోయిన వాళ్ల‌తో కూడా శ‌తృత్వం ఏంటి జ‌గ‌న‌న్నా! అంటూ వారు లోలోప‌ల బాధ ప‌డ్డా ఆయ‌నైతే ఖ‌రాకండిగా రాన‌ని చెప్పేశార‌ట‌. దీంతో పార్టీ త‌ర‌ఫున‌..  అయోధ్య రామిరెడ్డి, మేకపాటి రాజమనోహర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి మాత్రం హాజరయ్యారు. అదే సమయంలో ఈ విషయాలేవీ తెలియని వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్, జగన్ పేరిట మొక్కుబ‌డిగా ఒక సానుభూతి ప్రకటన రిలీజ్ చేయ‌డంతో స‌రిపెట్టారు.  తాను సీఎంగా ఉండ‌గా మ‌ర‌ణించిన మాజీ సీఎం రోశ‌య్య మీద కూడా స‌రిగ్గా ఇలాగే కోపం చ‌ల్లార‌ని జ‌గ‌న్  భౌతికకాయాన్ని సందర్శించి నివాళి అర్పించడానికి  ససేమిరా అన్నారు. క‌డ‌సారి చూపున‌కూ రాకుండా మొహం చాటేశారు జ‌గ‌న్.జ‌గ‌న్ అంతే.. ఆయ‌న‌కు క‌నీస రాజ‌కీయ విచక్ష‌ణా జ్ఞానం కానీ, హుందా త‌నంగానీ, ఒక రాజ‌కీయ అవ‌గాహ‌న కానీ లేవ‌ని అంటారు..

డ్రగ్స్‌ పార్టీ..డిప్యూటీ తహసీల్దార్‌ అరెస్ట్

    డ్రగ్స్‌ కేసులో రాజమండ్రి డిప్యూటీ తహసీల్దార్‌ మణిదీప్‌ను హైదరాబాద్ గచ్చిబౌలి పోలీసులు  అరెస్ట్‌ చేశారు. ఓ అపార్ట్‌మెంట్‌లో నిర్వహించిన పుట్టిన రోజులు వేడుకల్లో యువకులు డ్రగ్స్‌ తీసుకున్నట్లు ఈగల్‌ టీమ్‌ పోలీసులు గుర్తించారు. కీలక నిందితుడు విక్రమ్‌రెడ్డి సహా ఎనిమిది మందిని అరెస్ట్‌ చేశారు. వీరిలో డిప్యూటీ తహసీల్దార్‌తో పాటు ఇద్దరు యువతులు కూడా ఉన్నారు. బెంగళూరు నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. మల్నాడు రెస్టరంట్‌ డ్రగ్స్‌ కేసులో విక్రమ్‌రెడ్డి కీలకంగా వ్యవహరించాడు. వారి నుంచి 20 గ్రాములు కోకైన్, నాలుగు గ్రాములు ఎండీఎంఎ, 20 ఎక్స్‌టీసీ పిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో డిప్యూటీ తహసీల్దార్‌ ఉండటం చర్చనీయాంశమైంది.  

ఏపీ ఉప సభాపతి రఘురామకు భారీ ఊరట

  ఆంధ్రప్రదేశ్ ఉప సభాపతి  రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. లోక్ సభ సభ్యుడిగా ఉన్న సమయంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఏపీ ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌ బాషాపై దాడి చేశారంటూ గతంలో డిప్యూటీ స్పీకర్ ఆయన కుమారుడు భరత్‌, కార్యాలయ సిబ్బందిపై కేసు నమోదైంది.  అయితే ఆ కేసును ఇకపై కొనసాగించుకోదల్చుకోలేదని కానిస్టేబుల్‌ బాషా తాజాగా సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న జస్టిస్‌ జేకే మహేశ్వరి ధర్మాసనం.. రఘురామ, ఆయన కుమారుడు, సిబ్బందిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. 2022లో రఘురామరాజు ఇంటి వద్ద కానిస్టేబుల్‌ బాషాపై దాడి జరిగిందని అప్పటి వైసీపీ ప్రభుత్వం కేసు నమోదు చేసింది.  

ఉస్మానియా వర్సిటీ అభివృద్ధికి వెయ్యి కోట్లు ఖర్చు చేస్తాం : సీఎం రేవంత్‌

  తెలంగాణకు ప్రత్యామ్నాయ పదం ఉస్మానియా వర్సిటీ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ, ఉస్మానియా, తెలంగాణ  అవిభక్త కవలలు అని సీఎం పేర్కొన్నారు. ఓయూలో  రూ.90 కోట్లతో నిర్మించిన భవనాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు.  దుందుభి, బీమా హాస్టల్ భవనలను ప్రారంభించి డిజిటల్‌ లైబ్రరీ, రీడింగ్‌ రూమ్‌లకు శంకుస్థాపన చేశారు. పీవీ నరసింహారావు ఈ గడ్డ నుంచే ధిక్కారస్వరం వినిపించారు. మర్రి చెన్నారెడ్డి, జైపాల్‌రెడ్డి, జార్జ్ రెడ్డి, గద్దరన్నను అందించిన నేల ఇది. రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా ఉద్యమం ఇక్కడే మొదలవుతుందని సీఎం రేవంత్ తెలిపారు.  ఈ ఉస్మానియా వర్సిటీకీ గొప్ప చరిత్ర ఉంది. వందేళ్లలో ఓయూకు వీసీగా దళితుడిని నియమించింది కాంగ్రెస్‌ ప్రభుత్వమే. గత పాలకులు కుట్రపూరితంగా ఓయూను నిర్వీర్యం చేయాలని చూశారు. ఓయూలో చదువుకున్న వారికి చాలా అవకాశాలు వచ్చాయి. యువ నాయకత్వం దేశానికి అవసరం ఉంది. దేశానికి అతిపెద్ద సంపద యువతే అని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రొఫెసర్ కోదండరామ్‌ను ఎమ్మెల్సీగా చేసిందని గుర్తు చేశారు. కానీ బీఆర్ఎస్ నేతలు.. సుప్రీంకోర్టు వరకు వెళ్లి ఆయన పదవిని తీయించేశారని విమర్శించారు. ప్రొ. కోదండరామ్ ఎమ్మెల్సీ పదవిని ఊడకొట్టేందుకు రూ. కోట్లు ఖర్చు చేశారంటూ బీఆర్ఎస్ నేతలపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.  అయినా.. ఎందుకు అంత శునకానందం మీకు అంటూ.. బీఆర్ఎస్ పార్టీ నేతలపై సీఎం మండి పడ్డారు. ఉస్మానియా వర్సిటీ చదువులకే కాకుండా పరిశోధనలకు వేదిక కావాలని పేర్కొన్నారు. విద్యార్థుల కోసం పని చేయని వారిని వ్యతిరేకించండి. డిసెంబర్‌లో ఆర్ట్స్‌ కళాశాల వద్ద సభ పెడితే నేను వస్తా. అన్ని పనులు మంజూరు చేస్తా. ఒక్క పోలీసును కూడా క్యాంపస్‌లో ఉంచొద్దని ముఖ్యమంత్రి అన్నారు.  ఒక వేళ విద్యార్థులు నన్ను అడ్డుకొని ప్రశ్నిస్తే చిత్తశుద్ధితో సమాధానం చెబుతా. ఉస్మానియా వర్సిటీని ఆక్స్‌ఫర్డ్‌ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు నేను సిద్ధం. సకల వసతులు చేకూర్చేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయండి. అందుకోసం నిపుణులతో కమిటీ వేయండి. నిధులు సమకూర్చేందుకు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది.’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌, వేం నరేందర్‌రెడ్డి, కోదండరామ్‌, ఓయూ వీసీ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. .

ఈ విజ‌య‌ ద‌శ‌మికి మందు ముక్కా లేవుగా ఎందుకంటే!?

  మొన్న ఆగ‌స్ట్ 15, 16, 17 మూడు రోజుల సెల‌వులు మూకుమ్మ‌డిగా రావ‌డంతో ఆ ఆనందం త‌ట్టుకోలేక పోయింది మ‌న బాల స‌మాజం. కార‌ణం ఆగ‌స్ట్ 15 ఇండిపెండెన్స్ డే, ఆగ‌స్ట్ 16 సెకండ్ శాట‌ర్ డే, ఆపై ఆగ‌స్ట్ 17 సండే. ఈ మూడు సెల‌వుల‌తో ఇటు పేరెంట్స్ కి పిల్ల‌ల ప‌రేషాన్- అటు పిల్ల‌లు చూస్తే దిల్ ఖుష్ అయిపోయారు. ఈ ఆనందం ఆవిరి చేయ‌డానికా అన్న‌ట్టు ఈ సారి వ‌చ్చే ద‌స‌రా అక్టోబ‌ర్ 2న వ‌చ్చింది. దీంతో రెండు సెల‌వులు కాస్తా ఒక సెల‌వుగా మారింది. మాములుగా అయితే మ‌నకు అధికారికంగా విజ‌య‌ద‌శ‌మి, గాంధీ జ‌యంతి రెండు వేర్వేరు సెల‌వులు. చిత్ర‌మైన విష‌య‌మేంటంటే.. ఈ రెండూ ఒకే రోజు రావ‌డంతో ఒక సెల‌వు కాస్తా ఎగిరిపోయింది. సెల‌వు సంగ‌తి అలా ఉంచితే కొంద‌రు విజ‌య‌ద‌శ‌మికి క‌క్కా ముక్కా భారీ ఎత్తున ప్లాన్ చేస్తారు. మ‌రీ ముఖ్యంగా తెలంగాణ క‌ల్చ‌ర్‌లో  దావ‌త్‌లు  పెద్ద ఎత్తున న‌డుస్తాయ్. మందు విందు పొంగిపొర్లుతాయి. ఆ రోజు గాంధీ జ‌యంతి కూడా కావ‌డంతో పాపం.. ఈ మందుబాబుల‌కు చ‌చ్చేంత ప‌నొచ్చింది.  బేసిగ్గా ఈ విజ‌య‌ద‌శ‌మి- గాంధీ జ‌యంతి కూడా కావ‌డంతో కొంద‌రు రాజ‌కీయ నాయ‌కులు ఆ రోజు ముక్క ముట్ట‌క పోవ‌డ‌మే మంచిద‌ని భావిస్తారు. ఎందుకంటే గ‌తంలో సీపీఐ నారాయ‌ణ స‌రిగ్గా ఇలాగే.. గాంధీ జ‌యంతి రోజున చికెన్ తిని అడ్డంగా బుక్ అయిపోయారు. దీంతో పండ‌గ సంద‌డి కాస్తా ఆవిరైంద‌న్న ఆలోచ‌న ఫీలింగ్ లో  ఇటు చిన్నా పెద్ద ప‌డిపోవ‌డం క‌నిపిస్తోంది.