మంత్రుల మీటింగ్లో పేలుడు
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ఐటీడీఏ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో పలువురు తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. వీళ్ళందరూ కూర్చుని సమావేశం జరుపుకుంటూ వుండగా అకస్మాత్తుగా పెద్ద పేలుడు ధ్వని వినిపించింది. దాంతో మంత్రులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు అందరూ భయపడిపోయి అక్కడి నుంచి పరుగు లంఘించుకున్నారు. ఏదైనా బాంబుగానీ, గన్గానీ పేలిందని భావించారు. భయంతో వణికిపోయారు. అయితే ఆ తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే, హై ఓల్టేజీ కారణంగా సమావేశం హాల్లోని ట్యూబ్ లైట్లు ఒక్కసారిగా పేలాయి. దానివల్లే అంత శబ్దం వచ్చింది. అసలు విషయం తెలుసుకుని అందరూ నవ్వుకుంటూ మళ్ళీ సమావేశాన్ని కొనసాగించారు.